ar
Feedback
కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

الذهاب إلى القناة على Telegram

విరాళాలు పంపాల్సిన వివరాలు. A/C Name : Kanchi Paramacharya Dharmika Seva Trust ® A/C. No : 50200059599164 IFSC Code : HDFC0001753 Branch : HDFC Bank UPI ID : 7259859202@hdfcbank Gpay/Phone pay/BHIM/freecharge 7259859202

إظهار المزيد

📈 نظرة تحليلية على قناة تيليجرام కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

تُعد قناة కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి) (@kpdstrust) في القطاع اللغوي Telugu لاعباً نشطاً. يضم المجتمع حالياً 16 539 مشتركاً، محتلاً المرتبة 5 119 في فئة الدين والقيم الروحية والمرتبة 25 458 في منطقة الهند.

📊 مؤشرات الجمهور والحراك

منذ تأسيسه في невідомо، حقق المشروع نمواً سريعاً وجمع 16 539 مشتركاً.

بحسب آخر البيانات بتاريخ 06 يوليو, 2026، تحافظ القناة على نشاط مستقر. خلال آخر 30 يوماً تغيّر عدد الأعضاء بمقدار -170، وفي آخر 24 ساعة بمقدار -10، مع بقاء الوصول العام مرتفعاً.

  • حالة التحقق: غير موثّقة
  • معدل التفاعل (ER): يبلغ متوسط تفاعل الجمهور 11.43‎%. وخلال أول 24 ساعة من النشر يحصد المحتوى عادةً 5.30‎% من ردود الفعل نسبةً إلى إجمالي المشتركين.
  • وصول المنشورات: يحصل كل منشور على متوسط 1 891 مشاهدة. وخلال اليوم الأول يجمع عادةً 876 مشاهدة.
  • التفاعلات والاستجابة: يتفاعل الجمهور بانتظام؛ متوسط التفاعلات لكل منشور يبلغ 0.

📝 الوصف وسياسة المحتوى

يصف المؤلف القناة بأنها مساحة للتعبير عن الآراء الذاتية:
విరాళాలు పంపాల్సిన వివరాలు. A/C Name : Kanchi Paramacharya Dharmika Seva Trust ® A/C. No : 50200059599164 IFSC Code : HDFC0001753 Branch : HDFC Bank UPI ID : 7259859202@hdfcbank Gpay/Phone pay/BHIM/freecharge 7259859202

بفضل وتيرة التحديث المرتفعة (أحدث البيانات بتاريخ 08 يوليو, 2026) تحافظ القناة على حداثتها ومستوى وصول مرتفع. وتُظهر التحليلات تفاعلاً نشطاً من الجمهور، ما يجعلها نقطة تأثير مهمة ضمن فئة الدين والقيم الروحية.

16 539
المشتركون
-1024 ساعات
-517 أيام
-17030 أيام

جاري تحميل البيانات...

القنوات المماثلة
لا توجد بيانات
هل تواجه مشاكل؟ يرجى تحديث الصفحة أو الاتصال بمدير الدعم الخاص بنا.
سحابة العلامات
لا توجد بيانات
هل تواجه مشاكل؟ يرجى تحديث الصفحة أو الاتصال بمدير الدعم الخاص بنا.
الإشارات الواردة والصادرة
---
---
---
---
---
---
جذب المشتركين
يوليو '26
يوليو '26
+4
في 0 قنوات
يونيو '26
+16
في 0 قنوات
Get PRO
مايو '26
+31
في 0 قنوات
Get PRO
أبريل '26
+24
في 0 قنوات
Get PRO
مارس '26
+6
في 0 قنوات
Get PRO
فبراير '26
+81
في 0 قنوات
Get PRO
يناير '26
+97
في 0 قنوات
Get PRO
ديسمبر '25
+28
في 0 قنوات
Get PRO
نوفمبر '25
+31
في 0 قنوات
Get PRO
أكتوبر '25
+11
في 0 قنوات
Get PRO
سبتمبر '25
+39
في 0 قنوات
Get PRO
أغسطس '25
+21
في 0 قنوات
Get PRO
يوليو '25
+58
في 0 قنوات
Get PRO
يونيو '25
+89
في 0 قنوات
Get PRO
مايو '25
+31
في 0 قنوات
Get PRO
أبريل '25
+25
في 0 قنوات
Get PRO
مارس '25
+32
في 0 قنوات
Get PRO
فبراير '25
+29
في 0 قنوات
Get PRO
يناير '25
+79
في 0 قنوات
Get PRO
ديسمبر '24
+65
في 0 قنوات
Get PRO
نوفمبر '24
+40
في 0 قنوات
Get PRO
أكتوبر '24
+39
في 0 قنوات
Get PRO
سبتمبر '24
+32
في 0 قنوات
Get PRO
أغسطس '24
+46
في 0 قنوات
Get PRO
يوليو '24
+96
في 0 قنوات
Get PRO
يونيو '24
+118
في 0 قنوات
Get PRO
مايو '24
+1 521
في 0 قنوات
Get PRO
أبريل '24
+49
في 0 قنوات
Get PRO
مارس '24
+92
في 0 قنوات
Get PRO
فبراير '24
+61
في 0 قنوات
Get PRO
يناير '24
+56
في 0 قنوات
Get PRO
ديسمبر '23
+86
في 0 قنوات
Get PRO
نوفمبر '23
+84
في 0 قنوات
Get PRO
أكتوبر '23
+55
في 0 قنوات
Get PRO
سبتمبر '23
+63
في 0 قنوات
Get PRO
أغسطس '23
+37
في 0 قنوات
Get PRO
يوليو '23
+134
في 0 قنوات
Get PRO
يونيو '23
+497
في 0 قنوات
Get PRO
مايو '23
+159
في 0 قنوات
Get PRO
أبريل '23
+112
في 0 قنوات
Get PRO
مارس '23
+68
في 0 قنوات
Get PRO
فبراير '23
+56
في 0 قنوات
Get PRO
يناير '23
+122
في 0 قنوات
Get PRO
ديسمبر '22
+96
في 0 قنوات
Get PRO
نوفمبر '22
+70
في 0 قنوات
Get PRO
أكتوبر '22
+63
في 0 قنوات
Get PRO
سبتمبر '22
+56
في 0 قنوات
Get PRO
أغسطس '22
+47
في 0 قنوات
Get PRO
يوليو '22
+258
في 0 قنوات
Get PRO
يونيو '22
+188
في 0 قنوات
Get PRO
مايو '22
+428
في 0 قنوات
Get PRO
أبريل '22
+535
في 0 قنوات
Get PRO
مارس '22
+2 079
في 0 قنوات
Get PRO
فبراير '22
+34
في 0 قنوات
Get PRO
يناير '22
+183
في 0 قنوات
Get PRO
ديسمبر '21
+140
في 0 قنوات
Get PRO
نوفمبر '21
+123
في 0 قنوات
Get PRO
أكتوبر '21
+461
في 0 قنوات
Get PRO
سبتمبر '21
+104
في 0 قنوات
Get PRO
أغسطس '21
+192
في 0 قنوات
Get PRO
يوليو '21
+488
في 0 قنوات
Get PRO
يونيو '21
+791
في 0 قنوات
Get PRO
مايو '21
+491
في 0 قنوات
Get PRO
أبريل '21
+576
في 0 قنوات
Get PRO
مارس '21
+463
في 0 قنوات
Get PRO
فبراير '21
+12 911
في 0 قنوات
التاريخ
نمو المشتركين
الإشارات
القنوات
07 يوليو+3
06 يوليو0
05 يوليو+1
04 يوليو0
03 يوليو0
02 يوليو0
01 يوليو0
منشورات القناة
బాధ్యత - బరువు శ్రీవారికి 1938 ప్రాంతాలలో కాశీయాత్ర ముగించి వచ్చినప్పటి నుండి పీఠబాధ్యతల నుండి వైదొలగి ఏ చెట్టునీడలోనో, గోపురపు ఛాయలలోనో జీవిస్తూ పరివారపు కట్టడిలేని స్వేచ్ఛా జీవనాన్ని గడపాలని ఉండేది. శిష్యస్వామికై ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఆదిశంకరుల అభిప్రాయం వీరు బహుకాలం పీఠంలో ఉండి ప్రతిష్ఠను ఇనుమడింపజేయాలన్నది కావచ్చు. 1954 దాకా శిష్యస్వామివారు దొరకలేదు. యాభైయేళ్ళ పీఠాధిపత్య నిర్వహణానంతరం 1957లో మఠ బాధ్యతలన్నీ చట్టపూర్వకంగా శిష్యస్వామివారికి ఈయబడినాయి. అయితే అత్యంత గురుభక్తితో శ్రీజయేంద్ర సరస్వతీ స్వామివారు మహాస్వామివారి మార్గదర్శకత్వం కావాలని ప్రార్థించి పీఠం నుండి వెలికిపోనీయలేదు. శిష్యస్వామి వారితో కూడా విజయయాత్ర చేస్తూ 1969లో కంచికి తిరిగి వచ్చారు. నిదానంగా పూజ, ఇతర వ్యవహారములు జయేంద్రుల వారికి అప్పగించారు. ఒకరోజు స్వామివారు హఠాత్తుగా కంచిమఠం ప్రాంగణం సింహద్వారం బయటకు వచ్చి నిలచి తనవెంట వస్తున్న పరివారమునుద్దేశించి పీఠములో జీతం తీసుకొంటున్న వారెవరూ తనతో రావడానికి వీలులేదని కట్టడి చేశారు. అతొ కొద్దిమంది అశుల్కదాసులు వెంటరాగా కాంచీపురం పొలిమేరలో ఉన్న సర్వతీర్థం చేరారు. అక్కడ కాశీవిశ్వనాథుని దేవాలయం ఒకటి పురాతనమైనది ఉన్నది. దాని ముఖమంటపంలో స్వామివారు మకాం చేశారు. అప్పటినుండి 1983లో శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామివారు పీఠానికి రాగా - శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి ప్రార్థనను అంగీకరించి ప్రవేశించేంతవరకూ మఠం లోనికి అడుగు పెట్టలేదు. పీఠబాధ్యతలు లేవు. ఆదిశంకరులనుండి అనూచానంగా అర్చించబడుతున్న చంద్రమౌళీశ్వరుడు క్రియాశీలక పీఠాధిపత్యం నెరుపుతున్న శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారిచేత మహాస్వామివారేర్పరచిన సంప్రదాయాల అనుసారం పూజ అందుకొంటున్నారు. అయినప్పటికి శ్రీవారు తాము సన్యాసాశ్రమ స్వీకరం నుండి కొనసాగిస్తూ వచ్చిన ఒక గంట జపము తప్పక చేసేవారు. --- శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి, ఋషిపీఠం ప్రచురణల నుండి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

2
మృష్టాన్నభోజనం ఈరోజుల్లో టీవీలలో ఎన్నో వంటల కార్యక్రమాలు వస్తున్నాయి. ఆ కార్యక్రమాల్లో ఇచ్చే సూచనలను సరిగ్గా అర్థం చేసుకుని వండితే, చివరగా తయారయ్యే పదార్ధం తినడానికి యోగ్యంగా ఉంటుందా? అది అనుమానమే. కొత్త వంటకాలు ఏవీ లేకపోతె, సాధారణంగా చేసే మునక్కాయ సాంబారు లేదా బెండకాయ తాలింపు చేసే విధానాన్నే ఉపయోగించి కొత్త వంటలు చేస్తారు. స్వామివారు పూర్వాశ్రమంలో ఎన్నడూ వంటింటికి వెళ్ళలేదు; సన్యసించిన తరువాత ఇక వెళ్ళాల్సిన అవసరం లేదు. కాని స్వామివారికి నలభీమపాకంలోని మెళకువలన్నీ తెలుసు. అంతేకాక కొత్త కొత్త వంటలు ఎలా చెయ్యాలో కూడా మంచి నేర్పు. మేము పండరీపురం నుండి తిరిగొస్తున్నాము. అయిదారు చిన్ని గుడిసెలు ఉన్న ఒక కుగ్రామానికి చేరుకున్నాము. ఒక పెద్ద చెట్టు కింద మకాం ఏర్పాటుచేసుకున్నాము. పరమాచార్య స్వామివారు భిక్ష పూర్తిచెయ్యగానే, మాకోసం కాస్త ఎక్కువగా వండిన పదార్థాలను ఆరగించి మా భోజనం కూడా పూర్తిచేశాము. అది మధ్యాహ్న విశ్రాంతి సమయం. హఠాత్తుగా పెద్ద కోలాహలంతో ఇరవై మంది వ్యక్తులు వచ్చారు. వారందరూ చెన్నై ప్రాంతం వారు. శ్రీమఠం మకాం కాబట్టి శ్రీ చంద్రమౌళీశ్వర ప్రసాదంగా మంచి ఆహారం దొరుకుతునదన్న నమ్మకంతో అక్కడకు వచ్చారు. కాని అప్పుడు శ్రీమఠం ఒక పెద్ద చెట్టు కింద మకాం చేసి ఉంది. వండడానికి కావాల్సిన సరుకులు, పాత్రలు కూడా లేవు. ఇటువంటి విషయాల గురించి మహాస్వామివారు ఎక్కువగా కలతచెందేవారు కాదు. ఆకలితో వచ్చిన వారి కడుపు నింపడమే స్వామివారి లక్ష్యం. బ్రహ్మచారి రామకృష్ణన్ అని స్వామివారి ఆంతరంగిక సేవకుడు ఉండేవాడు. “అందరికి ఆహారం తయారుచెయ్యి” అని అతణ్ణి ఆదేశించారు స్వామివారు. రామకృష్ణన్ చేతులు నలుపుతూ నిస్సహాయంగా నిలబడి, “మనం మన మకాం తరువాతి ఊరికి వెళ్ళినతరువాత వారికి వండి పెడతాను” అని తెలిపాడు. ఇబ్బంది ఉందని పరమాచార్య స్వామివారు అర్థం చేసుకుని, “బియ్యం ఉందా?” అని అడిగారు. “ఉంది; కాస్త పెసర పప్పు కూడా ఉంది” “అయితే ఇంకేం! నువ్వు ఏం చేస్తావంటే, బియ్యాన్ని నానబెట్టి కడుగు, ఆ నీటిని మరొక పాత్రలో సేకరించు. డానికి కొద్దిగా ఉప్పు వేసి, నిమ్మకాయ పిండి, నారత్తై ఆకులను కత్తిరించి వెయ్యి. ఇది మజ్జిగ అవుతుంది. పెసర పప్పుని ఎక్కువగా నీరు పోసి ఉడికించు. నీటిని పప్పును వేరుచేసి, ఆ వేడినీళ్ళకు నిమ్మకాయ వెయ్యి. ఇది రసం అవుతుంది. ఇప్పుడు ఉడికించిన పెసర పప్పు ఉంది కదా! దానికి కాస్త ఉప్పు, కత్తిరించిన మిరపకాయలు వెయ్యి. అది తాళింపు అవుతుంది” అని ఆదేశించారు. అరగంటలో మొత్తం సిద్ధం అయ్యింది. ఈలోగా మేము అతిథులకి భోజనానికి ఆకులు, నీరు సమకూర్చాము. మొత్తానికి షడ్రుచుల నాలుక కోసం అన్నం, పెసర పప్పు తాళింపు, రసం, మజ్జిగ తయారుచేసాము. “ఇది మృష్టాన్న భోజనం” అన్నారొక అతిథి. “దేవామృతం” అని మరొకరు చెప్పారు. “ఇంతటి రుచికరమైన భోజనాన్ని ఇంతకుముందెన్నడూ తినలేదు” అన్నారు మూడవవారు. ఆ మాటలను విని మాలో మేము నవ్వుకున్నాము. అది పరమాచార్య స్వామివారి వాక్కు వల్ల కలిగిన రుచి అని మాకు తెలుసు. ఆతిథ్యం అన్నది పరమాచార్య స్వామివారిని చూసే నేర్చుకోవాలి. అది ఒక అక్షయ పాత్ర. --- శ్రీమఠం బాలు. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 4 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు. t.me/KPDSTrust #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
943
3
దాంతో ఊరిబయటే ఆగిపోయిన ఎడ్లబండ్లు లోపలకు అనుమతించబడి, పరమాచార్య స్వామివారి అనుగ్రహంతో ఇక అక్కడినుండి అంతా సవ్యంగా జరిగిపోయింది. ఈ అన్నసమారధనల్లో ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే, ‘నడిచే శివన్’ కాని ‘అన్నదాన శివన్’ కాని వండిన వంటలో ఒక్క మెతుకు కూడా ముట్టుకోరు. సాధారణంగా పరమాచార్య స్వామివారు ఉపవసించకుంటే శ్రీ చంద్రమౌళీశ్వరునికి నివేదించిన అటుకులను తీసుకుంటారు. అన్నదాన శివన్ తన స్నేహితుని ఇంటికి వెళ్లి, తనకు ఎంతగానో ఇష్టమైన పెరుగన్నం తీసుకుంటాడు. ప్రతి రోజూ తన ఇష్టదైవమైన శ్రీ దక్షిణామూర్తికి నివేదించి తీసుకునేది ఆ పెరుగన్నం మాత్రమే. తరువాత పరమాచార్య స్వామివారు చెప్పిన విషయం ఏమిటంటే, అందరూ అనుకున్నట్టు ఈ అన్నసమారాధనలను శివన్ కంచి మఠం తరుపున జరిపాడు అనడంకంటే, శివన్ జరిపిన ఈ సమారాధనల వల్లే అప్పట్లో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న మఠం కాస్త కుదుటపడింది. --- రా. గణపతి, “మహా పెరియవాళ్ విరుంధు” నుండి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు. t.me/KPDSTrust #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1 185
4
అన్నదాన శివన్ “వండిన అన్నం అంతా ఒకచోట రాశిలా పోస్తే, తెల్లని హిమాలయా పర్వతాలలాగా కనిపిస్తోంది. సాంబారు గంగాళంలోకి ఏనుగు పడినా మనకు కనపడదు. మీనాక్షి కళ్యాణం అప్పుడు హిమలాచల శివుడు గుండోదరుని ఆహారం కోసం పెద్ద గొయ్యి సృష్టించాడు అని చెబుతారు. అలాగే, ఈ పేద బ్రాహ్మణుడు శివన్ అద్భుతమైన పెద్ద కార్యం చేశాడు”. కంచి పరమాచార్య స్వామివారు ‘అన్నదాన శివన్’ గా పేరు ప్రఖ్యాతులు పొందిన తెప్పేరుమానల్లూర్ శ్రీ రామస్వామి అయ్యర్ జరిపిన అన్నదాన ఉత్సవాల విశేషాలను నెమరువేసుకుంటున్నారు. ఈ అన్నదాన సమారాధనలు కుంభకోణంలో మహామాఖం సందర్భంగా 1921 మరియు 1933లలో జరిగినప్పుడు కొన్ని వేలమంది అన్నం తిన్నారు. పద్దెనిమిదవ శతాబ్దం మధ్యనుండి పంతొమ్మిదవ శతాబ్దం మధ్యవరకు కంచి మఠానికి కుంభకోణం ప్రధాన కార్యాలయం. 1916 నుండి 1939లో శరీరం విడిచేదాకా మఠాన్నే తన గృహంలా మార్చుకున్నాడు శివన్. ఆ మహోత్సవాల గురించి పరమాచార్య స్వామివారు ఇలా గుర్తు చేసుకున్నారు. “అది 1933లో జరిగిన మాహామఖం అన్నదాన సమారాధన. వంట చెయ్యడం కోసం వంద ఎడ్లబండ్లలో వంటచెరుకు తెచ్చారు. పచ్చళ్ళ కోసం పది ఎడ్లబండ్ల ఉసిరికాయలు వచ్చాయి. వండుతున్నప్పుడు ఆ వంటల నుండి వస్తున్న వాసన్ చూసి వాటికి ఏమి తక్కువయ్యిందో చెప్పగలిగేవాడు. రసం నుండి వచ్చే వాసనను బట్టి ఇంకా ఎంత ధనియాల పొడి దంచి వెయ్యాలో చెప్పేవాడు. ఎదో పిడికెడు ధనియాలు కాదు. ‘పెద్ద తట్టలో ధనియాలు దంచి రసానికి వెయ్యండి’ అని ఒక వంటవానికి చెప్పాడు. ఇప్పటికే రసానికి వేసిన ధనియాల పొడి కాకుండా ఇంత పెద్ద తట్టలో ధనియాల పొడి వెయ్యమని చెప్పాడంటే, అక్కడ తయారవుతున్న రసం పరిమాణం ఎంతో మనం ఊహించవచ్చు. భోజనాలు అయిన తరువాత ఊడ్చి శుభ్రం చెయ్యడానికి రెండు ఎడ్లబండ్ల చీపుళ్ళు ఉపయోగిస్తున్నారు. అన్నం వండడానికి ఎంత పెద్ద పాత్రలు ఉన్నా, ఎంత పొడుగైన కట్టెల పొయ్యిలు ఉన్నా, కావాల్సినంత అన్నం వండడానికి అవి ఏమాత్రం సరిపోవు. కనుక అతను ఏమి చేసేవాడు అంటే, మొదట పది లేదా ఇరవై సంచుల అన్నాన్ని వండి, దాన్ని పొడవుగా పరచిన చాపలపై పోసి, పొగలు కక్కుతున్న ఆ అన్నంపై పలుచటి తెల్ల బట్ట కప్పి, దానిపై వండని బియ్యాన్ని పరచేవాడు. వండని బియ్యాన్ని పెద్ద గోనెసంచులతో కప్పి చాపలను గట్టిగా చుట్టేవాడు. అరగంట తరువాత ఆ సంచులను విప్పితే, పైన ఉన్న బియ్యం మొత్తం ఉడికి పువ్వులా తెల్లగా అన్నం అయ్యేది. అన్నం త్వరగా వండడానికి తను కనుగొన్న విధానం ఇది. అంతమందికి కావాల్సిన పెరుగు తయారుచేయడానికి ఉపయోగించే పాల కోసం ఎక్కడికి వెళ్ళేవాడు? దీనికోసం శివన్ దగ్గర మరొక ఉపాయం ఉంది. అప్పట్లో ఇప్పటిలా ఫ్రిజ్జులు లేని కాలంలో తనకోసం ఒకటి కనిపెట్టాడు శివన్. సమారాధనకు కొద్ది వారాలు లేదా నెలల ముందే పాలు సేకరించి పెరుగు తయారుచేసే ప్రక్రియకు ఉపక్రమిస్తాడు. ఆ పెరుగును చెక్క బానల్లో నింపి, మైనంతో వాటిని మూసి, లోతైన చెరువుల్లో వాటిని ముంచుతాడు. ఆ బానలను బయటకు తీసి వాటిని తెరిస్తే, అందులోని పెరుగు ముందురోజే తయారుచేసినంత తాజాగా ఉండేది! అది కేవలం చెరువు యొక్క చల్లదనం వల్ల మాత్రమె కాదు, అతని మనస్సు యొక్క చల్లని కరుణ స్థితి వల్ల కూడా ఇది సాధ్యం అని చెప్పవచ్చు”. శివన్ ఈ సమారాధనలను కంచి మఠం తరుపున చేసినా, 1921 మరియు 1933లలో జరిగిన మహామాఖం అన్నసమారాధనలు ఎంతో ప్రత్యేకం ఎందుకంటే, అప్పుడు పరమాచార్య స్వామివారు కుంభకోణంలో లేని సమయం, 1919లో స్వామివారు సంకల్పించిన గంగాయత్ర దాదాపు ఇరవైఒక్క సంవత్సరాలు సాగింది. 1933 మాహామాఖం అప్పుడు స్వామివారు రామేశ్వర యాత్ర చేస్తూ కుంభకోణం దగ్గర్లోని పట్టీస్వరం, తిరువిడైమరదూర్ లలో మకాం చేశారు. తరువాత రామేశ్వరం నుండి వారణాసి యాత్ర చేస్తారు. నియమం ప్రకారం యాత్ర ముగిసేదాకా కుంభకోణం మఠానికి పోలేదు స్వామివారు. స్వామివారు మకాం చేసిన స్థలం నుండి స్నానం కోసం మహామాఖం పుష్కరిణికి లేదా కుంభకోణంలోని దేవాలయాలకు వెళ్లి తిరిగోచ్చేవారు. 1933 సంవత్సరంలోనే శివన్ ఆధ్వర్యంలో మఠం జీర్ణోద్ధరణ పూర్తైయ్యింది. శివన్ చేసే అన్నదాన సమారాధనలలో ప్రత్యేకత ఏమిటంటే, ముందురోజు సాయింత్రం దాకా అన్నదానానికి సంబంధించిన పనులు జరుతున్నట్టు కనబడదు. అన్నదానికి కావాల్సిన సరుకులు రావడం కూడా రాత్రికే మొదలవుతుంది. 1933లో అర్ధరాత్రి దాటిపోయినా ఒక్క ఎడ్లబండిలో కూడా కావాల్సిన సరుకులు రాలేదు. భయం ఎరుగని శివన్ కూడా మరుసటిరోజు లక్షల మందికి చేయాల్సిన అన్నదానానికి సరిపడా వండడానికి ఉన్న సమయం గురించి ఆందోళనచెందడం మొదలుపెట్టాడు. ఈ విషయం పరమాచార్య స్వామివారు బస చేస్తున్న చోటుకు చేరింది. కొద్ది సమయం తరువాత ఎడ్లబండ్లు రావడం మొదలయ్యాయి. మహామాఖం అప్పుడు ఉండే ట్రాఫిక్ నిబంధనలు శివన్ ఎడ్లబండ్లకు వర్తించవు అన్న విషయం తెలియని అధికారులు వాటిని ఆపేశారు. రాత్రి ఒంటిగంటన్నరప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కు హఠాత్తుగా ఈ విషయం గుర్తురావడంతో వెంటనే బండ్లు ఉన్న ప్రదేశానికి బయలుదేరాడు.
1 010
5
చివరగా స్వామివారు, “నిఘంటువులను చూశావా? అవన్నీ ఇరైవన్ అంటే శివుడనే చెబుతాయి. డానికి వేరే అర్థాలు ఎన్నో ఉన్నా, దేవతల పేర్లలో శివుడు మాత్రమే ఉంది” అన్నారు. తిరువళ్ళువర్ మతం గురించిన సమాచారాన్ని పరిశోధించడానికి, ఇంతవరకు ఏ పరిశోధకుడు చెయ్యని ఒక కొత్త మార్గం చూపారు స్వామివారు. నా ఆశ్చర్యానికి హద్దు లేదు. చెన్నైలోని ఫ్రెంచి గ్రంథాలయానికి వెళ్లి నిఘంటువులను వెతికాను. చూళామని, దివాకరం, పింగళందై, అరిసియ ఉరిచ్చీర్ ఇలా ఎన్నో నిఘంటువులు ఉన్నాయి. ‘ఇరై శివన్ కదన్ వెంగై’ అన్న సూత్రం ఉంది. ఆరవ శతాబ్దం వరకు ఇరై అనే పదం శివుడు అని తెలుపుతుందని నాకు అప్పుడు అర్థం అయ్యింది. అప్పటి దాకా ఆ పదం వేరొక దేవతని తెలుపదు. తిరుక్కురళ్ ని మహాస్వామివారు ఎంత లోతుగా, నేర్పుగా అర్థం చేసుకున్నారో తెలిసిపోయింది. అవధులు లేని ఆ జ్ఞానాన్ని నేను ఆరాధించాను. చోళవరంలోని ఆ జ్ఞాన కుటీరంలో రెండు సందర్భాల్లో అ తమిళ జ్ఞానిని దర్శించుకున్న తరువాత, శ్రీ మహాస్వామివారు నాకు ప్రసాదం ఇచ్చారు. నా ద్విపద మణిమాల పుస్తకాన్ని చేతులలోకి తీసుకుని దానిపై ప్రసాదం ఉంచి, అపూర్వమైన ఆశీస్సులని ఇచ్చారు, “నీ జీవిత అనంతరం దీన్ని మేము పారాయణ పుస్తకంగా గుర్తిస్తాము”. పక్కన ఉన్న గదివైపు చూపిస్తూ, “పుదు పెరియవాళ్” అని చెప్పి, దర్శనం చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. శ్రీ మహాస్వామివారి ఆజ్ఞతో నా జీవితంలో మొదటిసారి శ్రీ పుదు పెరియవాను దర్శించుకున్నాను. జీవితాంతం కంచి ఆచార్యుల దర్శనభాగ్యం పొందడానికి ఇది శ్రీకారం. పుదు పెరియవా ఉంటున్న గదిలోకి వెళ్ళాలంటే మరలా వీధిలోనికి వచ్చి గదిలోనికి వెళ్ళాలి. జగద్గురు పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతి శ్రీ శంకరాచార్య స్వామివారికి సాష్టాంగం చేశాను. నేను అలా నమస్కరిస్తున్నప్పుడే “ద్విపద మణిమాల” అని అన్నారు. అభయ హస్తం చూపి అత్యంత ప్రసన్నత కల్గిన నగుమోముతో నన్ను ఆశీర్వదించారు. ఎవరూ నా గురించి చెప్పకుండానే వారి నోటిలో నుండి వచ్చిన తొలి పలుకులు నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. ద్విపద మణిమాల అంటే రెండు వరసల పూసలతో అల్లిన మాల అన్న అసలైన అర్థం నా మనస్సు నుండి వెళ్ళిపోయింది. పూజ్యశ్రీ పుదు పెరియవా దర్శనంతో రెండు నవమణులపై రాసిన స్తోత్రమాలగా ఆలోచన కలిగింది. దీనికి మరొక్క కారణం కూడా ఉంది. సాధారణంగా ద్విపద మణిమాల ప్రబంధాన్ని వెన్బాండ్ కట్టళైక్కాలితురై వృత్తంలో అంతాది, ఒక పాదం చివరి పదం మరొక పాదం మొదటి పదంగా వచ్చేలా వ్రాయాలి. అందరు కవులు ఇదే విధానాన్ని పాటిస్తారు. కాని, నవనీతప్ పాట్టియాల్ ద్వారా తెలిసిన మరొక నియమం, ద్విపద మణిమాలని వెణ్బ మరియు ఆసిరియ విరుత్తం వృత్తంలో కూడా రాయవచ్చు. ఇక్కడ ఉన్నది శ్రీ పుదు పెరియవా. నా కావ్య ప్రబంధంలో ఈ కొత్త తరహా విధానం రావడానికి వీరి అనుగ్రహమే కారణం అయ్యింది. కట్టళైక్కాలితురైలో కాకుండా ఆసిరియ విరుత్తం వృత్తంలో వ్రాయాలన్న ఆలోచన నాకు ఎలా కలిగిందో అర్థం కావడం లేదు. ఛందస్సులో వచ్చిన కొత్త విధానం శ్రీ పుదు పెరియవాను స్తుతించడానికే. ఇరవై పద్యాలకు ఉన్న ఒక్కటే పేరు శ్రీ శంకరాచార్యర్. అది కామకోటి పీఠాధిపతులందరికీ ఉన్న సామాన్య నామం. వారి అనుగ్రహం వల్ల నాకు కలిగిన అతి సామాన్య సాధారణ విషయం. శ్రీ పుదు పెరియవా నా ఉద్యోగ విషయాలను అడిగి, నన్ను ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చారు. --- యం. వి. పశుపతి, చెన్నై - 49. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు. t.me/KPDSTrust #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1 187
6
లోనికి రాగానే మా అమ్మ నన్ను గదినుండి విడుదల చేసి నాతో, “నేను ఆయన దేవుడు అని చెప్తిని కదా?” అని రెండు చేతులు పైకెత్తి నమస్కరించింది. నాకు ఉపనయనం జరగని విషయం గురించి అడిగారేమో అని నాకు ఆందోళన కలిగింది. కూర్చోవడానికి, నిలబడడానికి వీలులేకపోవడంతో మా అమ్మమ్మ బయటకు వెళ్ళింది. నేను “అవ్వా! అవ్వా!” అని పిలుస్తూ తన దగ్గరకు వెళ్లాను. ఏం జరిగిందో తను నాకు చెప్పింది. “ఆమె సూలమేని దొరైసామి అయ్యర్ భార్య కదా?” అని తన గురించి అడిగారట స్వామివారు. భర్త పోయిన ఇరవై సంవత్సరాల తరువాత మా అమ్మమ్మ తిరుప్పనంతాళ్ లోని తన కుమారుని ఇంటికి వచ్చి ఇక్కడే ఉండిపోయింది. చాలా సంవత్సరాల క్రితం మా తాతయ్య బ్రతికున్నప్పుడు పూజ్యశ్రీ మహాస్వామివారి దర్శనం చేసుకుందిట మా అమ్మమ్మ. కాలము, దేశము, పరిస్థితి మారిపోయిన ఇన్ని సంవత్సరాల తరువాత మహాస్వామివారు తన గురించి విచారించడం . . . మా అమ్మ నాకు చెప్పినవి మాటలు కాదు, బోధనలు. ఆ తిరుప్పనంతాళ్ సంఘటన వల్లే లోపలకు వెళ్లి స్వామివారికి సాష్టాంగం చేయడానికి నేను వెనకడుగు వేసినది. ఎలాగోలా నన్ను నేను స్తిమితపరచుకుని కాళ్ళను కదలడానికి సిద్ధం చేశాను. అప్పటికి కూడా నాకు ఇంకా ఉపనయనం జరగలేదు. మొత్తానికి చొక్కా విప్పి లోపలకు వెళ్ళగలిగాను. నా జంధ్యం గురించి స్వామివారు ఏమీ అడగలేదు. భయపడుతున్నవారిని మరింత భయపెట్టడం పరమాత్ములకు అలవాటు లేదు. ఆ పావన గృహంలోకి వెళ్ళగానే మహాజ్ఞాన ప్రకాశాన్ని తనివితీరా దర్శించుకున్నాను. ఆకాశంలో తేలుతున్న ఒక అద్వితీయ భావన. ‘శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీమద్ శంకరాచార్య స్వామి ద్విపద మణిమాల (వ్యాఖ్య సహితం)’ అన్న నా పుస్తకం గురించి ఏమైనా చెబుతారని ఊహించాను. స్వామివారి నుండి ఒక అరుదైన దీవెన లభించింది. అప్పటిదాకా సుందర తెలుగులో సాగిన సంభాషణ, ఇప్పుడు తేనె కంటే మధురమైన అచ్చ తమిళంలోకొనసాగింది. “తిరువళ్ళువర్ ఎన్న సమయం?” (తిరువళ్ళువర్ ఏ మతానికి చెందినవాడు?) అని ఆ సర్వ మహాజ్ఞాని నన్ను అడిగారు. అప్పట్లో కొంతమంది వ్యక్తులు మాయకులోనై ఈయన చెప్పిన విషయలను సరిగ్గా అర్థం చేసుకోక వారి కలాలతో పాపం చేశారు. తిరుక్కురళ్ గురించి ఈ మహాజ్ఞానికి తెలిసినంతగా ఇప్పటికీ ఏ పరిశోధకుడు తెలుసుకోలేదు అన్నదానికి తార్కాణం ఈ సంఘటన. అది నేను సమాధానం చెప్పగలిగిన ప్రశ్న కావడంతో, నాకు కొంచం ధైర్యం వచ్చింది. బిడ్డ తల్లి ముందు ఎందుకు భయపడతాడు? “తిరువళ్ళువర్ శైవ - సిద్ధాంతి” అని బదులిచ్చాను. చెప్పిన విషయం సరైనదే అయినా వాడిన పదాలు మాత్రం సరికావు. ఈ తప్పుని దాదాపు ఇరవైఅయిదేళ్ళ తరువాత పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతి శ్రీ శంకరాచార్య స్వామివారు సరిజేశారు. 2001లో శ్రీమఠంలో నన్ను మాణిక్యవాచకుల గురించి మాట్లాడమని వారి సమక్షంలో అనుగ్రహించారు. నేను చప్పడం ముగియగానే, జగద్గురు పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతి శ్రీ శంకరాచార్య స్వామివారు నాకు జ్ఞానాన్ని, ఆశీసులని అందించి, “శైవ - సిద్ధాంతి అని నువ్వు చెప్పావు”. దాన్ని అలా అనకూడదు. ‘శివాద్వైతి’ అనాలని తెలిపారు. 09-12-1965న అరవైఎనిమిదవ పీఠాధిపతి ఎదుట నా మాటల్లో జరిగిన తప్పుని ఏప్రియల్ 2001లో అరవైతొమ్మిదవ పీఠాధిపతి సరిచేయడం, ఒకే జ్యోతి ఇన్ని రూపాలుగా మన కులగురునాథులుగా అవతరించి మనలని రక్షిస్తున్నారని రుజువుచేయడమే. పూజ్యశ్రీ మహాస్వామివారు నా సమాధానం విని, “అది నువ్వు ఎలా చెప్పగలవు?” అని అడిగారు. ఒక్కక్షణం ఆగి, “దీనిపై ఒక వ్యాసంతో సాయంత్రం రా” అని ఆదేశించారు. నాకు నాథన్ తాళ్ (గురు పాదాల) దర్శనం అయ్యింది; నాకు నా తంతాళ్(నాకు నాలుక ఇచ్చినవాడు) దర్శనం అయ్యింది; కావాల్సినన్ని తాళ్(కాగితాలు) కూడా ఉన్నాయి. నాకు జ్ఞాపకం ఉన్న విషయాలన్నిటిని క్రోడీకరించి, ‘తిరువళ్ళువర్ మతం’ అన్న ఏడు పేజీల వ్యాసం వ్రాసాను. సాయంత్రం నాకు మరొక దర్శనభాగ్యం కలిగింది. నా వ్యాసంలో ఇలా వ్రాశాను; తిరుక్కురళ్ లో కనిపించే తామరై కణ్ణన్ (తామర కన్నులు కలవాడు) మరియు అడియళందాన్ (పాదంతో కొలిచినవాడు) అనే పదాలు తిరుమాల్ (మహావిష్ణువు) గూర్చినవి - పాదాలను కీర్తించే మొదటి భాగంలోనిది, ‘దేవుని స్తుతి’ - ఇంద్రానే సలుం కరి (దేవతల రాజైన ఇంద్రుడు కూడా, ఋషుల శాపం అనుభవించాడు) అనే పాదం - ఉళగు ఇయాట్రియాన్ (విశ్వాన్ని సృష్టించినవాడు) అన్న వాక్యం - ఎణ్ గుణత్తాన్ (ఎనిమిది గుణాలు) మొదలగు వాక్యాలు. పూజ్యశ్రీ మహాస్వామివారి ముందు ఈ వాక్యాలను వివరిస్తున్నాను. అలాగే తిరుక్కురళ్ ని చదువుతూ ఉంటే, పిరవిప్ పెరున్కడల్ నీందువర్ నీంధర్ ఇరైవనాది సెరాదర్ అనతమైన జన్మ పరంపర సాగరాన్ని దాటవచ్చు, నిజానికి,కాని అది అనంతుడి పాదాలలోకి ఐక్యం అయతే తప్ప కుదరదు. ఆపమని చేతులతో సైగ చేశారు స్వామివారు. “తిరువళ్ళువర్ కాలంలో ఇరైవన్ అంటే శివుడు” అన్న అనుగ్రహ సందేశాన్ని ఇచ్చారు. తిరుక్కురళ్ కి మొదటి భాష్యం వ్రాసిన పరితియార్, ఈ వాక్యాన్ని వివరిస్తూ, “శివుని పాదాలను ధ్యానించని వారు జన్మ పరంపర అనే సముద్రాన్ని దాటలేరు”. స్వామివారు చెప్పిన విషయం నాకు ఇప్పటికి గుర్తే. మొత్తం స్వామివారికి వివరించాను.
952
7
పూజ్యశ్రీ జగద్గురువులు చోళవరం వచ్చి ఒక చిన్న పెంకుల ఇంటిలో ఉన్నారు. ఆ ఇద్దరు మహానుభావులు ఆ ఇంటిలో ఉండడంతో అది ఒక పవిత్ర స్థలం అయ్యింది. అది ఒక చిన్న హాలు ఒక గదితో ఉన్న ఇల్లు. ఆ గదిలో ఒక్కరు కూర్చోవచ్చు, లేదా ముగ్గురు నిలుచోవచ్చు. భక్తులకు దర్శనం ఇవ్వడానికి మహాస్వామివారు ఆ గదిలో కూర్చున్నారు. వెదురు తట్టల్లో పూలు, పళ్ళు తీసుకుని ఎందఱో లోపలకు వెళ్ళారు. వాటితో పాటు నా ప్రచురణ కూడా లోనికి వెళ్ళింది. ఆ గదికి రోడ్డువైపున ఒక కిటికీ ఉంది. కవిచక్రవర్తి అయిన కంబన్ రాసిన ఇతిహాసంలో మిథిలా నగర దృశ్యాన్ని వర్ణిస్తూ, ‘ప్రతి కిటికిలో తామర పూవులు వికసించాయి’ (శ్రీరాముణ్ణి చూడడానికి). ఇక్కడి పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. జ్ఞాన మధువును కురిపించే బంగారు తామర పువ్వు గదిలోపల వికసిస్తే, ఆ కమల కారుణ్య నయనాల కనుకొనల క్షణ వీక్షణ కోసం కిటికీ వద్ద తేనెటీగల గుంపు ఉంది. ఆ తేనెటీగల గుంపులో నా మొహం కూడా ఆత్రుతగా నిరీక్షిస్తోంది. ఏమి అద్భుతం! నా పుస్తకం ప్రాధాన్యతను సంతరించుకుంది, శ్రీ మహాస్వామివారి కళ్ళు దుర్భిణి సహాయంతో పుస్తకంలోని పేజీలను వీక్షిస్తున్నారు. ప్రతి పదాన్ని ఎంత శ్రద్ధతో చూస్తున్నారో నాకు అర్థమవ్వగానే కళ్ళు నీరు వర్షించాయి. ఆ మహాజ్ఞాని కళ్ళు పుస్తకం చివరి పేజీకి రాగానే, నా మనస్సు భయంలో చిక్కుకుంది. భయం ఎందుకంటే, ఆ పుస్తకం గురించిన అభిప్రాయం ఏమైఉంటుందా అని. అప్పటిదాకా ముకుళిత హస్తాలతో ఉన్న నేను భయం వల్ల కిటికీ వద్ద నా ముందు ఉన్న వ్యక్తి భుజాలపై ఉంచాను. కోటిసూర్య ప్రకాశంగా వెలిగే స్వామివారి జ్ఞాన ముఖం కుడివైపుకు తిరిగింది. నేను స్థాణువయ్యాను. “పశుపతి, నువ్వు శ్రీరుద్రం చదువుకున్నవా?” అని అన్నారు. “స్వామి, లేదు స్వామి” అన్నాను. “శ్రీరుద్రంలో ఉన్న విశేషాలు ఈ ప్రబంధములో ఉన్నది” అన్నారు స్వామివారు. నాకు భయం పోయింది. కాని దాని స్థానంలో తీవ్రమైన ఆత్రుత నన్ను పట్టుకుంది. కిటికీ వద్ద ఇంత మంది జనం ఉంటె, ఎవరూ నన్ను పరిచయం చేయకుండానే, నన్ను ఎలా గుర్తుపట్టారు? ఇన్నిరోజులుగా ఒక్కసారి కూడా ఆ మహాత్ముని చూపులు నాపై పడలేదు కదా! ఆ పుస్తకంలో నా చిత్రం కూడా అచ్చువేయలేదు. మరి నన్ను గుర్తుపట్టి నాపై కరుణని ప్రసరింపజేయడం ఎలా సంభవం? అంతేకాదు నా మాతృభాష తెలుగని, మేము తెలుగువాళ్ళమని స్వామివారికి ఎవ్వరూ చెప్పలేదు, కాని నాతో తెలుగులోనే మాట్లాడారు. నేను కలగంటున్నానా? ఇలాంటి సందేహాలతో ఈ గందరగోళం తారాస్థాయికి చేరింది. రెప్పపాటులో ఇన్ని సందేహాలతో నా ఆలోచనలు సాగుతూవుంటే, స్వామివారు నాతొ మాట్లాడుతూనే ఉన్నారు. “మ.వే. అంటే మంత్రవాది వెంకటరామయ్యేనా?” అని అడిగారు. అవునన్నట్టు తలూపాను. ఇంతకుముందు స్వామివారి దగ్గరకు వెళ్ళకపోవడానికి గల కారణం ఇప్పుడు కూడా నా కాళ్ళను కదలనివ్వడంలేదు. ఇంతకుముందు ఒకసారి స్వామివారిని చాటుగా దర్శించుకున్నాను. నాకు పద్దెనిమిదేళ్ళు నిండాయి. పూజ్యశ్రీ మహాస్వామివారు తిరుప్పనంతాళ్ విజయం చేశారు. ఆ ఊర్లో మా ఇల్లు తాడకై ఏచ్చారం సన్నిధిలో ఉండేది. మా నాన్న, అమ్మ, అమ్మమ్మ, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ కులగురునాథుల దర్శనం కోసం వీధిలో నిలుచున్నారు. కేవలం కొద్ది క్షణాల్లోనే స్వామివారిని ఆహ్వానించడానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. మా అమ్మ కళ్ళు నన్ను చూశాయి. వెంటనే నా చేయి పట్టుకుని, లోపలికి లాక్కెళ్ళి, రోడ్డువైపు ఉన్న గదిలో ఉంచి గడియ వేసింది. రోడ్డువైపున ఉన్న అరుగు ఎక్కి నన్ను బంధించిన గది కిటికీ వద్దకు వచ్చి, “పశుపతి, ఒచ్చేది మన కులగురు; ఆయన దేవుడు; ఆయనకు అన్నీ తెలుసును; వీడికి ఎంతుకు ఇంగా ఉపనయనం సేయలేదు అంటే మేమి ఏమి సేస్తుము” అని చెప్పింది. రెండు చేతులను పక్కలకు చాచి చిన్నగా నాకు చెప్పి, అరుగు దిగి, వీదిలోనికి వెళ్ళిపోయింది. “ఆయన దేవుడు అయితే, నువ్వు నన్ను గదిలో బంధించిన విషయం కూడా తెలుసు కదా!” అని నాలో నేనే గొణుక్కున్నాను. ఆ మాటలలో నా నాస్తికత్వ భావజాలం కూడా కాస్త ఉంది. అంతేకాక, ఊరివారందరూ ఎంతో ఆనందంగా కోలాహలంగా పాల్గొంటున్న ఉత్సవానికి నన్ను దూరం చేశారన్న బాధ. ఆ గది కేటికీ ఊచల దూరదూరంగా ఉండడంతో, రోడ్డుపై జరిగేదంతా నాకు కనపడుతుంది. పల్లకి వచ్చింది. మా అమ్మ, నాన్న దగ్గరకు వెళ్లి పూజ చేశారు. నా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు నేలపై పడి నమస్కారం చేశారు. ఆ కిటికీ ఊచల నుండి చేతులు బయటపెట్టి నమస్కారం చేశాను. మా అమ్మమ్మ(మొత్తం భగవద్గీత కంఠతా వచ్చు, ఎందరికో నేర్పించేది) పూర్వసువాసిని కావడంతో దూరంనుండే స్వామివారికి పంచాంగ నమస్కారం చేసింది. ఆవిడని చూపిస్తూ పూజ్యశ్రీ ఆచార్యులు మా అమ్మను ఏదో అడుగగా అందుకు మా అమ్మ సమాధానం చెప్పింది. వారికి నేను దాదాపు ఇరవైఅయిదు అడుగుల దూరంలో ఉండడంతో, జరుగుతున్నది చూడగలను కాని ఏమీ వినబడడంలేదు. మా ఇంటికి నాలుగైదిళ్ళ తరువాత ఎదురుగా ఉన్న కట్టళై మఠంలోనికి వెళ్ళారు పూజ్యశ్రీ మహాస్వామివారు. మా నాన్నగారు కూడా మఠానికి వెళ్ళారు.
789
8
ఆయన కులగురు - ఆయన దేవుడు 09-12-1965, ఈరోజు నా జీవోతంలో మరచిపోలేని రోజు. సాటిలేని మహాజ్ఞాని పరమాచార్య స్వామివారి కారుణ్య లీలానుగ్రహం నాకు లభించిన రోజు. ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలో జూన్ 1964 దాకా తమిళ ఉపాధ్యాయుడుగా శిక్షణ పొందాను. శిక్షణ ముగియగానే, చెన్నైలోని చోళవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నవంబర్ 1964లో నియామకం దొరికింది. అప్పుడు ఆ పాఠశాలకి శ్రీ మీనాక్షిసుందరం అనేవారు ప్రధానోపాధ్యాయులుగా ఉండేవారు. వారికి తిరుప్పనంతాళ్ సెంతమిళ్ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసిన ప్రముఖ వ్యక్తి అయిన మా నాన్నగారు బాగా తెలుసు. మా నాన్నగారితో స్నేహబంధం ఉన్న వ్యక్తి ప్రధానోపాధ్యాయులుగా ఉన్న పాఠశాలలో నేను పనిచేయడం వల్ల వారితో స్నేహంగా మెలగే అవకాశం కలిగింది. చోళవరంలో పనిచేయడానికి నాకు ఉత్తర్వులు రావడం ప్రభుత్వ విద్యాశాఖ వల్ల కాదు కాని, పరమాచార్య స్వామివారు కారుణ్య శాఖ వల్ల మాత్రమే. ఇది ఎందుకంటే, ఉద్యోగంలో చేరిన నెలలోపే శ్రీ పరమాచార్య స్వామివారు అక్కడికి విజయం చేశారు. అప్పుడే నాకు వారి కరుణ స్పర్శ కలిగింది. శ్రీ పెరియ పెరియవా, శ్రీ పుదు పెరియవా ఇక్కడికి విచ్చేస్తున్న సందర్భంగా చోళవరం ప్రజల తరుపున పద్య రూపంలో స్వాగతోపన్యాసం తయారుచేయల్సిందిగా ప్రధానోపాధ్యాయులు నన్ను అడిగారు. అవసరమైతే నా బోధనా ప్రణాలికను కాస్త పక్కనపెట్టి ఈ పని ముగించమని తెలిపారు. ఇది నాకు కలిగిన అపూర్వ భాగ్యం అని అప్పుడు నాకు అనిపించలేదు. ఒక పెద్ద అవకాశం మాత్రమె అని తోచింది. ఇది ఒక భాగ్యం అని నాకు అనిపించకపోవడానికి కారణం నా మనస్సులో ఉన్న స్వాభావికమైన భయం. ఆ భయం ఎందుకో మీకు తెలియజేస్తాను. ఉభయులిద్దరూ అభయం ఇచ్చేటప్పుడు ఆ భయం ఎందుకు వెళ్ళిపోదు? శ్రీ మీనాక్షిసుందరం ఇచ్చిన అవకాశాన్ని నేను వదులుకోలేదు. కాని కాస్త ఆలస్యం చేశాను. అందుకని వారితో, “సార్! నా గొంతు రాచుకుపోయేలాగా, మెడ నొప్పి పుట్టేలాగా పాఠాలు చెప్పడం నా ఉదయం పూట పని. రాయడం నా రాత్రిపని. కనుక నేను రాత్రిపూట(ఇరవిల్) రాసేది ఖచ్చితంగా అరువు(ఇరవాల్) తెచ్చుకున్నది మాత్రం కాదు” అని తరగతికి వెళ్ళిపోయాను. శ్రీ మీనాక్షిసుందరం నాకు ఇచ్చిన అవకాశాన్ని నా మేనమామకు తెలిపాను. మా పెదన్న శ్రీ కె.యం. కృష్ణమూర్తి కూడా అక్కడకు వచ్చారు. ఇద్దరూ ఒకేసారి ఇలా అన్నారు, “నీకు మంచి సమయం వచ్చింది” అని. వారిద్దరూ ఒకేసారి అలా అనడంతో నాకు ఒక ఆలోచన వచ్చింది - స్వాగతోపన్యాసం కాకుండా ఒక ప్రబంధం ఎందుకు రాయకూడదు. కళ్ళు మూసుకుని నాకు నేనే ధైర్యం కూడగట్టుకుని, “అయిదారు పద్యాలతో స్వాగతోపన్యాసం ఇస్తే ఏమిటి ఉపయోగం? అక్కడకు వచ్చినవారందరికీ ఇచ్చిన ఆ కాగితాలను తరువాత పడవేయడానికి మడిచి పెట్టుకుంటారు. పది పాటలు గల పత్తికం ఒక చిన్న పొత్తంగా ఇవ్వొచ్చు. లేదా ద్విపద మణిమాలగా ఒక చిన్న పుస్తకం చెయ్యొచ్చు. పుస్తక రూపంలో ఇస్తే, చదవకపోయినా కనీసం దాచుకోవడానికి జనం దాన్ని ఇంటికి తీసుకునివెళతారు. ఒక చిన్న ప్రబంధాన్ని రాయడానికి తగిన సమయం కూడా ఉంది”. “శభాష్” అన్నారు మా మేనమామ. “అంతా బాగానేఉంది కాని, ఈ గ్రామ ప్రజల తరుపున సమర్పిస్తున్నావు కదా దీన్ని వారు అంగీకరిస్తారా? ప్రబంధం చదవడం కష్టం కదా!” చివరిగా నేను వారికి, “వారు అంగీకరించకపోతే ఏంటి? నేను దీన్ని ఇలానే ప్రచురిస్తాను” అని తెలిపాను. ఆరాత్రే ‘పూజ్యశ్రీ శంకరాచార్య స్వామి ద్విపద మణిమాల’ మొదలయ్యింది. మాణిక్యవాచకులు చెప్పినట్టు, ‘ఆయన కరుణతో, ఆయన పాదాలకు(తాళ్) తలవంచి’ వ్రాస్తూ వ్రాస్తూ పేజీలు(తాళ్) నిండిపోయాయి. కళ్ళు తడి అవ్వగా, శరీరం పులకరించగా, పదాలు పుట్టి ప్రబంధం పూర్తైయ్యింది. దాన్ని ప్రచిరించాల్సిన రోజు వచ్చింది కాని, నావద్ద డానికి సరిపోయే ధనం లేదు. ఒక్క పేజీ తక్కువగా ఉండిఉంటే నావద్దనున్న ధనం సరిపోయేది. ఆ పరమ కారుణ్యమూర్తి అనుగ్రహం వల్ల సమస్య తొలగిపోయింది. మూడవ దళసరి పేజీని ఎక్కువైన పేజీకి బదులుగా వాడుకుని, మిగిలిన అన్ని పేజీలను సాధారణ తెల్ల పేజీపై అచ్చు వేయించాను. 09-12-1965 నాకు పనిదినం. ప్యాంటు, చొక్కా వేసుకుని తయారయ్యి, ఒక వంద కాపీలను ఇంటిలోనే ఉంచి, మిగిలిన ప్రతులను శ్రీ మీనాక్షిసుందరం గారికి ఇచ్చి, “ఇవి మీరు సమర్పించండి” అని తెలిపాను. శ్రీ కంచి మఠం మరియు శ్రీ జగద్గురువుల భక్తులైన శ్రీ యస్.వి. సుబ్బయ్య(సినిమా నటులు) చోళవరం దగ్గరలోని కారనోడై విశాలమైన పందిరి వేసి పెద్ద సభ ఏర్పాటు చేశారు. వారి ఉద్యానవనంలో వేలమంది కూర్చోవడానికి వీలుగా సినీ ఫక్కీలో దాన్ని నిర్మించారు. నాకు గుర్తున్నట్టుగా నేను విన్నది ఏమిటంటే, ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఈ సభను నివారించేందుకే లేదా వాయిదా వెయ్యడానికే ఆరోజు పూజ్యశ్రీ జగద్గురువులు చోళవరంలో మకాం చేశారు. అలా చూస్తే, మరొక కారణం నావంటి సామాన్యుడిని కటాక్షించడానికి కూడా అని నా అభిప్రాయం. మానవ మేధస్సు, బుద్ధి ఆ మహాశక్తి ఆలోచనలను ఎలా చేధించగలదు?
961
9
పరమాచార్య గొప్పదనం 1950-51 సంవత్సరాలలో, పరమాచార్య స్వామివారు కుంభకోణం మఠంలో ఉన్నారు. ఒకరోజు రాత్రి స్వామివారు ఉపన్యసిస్తున్నారు. స్వామివారికి ఎదురుగా మైక్ కూడా లేదు. శ్రీమఠానికి చాలామంది భక్తులు వచ్చారు. స్వామివారు ఉపన్యాసాంతర్గాతంగా ఒక శ్లోకంలోని ‘కర్మనాశ జలస్పర్శత్’ అన్న రెండు పదాలను పదే పదే చెబుతున్నారు కాని, పూర్తీ శ్లోకం చెప్పడంలేదు. నా అజ్ఞానం వల్ల స్వామివారికి మిగిలిన శ్లోకం తెలియదేమో అనుకున్నాను. నాకు ఆ శ్లోకం మొత్తం రావడంతో బాల్య చాపల్యం చేత, స్వామివారు ప్రసంగిస్తున్నా అత్యుత్సాహంతో గట్టిగా ఆ శ్లోకాన్ని చెప్పాను. కర్మనాశ జలస్పర్శత్ కరదోయ విలంగనాత్ గండకీ బాహుదరనాత్ ధర్మఃక్షరతి కీర్తనాత్ మహాస్వామివారు తమ ఉపన్యాసాన్ని ఆపి, ఆ శ్లోకాన్ని మరలా చెప్పమని నన్ను ఆజ్ఞాపించారు. ఎవరినా ఉపన్యసిస్తున్నప్పుడు మధ్యలో భాగం కలిగిస్తే, వారికి కోపం రావడంతో పాటు ఆ ఇబ్బంది కలిగించినవాణ్ణి అధికప్రసంగి అని తిట్టుకోవడం సహజం. కాని పరమాచార్య స్వామివారు కరుణామూర్తి. శ్లోకం చెప్పమని స్వామివారు ఆదేశించిన వెంటనే నేను చెప్పడం మొదలుపెట్టాను కాని, సరిగ్గా గుర్తుకురాలేదు. అయినా “ఆ పిల్లవాడు చెప్పాడు చూడండి” అని స్వామివారు నన్ను ఆశీర్వదించారు. నాకు అవకాశం కల్పించడానికే స్వామివారు అ శ్లోకాన్ని మరచిపోయినట్టుగా నటించారు. దాంతోపాటు నా అజ్ఞానాన్ని కూడా బయటపడకుండా చేశారు. పరమాచార్య స్వామివారి కరుణ ఎటువంతిదని తెలిపే ఈ సంఘటన ఇప్పటికి నా జ్ఞాపకాల పొరల్లో ఎంతో తాజాగా ఉంది. *************** ఒకసారి పరమాచార్య స్వామివారు కాంచీపురంలోని శివాస్థానంలో ఉన్నారు. వృక్షశాస్త్రంలో డాక్టరు డిగ్రీ పొందిన ఒక యువకుడు స్వామివారి దర్శనానికి వచ్చాడు. మహాస్వామివారు అతణ్ణి, “వెట్రిలై(తమలపాకు) కు ఆ పేరు రావడానికి గల కారణమేమి?” అని అడిగారు. తనకు తెలియదని చెప్పడంతో, స్వామివారే డానికి కారణం తెలిపారు, “అది ఒక లత. ఏ లత అయినా పువ్వులు పూచి, కాయలు కాస్తుంది. కొన్ని పాదులు కాయలు కాయకపోయినా పువ్వులు పూస్తుంది. కాని ఈ తమలపాకు లత పువ్వులు పూయదు, కాయలు కాయదు. కేవలం ఆకులు మాత్రమే ఉంటాయి. ఈ తీగ కేవలం ఆకులతో ఉంటుంది కాబట్టి దీనికి వెట్రిలై(కేవలం ఆకు) అని పేరు”. నిజంగా డాక్టరేటు ఇవ్వాల్సింది మహాస్వామివారికే అని అనుకున్నాడు ఆ యువకుడు. *************** పరమాచార్య స్వామివారికి శిల్పశాస్త్రంలో అపారమైన జ్ఞానం. శిల్పులకు కూడా తెలియని ఎన్ని విషయాలను స్వామివారు తెలిపేవారు. ఆగమశాస్త్రంలో శిలలను మూడు రకాలుగా విభాజించారు: ఆడవి, మగవి, ఆడ మగ కానివి. కొన్ని శిల్పాలు కేవలం మగ శిలలతోనే చేయాలి, కొన్ని ఆడ శిలలతో, మరికొన్ని నపుంసక శిలలతోనే చెయ్యాలి. ఉలి దెబ్బ ద్వారా శిల యొక్క గుణాన్ని శిల్పులు తెలుసుకుంటారు. కాని పరమాచార్య స్వామివారు కేవలం ఆ శిలను చూసే, దాని గుణం తెలుసుకుంటారు. దాంతోపాటు ఒక్కోసారి ఆ శిలల్లో కప్పలు ఉంటాయి. అటువంటి శిలలతో దైవప్రతిమలు చెయ్యరాదు. ఒకసారి స్వామివారి వద్దకు స్థపతి ఒకరు ఒక శిలను తెచ్చారు. స్వామివారు అందులో కప్ప ఉందని చెప్పారు. అందుకు ఆ శిల్పి పరీక్ష చేసి నిర్ధారించుకున్న తరువాతనే తాను ఈ శిలను తెచ్చానని వాదించాడు. ఆ శిలను పగులగొట్టమని స్వామివారు ఆదేశించారు. ఆ శిలను బద్ధలుకొట్టగానే ఒక కప్ప ఎగురుకుంటూ బయటకు వచ్చింది. ఆ శిల్పి ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ శిలలతో పనిచేసే శిల్పాచార్యులకు కూడా లేని శిల్పశాస్త్ర పాండిత్యం స్వామివారికి సొంతం. --- యస్. పంచపకేశ శాస్త్రిగళ్, కుంభకోణం. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు. t.me/KPDSTrust #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1 306
10
జయ జయ శంకర !! హర హర శంకర !! 2026 మార్చి, ఏప్రియల్, మే, జూన్ నెలల్లో మనం ట్రస్ట్ తరుపున పూర్తిచేసిన కార్యక్రమాల వివరాలు. * హైదరాబాదులో ఉన్న అభీష్టం గోశాలలోని గోవులకు గోగ్రాసం మరియు పౌష్టిక ఆహారం కొనుగోలు. * కల్పతరు గోశాల, అద్వైత గోశాలల నిర్వహణ, పనివారి జీతాలు, ఎండు గడ్డి కొనుగోలు. * వారణాసి క్షేత్రంలో సాధు సంతులకు నిత్య నారాయణ సేవ. * పరమాచార్య స్వామివారి జన్మ నక్షత్రం నాడు అనుషం మాస వేద పారాయణ. * శ్రీరామ నవమి సందర్బంగా వజ్రముష్టి ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు. * మన అద్వైత గోశాలలో ఆదిశంకరాచార్యుల వారి జయంతి ఉత్సవముల నిర్వహణ (ఇరువురు ఘనపాఠీలకు సత్కారం, సన్మానం). * కంచి కామకోటి పీఠం వారు ప్రచురించిన "వివాహం, ఉపనయనం" అను రెండు పుస్తకాల ముద్రణకు ఆర్ధిక సహాయం. * అధిక జ్యేష్ట మాసం సందర్బంగా రెండు గోదానాలు, తొమ్మిది సాలగ్రామాల సమిష్టి దానం కార్యక్రమం. విరాళాలు పంపదలచినవారు UPI ID : 7259859202@hdfcbank ఉపయోగించి చెయ్యవచ్చు. ట్రస్టు బ్యాంకు అకౌంటు వివరాలు A/C Name: Kanchi Paramacharya Dharmika Seva Trust A/C. Num: 50200059599164 IFSC Code: HDFC0001753 A/C Branch: Kanakapura Road, Bengaluru
1 376
11
కృతజ్ఞత మహాస్వామివారు తమ ఉపదేశం కేవలం ఆచరణ రూపంలో చూపారు. సన్యాస ధర్మ పరిపాలన విషయంలో వీరి నియమ ధృతి ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఆ విషయం చెప్పుకోబోయే ముందు కొంచం క్రొత్తదనం కోసం వారి అనేక మహోన్నతమైన గుణములలో ఒకటైన కృతజ్ఞతా లక్షణాన్ని స్మరించుకొందాము. కృతజ్ఞత అనేది మహాపురుష లక్షణము. వాల్మీకి నారదుని పదహారు ఉన్నతమైన లక్షణాలున్న మహాపురుషుడెవరైనా ప్రస్తుత కాలంలో ఉన్నాడా అని ప్రశ్నిస్తూ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. . . అంటూ ఈ కృతజ్ఞతా లక్షణాన్ని ఉటంకిస్తాడు. దప్పికతో ఉన్నప్పుడు మనకు చల్లటి మంచినీరు ఒక గ్లాసు ఇచ్చిన వారి మేలు - మనం తరువాత కాలంలో అనేక పర్యాయములు వారికి మరగ కాచిన పాలు, చిక్కటి మజ్జిగ ఇచ్చే అవకాశం కలిగినా మరిచిపోరాదని పెద్దలు చెబుతారు. మహాస్వామివారికి వైయక్తికమైన అవసరాలు ఏమిటుంటాయి? అయితే తమ పూర్వీకులైన ఆచార్యులవారలకు, పీఠమునకు చేసిన మేలు ఎన్నడూ మరవక అటువంటి వారి యెడల ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావం చూపుతూ వచ్చారు స్వామివారు. 17వ శతాబ్ధంలో కర్ణాటక యుద్ధం మూలంగా ఏర్పడిన అస్తవ్యస్తత కారణంగా శ్రీమఠం కావేరీ తీరంవైపు తరిలివెళ్ళింది. క్లిష్ట పరిస్థితులలో మఠాన్ని ఉడయార్ పాళయయం సంస్థానాధీశుడు ఆహ్వానించి ఒక సంవత్సర కాలం పొషించారట. మళ్ళీ తంజావూరు ప్రభువులు ఆహ్వానించేంత వరకూ వీరు ఉడయార్ పాళయం రక్షణలోనే ఉన్నారు. క్రమశః సంస్థానాధిపతులు జమీందారులయి, జమీందారీ కూడా పోయి సాధారణ మనుష్యులైనారు. ఆస్తులన్నీ పోయి, జమీందారీ తాలూకు భేషజాలు, కోట మాత్రం మిగిలి పొషణభారం మోయలేని దుస్థితికి దిగజారారు. ఎప్పుడూ శిష్యుల లౌకికాభివృద్ధికి తమ పలుకుబడిని ఉపయోగించడానికి ఇష్టపడని స్వామివారు వీరి విషయం సంబంధిత అధికారులు తమ దర్శనానికి వచ్చినప్పుడు నేరుగా మాట్లాడి వీలయినంత సహాయం చేయించారు. సాధారణ వ్యక్తిగా ఒక వదులు జుబ్బా వేసుకొని జనీందారు వంశస్థుడు శ్రీవారి దర్శనానికి వచ్చేవాడు. స్వామివారు మఠాన్ని పోషించిన సంస్థానాధీశుని పేరు చెప్పి అతని మనవడంటూ సాదరంగా తివాచి తెప్పించి కూర్చోబెట్టేవారు. చివరికి అతడేదో ఖర్చులకు నగలు అమ్ముకోవలసి వచ్చింది. ఆ ప్రాంతాలలో ఆ రాళ్ళకు విలువ కట్టగలవారే లేరు. మదరాసు నుండి జొషి అనే మహాభక్తుడైన వజ్రాల వ్యాపారిని పిలిచి “పాపం! ఆ జమీందారు మోసపోతాడేమో! ఆ రాళ్ళకు విలువ కట్టరా! అయితే నీవు మాత్రం కొనడానికి వీలులేదు. అంతగా అయితే కొనగలిగే బేరగాళ్ళను చూపించవచ్చు”నని కట్టడి చేసి మరీ పంపారట. మహాస్వామివారు సిద్ధి పొందిన తరువాత ఈ మాజీ జమీందారు ఇంతకాలం నన్ను నా గౌరవాన్ని కాపాడిన స్వామి ఎక్కడ అంటూ గగ్గోలు పెట్టాడు. మరి గంగైకొండ చోళపురం బృహదీశ్వరుని మిగులుతో కదా పీఠం పోషించబడింది. క్రమశః భూములన్నీ అన్యాక్రాంత మైపోయాయి. నిలవరించడానికి జమీందారుకు అధికారం లేదు. ఉత్తరాది వరకు దండయాత్ర చేసి గంగైకొండ చోళుడు తను జయించిన రాజులందరిచేత మోయించుకొని వచ్చిన గంగాజలాలతో నిత్యం అభిషేకం చేయించుకొని మహా భోగాలనుభవించిన బృహధీశ్వరునికి నిత్య ధూప దీప నైవేద్యాలకు కరవయిపోయింది. అసలౌ జరగడం లేదని కాదు. విధి విధానంగా జరగడం లేదు. ఆ స్వామికి నిత్యం గంగనీళ్ళతో స్నానం చేసే అలవాటున్నది. పదహారు అడుగల ఆ మహాలింగానికి అయిదు మానికల బియ్యం వండి అధరవులతో ఆరగించే రివాజున్నది. ప్రతి కార్తీక పూర్ణీమనాటికి ఎనభై బస్తాలు బియ్యం వండి దానితో అభిషేకం చేస్తే నిండిపోయి ఒక్కొక్క మెతుకు ఒక్కొక్క శివలింగంగా ప్రకాశించి భక్తులకు అన్ని శివలింగాల దర్శనం చేసిన పుణ్యం ప్రసాదించే అనుగ్రహ బుద్ధి ఉన్నది. ఈ సంప్రదాయాలన్నీ అడుగంటిపోయినాయి. 1989లో శ్రీవారు తమ భక్తులతో సంభాషిస్తున్నారు “తల్లితండ్రులు అప్పుచేస్తే వారు తీర్చలేకపోయినప్పుడు పిల్లలు బాధ్యతవహించాలి కదా! నేను ఒక సన్యాసిని, నా పూర్వీకులు కూడా సన్యాసులే. మాకు డబ్బు గడించడానికి ఖర్చు చేయడానికి అధికారం లేదు. అయితే ఈ బీద సన్యాసికి సంక్రమించిన ఋణం నుండి విముక్తి చేయవల్సిన బాధ్యత శిష్యులైన మీ అందరి యెడల ఉన్నది కదా!” అని ఆరంభించి గంగైకొండ చోళపురపు బృహదీశ్వరుని మిగులులో తమ పీఠం పోషించిన వైనమంతా చెప్పి, “మమ్ము, రాజభోగాలతో పోషించిన ఆ బృహదీశ్వరునకిపుడు భోగాలు కరువయ్యాయి. అన్నాభిషేకం, విధి విధానమైన నైవేద్యం, గంగా జలాభిషేకం జరిగేలా చూడటం ద్వారా మీరంతా మమ్ము ఋణవిముక్తులను చేయాలి” అంటూ ముగించారు. అప్పటి నుండి ఈ కార్యక్రమాలు పరమ వైభవంగా జరుగుతున్నాయని వేరే చెప్పనక్కరలేదు. --- శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి, ఋషిపీఠం ప్రచురణల నుండి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1 448
12
పరమాచార్య - ప్రదోషం మామ దయాసముద్రుడైన ఆ పరమేశ్వరుడే పరమాచార్య స్వామివారిలాగా ఈ భూమిపై అవతరించారు. కేవలం కొంత మంది మాత్రమే ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగారు. కొంతమంది వారి దివ్య లీలలను అనుభవిస్తూ, పొందుతూ ఉండిపోయారు. మరికొంతమంది వారి వైభవాన్ని, గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో నిమగ్నమయ్యారు. వీరు దాన్ని తమ జీవిత ధ్యేయంగా మలచుకొని మహాస్వామివారే అన్ని రోగాలను పోగొట్టే వైదీశ్వరుడని, చిదంబరంలోని నటరాజు అని ప్రజలకు తెలియజేయాలని జీవితాంతం శ్రమించారు. అటువంటి మహా భక్తుల్లో ఒకరు బ్రహ్మశ్రీ ప్రదోషం మామ. పరమాచార్య స్వామివారు ప్రదోషం మామ యొక్క అనన్య భక్తికి ఎప్పుడూ బద్ధుడై ఉంటారు. మహాస్వామి వారు తనపై చూపిన కరుణని దయని ఎన్ని జన్మలకైనా తిర్చుకోలేనిదని అంటుంటారు ప్రదోషం మామ. పరమాచార్య స్వామి వారిపై మామ భక్తిని వారు నెలనెలా నిర్వహించే ఉత్సవాలలోనూ, సంవత్సరోత్సవాలు, జయంతి, మహారుద్ర, సువాసిని పూజల్లోనూ ప్రస్ఫుటంగా చూడవచ్చు. మామ పదవి విరమణ పొందిన రైల్వే ఉద్యోగి. వారికి వచ్చే పెన్షన్ వారి కుటుంబానికి ఏమాత్రం సరిపోయేది కాదు. వారికి ఉన్న పెద్ద సంపదల్లా పరమాచార్య స్వామివారి ఆశీస్సులే. అదే వారికి ఇన్ని కార్యక్రమాలు చేయాడానికి తోడ్పడుతోంది. ఈ కార్యక్రమాల నిర్వహణ విషయంలో మామకి ఎవ్వరూ సాటి రారు. ఒకసారి మహాస్వామి వారు మహాగావ్ లో మకాం చేస్తున్నారు. హఠాత్తుగా రామమూర్తి అయ్యర్ తో తమ భిక్షకి దానం సేకరించవలసిందిగా ఆదేశించారు. అక్కడున్న వారందరూ ఇది నమ్మలేకపోయారు. భిక్ష కోసం మహాస్వామి వారు ధనం అడగడం. రాజులు, జమీందారులు ఇచ్చిన ధనం పైనే ఎప్పుడూ స్వామివారు ఇష్టత చూపలేదు. వాటిని మఠం వారు స్వీకరించి వెంటనే అవసరంలో ఉన్నవారికి ఇచ్చివేసేవారు. అలాంటిది స్వామివారి మాటలకు ఆశ్చర్యపోయారు. వారి ఆదేశం ప్రకారం రామమూర్తిగారు అక్కడున్న ఐదు మంది బ్రాహ్మణులతో 1500 పోగుచేశారు. “ఇది అతనికి ఇవ్వు” అని అన్నారు స్వామివారు, ముద్దుగా 64వ నాయనారుగా పిలుచుకునే ప్రదోషం మామను చూపిస్తూ. ఆరోజు మామకు ఇచ్చిన దానం మేరుపర్వతమంత అయి మామకు సహాయ పడింది. మరుసటి ప్రదోషం నాటికి తమని దర్శించడానికి వచ్చిన మామతో “ఆ దానం బ్యాంకులో వెయ్యి” అని చెప్పారు స్వామివారు. పరమాచార్య స్వామివారి కార్యక్రమములు, వేద సంరక్షణ, గో సంరక్షణ, దేవాలయ ఉత్సవాలు అన్నీ ఆ ధనంతోనే జరుగుతున్నాయి. ఇలా అనుగ్రహింపబడింది కేవలం ప్రదోషం మామ ఒక్కరే. --- ‘లోకమాత’ 1996 దీపావళి ‘కల్కి’ విశిష్ట సంచిక నుండి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు. t.me/KPDSTrust #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1 556
13
لا يوجد نص...
1 681
14
కాలిన పాదాలు - కరక్కాయ లేపనం పరమాచార్య స్వామివద్దకు మౌళి మామ పరిగెత్తుకుంటూ వచ్చారు. మామ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఎలా భరించడం? అసలు ఎలా భరించడం? దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటనను ఇప్పుడు తలచుకున్నా మామ కళ్ళల్లో కన్నీటి ధార. అసలు ఎందుకు అలా జరిగింది? అలా జరుగుతుందని ఎలా అనుకోగలం? అందుకోసం, 1900 దశాబ్దం మొదట్లో తిండివనంలో జరిగిన సంఘటనను ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. శ్రీ కృష్ణమూర్తి అయ్యర్ స్వామినాథన్ అనే చిన్న పిల్లవాని జాతకం పరిశీలించి, ప్రపంచాన్ని సక్రమమైన మార్గంలో నడిపేందుకు వచ్చిన అవతారం అని అర్థం చేసుకున్నారు. ఆ పిల్లవాని పాదములను తాకి, నీళ్ళతో కడిగి, శుభ్రంగా తుడిచి, బాగా పరిశీలించి “అతి త్వరలోనే రాజులు, రారాజులు కూడా ఈ పాదాలను తాకలేరు” అని చెప్పారు. ఆ పిల్లవాని పాదాలలో ఎన్నో చక్రాల గుర్తులను చూశారు. ఈ బాలుడు జగద్గురువు అవుతాడు అని చెప్పారు. పరమాచార్య స్వామీ వారు ఉదయార్ పాల్యంలో మకాం చేస్తున్న సమయం. మహాస్వామి అప్పుడు వారు బాల సన్యాసి. వారు అనుష్టానం చేసుకుంటూ ఉండగా ఉదయార్ పాల్యం రాజు దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఆయన మంచి పండితుడు. స్వామివారు చేస్తున్నది నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆశ్చర్యంతో “మీరు సాక్షాత్ దైవ స్వరూపులు. మీ పాదాలలో చక్రాలు ఉన్నాయి” అన్నారు. అప్పటినుండి పరమాచార్య స్వామివారి పల్లకిని మోసే బోయీలు ఉదయార్ పాల్యం జమిందారి వాళ్ళే. వారిని పోషిస్తున్నది ఆ జమిందారిలే. శ్రీ కృష్ణమూర్తి అయ్యర్ గారు చెప్పినట్లు ఆ రాజు గారు కూడా పాదాలలోని చక్రాలను దర్శించుకొన్నారు కాని తాకలేకపోయారు. అది 1978 ఏప్రియల్ 14 లేదా 15. పరమాచార్య స్వామివారు తేనంబాక్కం నుండి యాత్ర మొదలుపెట్టారు. కాని ఆ యాత్ర ఎక్కడ ఎప్పుడు ఎలా ముగుస్తుందో ఎవ్వరికి తెలియదు. అది యాత్ర అని కూడా ఎవరికీ తెలియదు. ఎనభై ఏళ్ల ప్రాయంలో కేవలం శ్రీ చంద్రమౌళి మామ (కుళ్ళ), శ్రీ వేదపురి మామ, శ్రీ శ్రీకంఠన్ మామ ముగ్గురు సేవకులతో నడుతున్న యాత్ర అది. తెల్లవారుఝామున 3:45 అప్పుడు చిత్తూరు శివార్లలో గల థియోసాఫికల్ సొసైటి ప్రాంగణంలోకి వచ్చారు. మహాస్వామీ వారు పూజకోసం ఒక మామిడి చెట్టు క్రింద కూర్చున్నారు. సేవకుల భిక్షకై మౌళి మామ శ్రీకంఠన్ మామ మూడు కిమీ దూరంలో గల ఆగ్రహారానికి వెళ్ళారు. కొద్దిసేపటి తరువాత అంటే సుమారు పదకొండు గంటల సమయంలో వారి తిరిగి రాగా అసలు ఆ ప్రాంగణంలోకి వెళ్ళడానికి కూడా కుదరలేదు. చాలా మంది గుమిగూడి ఉన్నారు. అందరూ పరమాచార్య స్వామివారి చుట్టూ చేరి వారి పాదాలు తాకడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎవరో ఎవరికీ తెలిసినట్టు లేదు. కాని వారికి పట్టదు కదా! అక్కడే ఉన్న ఇద్దరు సేవకులకి వారిని నిలువరించడం చాలా కష్టంగా ఉంది. పరమాచార్య స్వామివారు కనీసం పాదుకలు కూడా వేసుకోకుండా, అంతటి ఎండలో ఆ ప్రాంగణాన్ని వదిలి హైవే మీదకు పయనమయ్యారు. అంతే! ఇద్దరు సేవకులు మహాస్వామి వారితో బయలుదేరిపోయారు. చివరి క్షణంలో అక్కడకు వచ్చిన మౌళి మామ, శ్రీకంఠన్ మామ భిక్షగా తెచ్చినదంతా అక్కడ వేసి, రిక్షా తీసుకుని మొత్తం సామాను అంతా పెట్టుకుని స్వామి దగ్గరకు పరిగెత్తారు. అది చైత్రమాసం అందులా చిత్తూరు జిల్లా కావడంతో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అంతటి ఎండలో మిట్టమధ్యాహ్నం పాదుకలు కూడా లేకుండా నడుస్తున్నారు స్వామివారు. న్యాయవాది జ్యోతిష్కులు శ్రీ కృష్ణమూర్తి అయ్యర్ ఏ పాదాలనైతే ఎవ్వరూ తాకలేరు అన్నారో, రాజులు - రాణులు కూడా కేవలం దర్శనం మాత్రమే చేసుకోగలరో, యోగులు సిద్ధులు కూడా తాకే అర్హత లేకపోవడంతో కేవలం ధ్యానం మాత్రమే చేయగల ఆ పాదాలు ఆ తారు రోడ్డుపై నడవడంతో కాలిపోయి బొబ్బలు లేచాయి. మకాం చిత్తూరు చేరుకుంది. మహాస్వామివారు ఒక కర్మాగారంలోకి నడిచారు. అక్కడ కొద్దిరోజులు బస చేశారు. రాత్రికి స్వామివారు “వేదపురి, కుళ్ళా మౌళిని పిలువు” అన్నారు. మౌళి మామ కరక్కాయని చక్కగా చూర్ణం చేసి లేపనంగా తయారుచేశాడు. పరుగు పరుగున వచ్చి ఎవరికి దొరకని ఆ పాదాల దగ్గర కూర్చున్నాడు. పరమాచార్య స్వామివారు కాళ్ళను బాగా చాపి “ఆ కరక్కాయ ముద్దని కాళ్ళకు రాయి” అని ఆదేశించారు. ఈ విషయం చెబుతూ ఇప్పుడు కూడా మామ మాటలు రాక గొంతు పూడుకుపోయి కళ్ళ నీరు పెట్టుకుంటాడు. ఏమి ఈ సేవకుల భాగ్యం. ఒక్క పుష్పం స్వామివారికి సమర్పించి చాంతాడంత కోరికలు కోరుకుంటాము. కాని వీళ్ళు కేవలం స్వామివారి సేవ చేసుకోవడమే మహాద్భాగ్యంగా తలుస్తున్నారు. ఆ పరమాచార్య సేవకులకు అనంతకోటి సాష్టాంగ నమస్కారాలు. ఆ పరమాచార్య సేవకులకు అంగప్రదక్షిణ నమస్కారాలు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
2 087
15
నా ప్రాణం కాపాడిన దేవుడు ఒకసారి చెంగల్పేట్ జిల్లా న్యాయలయ తనిఖీ కోసం చెన్నైనుండి హైకోర్టు న్యాయావాది ఒకరు వచ్చారు. మామూలుగా అతను చెయ్యవలసిన పనులు చాలా ఉంటాయి కనుక అతను ఒక నిర్దుష్టమైన ప్రణాలిక వేసుకుని వస్తుంటారు. అలా తనిఖీ కోసం వచ్చిన సందర్భంలో అతను త్వరగా చెన్నై వెళ్ళిపోవాలి. కనుక తనిఖీ తరువాత చెన్నై వెళ్తూ పరమాచార్య స్వామివారిని మాత్రం దర్శించాలని అనుకున్నారు. కావల్సిన ఏర్పాట్లు చేసి నేను కూడా వారితో పాటు కార్లో కాంచీపురంలోని శ్రీమఠానికి వెళ్ళాను. మహాస్వామి వారిని దర్శించుకున్నాము. స్వామివారు ఆ జడ్జితో మాట్లాడిన తరువాత అతణ్ణి కంచిలోని కొన్ని ముఖ్యమైన దేవాలయాలకు తీసుకుని వెళ్ళమని నాతో చెప్పారు. ఈ విషయం జడ్జితో చెప్పడానికి నేను భయపడుతున్నాను. అతను వెంటనే చెన్నై వెళ్ళిపోవాలి, కాని నేను మహాస్వామి వారి ఆజ్ఞను తృణీకరించలేను. చివరికి ఎలాగో విషయాన్ని చెప్పాను. ఆయన అన్యమనస్కంగానే ఒప్పుకున్నాడు. నేను ఆయన్ని కొన్ని దేవాలయాలకు తీసుకుని వెళ్ళాను. చివరికి రెండు గంటల ఆలస్యంగా జడ్జి చెన్నైకి బయలుదేరారు. అప్పటికే పెద్దగా గాలి వీస్తూ జోరుగా వర్షం పడుతోంది. మేము హైవే సమీపించగానే, గాలులకు రోడ్డుపై అడ్డంగా పడిన ఒక చెట్టుని తొలగిస్తున్న కొంతమంది కార్మికులని చూశాము. విషయం ఏంటని అడుగగా దాదాపు గంటన్నర క్రితం విపరీతంగా వీచిన గాలులకి ఆ పెద్ద చెట్టు పడిపోయిందని వెంటనే కొంతమంది కార్మికుల సహాయంతో దాన్ని తొలగించడానికి మొదలుపెట్టారని చెప్పారు. అప్పుడే మాకు స్వామివారి మాటల్లోని అంతరార్థం తెలిసింది. మేము మహాస్వామివారి మాటలు కనుక పెడచెవినపెట్టి బయలుదేరిఉంటే ఆ చెట్టు మాకారు పైన పడి ఉండేది లేదా మా ప్రయాణం కొబసాగించడానికి వీలు లేకుండా అక్కడ చిక్కుకుని ఉండేవాళ్ళం. స్వామివారి కారుణ్య పలుకుల వల్ల ఆరోజు మేము రక్షింపడ్డాము. ఈ విషయాన్ని నేను ఎప్పటికి మరచిపోలేను. --- పి.కె. రామనాథన్, చెన్నై - 24, మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 2 #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
2 207
16
అప్పు - ఆలస్యం నా కుమార్తె పెళ్ళికొరకు కొంత ధనం అవసరమై కాంచీపురంలోని ముదలియార్ గారిని అప్పు అడిగాను. తను నాకు ఇవ్వడానికి ఒప్పుకుని, ఫలానా రోజు మధ్యాహ్నం మూడుగంటలకు వచ్చి కలవాల్సిందిగా చెప్పాడు. నేను చెంగల్పేట్ నుండి బయలుదేరి అతను చెప్పిన రోజు కాంచిపురం చేరుకున్నాను. ఆయనను కలిసే ముందు ఒకసారి కంచి పరమాచార్య స్వామివారిని దర్శించుకుందామని శ్రీమఠానికి వెళ్ళాను. మద్యాహ్నం రెండుగంటలకే నాకు మాహాస్వామివారి దర్శనం లభించింది. అంతేకాక ఎప్పుడూ లేనిది మహాస్వామివారు ఆ ఎండలో తీరుబడిగా అన్ని విషయాలు నాతో ముచ్చటించడం మొదలుపెట్టారు. నా మనస్సంతా మూడుగంటలకు ముదలియార్ దగ్గరకు వెళ్ళాలని ఉంది. వెళ్ళడానికా స్వామివారు అనుమతి ఇవ్వట్లేదు. ఆఖరికి సాయింత్రం అయిదున్నరకి స్వామివారు నన్ను వెళ్ళనిచ్చారు. వెంటనే ముదలియార్ ఇంటికి పరుగులాంటి నడకతో చేరుకున్నాను. చెప్పిన సమయానికి రానందున అతను మనసు నొచ్చుకుని ఇస్తాడన్న డబ్బులు ఇవ్వడేమో అని మనసులో చాలా భయంగా ఉంది. భయం భయంగానే ఇంటి తలుపు తట్టాను. ఆయనే స్వయంగా తలుపు తీసి ప్రేమతో లోపలికి ఆహ్వానించాడు. ఆయన నాతో, “నేను నిన్ను మూడుగంటలకు రమ్మన్నాను. కాని నేను కొద్దిగా పనిఉండి బయటకు వెళ్ళి ఇదిగో ఇపుడే వచ్చాను. అంతేకాక పంచాగం చూస్తే ఈరోజు సాయింత్రం ఆరుగంటల దాకా సమయం మంచిది కాదు అని తెలిసింది. నిన్ను ఆరుగంటలకు రమ్మని చెప్పి ఉంటే బావుండేది అని అనుకున్నాను. కాని నీకై నువ్వే మంచి సమయానికి వచ్చావు. ఇప్పుడు ముహూర్తం కూడా భేషుగ్గా ఉంది. ఇప్పుడు తీసుకో నీకు అప్పుగా ఇస్తానన్న ధనం” అని అన్నారు. నన్ను ఎవరో తలపై గట్టిగా కొట్టినట్టు అనిపించింది. నాకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వకుండా పరమాచార్య స్వామివారు అంతసేపు నన్ను అక్కడ ఎందుకు ఉంచుకున్నారో ఇప్పుడు అర్థం అయ్యింది. --- పి.కె. రామనాథన్, చెన్నై-24. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 6 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు. t.me/paramacharyavaibhavam #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1 998
17
لا يوجد نص...
1 967
18
Vijaya Yatra of Shri Kanchi Kamakoti Peetadhipati Jagadguru Pujyashri Shankara Vijayendra Saraswati Shankaracharya Swamiji to
Vijaya Yatra of Shri Kanchi Kamakoti Peetadhipati Jagadguru Pujyashri Shankara Vijayendra Saraswati Shankaracharya Swamiji to New Delhi - Tentative SCHEDULE- 30thJune - 7th July 2026
1
19
దుప్పటి - దయ పరమాచార్య స్వామివారు సతారాలో మకాం చేస్తున్నారు. అది చలికాలం. స్వామివారు బాలు మామకి ఒక దుప్పటిని ఇచ్చి కుంబకోణం పట్టు పాట్టికి ఇవ్వమని చెప్పారు. కుంబకోణం పట్టు పాట్టి పరమాచార్య స్వామివారికి పెద్ద భక్తురాలు. ఆమెకు సంతానం లేకపోవడంతో ఆమెకున్న రెండు ఇళ్లనూ కంచి మఠానికి ఇచ్చివేసింది. ఆమె చాలా మంచి మనసు కలది. అందరితోనూ బాగా కలివిడిగా ఉండేది. ఆరోజు రాత్రే మహాస్వామివారు నిద్రనుండి మేలుకొని, బాలు మామని నిద్రలేపి దుప్పటిని పాట్టికి ఇచ్చావా? అని అడిగారు. బాలు మామ ఆ విషయం మరచిపోవడంతో అలా చూస్తూ నిలబడిపోయారు. వెంటనే వెళ్లి ఆమె ఎక్కడుందో వెతికి ఆమెకు దుప్పటి ఇమ్మని పరమాచార్య స్వామివారు ఆదేశించారు. అది మధ్యరాత్రి కావడంతో చలి చాలా తీవ్రంగా ఉంటుందని, బయటకు వెళ్ళడానికి బాలు మామ భయపడి ఉదయం ఇస్తానని చెప్పారు. “లేదు! ఇప్పుడే ఈ దుప్పటి తనకి చేరాలి. ఈ రాత్రి చాలా చలిగా ఉంది” అని చెప్పారు స్వామివారు. ఇక చేసేదిలేక ఆ రాత్రిలో ఆమెను వెతుకుతూ వెళ్ళారు బాలు మామ. వెతకగా వెతకగా చివరికి కబిలేశ్వర్ ఇంటి దగ్గర కనపడ్డారు పాట్టి. ఆమె చెలికి తాళలేక గజ గజ వణుకుతూ నేలపై పడుకుని ఉంది. మహాస్వామివారు ఎందుకు ఆ క్షణమే ఆ దుప్పటి ఇమ్మని చెప్పారో బాలు మామకు ఆపుడు అర్థం అయ్యింది. పాట్టి ఆ దుప్పటిని తీసుకోని కప్పుకుంది. జగద్రక్షకుని రక్షణలో ఉన్నట్టు తన్మయత్వం పొందింది పాట్టి. స్వామివారి కరుణ అపారం కదా! ఇలాంటి సంఘటన ఒకటి బాలు మామ జీవితంలో కూడా జరిగింది. ఇంతటి కరుణను స్వయంగా అనుభవించారు బాలు మామ. ఒకసారి తీవ్రమైన చలికాలంలో దేవాలయ ఆవరణంలో పడుకున్నారు బాలు మామ. కప్పుకోవడానికి దుప్పటి కూడా లేదు. ఉదయం నిద్రలేవగానే ఇంతటి తీవ్రమైన చలిలో ఇంత సుఖంగా పడుకున్నానేమిటా అని ఆశ్చర్యం వేసింది మామకి. చూడగా వారిపై ఒక శాలువా కప్పబడి ఉంది. ఎవరో మఠంలో ఉన్న తన తోటివారు ఎవరో కప్పి వెళ్ళుంటారని అనుకోని దాని విషయం మరచిపోయారు. నాలుగు రోజులు గడిచిపోయాయి. స్వామివారు బాలుమామ దగ్గరున్న శాలువా చూసి చాలా బావుందని అది ఎక్కడిదని అడిగారు. మఠంలోని వారే ఎవరో తనపై కప్పి వెళ్ళారని చెప్పారు బాలు మామ. అది విని స్వామివారు చిన్నగా నవ్వి, అది నేనే అన్నట్టుగా స్వామివారు చేతితో సైగ చేశారు. “ఆ చల్లని నేలపై పైవస్త్రం కూడా లేకుండా పడుకుని ఉన్నావు. మరి మీ అమ్మగారు నిన్ను అలా చూస్తే ఏమనుకుంటారు?” అని అన్నారు. పరమాచార్య స్వామివారి అపార కరుణ చలికాలంలో వెచ్చదనం, ఎండాకాలంలో నీడ, వర్షాకాలంలో గొడుగు వంటిది. మనల్ని మనం వారికి సమర్పించుకొని జీవితంలో సుఖసంతోశాలను పొందుదాం --- శ్రీ ప్రదోషం మామ గృహం ‘రేర్ జెమ్స్’ నుండి. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు. t.me/KPDSTrust #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
2 308
20
Video from Rajavikram Paruchuru
Video from Rajavikram Paruchuru
2 310