en
Feedback
కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

Open in Telegram

విరాళాలు పంపాల్సిన వివరాలు. A/C Name : Kanchi Paramacharya Dharmika Seva Trust ® A/C. No : 50200059599164 IFSC Code : HDFC0001753 Branch : HDFC Bank UPI ID : 7259859202@hdfcbank Gpay/Phone pay/BHIM/freecharge 7259859202

Show more

📈 Analytical overview of Telegram channel కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

Channel కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి) (@kpdstrust) in the Telugu language segment is an active participant. Currently, the community unites 16 235 subscribers, ranking 5 149 in the Religion & Spirituality category and 24 939 in the India region.

📊 Audience metrics and dynamics

Since its creation on невідомо, the project has demonstrated rapid growth, gathering an audience of 16 235 subscribers.

According to the latest data from 09 September, 2026, the channel demonstrates stable activity. Although there has been a change in the number of participants by -146 over the last 30 days and by -7 over the last 24 hours, overall reach remains high.

  • Verification status: Not verified
  • Engagement rate (ER): The average audience engagement rate is 13.01%. Within the first 24 hours after publication, content typically collects 5.36% reactions from the total number of subscribers.
  • Post reach: On average, each post receives 2 112 views. Within the first day, a publication typically gains 870 views.
  • Reactions and interaction: The audience actively supports content: the average number of reactions per post is 0.

📝 Description and content policy

The author describes the resource as a platform for expressing subjective opinions:
విరాళాలు పంపాల్సిన వివరాలు. A/C Name : Kanchi Paramacharya Dharmika Seva Trust ® A/C. No : 50200059599164 IFSC Code : HDFC0001753 Branch : HDFC Bank UPI ID : 7259859202@hdfcbank Gpay/Phone pay/BHIM/freecharge 7259859202

Thanks to the high frequency of updates (latest data received on 10 September, 2026), the channel maintains relevance and a high level of publication reach. Analytics show that the audience actively interacts with content, making it an important point of influence in the Religion & Spirituality category.

16 235
Subscribers
-724 hours
-377 days
-14630 days

Data loading in progress...

Similar Channels
No data
Any problems? Please refresh the page or contact our support manager.
Tags Cloud
No data
Any problems? Please refresh the page or contact our support manager.
Incoming and Outgoing Mentions
---
---
---
---
---
---
Attracting Subscribers
September '26
September '26
+2
in 0 channels
August '26
+8
in 0 channels
Get PRO
July '26
+25
in 0 channels
Get PRO
June '26
+16
in 0 channels
Get PRO
May '26
+31
in 0 channels
Get PRO
April '26
+24
in 0 channels
Get PRO
March '26
+6
in 0 channels
Get PRO
February '26
+81
in 0 channels
Get PRO
January '26
+97
in 0 channels
Get PRO
December '25
+28
in 0 channels
Get PRO
November '25
+31
in 0 channels
Get PRO
October '25
+11
in 0 channels
Get PRO
September '25
+39
in 0 channels
Get PRO
August '25
+21
in 0 channels
Get PRO
July '25
+58
in 0 channels
Get PRO
June '25
+89
in 0 channels
Get PRO
May '25
+31
in 0 channels
Get PRO
April '25
+25
in 0 channels
Get PRO
March '25
+32
in 0 channels
Get PRO
February '25
+29
in 0 channels
Get PRO
January '25
+79
in 0 channels
Get PRO
December '24
+65
in 0 channels
Get PRO
November '24
+40
in 0 channels
Get PRO
October '24
+39
in 0 channels
Get PRO
September '24
+32
in 0 channels
Get PRO
August '24
+46
in 0 channels
Get PRO
July '24
+96
in 0 channels
Get PRO
June '24
+118
in 0 channels
Get PRO
May '24
+1 521
in 0 channels
Get PRO
April '24
+49
in 0 channels
Get PRO
March '24
+92
in 0 channels
Get PRO
February '24
+61
in 0 channels
Get PRO
January '24
+56
in 0 channels
Get PRO
December '23
+86
in 0 channels
Get PRO
November '23
+84
in 0 channels
Get PRO
October '23
+55
in 0 channels
Get PRO
September '23
+63
in 0 channels
Get PRO
August '23
+37
in 0 channels
Get PRO
July '23
+134
in 0 channels
Get PRO
June '23
+497
in 0 channels
Get PRO
May '23
+159
in 0 channels
Get PRO
April '23
+112
in 0 channels
Get PRO
March '23
+68
in 0 channels
Get PRO
February '23
+56
in 0 channels
Get PRO
January '23
+122
in 0 channels
Get PRO
December '22
+96
in 0 channels
Get PRO
November '22
+70
in 0 channels
Get PRO
October '22
+63
in 0 channels
Get PRO
September '22
+56
in 0 channels
Get PRO
August '22
+47
in 0 channels
Get PRO
July '22
+258
in 0 channels
Get PRO
June '22
+188
in 0 channels
Get PRO
May '22
+428
in 0 channels
Get PRO
April '22
+535
in 0 channels
Get PRO
March '22
+2 079
in 0 channels
Get PRO
February '22
+34
in 0 channels
Get PRO
January '22
+183
in 0 channels
Get PRO
December '21
+140
in 0 channels
Get PRO
November '21
+123
in 0 channels
Get PRO
October '21
+461
in 0 channels
Get PRO
September '21
+104
in 0 channels
Get PRO
August '21
+192
in 0 channels
Get PRO
July '21
+488
in 0 channels
Get PRO
June '21
+791
in 0 channels
Get PRO
May '21
+491
in 0 channels
Get PRO
April '21
+576
in 0 channels
Get PRO
March '21
+463
in 0 channels
Get PRO
February '21
+12 911
in 0 channels
Date
Subscriber Growth
Mentions
Channels
10 September0
09 September0
08 September0
07 September0
06 September0
05 September+2
04 September0
03 September0
02 September0
01 September0
Channel Posts
జీవిత సత్యం బోధించారు అది 1966వ సంవత్సరం. ఆ సంవత్సరం జూన్ లో చీఫ్ సెక్రెటరి కే. వీ. అనంతరామన్ గారు నన్ను పిలిచి వెంటనే చిత్తూరు వెళ్లి జిల్లా కలెక్టరు మెజిస్ట్రేటుగా అధికారాలు తీసుకోవాలని ఆదేశించారు. అదే సంవత్సరం స్వామివారు వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తిలో మకాం చేశారు. మహాస్వామివారు ఒక వేద ఆగమ పండిత సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నారు. వారు అక్కడుండగానే శ్రీ నటరాజ రంగస్థలాన్ని, దాని వెనుక కొండపై ఉన్న రాతి చక్కడాలను కనుగొన్నారు. దేవాలయాల కళలను అధ్యయనం చేస్తున్న విద్యార్థిగా ఇప్పుడు వాటిని పరిశోధించి అవి ఆరవ శతాబ్దానికి చెందినవిగా పల్లవుల కళలకు సంబంధించినదిగా చెప్పడం నా బాధ్యత. ఆ అధ్యయనం నన్ను మొత్తం దేవాలయాన్ని అధ్యయనం చేయాలనే కోరికను కలిగించింది. నేను మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ నాగిరెడ్డి కలిసి ఒక కాళహస్తి దేవస్థానం తరుపున “శ్రీ కాళహస్తి టెంపుల్” అను పేర ఒక పత్రము ప్రచురించాము. దేవస్థానం వారు నాకు కాంస్య శివపార్వతుల ఆలింగన మూర్తిని బహూకరించారు. అది ఇప్పటికి నా టేబల్ పైన ఉంది. కాని దానికంటే అదృష్టం ఏంటంటే పరమాచార్య స్వామివారు ఇచ్చిన శ్రీముఖం. ఈ పుస్తకం అచ్చయ్యి రెండు ప్రతులు నా దగ్గర ఉన్నాయి. అప్పుడు నేను కలెక్టర్ల సమావేశం కోసమని గుంటూరుకు వెళ్లాను. జిల్లా కలెక్టరు అధ్యక్షుడిగా జిల్లా అభివృద్ధి సంస్థలను ఏర్పాటు చెయ్యాలనే విషయం గురించిన సమావేశం అది. వేలత్తూర్ లొ పరమాచార్య స్వామివారు మకాం చేస్తున్నారని నాకు తెలిసింది. నేను అక్కడకు వెళ్లి స్వామివారికి నమస్కరించాను. జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి చరణ కమలాలకు అంకితమిచ్చిన “శ్రీ కాళహస్తి టెంపుల్” పుస్తకాన్ని స్వామివారికి సమర్పించాను. 1966లో కాళహస్తిలో స్వామివారు చాతుర్మాస్యంలో ఉండగా పంచముఖ లింగాన్ని కనుగొన్నారు. స్వామివారి ఆదేశం ప్రకారం ఆ స్థలాన్నంతా శుభ్రపరచి జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు. రుద్రాభిషేకానికి పూర్వాంగంగా చేసే మహాన్యాసంలోని శివుని యొక్క పంచముఖాలను కీర్తించే శ్లోకాన్ని నాకు ఇచ్చారు. “స్ఫటిక వర్ణంలోని సద్యోజాత పడమర ముఖము; అరుణ వర్ణంలోని వామదేవ ఉత్తర ముఖము; ధూమ్ర వర్ణంలోని అఘోర దక్షిణ ముఖము; బంగారు వర్ణంలోని తత్పురుష తూర్పు ముఖము; ఈశాన ఊర్ధ్వ ముఖము; పరమశివుని ఈ ఐదు ముఖములు మీ కోరికలను తిర్చుగాక!” ఆ పుస్తకంలోని మొదటి పేజిలో ఈ శ్లోకాన్ని అచ్చువేయించాము. అలాగే శ్రీవారు తెలుగులో ఇచ్చిన శ్రీముఖం కూడా. ఆ శ్రీముఖంలో చిత్తూరు జిల్లా కలెక్టరు చేసిన పరిశోధనతో పాటు శ్రీ జ్ఞానప్రసూనాంబికా సామెత శ్రీ కాళహస్తిశ్వర స్వామివారి ఆశిస్సులు కూడా అందించారు. అదే సమయంలో గ్రీసు దేశపు రాణి ఫ్రెడెరిక మరియు యివరాణి ఇరీన్, ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధి గారితో కలిసి పరమాచార్య స్వామివారిని దర్శించుకున్నారు. 1990లో జనతా హయాంలో ఆంద్ర ప్రదేశ్ గవర్నర్ శ్రీ కృష్ణకాంత్, మహమ్మదీయ నాయకులు జానాబ్ బుల్కారితో కలిసి చాలా సార్లు కంచిలో స్వామివారిని కలిశారు. నేను కూడా స్వామివారిని దర్శించుకొని, కామాక్షి అమ్మవారికి నమస్సులు అర్పించుకునే వాడిని. నా ఉద్యోగకాలంలో తరచూ మహాస్వామివారిని కంచి దగ్గరలోని వినాయకుని గుడి వద్ద ఒక ఆశ్రమంలో కలుసుకునేవాడిని. ఇది ఒక విశేషమైన దేవాలయం. ఇక్కడి గణపతి సోమస్కందుడిలా, తల్లి తండ్రులతో కలిసి ఉంటాడు. స్వామివారు సాక్షాత్ గణపతి అవతారం. ఇప్పుడు స్వామివారి దర్శనం ఆశ్రమంలోని బావి వద్ద నుండే. నాకు స్వామివారు ఏమీ చెప్పలేదు, ఏ ఉపదేశమూ చెయ్యలేదు అనే అసంతృప్తి ఉండేది. కాని స్వామి చెప్పకనే నాకు కొన్ని విషయాలు చెప్పారు. గాయత్రిని ఎప్పటికి మరువరాదు/విడువరాదు. రెండవసారి మహాస్వామివారు ఒక పుస్తకం చదువుతుండగా చూశాను; అంటే ప్రతిరోజూ భగవన్నామ జపము, ఈశ్వరార్చన జరపాలి. మూడోసారి స్వామివారు పద్మాసనంలో ధ్యానం చేసుకుంటూ కూర్చుని ఉన్నారు. చేతిలో ఉన్న పూలను తలపై వేసుకున్నారు. అంటే మనమే బ్రహ్మము. అదే సత్యం, దాన్ని తెలుసుకోవాలి. --- పి. సీతాపతి, రిటైర్డ్ IAS. అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్ శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

2
బాలు మామ మాటల్లో . . . పరమాచార్య స్వామివారి దర్శనానికి చెన్నై ఉన్నత న్యాయస్థానం నుండి ఒక జడ్జి వచ్చారు. పద్ధతి ప్రకారం, నడుము చుట్టూ ధోవతి కట్టుకున్నాడు కానీ, పైన ఎటువంటి అంగవస్త్రం వేసుకోలేదు. ఎందుకని అడుగగా, “మా ఇండ్లకు వచ్చే పేదవారిని ఆహ్వానించి అన్నం పెట్టి పంపడం మాకు ఆనవాయితీ. అలా వచ్చిన ఒక అతిథి నా అంగవస్త్రాన్ని, నల్ల కళ్ళజోడును తీసుకునివెళ్ళాడు. అప్పటి నుండి నేను అంగవస్త్రం వేసుకోను, కళ్ళజోడు పెట్టుకోను” అని చెప్పాడు. అతని మాటలను ఓపికగా విన్న మహాస్వామివారు మఠం తరుపున ఒక అంగవస్త్రాన్ని ఆ జడ్జికి ఇవ్వమని ఆదేశించారు. “ఇప్పటినుండి రోజూ అంగవస్త్రం ధరించు. ఏకవస్త్రం ధరించడం సరైన పద్ధతి కాదు. నల్ల కళ్ళద్దాలు పెట్టుకోవడం నీ స్వవిషయం. ఏకవస్త్రంతో సత్కర్మలు చేయరాదు” అని చెప్పారు. స్వామివారి ఆదేశానుసారం నడుచుకుంటానని మాటిచ్చాడు ఆ జడ్జి. పరమాచార్య స్వామివారు అటవీప్రాంతంలోని ఒక స్థలంలో ఉంటున్నారు. దాదాపు మధ్యాహ్నం మూడుగంటలప్పుడు ముగ్గురు ఆంధ్ర వైదికులు దర్శనానికి వచ్చారు. వారు ఇంకా స్నానం, సంధ్యావందనం, దేవతార్చన పూర్తిచేయ్యలేదు. అంతేకాక వారు స్వయంపాకీయులు (వారే స్వయంగా వండుకుని తినేవారు). కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అటువంటి ఏర్పాటు చెయ్యడం కుదరని పని. “సరే, ముందు మీ నిత్యకర్మలు పూర్తిచేసి మరలా ఇక్కడకు రండి” అని తెలిపారు స్వామివారు. శిష్యులకు ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు. చాలా కష్టతరమైన పని ఏమైనా పడుతుందేమో అని భయంతో దిగులుపడుతున్నారు. అరగంట తరువాత ఆ వైదికులు తిరిగొచ్చి మహాస్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేశారు. “మీ భోజనం తగురీతిన చెయ్యడానికి ఇక్కడ వసతులు అంత సరిగ్గా లేవు. అందుకే ఉప్పు వేయని నా భిక్ష పక్వాన్ని మీకు ఇవ్వమని నా సేవకులను ఆదేశించాను” అని చెప్పారు స్వామివారు. శిష్యులకు గుండెలో రాయి పడ్డట్టైంది. పరమాచార్య స్వామివారి భిక్ష కోసం సిద్ధం చేసిన పదార్థాలను వారికి ఇచ్చివేస్తే, మరి స్వామివారికి భిక్షగా ఏమివ్వాలి? “ఈరోజు సాంబషష్టి. నేను ఆహారం తీసుకోరాదు, నాకు పాలు చాలు” అని శిష్యులను ఓదార్చారు స్వామివారు. స్వామివారి త్యాగం వారి కళ్ళల్లో సుడిగుండాలను నింపింది. --- శ్రీమఠం బాలు మామ. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
997
3
మైలాపూర్ కర్పగాంబళ్ శ్రీమతి త్రిపురసుందరి, ప్రక్యాత తమిళ కవి, పండితుడు శ్రీ కి.వ. జగన్నాథన్ గారి కోడలు, పరమాచార్య స్వామివారి భక్తురాలు. మహాస్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఒకసారి స్వామివారు చెన్నైలో తాను ఎక్కడ నివసిస్తున్నది అని ఆ ప్రదేశం గురించి అడిగారు. “నేను మైలాపూర్ లో నివసిస్తున్నాను పెరియావ” అని బదులిచ్చారు ఆమె. “దేవాలయానికి వెళ్తుంటావా?” అని అడిగారు స్వామివారు. “అవును. నేను ఎప్పుడూ కర్పగాంబళ్ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటాను” “ఆమెని ఏమని వేడుకున్తావు?” “అందరి సంక్షేమాన్ని కోరుకుంటాను” అని చెప్పింది. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు. “నీకు ఒక విషయం చెబుతాను శ్రద్ధగా విను” “వెనుకటి జన్మలో నీవు చేసుకున్న పుణ్యఫలం వల్ల నీవు మైలాపూర్లో నివసిస్తున్నావు. ఆమె కర్పగాంబళ్ అమ్మవారు. ఆమె కల్పతరువు. ఆమె భిక్ష ఇస్తుంది. మనకు ఎన్నో జన్మలు ఉండవచ్చు. ప్రతి జన్మలోనూ నేను మైలాపూర్ లోనే జన్మించాలని, నీ పాద పద్మముల దర్శనం చేసుకునే భాగ్యం కలగాలని ఆమెను ప్రార్థించు” “ఆమె సన్నిధానంలో ఏ యాచకుడు లేదా చివరికి ఒక కుక్క కూడా ఆకలితో ఉండరు” అని చెప్పారు స్వామివారు. --- శ్రీమతి త్రిపురసుందరి అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్ శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1 185
4
అరటి ఆకులు - ప్లాస్టిక్ పోట్లాలు కాంచి మహాస్వామి వారు 1960లో తిరుచ్చి నేషనల్ కాలేజ్ హైస్కూలులో మకాం చేస్తున్నారు. స్వామివారి అనుగ్రహం కోసం ప్రతిరోజూ వేలసంఖ్యలో భక్తులు వస్తున్నారు. వచ్చినవారందరికీ మంచి రుచి అయిన భోజనం పెడుతున్నారు. ఉదయం పదకొండు గంటలకు మొదలయ్యే ఈ అన్నదానం సాయంత్రం నాలుగ్గంటల వరకూ జరిగేది. ఏర్పాట్లు చేసే బృందం సభ్యులు ఈ భక్తుల తాకిడిని నియంత్రించడానికి, భోజనాలు అయ్యాక వారిని పంపడానికి చాలా తంటాలు పడుతున్నారు. వారి సమస్యను స్వామివారికి చెప్పి, భోజనానికి వచ్చే భక్తులకు పంక్తి భోజనం కాకుండా ఆహార పోట్లాలను ఇచ్చే విషయమై స్వామివారికి తెలిపారు. పరమాచార్య స్వామివారు ఆ కమిటీ సభ్యులను ముందర కూర్చొబెట్టుకుని రెండు ప్రశ్నలను అడిగారు. మొదటిది: ఆహార పోట్లాలోని పదార్థాన్ని తిన్న తరువాత ఆ అరటి ఆకులను వారు ఎక్కడ పడవేస్తారు? రెండవది: దాహాన్ని తీర్చుకోవడానికి గ్లాసు నీళ్ళకోసం వారు ఎక్కడకు వెళతారు? స్వామివారు ముందర కూర్చున్నవారు ఎవ్వరూ ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారు. వారి మౌనాన్ని గమనించి స్వామివారే చెప్పారు, “ఖర్చును, పని ఒత్తిడిని తగ్గించుకోవాలని మీరు ఆలోచిస్తున్నారు. ఆకలిగా ఉన్నవాడు మాత్రమే మొదటి బంతిలో కూర్చోవాలని చూస్తాడు. ఇతరులు చివరి బంతిలో కూర్చుంటారు” “నేను ఎన్నో ప్రాంతాలకు వెళ్లినప్పుడు, భోజనం తరువాత ఆ అరటి ఆకులను ఒక తొట్టెలో పడవేస్తారు. నేను చూశాను ఆ ఆకులలో మిగిలిపోయిన పదార్థాలను నారికురవలు సేకరిస్తారు. మరియు ఆ ఆకులకు అంటుకున్న ఆహార పదార్థాలను ఆవులు తింటాయి. మీరు గమనించండి, ఆకులు వేసి భోజనం పెట్టడం వల్ల ఎందరో ఇతరుల ఆకలి కూడా తీరుతోంది”. “ఆహార పోట్లాలను తయారుచెయ్యాలన్న మీ ఆలోచనను విరమించుకొని, అందరికీ అరటి ఆకులు వేసి భోజనం పెట్టండి. ఇంతమంది ప్రజలు ఆహారం స్వీకరించడాన్ని చూడటం, దానికోసం ఖర్చు పెట్టుకోవడం కూడా మీకు పుణ్యం. నాకు ఆనందం కూడా” అన్న సమారాధనలు చెయ్యడం చూశాము కానీ, దానియొక్క గొప్పదనాన్ని ఇటువంటి మహాత్ములు చెప్పిన తరువాతనే అర్థం చేసుకున్నాము. --- రా. వేంకటసామి. ‘శక్తి వికటన్’ ఆగస్ట్ 15, 2004 ప్రచురణ అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్ శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1 391
5
వేదమార్గ ప్రమాణత్వఖ్యాపకాయ హోమం ఎంతో వైభవంగా, వైదిక మర్యాదతో జరుగుతోంది. ఇక పూర్ణాహుతి జరగాల్సిన చివరి సమయం. భక్తులు పరమాచార్య స్వామివారిని యాగశాలకు తీసుకునివచ్చారు. స్వామివారు యాగశాల చుట్టూ ప్రదక్షిణగా వెళ్ళి, కలశ కుండాలను దర్శించుకున్నారు. పూర్ణాహుతి చెయ్యడానికి స్వామివారి అనుమతి తీసుకివాల్సిన సమయంలో, “పూర్ణాహుతి ఇప్పుడు వద్దు; కొద్దిసేపు అయిన తరువాత చెయ్యొచ్చు” అని స్వామివారు ఆదేశించారు. అందరూ కలవరానికి గురయ్యారు. ఇది సరైన సమయమే కదా; మరి ఎందుకు చేయకూడదు? స్వామివారు లోపలకు వెళ్ళిన తరువాత, సేవకుడోకడిని లోపలకు పిలిచారు. “పూర్ణాహుతికి ఉంచిన నెయ్యి మంచిది కాదు; అది హోమయోగ్యమైనది కాదు. మరలా మంచి నెయ్యిని తెప్పించమని వారికి చెప్పు”. స్వామివారి ఆదేశం ప్రకారం ఆ ఏర్పాట్లు చేసిన తరువాత, ఆ సేవకుడు నెయ్యి డబ్బాని పరిశీలించాడు. మందంగా కందెనలాంటి పదార్థంతో, ఆరేడు పురుగులతో ఉంది. ఎక్కడో మూలలో ఉంచిన సగం డబ్బాలో ఉన్న నెయ్యి మలినమైపోయిందన్న విషయం స్వామివారికి ఎలా తెలిసింది? స్వామివారివి ఎక్సరే కళ్ళా? కాదు, కాదు, వెలుగురేఖలకే వెలుగు పంచే స్వయంప్రకాశమైన కళ్ళు అవి. ******* వేదపండితుడు, నిత్యాగ్నిహోత్రి, అనుష్టానపరాయణుడు అయిన ఒక వైదికుడు పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. అతడి వివరాలు కనుక్కున్న తరువాత స్వామివారు అతనితో మాట్లాడారు. ఆ పండితుని వైదిక అనుష్టానాన్ని స్వామివారు ఎంతగానో మెచ్చుకున్నారు. “నేను ఒక యాగం చేయబోతున్నాను. అంతా సిద్ధం అయ్యింది. ఎంతోమంది సహాయం చేశారు. నేను యాగ పశువును కోనాలి. దానికి చాలా వ్యయం అవుతుంది. పరమాచార్య స్వామివారు అనుగ్రహం చూపాలి. యాగపశువును కొనడానికి శ్రీమఠం నుండి ద్రవ్య సహాయం చెయ్యాలి” అని అగ్నిహోత్రి అడిగాడు. స్వామివారు యాగానికి ఆశీస్సులను అందించారు, “మంచి కార్యం. చాలా చక్కగా జరుగుతుంది. యాగంలో జరిగే పశుహింస అహింసయే. అది ధర్మ సమ్మతం. నేను సన్యాసిని. ‘అహింసో పరమ ధర్మ’ అన్నది నా ధర్మం. కనుక యాగపశువు కొనడానికి సహాయామ్ చెయ్యడం నాకు ధర్మం కాదు. ద్రవ్య సహాయం కోసం ఎవరైనా గృహస్థుణ్ణి అర్థించి నీ యాగం పూర్తి చెయ్యి”. ఆ వచ్చిన పండితుడు చాలా మొండివాడు. ఎలాగైనా మహాస్వామి వారి వద్ద ధనం తీసుకోవాలని అతని ఆశ. మహాస్వామి వారిని మాటలతో స్తుతించడం మొదలుపెట్టాడు, “ఆ... హ... హ... యజ్ఞేశ్వరుడు వైకుంఠంలో లేడు. సాక్షాత్తుగా ఇక్కడే ఉన్నాడు! పరమాచార్య స్వామియే యజ్ఞేశ్వరుడు . . .” “శాస్త్రిగారూ! మీకు కుదిరితే యాగం చెయ్యండి. పశువును కొనడానికి శ్రీమఠం నుండి ఒక్క పైసా కూడా దొరకదు. యజ్ఞం గురించిన విషయం మాకు ముందుగానే తెలిపి వుంటే, ఉచితమైన సహాయం చేసేవాడిని. కానీ మీరు అడుగుతున్న కార్యం కోసం సహాయం చెయ్యడం సన్యాస ధర్మానికి విరుద్ధం” అని కాస్త నిష్కర్షగా చెప్పారు స్వామివారు. ఆ వచ్చిన వ్యక్తికి కాస్త నిరాశ కలిగినా, తప్పు తనవైపు ఉంది కాబట్టి కాస్త శాంతించి వెళ్లిపోవడాన్ని శిష్యులు గమనించారు. --- శ్రీమఠం బాలు మామ. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1 529
6
అలా ఒకసారి శ్రీమఠానికి వెళ్లినప్పుడు, నేను తీసుకునివెళ్లిన పుస్తకం ముఖచిత్రం స్వామివారికి నచ్చలేదు. అది చిన్నపిల్లల కోసమ్ ప్రచురించిన చిన్న పొత్తమ్. ఒక బాకు పట్టుకున్న వ్యక్తి చిత్రాన్ని ముఖచిత్రంగా వేశాము. “ఇది చూడు, ఇది పిల్లలు చదివే పుస్తకం. మరి ఈ కత్తులు, కటార్లు అవన్నీ ఎందుకు?” అని స్వామివారు అనడంతో నాకు ఆందోళన కలిగింది. నేను చెన్నై చేరుకున్న వెంటనే చేసిన మొదటి పని కొత్త చిత్రం గీయించి, మొత్తం ప్రచురించిన పుస్తకాల ముఖచిత్రం మార్చడం. అప్పుడే నా మనస్సుకు శాంతి కలిగింది. స్వామివారు అంతటి సూక్ష్మ పరిశీలన కలిగిన వారు కాబట్టే ప్రతియొక్క విషయాన్ని లోతుగా పరిశీలించి, ఏదైనా తప్పు ఉంటే ప్రేమగా తెలిపేవారు. ఒకసారి నా వ్యక్తిగత వివరాలు కోరుతూ పాండిచ్చేరి విశ్వవిద్యాలయం నుండి ఒక ఉత్తరం వచ్చింది. నాకు డాక్టరేట్ డిగ్రీ ఇవ్వాలని వారు నిశ్చయించారు. ఎంతో ఆనందంతో ఆ ఉత్తరాన్ని మహాస్వామి వారి వద్దకు తీసుకునివెళ్లి, స్వామివారి ఆశీసులు కోరుతూ పూలు, పళ్లతో పాటు సమర్పించాను. స్వామివారు ఆ ఉత్తరాన్ని తీసుకుని పరిశీలించి దాన్ని పళ్లబుట్టలోకి పడేశారు. “వారు కూడా నీకు డిగ్రీ ఇస్తున్నారా? మేము Samaya Ilakkiyap Prachaara Mani మేము బిరుదు నిశ్చయించాము” అని సేవకుడిని పిలిచారు. కొద్దిసేపటి తరువాత ఆ సేవకుడు ఒక శాలువా తెచ్చి స్వామివారి తరుపున దాన్ని నాకు కప్పారు. దాంతో ఆగకుండా మహాస్వామి వారు ధరించిన పగడాల మాలని ఇచ్చి నా మెడలో వేయించి నన్ను ఆశీర్వదించారు. “దీనికంటే గొప్పదైన డాక్టరేటు ఏముంది?” అని స్వామివారు నన్ను అడిగినట్టు అనిపించింది. మరొక సందర్భంలో నా చెల్లెలు మీనల్ చాలా అనారోగ్యానికి గురయ్యింది. తను సరిగ్గా ఆహారం తీసుకోకుండా భ్రాంతిలో ఉన్నట్టు ఉండేది. ఎన్నోర్ దగ్గర్లోని కట్టుప్పల్లిలో మహాస్వామి వారు మకాం చేస్తున్నారు. నా చెల్లిని స్వామివారి వద్దకు తీసుకునివెళ్లాను. మొత్తం వివరాలు తెలుసుకుని నన్ను, తనను మార్చి మార్చి చూశారు స్వామివారు. స్వామివారి దృష్టిమాత్రం చేత మొండి రోగాలు కూడా నయమవుతాయి. “ఆమెను రోజూ తిరుముగాట్రుప్పడై చదవమను. తను చదవలేకపోతే, ఆమెకోసం ఎవరినైనా చదవమను. తన చెవులకు చేరితే చాలు” అని చెప్పారు స్వామివారు. ఒక్క చిన్న టీ కొట్టు కూడా లేని ఆ చిన్న గ్రామంలో, స్వామివారి ఆదేశం ప్రకారం మా కుటుంబం మొత్తానికి భోజనం ఏర్పాటు చేశామని సేవకులు తెలిపినప్పుడు మాకు ఆశ్చర్యం కలిగింది. అక్కడి నుండి వచ్చిన ఒక్క నెలలోపే మహాస్వామివారి ఆశీస్సులు, తిరుముగాట్రుప్పడై పారాయణ విశేషం వల్ల నా చెల్లికి స్వస్థత చేకూరింది. నేను యువకునిగా ఉన్నప్పుడు బర్మా నుండి భారతదేశానికి నడచివచ్చిన అనుభవాలను స్వామివారికి తెలిపే అవకాశం వచ్చింది ఒకసారి. బర్మా సంప్రదాయ విశేషాలను క్షుణ్ణంగా అడిగారు స్వామివారు. బర్మాయే ఇప్పటి మయన్మార్. “నువ్వు బర్మాలో ఉండేవాడివా? నీకు తెలుసా అక్కడ భూమిని దున్ని వ్యవసాయం చేసేవారిలో చాలామంది ఒరిస్సా వారని? రాత్రయితే వారు వీధినాటకాలు వేస్తూ, రామాయణ మహాభారతాలను ప్రదర్శిస్తారు. నువ్వు చూశావా?” అని అడిగారు. “కొద్దిగా తెలుసు. కృష్ణ లీల నాటకం కూడా వేస్తారు, దాన్ని నేను చూశాను” అని నాకు తెలిసినది చెప్పగానే మహాస్వామి వారు చెయ్యెత్తి, సుమనహోరమైనా నవ్వుతో నన్ను ఆశీర్వదించారు. ఎప్పటికీ మరపురాని దృశ్యం అది. --- వాణతి ఎ. తిరునవుక్కరసు. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 7 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1 315
7
ఆ పుస్తకావిష్కరణప్పుడు మహాస్వామి వారు కర్నూలులో మకాం చేస్తున్నారు. పుస్తకం మొదటి కాపీ తీసుకుని స్వామివారికి సమర్పించి ఆశీస్సులు అందుకున్నాము. అప్పటికి బాల పెరియవా కూడా మఠానికి వచ్చేశారు. అప్పుడు కర్నూలులో దేవాలయాల మూర్తుల చిత్రపటాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. నాతోపాటు మా బామ్మని, నా కూతురు వాణతిని కూడా కర్నూలుకు తీసుకునివెళ్లాను. అది మాకు మంచి అనుభవాన్ని మిగిల్చింది. ఏదో కారణం వల్ల మా మూడవ అమ్మాయి వాణతి వివాహం ఆలస్యం అవుతూవుంది. ‘నక్షత్రం బాలేదు’ వంటి కారణాల వల్ల ఆలస్యం జరుగుతోంది. తగిన వరుడు దొరకకపోవడంతో మేము చాలా దిగులుగా ఉన్నాము. నాకు అది కావాలి, ఇది కావాలి అని అడిగే స్వభావం కాదు నాది. కానీ ఆరోజు మహాస్వామివారిని కలవగానే అడగాలన్న ఆలోచన కలిగింది. “మా అమ్మాయి వివాహం ఏదో కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. తనపై స్వామివారు కరుణ చూపాలి” అని వేడుకుని నమస్కారం చేశాను. నా ప్రార్థనని స్వామివారు స్వీకరించిన విధానం నాకు కాస్త గందరగోళ పరిస్థితిని కల్పించింది. “ఏమిటి? డబ్బు వల్ల అడ్డంకా? మగపెళ్ళివారు అంత ఎక్కువ ధనం అడుగుతున్నారా? పుస్తక ప్రచురణ వల్ల నీ ధనం అంతా అయిపోయిందా? పుస్తకాలను మఠానికి పంపు. నీకు డబ్బులు ఇవ్వమని నేను చెబుతాను” అని స్వామివారు అంటుండగా నాకు చమటలు పట్టాయి. “సమస్య డబ్బు వల్ల కాదు పెరియవా, ఏవో ఇతర కారణాల వల్ల . . . ” అని తెలిపి పుస్తకాలు కూడా ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతున్నాయి అని చెప్పాను. తరువాత స్వామివారు పుస్తకాలు కొన్నవారి వివరాలు, వారి వయస్సు, ప్రాంతం వంటి వివరాలను అడిగారు. “మధ్యవయస్కులు ఎక్కువ సంఖ్యలో కొంటున్నారు. డెబ్బై, ఎనభై యేళ్ళ వయస్సు వారు కూడా కొంటున్నారు. చెన్నై వారే కాకుండా, కోయంబత్తూర్, మధురై, తంజావూర్ నుండి కూడా కొంటున్నారు” అని తెలిపాను. స్వామివారు మమ్మల్ని ఆశీర్వదించి, వాణతిని దగ్గరకు రమ్మని పిలిచి, బుట్ట నిండుగా ఉన్న పళ్ళు, పోలా ప్రసాదాన్ని తీసుకొమ్మన్నారు. నాకు ఏదో తెలియని ధైర్యం వచ్చింది. దగ్గరలోని గదిలో ఉన్న ఔడు పెరియవా వద్దకు వెళ్ళి జరిగిన విషయం అంతా తెలిపాను. ఎప్పటిలానే నగుమోముతో నన్ను దగ్గరకు పిలిచి, “పరమాచార్య స్వామివారే స్వయంగా తమ నోటితో డబ్బులు ఇస్తాను, తీసుకుని వెళ్ళు అని చెప్పడం గొప్ప భాగ్యం మరియు అరుదు. ఇప్పటి నుండి ఆ పుస్తకాలు పెద్ద ఎత్తున అమ్ముడవుతాయి అని దాని భావం” అని తెలిపి ఆశీర్వదించి పంపారు. మహాస్వామివారి మహత్తరమైన అనుగ్రహం వల్ల దైవతిన్ కురల్ ఏడు సంపుటాలుగా విడుదలయ్యి, ప్రతీదీ అన్నో ప్రచురణలు పొందింది. ఈ గొప్ప కార్యంలో నేను కూడా ఒక పనిముట్టు అయినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అద్భుతాలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుగుతాయో చెప్పడం కష్టం. కర్నూలు నుండి తిరిగిరాగానే జరిగిన ఒక అద్భుతం, వాణతి వివాహానికి నిశ్చితార్థం జరగడం. అందులో మరొక ఆశ్చర్యం! మేము వరుని కోసం పల్లత్తూర్, కనడుకత్తన్, రాయవరం మొదలైన ఊర్లలో వెతుకుతున్నాము. కానీ వాణతికి కాబోయే భర్త దేవకొట్టైలో మా ఇంటి పక్కన ఉన్న వీధిలోనే ఉన్నాడన్న విషయం మాకు తెలియదు. మహాస్వామివారి అనుగ్రహ విశేషం వల్ల డబ్బుతో పాటు మంచి గుణవంతుడైన తిరుజ్ఞాన సంబంధం అన్న పేరున్న న్యాయవాదిగా పనిచేస్తున్న అల్లుడు దొరికాడు. పుదుక్కోట్టైలో నివాసముంటున్న ఆ దంపతులకు ఒక కొడుకు కూడా ఉన్నాడు; నా మనవడు కార్తీక్. ఒకసారి నేను మహాస్వామివారి దర్శనానికి వెళ్లినప్పుడు మా ప్రచురణ సంస్థకి “వాణతి పదిప్పగం” అన్న పేరెందుకు పెట్టారు అని అడిగారు. నా చిన్నప్పటినుండి అమరర్ కల్కి గారిపై ఉన్న భక్తి భావం వల్ల, వారు రచించిన ‘పొన్నియిన సెల్వన్’ అన్న ప్రఖ్యాత నవలలోని ప్రముఖ పాత్రపేరు కావడంతో, దాన్ని మా సంస్థకు పేరుగా నిర్ణయించుకున్నాము అని తెలిపాను. “అది నిజం! భగీరతుడు భువిపైకి తెచ్చిన అక్కడున్న ఆకాశ గంగ పేరు కూడా వాణతి; వాన్-నది” అని చెబుతూ ఆకాశంవైపు చూసి గాలిలో నది దిగి వచ్చినట్టుగా వేలితో చూపించారు. అప్పటికప్పుడు నేను ఆనందపరవశుడయ్యాను. అప్పటినుండి నేను ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా, అక్కడున్నవారు నా రాక గురించి స్వామివారికి చెప్పగానే, స్వామివారు గాలిలో నది ప్రవహించినట్టుగా గీసి, “వాణతి వచ్చాడా? రమ్మనండి” అని చెప్పడం అలవాటు చేసుకున్నారు స్వామివారు. శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారి సమక్షంలో, అప్పటి ప్రధాని శ్రీ పి.వి. నరసింహా రావు గారి చేతుల మీదుగా దైవతిన్ కురల్ ఆరవ సంపుటి విడుదల చేసి, మమ్మల్ని సన్మానించారు. నేను మహాస్వామివారి దర్శనానికి వెళ్ళిన ప్రతిసారీ కొత్తగా ప్రచురించిన పుస్తకాలను స్వామివారికి సమర్పించేవాడిని. స్వామివారు ముఖచిత్రంవైపు ఒకసారి చూసి, మొత్తం పుస్తకాన్ని పరిశీలించి ఒక్కోసారి తగిన సూచనలను చేసేవారు.
1 000
8
దాంతో నేను మహాస్వామివారికి, స్వామివారి అంతేవాసులైన శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి, శ్రీ శంకర విజయేంద్ర స్వామివారికి దగ్గరై వారి ఆశీస్సులను అందుకున్నాను. ఈ అనుగ్రహం కేవలం మా పూర్వీకులు అనుగ్రహం, పూర్వ జన్మలో నేను చేసిన పుణ్యకర్మల ఫలితాలు మాత్రమే. అంతకాక మరేమిటి? మా నాన్నగారు ఏకప్ప చెట్టియార్ గారు పండిపోయిన శివ భక్తులు. వారు జ్ఞానులను, మహాత్ములను ఆదరించి, గౌరవించి, పూజించే అలవాటుని తలచుకుంటే, శ్రీమఠంతో నాకు కలిగిన సంబంధం కేవలం పూర్వ పుణ్య ఫలితం మాత్రమే. ఎన్నో సంవత్సరాలపాటు కేవలం మూల మూర్తిని దూరంనుండి దర్శించుకుని లెంపలేసుకుని మొక్కుకునే నాకు, అవ్యాజ కరుణ వల్ల లభించిన అదృష్టం అక్కడే శాశ్వత సంగాన్ని పొందడం. ఈ అవకాశం నాకు కలగడానికి, నేను ఎంతగానో ఆరాధించి పూజించే కల్కి వార పత్రిక ప్రచురించే అమరర్ కల్కి (కల్కి కృష్ణమూర్తి) కారణం. పరమాచార్య స్వామివారి దైవ వాక్కును కల్కి ప్రచురణల్లో వివిధ శీర్షికలు క్రింద ఒక పూర్తి పేజీలో ప్రతి వారమూ తప్పక ప్రచురించేవారు. పెద్ద పెద్ద వ్యాసాలను దీపావళి మలర్ అన్న ప్రత్యేక సంచికల్లో ప్రచురించేవారు. అంతటి అద్భుతమైన వ్యాసాలను సేకరించి, ప్రచురిస్తున్నవారు మహాస్వామివారి పరమ భక్తులైన రా. గణపతి గారు అని తెలిసింది. వాటినన్నిటిని సేకరించి ఒక్క ప్రచురణగా విడుదల చేస్తే, అది నాకు పుణ్యము మరియు భక్తులకు ఎంతో ఉపయోగము. ఇదే విషయాన్ని రా. గణపతి గారిని అడిగితే, ఇది శ్రీమఠం అనుమతితోనే జరగాలని, వ్యక్తిగతంగా ఈ ఆలోచన నచ్చిందని అన్నారు. ఆలస్యం చెయ్యకుండా వెంటనే మోక్షపురి అయిన కంచికి వెళ్ళి, శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారికి విన్నవించాను. అప్పటికే మహాస్వామి వారు మూలమూర్తిగా ఉంటూ చాలా తక్కువగా బయటకు వచ్చేవారు. కేవలం జయేంద్ర సరస్వతీ స్వామివారు మాత్రమే ఉత్సవమూర్తిలా ఉంటూ అన్నీ పనులూ చేసేవారు. అప్పుడు మేము వారిని పుదు పెరియవా అని సంబోధించేవారం. తరువాత శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారిని బాల పెరియవా అని సంబోధించేవారం. శ్రీమఠంలో ముగ్గురు ఆచార్యులను ఏకకాలంలో దర్శించుకోవడం ఆ శతాబ్ధపు చివరి భాగంలో సజీవులైవున్న మావంటి వారికి కలిగిన గొప్ప అదృష్టం. మహాస్వామివారి దివ్య వాక్కు అలా పుస్తకరూపంలో రావడం జయేంద్ర సరస్వతీ స్వామివారికి సంతోషమే అయినా, పరమాచార్య స్వామి వారికి కూడా ఈ విషయం చెప్పాలని స్వామివారి అభిప్రాయం. అలాగే ఇటువంటి పుస్తకాలు ఎవరైనా ఆర్థిక స్వావలంబన పుష్టిగా ఉన్న పెద్ద సంస్థలు ప్రచురిస్తే చాలా బావుంటుందని చెప్పి, అటువంటి కొన్ని సంస్థల పేర్లు కూడా తెలిపారు. మహాస్వామి వారికి నా కోరిక మరియు ఇతర భక్తుల అభిప్రాయాలను కూడా తెలిపారు. నా కోరిక మహాస్వామి వారు చెప్పిన విషయం విని చాలా ఉద్వేగానికి లోనయ్యాను. పారవశ్యంతో ఒళ్ళు పులకరించి సన్నటి నీటిపొర నా కంటికి అడ్డుపడింది. స్వామివారు ఇతర ప్రముఖ ప్రచురణకర్తల గురించి చెబుతూ, “పుస్తకాన్ని వారు ప్రచురిస్తే బావుంటుంది, కానీ చదువరులు వాటిని గాజు గూళ్ళల్లో భద్రంగా దాచుకుంటారు. వాటి కంటే వాణతి తిరునవుక్కరసు మంచిది. విషయం(జ్ఞానం) అందరికీ చేరుతుంది. చేరదా?” అని అన్నారు. ఈ సామాన్యుడి పైన మహాస్వామి వారు పెట్టిన నమ్మకం సామాన్యమైనది కాదు. పరమాచార్య స్వామివారి అమృత వాకులను ‘దైవతిన్ కురల్’ అన్న పేరున వాణతి(పధిప్పహమ్) ద్వారా పుస్తక రూపంలో రావడానికి మహాస్వామి వారి అనుమతిని, ఆశీస్సులని తీసుకోవడానికి శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారు చేసిన సహాయాన్ని, నా జీవితంలో మరచిపోలేను. ఈరోజు ఆ ‘దైవతిన్ కురల్’ ఉపన్యాస సంగ్రహాలు ఏడు సంపుటాలుగా ప్రచురింపబడడం తలచుకుంటేనే అద్భుతం అని తోస్తుంది. ఈ ఏడు సంపుటాలు ఏడు సముద్రాలతో సమానం. వాటిని పూర్తిగా చదివిన వారికి ఎవరికైనా, ఇక ప్రపంచంలో తెలుసుకోవలసిన విషయం అంటూ ఏమీ ఉండదు అని అర్థమవుతుంది. వేదాలు, వేదాంతము, పురాణాలు, రాజకీయాలు, సంస్కృతి సాంప్రదాయాలు, చరిత్ర, గణితం, ఖగోళశాస్త్రం, ఆధినిక వైజ్ఞానిక శాస్త్రం - ఇలా మహాస్వామివారి మస్తిష్కంలో లేని అంశం అంటూ ఉండదు. వాణతి తరుపున ఈ దైవ వాక్కును పుస్తక రూపంలో ప్రచురించడం కంటే మహత్తరమైన గొప్ప కార్యం మరొకటి ఉంటుందని నేను అనుకోను. ఇది కేవలం భగవంతుని అనుగ్రహ ఫలితం మాత్రమే. అత్యంత భయ భక్తులతో, పరమాచార్య స్వామివారి ముఖచిత్రంతో కూడిన దాదాపు వెయ్యి పేజీల దైవతిన్ కురల్ పుస్తకం మొదటి ప్రతిని తీసుకుని, మహాస్వామి వారు మకాం చేస్తున్న కలవై చేరుకున్నాము. నాతోపాటు సంకలనకర్త అయిన రా. గణపతి గారు కూడా వచ్చారు. మొదటి పేజీ తీసి లోపలకు చూశారు. “ఇంత పెద్ద పుస్తకంగా ప్రచురించావా? ఎన్ని ప్రతులు అచ్చు వేయించావు?” అని విచారించి ఆశీస్సులను అందించారు స్వామివారు. అది 1976లో జరిగిన సంఘటన. ఈరోజు ఆ మొదటి సంపుటి మాత్రమే పదిహేడు పునర్ముద్రణలు అయ్యింది. దైవతిన్ కురల్ మూడవ భాగం ప్రచురించిన తరువాతనే పుస్తకావిష్కారణ ఏర్పాట్లు చేసుకున్నాము. ఆ మూడవ భాగాన్ని ఆవిష్కరించినవారు మహాస్వామివారి భక్తులు మరియు అప్ప్తి భారతదేశ రాష్ట్రపతులు శ్రీ ఆర్. వేంకటరామన్ గారు.
794
9
‘దైవతిన్ కురల్’ అలా వచ్చింది పరమాచార్య స్వామివారిని మొదటిసారిగా దర్శించుకున్న రోజులు నాకు ఇప్పటికి గుర్తున్నాయి. అది 1961వ సంవత్సరం. ప్రముఖ రచయిత ఆర్.వి. అందరికి తెలుసు. కణ్ణన్ పిల్లల మాస పత్రిక కలైమగళ్ కుటుంబం వారి అద్భుతమైన ప్రచురణ. ఆ పత్రిక సంపాదకులు ఆర్.వి. ఎందరో రచయితలు ఆ పత్రికకు వ్రాశారు. కణ్ణన్ పత్రికలకు రాయని రచయితలు ఎవరూ లేరు అని చెప్పవచ్చు. ప్రస్తుత శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ జయేన్ద్ర సరస్వతీ స్వామివారు కూడా ఒక ‘కణ్ణన్ రచయితే’. వారి కలంపేరు ‘కింకరన్’. శ్రీమఠంతో నాకున్న సంబంధం గురించి వచ్చిన పిళ్ళయార్ చూళి రాసినది కూడా ఈ ఆర్.వి. యే. అది ఒక దివ్యమైన అనుభవాల సంపుటి. నా స్నేహితుడు అ.లె. నటరాజన్ వ్రాసిన మహాభారతం గద్యానికి కంచి పరమాచర్య స్వామివారి నుండి శ్రీముఖం పొందాలని అనుకున్నాము. నా స్నేహితుడు ఆర్.వి. మమ్మల్ని మహాస్వామి వారి దర్శనానికి తీసుకుని వెళ్ళాడు. అప్పుడు స్వామివారు జయేన్ద్ర సరస్వతీ స్వామివారితో కలిసి మధురైలో మకాం చేస్తున్నారు. మహాకవి సుబ్రహ్మణ్య భారతి బోధించిన సేతుపతి హైస్కూలులో స్వామివార్లు ఉన్నారు. దాదాపు అయిదువేల మంది భక్తకోటి అక్కడ ఉన్నారు. ఎటువైపు చూసినా, "హర హర శంకర, జయ జయ శంకర" అన్న ఘోష వినబడుతోంది. మేము అక్కడకు చేరుకునేటప్పటికి ఉదయం తొమ్మిది గంటలు అయ్యింది. ఆర్. వి. చేసిన ఏర్పాటుతో మేము సరాసరి స్వామివారి వద్దకు వెళ్ళాము. అ. లె. నటరాజన్ రచించిన వ్యాసర్ అరుళియ మహాభారతం అన్న గద్య గ్రంథానికి స్వామివారి శ్రీముఖం కావాలని అభ్యర్థించాము. మా పేర్లు, ఇతర వివరాలు, ప్రచురణ పేరు అడిగి పుస్తకాన్ని తీసుకున్నారు. స్వామివారి నుండి ఏం సమాధానం వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నాము. "ఈ విషయమై మద్రాసు నుండి వచ్చాము. శ్రీముఖం అనుగ్రహం ఈరోజే ఇవ్వాల్సిందిగా స్వామివారిని వేడుకుంటున్నాను" అని ఆర్. వి. ప్రార్థించాడు. "అలాగా?" అని స్వామివారు నవ్వారు. "కొద్దిసేపు వేచి ఉండగలరా? పూజ పూర్తి అవ్వని" అని చేతితో సైగ చేశారు. స్వామివారి ఆదేశం ప్రకారం చేశాము. ఎంతోసేపు వేచిచూశాము. జీవితంలో అంతసేపు వేచియుండడం నేను మొదటిసారి. దాదాపు సాయంకాలం ఆరుగంటలు అయ్యింది. శ్రీమఠం సేవకులొకరు "తిరునవుక్కరసు, తిరునవుక్కరసు . . . ఇక్కడ ఎవరు . . . అతణ్ణి తీసుకునిరమ్మని స్వామివారి ఆదేశం" అని పిలిచాడు. నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. నిజంగా నన్నే పిలుస్తున్నారా లేదా ఆ పేరున ఉన్నవారినెవరినైనా పిలుస్తున్నారా అని సందేహం కలిగింది. ఆర్. వి. ప్రోత్సాహంతో స్వామివారి వద్దకు వెళ్ళాము. నేను, అ.లె. స్వామివారివద్దకు వెళ్ళగానే, ఆ దైవం నన్ను "తిరునవుక్కరసు" అని నోరారా నన్ను పిలిచి, శ్రీముఖం ఇచ్చి ఆశీర్వదించారు. అక్కడ అప్పుడు ఎందరో శిష్యులు ఉండగా, స్వామివారు ఉదయమెప్పుడో నా పేరు ఒక్కసారి విన్నారు అంతే. దాన్ని గుర్తుంచుకుని స్వామివారు నన్ను పిలవడం, తలచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తోంది. ఆరోజుల్లో 'దైవ వళిప్పాట్టు సంఘం' అన్న ఒక సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండేది. అందులో ఆర్. వి. ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవాడు. సత్సంగం సేవకులతో తరచుగా కంచి వెళ్ళి, మహాస్వామివారిని దర్శించుకుని స్వామివారు ఇచ్చే విభూతి, కుంకుమ, అక్షతలను తీసుకునివచ్చేవాడు. వాటిని జాగ్రత్తగా చిన్న చిన్న పొట్లాలుగా చేసేవాడు. నేను కూడా ఈ పనిలో సహకరించేవాడిని. 'దైవ వళిప్పాట్టు సంఘం' సంస్థ సేవకులు ఆ చిన్ని పొట్లాలను తీసుకుని శనివారాలు ఆదివారాలు చెన్నై సాధారణ ఆనుపత్రి, రోయపెట్ట ఆసుపత్రికి వెళ్ళి, కంచి స్వామివారి ఆశీస్సులు ఉన్న ఈ పొట్లాలను వైద్యం కోసం అక్కడకు వచ్చిన రోగులకు పంచేవారు. రోగంతో మంచాన ఉన్న వారు ఎంతో భక్తితో వాటిని స్వీకరించేవారు. సాక్షాత్ మహాస్వామివారి చేతులమీదుగానే అందుకున్న ఆనందం పొందేవారు. కేవలం మందుల కంటే, భగవంతుని కృప మరియు మహాత్ముల అనుగ్రహం తప్పక కాపాడుతుంది. కంచి పరమాచార్య స్వామివారి అనుగ్రహంతో క్రమం తప్పకుండా ఈ పని సాగింది. వీటిని పంచడానికి వచ్చే సేవకులు కూడా ఈ పనిపై ఎంతో నమ్మకం, నిబద్ధత కలవారు. నేను ఆ సంఘంలో సభ్యుణ్ణి కాకపోయినా, ఆర్. వి. తో పాటు నేను కూడా ఎన్నోసార్లు వెళ్ళేవాడిని. వాటిని పంచడంతోనే మా పని అయిపోయినట్టు కాదు. మేము మరలా మహాస్వామి వారిని కలిసినప్పుడు ఎంతో ఆసక్తితో సేవకుల అనుభవాలను అడిగి తెలుసుకుని సంతోషపడేవారు. “నువ్వు ప్రసాదం ఇచ్చావా? వారు ఏమన్నారు? మరలా వారిని కలిశావా?” ఈ ప్రశ్నలలో ఉన్న పరమార్థం వేరు. చాలావరకు, మొదటివారం మేము ఆసుపత్రిలో చూసినరు జబ్బు నయమై మరుసటి వారం మేము వెళ్ళేటప్పటికి వెళ్లిపోయేవారు. ఈ విషయం మేము స్వామివారికి చెబితే, వారు ఎంతో సంతోషించి మమ్మల్ని ఆశీర్వదించేవారు. ఈ కాలంలోనే నేను ఆర్. వి. తో పాటుగా సేవ చేసి, తరచుగా మఠానికి వెళ్ళి మహాస్వామి వారిని దర్శించుకునేవాణ్ని. స్వామివారి దర్శన అనుభవాలు ఎంతో మధుర క్షణాలు.
1 177
10
25 ఏళ్ళు - 7 ఏళ్ళు నేను ఒకసారి మహాస్వామి వారి దర్శనంకోసం కర్ణాటక రాష్ట్రం లోని వాసనగెరె వెళ్ళాను. స్వామి వారు సండూరు మహారాజు గారికి చెందిన గనుల ప్రాంతములో పర్యటిస్తున్నారు. కొంతమంది భక్తులతో కలిసి స్వామి వారు ఒక జమఖానం పై కూర్చున్నారు. ‘వేద రక్షా నిధి ట్రస్ట్’ కు చెందిన అన్నాదురై అయ్యంగార్ మరియు కొంతమంది వారి వేదపాఠశాల విద్యార్థులతో పాటు అక్కడ కూర్చున్నారు. అప్పుడు సమయం రాత్రి 10:30 గంటలు. సండూరు మహారాజు, మహారాణి, వారి కుమారుడు కూడా అక్కడ ఉన్నారు. అతను యు.స్ లోని యేల్ విశ్వవిద్యాలయంలో గణిత శాఖలో రీడర్ గా పనిచేస్తున్నాడు. అతను గణితంలో పి. హెచ్.డి పట్టా పొందాడు. వారి తల్లితండ్రులు స్వామి వారి ముందు వినయంగా నిలుచున్నారు. కాని ఇతను మాత్రం చాలా మమూలుగా ఉన్నాడు. పరమాచార్య స్వామి వారు రాజుగారు మరియు రాణిగార్లతో కాసేపు కన్నడం లో మాట్లాడి కొద్దిసేపటి తరువాత వాళ్ళ అబ్బాయి వంక తిరిగి అడిగారు. “నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? ఏమి చేస్తున్నావు” “నేను యేల్ విశ్వవిద్యాలయంలో గణిత శాఖలో రీడర్ గా పనిచేస్తున్నా ను” అని బదులిచ్చాడు. ”నువ్వు ఏమి చదువుకున్నావు? గణితంలో ఏ శాఖలో నువ్వు పి. హెచ్.డి పట్టా పొందావు?” అని అడిగారు. పరమాచార్య స్వామి వారికి అర్థం అవదు అని సంకోచిస్తూ అతను కొద్దిసేపు వారి ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అతని తండ్రి చెప్పమని అదేశించాడు. ”క్వాంటమ్ థియరీ” అని నిర్లక్ష్యంగా అన్నాడు. మహాస్వామి వారు మట్టిలో ఒక +ve సంజ్ఞను వేసి దాని చుట్టూ ఒక వృత్తం వేసారు. అలాగే –ve సంజ్ఞను వేసి ఒక వృత్తం వేసారు. వాటిని రెండూ చూపిస్తూ అతన్ని అడిగారు. ”నీ పి.హెచ్.డిలో క్వాంటమ్ థియరీ థీసిస్ కోసం నువ్వు సానుకూల విధానాన్ని(Positive Approach) అవలంబించావా లేదా ప్రతికూల విధానాన్ని(Negative Approach) అవలంభించావా?” అంతదాకా చికాకుగా ప్రవర్తిస్తున్న వాళ్ల అబ్బాయి ఈ ప్రశ్న విని కొద్దిగా ఆశ్చర్యపోయి కంగారుతో మాటలు తడబడగా పరమాచార్య స్వామి వారిపై గౌరవంతో బదులిచ్చాడు. ”సానుకూల విధానాన్ని అవలంబించాను.” “ప్రతికూల విధానాన్ని ఎందుకు తీసుకోలేదు? అది తరువాత చేద్దాం అనుకున్నావా?” ”అది సాధ్యపడదు. చాలా కష్టం” మహాస్వామి వారు అన్నాదురై అయ్యంగార్ వైపు చూసి “అది కష్టం అని అతను అంటున్నాడు. మీ వేద పాఠశాల పిల్లలతో ఋగ్వేదము నుండి ఈ పన్నాన్ని ఆమ్నాయం చెయ్యమని చెప్పండి” అని మొదటి రెండు పదాలను అందించారు. ఆ విద్యార్థులు దాన్ని ఐదు నిముషముల సేపు వల్లించారు. తరువాత ఆ అబ్బాయి వంక తిరిగి, ”నువ్వు 24 లేదా 25 వ సంవత్సరములో నీ పట్తా పొందావు కదూ.” అని అన్నారు “అవును నా 25వ సంవత్సరములో” అని బదులిచ్చాడు. ”ఋగ్వేదం లోనిది ఇప్పుడు నువ్వు విన్నది. అది సానుకూల విధానానం, ప్రతికూల విధానాం రెండింటి గురించి చెప్తుంది.” అని అన్నారు. వారి మాటలకు ఆ అబ్బాయి విస్తుపోయి, మళ్ళీ ఒక సారి చెప్పమని ఆ విద్యార్థులను కోరాడు. ”నువ్వు ఇప్పుడు ఏమి అలోచిస్తున్నావో నాకు తెలుసు. 25సంవత్సరాల లక్షలు లక్షలు ఖర్చుపెట్టి చదువుకొని తెలుసుకున్నది కేవలం 7 ఏళ్ళు వేదం చెదువుకొని ఉంటే తెలుసుకుని ఉండేవాడిని కదా!” అని గట్టిగా నవ్వారు. --- తిరువణ్ణామలై గౌరీశంకర్ మామ అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు. t.me/KPDSTrust #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1 577
11
జయ జయ శంకర !! హర హర శంకర !! చాతుర్మాస్యం సందర్బంగా మన ట్రస్ట్ తరుపున కంచి మఠంలో ప్రతీరోజూ భిక్షావందనం.
1 588
12
No text...
1 636
13
ధర్మము – ధర్మాచరణము నాకు గుర్తున్నంతవరకు అది 1965వ సంవత్సరం. పరమాచార్య స్వామివారు తిరుపతిలో మకాం చేస్తున్నారు. స్వామివారు వేంకటేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవం చేయించారు(600/- టికెట్టు). కళ్యాణోత్సవం తరువాత దేవస్థానం వారు ప్రసాదాలను ఇచ్చారు. కళ్యాణోత్సవం చేయించిన వారికి స్వామివారి దర్శనం కల్పిస్తారు. వీరిని మామూలు క్యూలైన్లలో కాకుండా వేరేగా స్వామి దర్శనానికి పంపిస్తారు. ఆలయ పేష్కారు స్వామివారిపై ఉన్న అపరిమిత భక్తి వల్ల పరమాచార్య స్వామివారితో ఉన్న మా అందరిని శ్రీనివాసుని దర్శనానికి రమ్మని పిలిచాడు. మేము దాదాపు ఒక పదిహేను మందిమి దాకా ఉన్నాము. అప్పుడు పేష్కారుతో మహాస్వామివారు, “కళ్యాణోత్సవం చేయిస్తే ఎంతమందిని దర్శనానికి అనుమతిస్తారు?” అడిగారు. ”ఆరు మందిని” అని పేష్కారు బదులిచ్చాడు. ”అలా అయితే మేము ఆరుమందిమి మాత్రమే ఈ విశేష దర్శనానికి వస్తాము. నేను, పుదు పెరియావ(జయేంద్ర సరస్వతి స్వామి), మరో నలుగురు” అని చెప్పారు. వెంటనే పేష్కారు ”అందరమూ వెళ్ళవచ్చు. . . ఏమి పరవాలేదు” అని అన్నాడు. ”అది తప్పు అధర్మం. దేవస్థానం ఒక నియమం చేసింది. కల్యాణోత్సవం టికెట్టుపై ఆరుమందికి విశేష దర్శనం అని. నీవు దేవస్థానం చిప్పంతివి(ఉద్యోగివి). నీకు నాపైన ఉన్న భక్తివల్ల పదిహేనుమందిని దర్శనానికి పంపించడం సరికాదు. దీని వల్ల రెండు తప్పులు జరుగుతాయి. దేవస్థానం తీసుకున్న నిర్ణయాలను ఒక దేవస్థానం ఉద్యోగియే ధిక్కరించడం. అంటే నిబంధనలను పెట్టినవారే వాటిని పాటించకపోతే ఇక ఇటువంటి నిబంధనలు ఎందుకు? మరొకటి నియమాలను అతిక్రమించడానికి నేనే ఒక అవకాశం ఇచ్చినట్టు. కాబట్టి మేము ఆరుగురు మాత్రమే వస్తాము” అని చెప్పారు. పేష్కారు ఏదో చెప్పబోతుండగా, మహాస్వామివారు మధ్యలోనే ”ధర్మం కేవలం ప్రచారం చెయ్యడానికి మాత్రమే కాదు. స్వయంగా దాన్ని తప్పక అనుష్టానించి చూపాలి”. ”రామో విగ్రహవాన్ ధర్మః - మూర్తీభవించిన ధర్మమే రాముడు” అన్నట్లు ఈ సంఘటనను నా కళ్ళారా చూడడం చేత పరమాచార్య స్వామివారు సాక్షాత్ రెండవ రాముడై “ఈ యుగానికి రాముడు” అని అర్థమైంది. [చదివినది విన్నది ధర్మం కాదు ఆచరించినదే ధర్మం. మొత్తం వేద వాంగ్మయ సారమంతా రెండే మాటలు. “సత్యం వద - ధర్మం చర”. “సత్యం పలుకు - ధర్మం పాటించు”. మరి ఏది సత్యం? ఏది ధర్మం? వేదం సత్యం. వేదం చెప్పినది ధర్మం. వేదప్రామాణమే సత్యం. అపౌరుషేయమైన వేదమే ప్రామాణం] --- బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షితర్, కంచి శ్రీమఠం విద్వాన్. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 1 #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1 696
14
అనంతమైన అనుభవాలు కేరళ నుండి ఒక జ్యోతిష్కుడు పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. ఆరోజు స్వామివారు కాష్టమౌనంలో వున్నారు. ఆ జ్యోతిష్కునితో ఏమీ మాట్లాడలేదు కానీ, చిరునవ్వుతో ఒక పండును అతనికి అనుగ్రహించారు. జ్యోతిష్కుడు బయటకు వచ్చాడు. శ్రీమఠం సిబ్బంది అతణ్ణి చుట్టుముట్టారు. ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉండడం సహజం కదా? ఆ సమస్యలు ఎప్పుడు అంతం అవుతాయో అని తెలుసుకోవడం అందరికీ ఇష్టమే కదా. వెంటనే ఆ జ్యోతిష్కుడు, “ఇక్కడ నేను జోస్యం చెప్పలేను. ఇక్కడ, ఈ స్థలంలో పరమాచార్య స్వామి పరిపూర్ణ సాన్నిధ్యం ఉంటుంది. స్వామివారు ఉన్న చోటునుండి మూడువందల అడుగుల లోపల ఏ గ్రహమూ మాట్లాడాదు; ఏ దేవతా బదులివ్వదు. మీరు నేను బస చేస్తున్న చోటుకు రండి; మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తాను” అని చెప్పారు. ఒక్క దర్శనంతోనే ఆ జ్యోతిష్కుడు స్వామివారిని అర్థం చేసుకున్నాడు. ************** ఒక భక్తుడు కాశీ క్షేత్రంలో రుద్రైకాదశి జప హోమం చేసి, అక్కడి నుండి గంగాజలం తీసుకునివచ్చి పరమాచార్య స్వామివారికి సమర్పించాడు. “నీవు రుద్రైకాదశి కోసం ఎక్కడి నుండి గంగాజలాన్ని సేకరించావు?” అని అడిగారు స్వామివారు. “వైదికులు ఆ జలాన్ని కాశీలోని కేదార్ ఘాట్ గంగా నుండి తీసుకునివచ్చారు”. “కాశీ పరమేశ్వరుని సొంతం. గంగ నీరు, గంగ మన్ను వంటివి అక్కడినుండి తీసుకునిరాకూడదు. నువ్వు అక్కడినుండి తెచ్చిన తీర్థాన్ని ఏదైనా బిల్వ చెట్టు మొదట్లో వెయ్యి” అని ఆదేశించారు స్వామివారు. “గంగ ఎక్కడైతే శుద్ధ గంగగా ఉంటుందో అక్కడి నుండి గంగాజలాన్ని తీసుకునిరావాలి. యమునా నది తనలో కలవడానికి ముందు ఉన్నదే శుద్ధ గంగ” అని చెప్పారు స్వామివారు. ************ పరమాచార్య స్వామివారు విడిదిచేసిన ఆ పల్లెటూరిలో కొన్ని గుడిసెలు వున్నాయి. సాయంత్రం పూట ఆ పిల్లలందరూ ఎందరో ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా, ఎంతో అల్లరితో ఒకర్నొకరు కొట్టుకుంటూ, పెద్దగా అరుస్తూ ఆడుకుంటున్నారు. (అటువంటి సందర్భంలో తాము కూడా ఆ పిల్లలతో పాటు చేరిపోయి ఆడుకోవాలన్న భావం స్వామివారి కళ్ళల్లో కనిపిస్తుంది) అలా ఆ పిల్లల ఆటలను, అల్లరిని చూస్తున్న స్వామివారి దగ్గరికి ఒకామె గిన్నె నిండుగా పాలకోవా తీసుకునివచ్చి, స్వామివారి ముందర ఉంచి, పంచాంగ నమస్కారం చేసింది. “ఏమిటిది? పాలను మరిగించి తీసుకునివచ్చావా?” అని అడిగారు. “అవును” “తియ్యగా ఉంటుందా?” “అవును ఉంటుంది” “వాసన?” ఆమె బదులు చెప్పేలోగానే, స్వామివారే బదులిచ్చారు. “అవును, అది ముక్కుపుటాలను చీల్చుకుని వెళ్తోంది” “నేను చాలా మడితో తయారుచేశాను. పుల్లగా అవ్వదు. నాలుగు రోజుల దాకా పాడవ్వడు. రోజూ, స్వామివారు కొంచం, కొంచంగా . . .” స్వామివారు ఆమె మాటలను ఏమాత్రం వింటునట్టులేదు. కానీ ఎంతో కుతూహలంతో, “నువ్వు ఏమి చేస్తావంటే, అక్కడ ఆడుకుంటున్న పిల్లల దగ్గరకు ఈ గిన్నె తీసుకునివెళ్లి, అంతా వారికి పంచి ఖాళీ గిన్నెను తీసుకునిరా, సరేనా? నాకోసం ఇంకోసారి తయారుచేసుకుని తీసుకునిరా . . .” క్షీర సాగర శయనుడు మొహిని దేవి రూపంలో అమృతాన్ని పంచినట్టు, ఆమె ఆ పాలకోవాను పరిపూర్ణ తృప్తితో పిల్లలకు ఇచ్చింది. అ పిల్లలు ఆ పాలకోవా తినదన్ చూసి స్వామివారు ఆనందించారు. ******* పరమాచార్య స్వామివారి ఆగమనాన్ని ప్రతి చిన్న ప్రాణి కూడా ఆనందించింది. శివాస్థానంలో ఎవరూ స్వామివారి గదిలోకి వెళ్ళేవారు కాదు. తమ పనులను స్వామివారే స్వయంగా చేసుకునేవారు. సేవకులు స్వామివారి గది బయట చిన్న చెక్క పాత్రల్లో నీరు ఉంచేవారు. కాళ్ళు, చేతులు కడుక్కోవడానికి మరియు అనుష్టానానికి వాటికవే ప్రత్యేకంగా ఉంచేవారు. ఎండాకాలంలో ఎలుకలు, ఉడుతలు మరియు పక్షులు నీతి కోసం అంతా తిరిగి తిరిగి వెతికేవి. శిష్యులు, భక్తులు ఎవ్వరూ కూడా స్వామివారి గదిలోకి వెళ్లలేకపోయినా, ఈ జంతువులకి అలాంటి అడ్డంకి ఏం లేదు. పూర్తి స్వాతంత్ర్యంతో లోపలకు వెళ్ళి, ఆ చక్క పాత్రలపైకి ఎక్కి, లోపలకు తొంగిచూసి, దాహం తీరేదాకా నీరు త్రాగి పారిపోయేవి. అవి వచ్చి నీరుతాగి వెళ్లిపోవడాన్ని గమనిస్తూ ఆనందించేవారు స్వామివారు. మనకు అవి ఎలుక, ఉడుత, పిచ్చుక లాగా కనిపిస్తాయి, కానీ స్వామివారికి అవి గణపతి, రామపిరన్, నారాయణుడుగా కనిపిస్తాయేమో. --- శ్రీమఠం బాలు, కాంచీపురం. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1 989
15
తేవార పారాయణం కాంచీపురంలోని పిళ్లైయార్ పాళ్యంలోని తిరుమెట్రలై వీధిలో నివసించే శ్రీ కె. నటరాజ ఓదువర్ గారికి ఇప్పుడు(2003) డెబ్బైఎనిమిది సంవత్సరాలు. పరమాచార్య స్వామివారిపై అపారమైన భక్తి. వారు చెప్పిన విషయం: పరమాచార్య స్వామివారు పల్లకీలో వెళ్తున్నప్పుడు, నేను ఎన్నోమార్లు తేవారం పత్తికాలు పాడేవాడిని. ఒకసారి స్వామివారు తిరుజ్ఞానసంబంధర్ కచ్చి మెట్రళై, పిళ్లైయార్ పాళ్యంలో సంపూర్ణ అనుగ్రహాన్ని ఇచ్చారు. నేను ‘తిరుమెట్రళై తేవారం’ పాడాను. వెంటనే స్వామివారు, “నువ్వు తిరుముదుకుండ్రప్ పత్తికం పాడు” అని ఆదేశించారు. ‘దేవా, సిరియోమ్ పిళైప్ పొరుప్పే, పెరియోణే’ (దేవా, నా తప్పులను సహించు, నేను చిన్నవాణ్ని) అన్న మాటలతో మొదలయ్యే జ్ఞాసంబంధర్ తేవారం పాడాను. ‘తిరుఏకాంబమ్ పత్తికం’ పాడమని స్వామివారి తరువాతి ఆజ్ఞ. ‘పణ్డు సెయ్ ద పళవినయిన్ పయన్’ (గత కాలంలో చేసిన కర్మ ఫలం) అని మొదలయ్యే అప్పర్ తేవారం పాడడం మొదలుపెట్టాను. మహాస్వామి వారు ఎంతో సంతోషించి నన్ను ఆశీర్వదించారు. మహాస్వామి వారు సతారాలో మకాం చేస్తున్నప్పుడు, మేము మువ్వూరు ఒదువర్లమూ తీర్థయాత్రలో భాగంగా అక్కడికి వెళ్లాము. మమ్మల్ని చూడగానే స్వామివారు చాలా ఆనందపడ్డారు. మమ్మల్ని రెండు రోజులపాటు అక్కడే ఉండి, రోజూ పూజలో తేవారం పాడమని ఆదేశించారు. స్వామివారి ఆదేశానుసారం మేము మువ్వురమూ శ్రీమఠంలోనే ఉండి తేవారం పాడేవారం. స్వామివారి నుండి సెలవు తీసుకునేటప్పుడు మమ్మల్ని అనుగ్రహించి మాకు ధోవతులను బహూకరించారు. రైల్వేస్టేషనుకు వ్యాను కూడా ఏర్పాటు చెయ్యడం స్వామివారి అవ్యాజ కరుణకు పరాకాష్ట. అది మమ్మల్ని కదిలించివేసింది. కాంచీపురం బంగారు తోటలో ఉన్న పెరియవా మఠంలో ప్రతి నెలా జరిగే అనుషం విశేష పూజలో ఉదయం పది గంటలప్పుడు నేను తేవారం పారాయణం చేస్తున్నా, రాత్రివేళల్లో పుష్పాపల్లకిలో స్వామివారి చిత్రపటం ఊరెరిగింపుగా జరుగుతున్నప్పుడు కూడా తేవార పారాయణం చేస్తున్నానంటే దానికి కారణం పరమాచార్య స్వామివారి అనంతమైన కరుణ మాత్రమే. --- కె. నటరాజ ఓదువర్. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1 897
16
శ్రీవారి అతీంద్రియ శక్తి : ఒకసారి స్వామివారిని హైదరాబాదులో దర్శనం చేసాను. మా నాన్నగారు రామాయణంలో విశ్వామిత్రుడు రామునితో అన్న "రామ! జగన్మోహనా!" అనే పద్యం స్నానం చేసేటప్పుడు, ఖాళీ సమయాల్లో కుర్చున్నపుడు ఎల్లప్పుడూ ఎంతో ఆర్తితో చదువుకొంటూ ఉండేవారు. శ్రీవారు ఆ పద్యాన్ని అదే స్వరంతో అంతే ఆర్తితో చదివి "మీ నాన్నగారెప్పుడూ ఈ పద్యాన్ని చదువుతూ ఉండేవారు కదా?" అని ప్రశ్నించారు. నేను నివ్వెర పడినాను. మా నాన్నగారిని వారెరుగరు. వారుగతించి చాలాకాలమయింది. మరి ఆ పద్యాన్ని ఎల్లప్పుడూ అంత ఆర్తితో చదువుతూ వుండే వారన్న విషయం వీరికేలా తెలిసింది. దాంతో నా వొళ్ళు గగుర్పొడిచింది. ఆరోజు తెనుగు చదవడం తెలుసునా అని పృచ్చించిన నా అజ్ఞానత్వానికి సూటి సమాధానం ఇది. ఈ కాలంలో కొద్దో గొప్పో శక్తి సంపాదించిన వారంతా దుకాణాలు పెట్టుకుంటున్నారు. ఆశ్రామలు, హాస్పటల్స్ అంటూ పెంచుకు పోతున్నారు. మహా శక్తీ సంపన్నులయిన స్వామివారు మాత్రం ఏమి తెలియని వారివలె వున్నారు. ఆయన లక్షణంగా సకల భోగభాగ్యాలు అనుభవిస్తూ కాలుమీదకాలేసి కూర్చుని మహారాజులా అనుభవించవచ్చు. వీరు "ఊ" అంటే ధనరాసుల్ని పోగులుగా కుమ్మరించే వారు అనేకులు వున్నారు. అయినా ఆయన ఈ సుఖాలన్నీ కాలదన్నుకొని రోజూ పది క్రోసులో, ఇరవై క్రోసులో ఈ లేవలేని రోజుల్లో ముసలితనంలో నడుస్తూనే వున్నారు. అది యోగమో, సౌఖ్యమో, ధ్యానమో, మరి ఏ ఇతరమో తెలియదు కానీ ఒక అపూర్వమయిన శక్తి వారివద్దనున్నదని చెప్పుకోవాలి. ఆ శక్తి ఎటువంటిది, ఎక్కడిది అంటే మనమేమి చెప్పగలం? అయితే శక్తికి, శక్తిమంతులకు అభేదం కనుక ఎల్లప్పుడూ నమస్కరించుకొంటూ, ఆ భగవంతుని నారాయణ స్మరణ ఫలం ఈ లోకానికెల్లా మేలు చేయగలదని ప్రార్థిస్తున్నాను. :- 22/05/1981, గురజాడలో స్వామివారి జయంతి సభలో కీ శే తాడేపల్లి రాఘవానారాయణ శాస్త్రులవారు పలికిన మాటలు. #KanchiParamacharyaVaibhavam #Paramacharya
2 246
17
నేలపై పడ్డ ప్రసాదం రామస్వామి అయ్యర్ సేలంలో ప్రముఖ న్యాయవాది. ఆ వృత్తిలో ఆయన బాగా రాణిస్తున్నారు. పరమాచార్య స్వామివారి అశేషకోటి భక్తులలో ఆయన కూడా ఒకరు. వారు ఒకసారి మహాస్వామివారి దర్శనానికి వెళ్ళారు. ఆయన వరుసలో నిలబడి స్వామిని దర్శించుకొని విభూతిని ప్రసాదంగా తీసుకున్నారు. స్వామివారు ఇచ్చేటప్పుడే పొరపాటున చెయ్యి జారిందో లేక తీసుకునే మునుపే ఈయన చెయ్యి వెనక్కు తీసుకున్నారో మొత్తానికి విభూతి ప్రసాదం నేలపై పడింది. నేలపై పడ్డ విభూతిని తీసుకోవడం ఏమిటని రామస్వామి అయ్యర్ ప్రసాదం కోసం మరలా చెయ్యి చాచారు. అప్పుడు స్వామివారు “నేలపై పడ్డ ఆ ప్రసాదం తీసుకో ఆన్నారు”. మన్నుతో కలిసిన ఆ ప్రసాదాన్నే రామస్వామి అయ్యర్ స్వీకరించాడు. ఎందుకు నేలపై పడ్డ ప్రసాదాన్ని తీసుకొమ్మని స్వామివారు ఆదేశించారు అని పరిపరి విధాల ఆలోచించారు. ఇంటికి చేరుకునే దాకా ఆ అసంతృప్తి వదల్లేదు. ఎన్నో ఏళ్లుగా న్యాయస్థానంలో కొనసాగుతున్న తంజావూరులో ఉన్న రామస్వామికి చెందిన భూముల వ్యవహారం కొన్ని రోజుల తరువాత ఆయన పరం అయ్యాయి. ఆ న్యాయవాది ఆనందం అనిర్వచనీయం. అసలు దక్కదు అనుకున్న స్థిరచారాస్తులు దక్కితే ఆ ఆనందం వేరు కదా. ఈ విషయాన్ని మహాస్వామివారికి చెప్పడానికి వెంటనే స్వామీ వద్దకు బయలుదేరారు. రామస్వామి అయ్యర్ ను చూడగానే స్వామివారు ఏమన్నారో తెలుసా? “ఆరోజు నేలపై పడ్డ ప్రసాదాన్ని తీసుకోవడానికి నువ్వు చాలా ఆలోచించావు. చూశావా ఈరోజు నీకు అంత భూమి లభించింది” అని అన్నారు. అసలు వచ్చిన విషయం చెప్పడానికి రామస్వామి ఇంకా నోరు కూడా తెరవలేదు. ఆ వచ్చిన విషయమూ, ఆ విషయానికి సంబంధించిన విషయము కూడా స్వామివారే చెప్పేశారు. ఇదే సామాన్యులు అర్థం చేసుకోలేని పరమాచార్య స్వామివారి దివ్య కరుణ. --- శ్రీ ఆర్. వెంకటస్వామి, “కంచి మహానిన్ కరుణై నిళగల్” నుండి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు. t.me/KPDSTrust #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
2 399
18
https://www.youtube.com/live/Esatz2ACTv4?si=DOz033VqCl7sg843
1 944
19
ఆ జాతకం ఇలా ఇవ్వు ఆత్తూర్ గ్రామంలో ముకుందరాజ్ పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. పదోన్నతితో అక్కడి నుండి చెన్నైకి మకాం మార్చాడు. అతనికి యమ్.టెక్ చెదివిన ఒక కుమారుడు ఉన్నాడు. ఉన్నత చదువులు చదివి ఉండడం వల్ల కుమారునికి యు.యస్. లో ఉద్యోగం లభించాలని ఆశించేవాడు. కనుక ఉద్యోగ ప్రయత్నాలకు ముందు అబ్బాయి జాతకం ఒకసారి చూపించాలని అనుకున్నాడు. అప్పట్లో బేతనాయకన్ పాళ్యంలో ఉంటున్న ఆంధ్రదేశానికి చెందిన రాంబట్ల శాస్త్రిగారు ప్రముఖ జ్యోతిష్యులు. వారితో మంచి పరిచయం ఉన్న శ్రీనివాసన్ అనే సహాయకునికి అబ్బాయి జాతకం ఇచ్చాడు. ఆయన జాతకాన్ని పరిశీలించి యు.యస్ లో ఉద్యోగం లభిస్తుందని, తెలిసిన బంధువుల పిల్లతో వివాహం నిశ్చయమవుతుందని చెప్పారు. నాలుగు నెలలోనే ఇవన్నీ జరుగుతాయని కూడా చెప్పారు. దీన్నంతా కాగితంపై వ్రాసి శ్రీనివాసన్ కు ఇచ్చారు. ముకుందరాజ్ ఊర్లో లేకపోవడం చేత, తను వచ్చిన తరువాత ఈ విషయాలు చెబుదామని జాతకాన్ని శ్రీనివాసన్ తన బ్యాగులో ఉంచుకున్నాడు. ప్రతినెలా పరమాచార్య స్వామివారిని దర్శించడం శ్రీనివాసన్ కు ఆనవాయితీ. కొన్నిరోజుల తరువాత మహాస్వామి వారి దర్శనానికి వెళ్ళాడు. ఆరోజు దర్శనానికి చాలామంది భక్తులు వచ్చారు. వారి కష్టాలను చెప్పుకొని స్వామివారి ఆశీస్సులు అందుకుంటున్నారు. అలా వరుసలో ఉన్న ఒకామె వంతు రాగానే తన కుమారునికి యు.యస్ ఉద్యోగం లభిస్తుందా? త్వరగా పెళ్ళి కుదురుతుందా? అని స్వామివారిని అడిగింది. కాని ఆమె తమ పోస్ట్ మాష్టర్ ముకుందరాజ్ భార్య అని శ్రీనివాసన్ కి తెలియదు. స్వామివారు నవ్వుతూ శ్రీనివాసన్ వైపు చూసి, “నీ బ్యాగులో ఉన్న ఆ జాతకం ఇలా ఇవ్వు” అని అడిగారు. శ్రీనివాసన్ జాతకంతో పాటు ఆ జ్యోతిష్కుడు వ్రాసిచ్చిన కాగితాన్ని కూడా బయటకు తీసాడు. దాన్ని ఆమెకు ఇవ్వమని స్వామివారు ఆదేశించారు. ఏంజరుగుతోందో అప్పుడు అర్థమైంది ఇద్దరికి. బ్యాగులో జాతకం ఉందన్న విషయం స్వామివారికి ఎలా తెలుసు? మనుషుల మనస్సులను తెలుసుకునే మహాస్వామివారికి బ్యాగులో ఏముందో తెలుసుకోవడం పెద్ద కష్టమా? అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
2 271
20
https://www.youtube.com/live/mYkNBykEcR4?si=lTloIBOZVpTZ5y3l
2 057