uz
Feedback
కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

Kanalga Telegram’da o‘tish

విరాళాలు పంపాల్సిన వివరాలు. A/C Name : Kanchi Paramacharya Dharmika Seva Trust ® A/C. No : 50200059599164 IFSC Code : HDFC0001753 Branch : HDFC Bank UPI ID : 7259859202@hdfcbank Gpay/Phone pay/BHIM/freecharge 7259859202

Ko'proq ko'rsatish

📈 Telegram kanali కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి) analitikasi

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి) (@kpdstrust) Telugu til segmentidagi kanali faol ishtirokchi. Hozirda hamjamiyat 16 680 obunachidan iborat bo'lib, Din & Maʼnaviyat toifasida 5 097-o'rinni va Hindiston mintaqasida 26 315-o'rinni egallagan.

📊 Auditoriya ko‘rsatkichlari va dinamika

невідомо sanasidan buyon loyiha tez o‘sib, 16 680 obunachiga ega bo‘ldi.

11 Iyun, 2026 dagi oxirgi ma’lumotlarga ko‘ra kanal barqaror faollikka ega. Oxirgi 30 kunda obunachilar soni -160 ga, so‘nggi 24 soatda esa -5 ga o‘zgardi va umumiy qamrov yuqori darajada qolmoqda.

  • Tasdiqlash holati: Tasdiqlanmagan
  • Jalb etish (ER): Auditoriya o‘rtacha 13.26% darajada jalb etiladi. Nashrdan keyingi dastlabki 24 soatda kontent odatda umumiy obunachilar sonining 5.51% ini tashkil etuvchi reaksiyalarni to‘playdi.
  • Post qamrovi: Har bir post o‘rtacha 2 211 marta ko‘riladi; birinchi sutkada odatda 919 ta ko‘rish yig‘iladi.
  • Reaksiyalar va o‘zaro ta’sir: Auditoriya faol: har bir postga o‘rtacha 0 ta reaksiya keladi.

📝 Tavsif va kontent siyosati

Muallif resursni shaxsiy fikrni ifoda etish maydoni sifatida ta’riflaydi:
విరాళాలు పంపాల్సిన వివరాలు. A/C Name : Kanchi Paramacharya Dharmika Seva Trust ® A/C. No : 50200059599164 IFSC Code : HDFC0001753 Branch : HDFC Bank UPI ID : 7259859202@hdfcbank Gpay/Phone pay/BHIM/freecharge 7259859202

Yuqori yangilanish chastotasi (oxirgi ma’lumot 12 Iyun, 2026 da olingan) sababli kanal doimo dolzarb va katta qamrovli bo‘lib qoladi. Analitika auditoriya kontent bilan faol hamkorlik qilishini, uni Din & Maʼnaviyat toifasidagi muhim ta’sir nuqtasiga aylantirishini ko‘rsatadi.

16 680
Obunachilar
-524 soatlar
-467 kunlar
-16030 kunlar

Ma'lumot yuklanmoqda...

O'xshash kanallar
Ma'lumot yo'q
Muammo bormi? Iltimos, sahifani yangilang yoki bizning qo'llab-quvvatlash boshqaruvchimizga murojaat qiling>.
Taglar buluti
Ma'lumot yo'q
Muammo bormi? Iltimos, sahifani yangilang yoki bizning qo'llab-quvvatlash boshqaruvchimizga murojaat qiling>.
Kirish va chiqish esdaliklari
---
---
---
---
---
---
Obunachilarni jalb qilish
Iyun '26
Iyun '26
+5
0 kanalda
May '26
+31
0 kanalda
Get PRO
Aprel '26
+24
0 kanalda
Get PRO
Mart '26
+6
0 kanalda
Get PRO
Fevral '26
+81
0 kanalda
Get PRO
Yanvar '26
+97
0 kanalda
Get PRO
Dekabr '25
+28
0 kanalda
Get PRO
Noyabr '25
+31
0 kanalda
Get PRO
Oktabr '25
+11
0 kanalda
Get PRO
Sentabr '25
+39
0 kanalda
Get PRO
Avgust '25
+21
0 kanalda
Get PRO
Iyul '25
+58
0 kanalda
Get PRO
Iyun '25
+89
0 kanalda
Get PRO
May '25
+31
0 kanalda
Get PRO
Aprel '25
+25
0 kanalda
Get PRO
Mart '25
+32
0 kanalda
Get PRO
Fevral '25
+29
0 kanalda
Get PRO
Yanvar '25
+79
0 kanalda
Get PRO
Dekabr '24
+65
0 kanalda
Get PRO
Noyabr '24
+40
0 kanalda
Get PRO
Oktabr '24
+39
0 kanalda
Get PRO
Sentabr '24
+32
0 kanalda
Get PRO
Avgust '24
+46
0 kanalda
Get PRO
Iyul '24
+96
0 kanalda
Get PRO
Iyun '24
+118
0 kanalda
Get PRO
May '24
+1 521
0 kanalda
Get PRO
Aprel '24
+49
0 kanalda
Get PRO
Mart '24
+92
0 kanalda
Get PRO
Fevral '24
+61
0 kanalda
Get PRO
Yanvar '24
+56
0 kanalda
Get PRO
Dekabr '23
+86
0 kanalda
Get PRO
Noyabr '23
+84
0 kanalda
Get PRO
Oktabr '23
+55
0 kanalda
Get PRO
Sentabr '23
+63
0 kanalda
Get PRO
Avgust '23
+37
0 kanalda
Get PRO
Iyul '23
+134
0 kanalda
Get PRO
Iyun '23
+497
0 kanalda
Get PRO
May '23
+159
0 kanalda
Get PRO
Aprel '23
+112
0 kanalda
Get PRO
Mart '23
+68
0 kanalda
Get PRO
Fevral '23
+56
0 kanalda
Get PRO
Yanvar '23
+122
0 kanalda
Get PRO
Dekabr '22
+96
0 kanalda
Get PRO
Noyabr '22
+70
0 kanalda
Get PRO
Oktabr '22
+63
0 kanalda
Get PRO
Sentabr '22
+56
0 kanalda
Get PRO
Avgust '22
+47
0 kanalda
Get PRO
Iyul '22
+258
0 kanalda
Get PRO
Iyun '22
+188
0 kanalda
Get PRO
May '22
+428
0 kanalda
Get PRO
Aprel '22
+535
0 kanalda
Get PRO
Mart '22
+2 079
0 kanalda
Get PRO
Fevral '22
+34
0 kanalda
Get PRO
Yanvar '22
+183
0 kanalda
Get PRO
Dekabr '21
+140
0 kanalda
Get PRO
Noyabr '21
+123
0 kanalda
Get PRO
Oktabr '21
+461
0 kanalda
Get PRO
Sentabr '21
+104
0 kanalda
Get PRO
Avgust '21
+192
0 kanalda
Get PRO
Iyul '21
+488
0 kanalda
Get PRO
Iyun '21
+791
0 kanalda
Get PRO
May '21
+491
0 kanalda
Get PRO
Aprel '21
+576
0 kanalda
Get PRO
Mart '21
+463
0 kanalda
Get PRO
Fevral '21
+12 911
0 kanalda
Sana
Obunachilarni jalb qilish
Esdaliklar
Kanallar
11 Iyun0
10 Iyun0
09 Iyun0
08 Iyun+3
07 Iyun0
06 Iyun0
05 Iyun0
04 Iyun+2
03 Iyun0
02 Iyun0
01 Iyun0
Kanal postlari
ధనవంతులైన అంధులు పరమాచార్యు స్వామివారు తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని పాపనాశంలో మకాం చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి చాలామంది వచ్చారు. చెన్నైకి చెందిన ఒక ధనవంతుడు స్వామివారు ఎక్కడ మకాం చేస్తే ,అక్కడికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవడం అలవాటుగా చేసుకున్నాడు. ఇప్పుడు పాపనాశానికి కూడా స్వామివారి ఆశీస్సులు పొందేందుకు వచ్చాడు. స్వామివారు మకాంచేసిన ప్రాంతం బయట అంధ దంపతులు ఒకరు, కళ్ళు లేని బిడ్డతో కలిసి భిక్షాటన చేస్తూ కూర్చున్నారు. ఆ ధనవంతుడు, వారు భిక్ష అడిగినందుకు కోపంతో వారిని దుర్భాషలాడాడు. అంతేకాక స్వామివారి ఆశీస్సులకోశం లోపలకు వెడుతూ వారిని తన్నాడు కూడా. స్వామివారి దర్శనం కోసం చాలా మంది ఉన్నారు. స్వామివారు ఆ ధనవంతుణ్ణి పట్టించుకోకుండా అందరికీ ప్రసాదం ఇచ్చేదాకా ఎదురుచూసేలాగా చేశారు. ఆ ధనవంతుడు స్వామివారి ముందు పళ్ళు, ఇతర వస్తువులుంచి నమస్కరించాగనే, స్వామివారు చాలా కోపంతో బయట ఉన్న భిక్షకులతో ప్రవర్తించిన తీరును ప్రశ్నించారు. “నేను ఏమీ ఇవ్వను అని ఒక్క మాట చెబితే సరిపోయేది. కానీ నీవు వారిని దుర్బాషలాడడమే కాకుండా ఆ గుడ్డివారిని తన్నావు. నీవు చేసిన ఈ పాపానికి నిష్కృతి లేదు" చెప్పారు స్వామివారు. ఆ ధనవంతుడు కన్నీళ్లతో స్వామివారికి సాష్టాంగం చేసి, క్షమాపణలు కోరుతూ, “నేను చాలా పెద్ద అపచారం చేశాను, నన్ను మన్నించి రక్షించండి” అని వేడుకున్నాడు. వెంటనే స్వామివారు కరుణతో, మృదుస్వరంతో “ఇక్కడే ఉన్న పాపవినేశ్వర స్వామిని సేవించి పూజించు. నీ పాపానికి పరిహారం పొందు" అని చెప్పారు. ఆ రోజు రాత్రి కలలో అతనికి స్వామివారు పాపవినేశ్వరునిగా దర్శనమిచ్చి, "ఆ అంధ కుటుంబానికి నీ వంతుగా సాధ్యమైనంత సహాయం చెయ్ – అదే నీకు మోక్షాన్ని ఇస్తుంది" అని చెప్పారు. తర్వాత ఉదయం ఆ ధనవంతుడు వెళ్లి, ఆ అంధ కుటుంబం చేతులు పట్టుకుని రోదించాడు. "నేను మహా పాపం చేశాను. మీరు ముగ్గురికీ చూపు వచ్చేందుకు శస్త్రచికిత్స చేయిస్తాను. నన్ను ఈ పని చేయమని సాక్షాత్తు ఆ పాపవినేశ్వరుడే ఆదేశించాడు” అంటూ అప్పటికప్పుడు వారికి 20 లక్షల రూపాయల చెక్కును ఇచ్చి తిరస్కరించకండి అని బ్రతిమలాడాడు. తర్వాత వారిని చెన్నైకి తీసుకెళ్లి తన ఇంట్లోనే ఉంచుకుని, శస్త్రచికిత్స చేయించాడు. స్వామివారి అనుగ్రహం వల్ల వారికి చూపు లభించింది. ఇప్పుడు వారు ఈజిప్టులో ఉన్నారు. స్వామివారి అపార కరుణ వల్ల ఒక అంధ, పేద కుటుంబం, చూపును పొంది ధనవంతులుగా మారిపోయారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు. t.me/KPDSTrust #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

2
Matn yo'q...
1 083
3
1986 ఫిబ్రవరి 26న కాసులమాల సమర్పణ ఎంతో వైభవంగా జరిగింది. నాన్నగారు కూడా కొంతసేపు పాల్గొన్నారు. మా అమ్మ కార్యదర్శి హోదాలో ఆ రోజు ఉదయం నుండి కార్యక్రమాన్ని నిర్వహించి, సాయంత్రం సమావేశంలో నివేదికను సమర్పించారు. ‘కర్పగం సువాసిని సంఘం’ తరపున అమ్మవారి కాసులమాల, దానికి సంబందించిన పత్రాలు భద్రపరచడం, ఒక కోసం గోద్రేజ్ అల్మరాని సమర్పణ చేశారు. ఇప్పటికీ ప్రతీ శుక్రవారం నాడు, పౌర్ణమి రోజున, మరియు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 26న, అమ్మవారు ఈ కాసులమాల ధరించి దర్శనమిస్తారు. 1986 మార్చి 13న, మా నాన్నగారు ఎటువంటి ఇబ్బంది పడకుండా అమ్మవారి సన్నిధికి వెళ్లిపోయారు. పరమాచార్య స్వామివారి కృపను, దయను మాటలలో వివరించలేం. డాక్టర్లు కూడా ఆశ వదిలేసిన సమయంలో స్వామివారే మరలా మా న్నానగారికి జీవితం ఇచ్చారు. మా అమ్మగారు తన సేవను, బాధ్యతను పూర్తిచేయగలిగేలా, మరికొన్ని రోజులు అందరమూ ఆనందంగా గడిపేలా చేశారు. ఇప్పటికీ మా కుటుంబం, బంధువులు, మిత్రులు ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ, స్వామివారి కృపను స్మరిస్తూ ఉంటాము. --- గౌరి సుకుమార్ అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు. t.me/KPDSTrust #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1 175
4
కర్పగాంబాళ్ బంగారు కాసులమాల చెన్నై మైలాపూర్ లో వెలసిన ప్రసిద్ధ కర్పగాంబాళ్ కపాలీశ్వర ఆలయం గురించి అందరికీ తెలిసిందే. 1950 సంవత్సరం నుండే అమ్మ అమ్మగారు శ్రీమతి ఆనందవల్లి మరియు ఇతర స్నేహితులతో కలిసి ప్రతిరోజూ ఈ ఆలయంలో లలితా సహస్రనామ పారాయణం చేసేవారు. ఆ సమూహానికి శ్రీమతి ముత్తులక్ష్మీ అమ్మాళ్ నాయకురాలు. ఈ బృందాన్ని "కర్పగాంబాళ్ సహస్రనామ గోష్ఠి" అని పిలిచేవారు. ముత్తులక్ష్మీ అమ్మాళ్ గారిని అందరూ “గురు పాటి” అని పిలిచేవారు. మా అమ్మగారు ఆ బృందానికి కార్యదర్శిగా వ్యవహరించేవారు. వారు రోజూ సహస్రనామం పారాయణం చేయడమే కాకుండా పండుగ సమయాల్లో ఆలయ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవారు. 1970లో ఒక రాత్రి గురుపాటి గారికి కలలో కర్పగాంబాళ్ అమ్మవారు దర్శనం ఇచ్చి, "మీరు ప్రతిరోజూ నా కోసం సహస్రనామం పారాయణ ఛేస్తున్నారు కదా, నాకు బంగారు సహస్రనామ కాసులమాల కావాలి. విశాలాక్షి, కామాక్షిలా నన్ను కూడా అలంకరించండి. మీరు చేయగలరా?" అని అడిగింది. గురుపాటి గారు కల గురించి గోష్ఠిలో చెప్పగా, అందరూ ఎంతో ఆనందంతో ఆ బంగారు కాసులమాల తయారీకి సమ్మతించారు. అనేకమంది భక్తుల నుంచి విరాళాలు సేకరించి తయారు చేయాలని నిర్ణయించారు. సంవత్సరాలు గడుస్తున్నా కానీ, ఆ మధ్యతరగతి మహిళల సమూహం తయారీకి కావలసిన మొత్తాన్ని సేకరించలేకపోయారు. కొంతమంది సూచించడంతో, 1978లో గురుపాటి గారు, మా అమ్మగారు తదితరులు పరమాచార్య స్వామివారి మార్గదర్శనం కోసం కాంచీపురం మఠానికి వెళ్ళారు. వారు దర్శనం కోసం ఎదురు చూస్తుండగా, మఠంలో పని చేస్తున్న వ్యక్తి వచ్చి “స్వామివారు పిలుస్తున్నారు. వెంటనే లోపలికి వెళ్లండి” అన్నారు. లోపలికి వెళ్లగానే స్వామివారిని చూసి ఆనందపరవశులయ్యారు. వీరు ఏమీ మాట్లాడక ముందే, “కాసులమాలకి బంగారం, డబ్బు తక్కువ పడిందా?” అని స్వామివారు ఆడగగానే వీరు ఆశ్చర్యపోయారు. “దిగులుపడకండి. అమ్మే అడిగింది కాబట్టి, అమ్మే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. విశాలాక్షి అమ్మవారికి, కామాక్షి అమ్మవారికి, కాసులమాలలు ధనవంతుల సహాయంతో తయారు అయ్యాయి. కానీ కర్పగాంబాళ్ అమ్మవారి కాసులమాల భక్తితో తయారవుతుంది.” అని స్వామివారు అభయమిచ్చారు. “మీ బృందానికి 'కర్పగం సువాసిని సంఘం' అని పేరు పెట్టి ఎక్కువగా సువాసిని పూజలు, బాల పూజలు నిర్వహిస్తూ ఉండండి.” అని ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చారు. స్వామివారి ఆదేశాన్ని ఖచ్చితంగా పాటించడంతో, బంగారం, డబ్బు విరివిగా సమకూరాయి. 1982లో బంగారు సహస్రనామ కాసులమాల తయారీ ప్రారంభమైంది. ఈ బాధ్యతను ‘వుమ్మిడి బంగారు కణ్ణన్’ గారికి అప్పగించారు. ప్రతి బంగారు నాణెం, ఒకవైపు అమ్మవారి నామంతో, మరొకవైపు ఆలయ చిహ్నం – వెనుకవైపు అమ్మవారు, ముందువైపు శివలింగాన్ని ఆరాధిస్తున్న నెమలితో రూపొందించారు. కాసులమాల తయారీ పురోగతిని ఎప్పటికప్పుడు కంచి మఠం ద్వారా మహాస్వామి వారికి తెలియజేస్తున్నారు. స్వామివారు మఠం వేద పాఠశాల నుండి కొంతమంది పండితులను పంపి కాసులమాలలో లిఖిస్తున్న అమ్మవారి నామాలు, వాటి వరుస క్రమాన్ని పరిశీలించారు. ఈ గొప్ప కార్యక్రమానికి, హిందూ ధార్మిక బోర్డు, కొంతమంది ఆలయ కమిటీ సభ్యులు, పనీపాటా లేని కొన్ని సామాజిక సంఘాలు మరియు సంఘ వ్యతిరేక శక్తుల రూపంలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి. కానీ స్వామివారి ఆశీస్సుల వల్ల మరియు మేనేజింగ్ డైరెక్టర్ సుగవనేశ్వరర్, తక్కర్ కుప్పుస్వామి, ప్రధాన అర్చకులు విశ్వనాథ శివాచార్యులు, న్యాయవాది కృష్ణస్వామి వారల సహాయంతో కాసులమాల తయారీ పూర్తయ్యింది. 1986 ఫిబ్రవరి 26న ఈ లలితా సహస్రనామ బంగారు కాసులహారాన్ని కర్పగాంబాళ్ అమ్మవారికి సమర్పించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి వివేక్ & కో నిర్వాహకులుగా వ్యవహరించాలని ఆదేశించారు. అయితే 1986 జనవరి 20న, మా నాన్నగారికి ఆరోగ్య సమస్యలు వచ్చి, ఆసుపత్రిలో చేర్చారు. ఆయన స్పృహ కోల్పోయి, చేతులు, కాళ్లు కదలకుండా పోయాయి. డాక్టర్లు కూడా నమ్మకం లేక, "ఇక 48 గంటల కంటే ఎక్కువ జీవించలేరు" అని తేల్చేశారు. అమ్మ మానసికంగా పూర్తిగా విచలితమై, పూజ గదిలో ప్రార్థనలో నిమగ్నమయ్యారు. గురుపాటి గారు ఇతర సభ్యులు, వుమ్మిడి కణ్ణన్, వివేక్ గారు అందరూ కలిసి పూర్తయిన కాసులమాల తీసుకుని స్వామివారికి చూపించడానికి కంచి మఠానికి వెళ్లారు. వారిని చూసి, "మీ కార్యదర్శి ఎందుకు రాలేదు?" అని అడిగారు స్వామివారు. బాధతో మా నాన్నగారి పరిస్థితిని వివరించగా, స్వామివారు మాలను చూసి, "ఈ మాల బాగా తయారయ్యింది. అమ్మవారికి ఈ మాల సమర్పించటప్పుడు మీ కార్యదర్శి కూడా ఉంటారు. భయపడకండి!" అని ప్రసాదం ఇచ్చారు. వారందరూ నేరుగా మా ఇంటికి వచ్చి ఈ శుభవార్త చెప్పారు. ఎంతటి అద్భుతం! అదే సమయంలో ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది – మా నాన్నగారు స్పృహలోకి వచ్చి బాగానే ఉన్నారు! వైద్యులు ఆశ్చర్యపోయి “ఏదో అద్భుతం జరిగింది” అన్నారు. నాన్నగారు మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యి, స్వయంగా నడుచుకుంటూ ఇంటికి వచ్చారు.
1 007
5
మా నాన్న కూడా ఇదే చెప్పారు ఒకసారి పరమాచార్య స్వామివారి దర్శనానికి ఒక ధనికుడు వచ్చాడు. స్వామివారు ఆజ్ఞాపిస్తే ఎడియానా ధార్మిక కార్యక్రమానికి తను ధనం ఇవ్వడానికి సిద్ధం అని తెలిపాడు. అందుకు స్వామివారు, “ఇంట్లోని పెద్దలతో మంచిగా ప్రవర్తించు, నీ భార్యను ప్రేమించు, సాధ్యమైనంత వరకు చెడ్డ పనులు చెయ్యొద్దు. అది చాలు” అన్నారు. శ్రీమఠానికి ధనం ఇవ్వమని చెబుతారేమో స్వామివారు అనుకుంటున్న ఆ ధనికుడు, స్వామివారు మాటలు విని ఆశ్చర్యపోయాడు. మఠానికి ఏమీ కోరకుండా పూర్తిగా వేరే విషయాన్ని చెప్పారు. ‘నేను స్వామివారితోనే ఉండి నా నుండి స్వామివారు ఏదైనా అడిగేలా చెయ్యాలి’ అని మనసులో అనుకున్నాడు. “నేను స్వామివారు చెప్పినట్లే చేస్తున్నాను; ఇకముందు కూడా అలాగే చేస్తాను. మీరు ఇంకా ఏదైనా చెయ్యమని చెప్పినా, దాన్ని కూడా చెయ్యడానికి సిద్ధం” కొద్దిసేపు మౌనం తరువాత, “మీకందరకూ ‘అయ్యనార్’ కులదైవం. దేవాలయం ముందర ఉన్న సిమెంటు గుర్రపుబొమ్మ పాతదైపోయింది. దాన్ని బాగుచేయించి, రంగులు వేయించి తరువాత దేవాలయానికి కుంభాభిషేకం చేయించు”. ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు. “అవును స్వామి, చనిపోయే ముందు మా నాన్న సరిగ్గా ఇదే పని చెయ్యమని చెప్పారు. దాని గురించి నేను పూర్తిగా మర్చిపోయాను. మా నాన్న ఏం చెప్పారో స్వామివారి కూడా సరిగ్గా అదే చెప్పారు, ఇది ఎలా సాధ్యం?” అవును, అది నిజం. మరి ఎలా? బహుశా అతని తండ్రి స్వర్గానికి వెళ్లిపోయే ముందు స్వామివారికి చెప్పాడేమో! ఎంతో ఆనందంతో ఆ ధనవంతుడు స్వామివారి ఆజ్ఞని పాటించాడానికి వెళ్లిపోయాడు. --- శ్రీమఠం బాలు మామ. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1 286
6
అప్పుడు వర్షం పడింది కొన్ని దశాబ్ధాల క్రితం కంచి పరమాచార్య స్వామివారు శిష్యులతో కలిసి బళ్ళారిలోని హగరి నదీతీరంలో చాతుర్మాస్యం చేస్తున్నారు. ఆ సమయంలో బళ్ళారి జిల్లా రైతులు వర్షాభావ పరిస్థితులవల్ల తీవ్రమైన నీటి ఎద్దడిని అనుభవిస్తున్నారు. విత్తనాలు వేయడానికి, చివరికి తాగడానికి కూడా నీరులేని పరిస్థితి. కర్ణాటక రాష్ట్రంలోని బళారి జిల్లాలో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. రైతులందరూ కలిసి పరమాచార్య స్వామి వద్దకు వెళ్ళి తమని ఎలాగైనా ఈ నీటి ఎద్దడి నుండి కాపాడాలని వేడుకున్నారు. వారి దీనస్థితిని చూసి స్వామివారు చలించిపోయారు. మంచి వర్షం కురవడం కోసం ‘వరుణ జపం’ చెయ్యించమన్నారు. ఇరవైనాగు గంటలపాటు ఏకధాటిగా వరుణజపం చేయించామని కాని ఏమి లాభం లేదని వాపోయారు. ఇంకా వారు స్వామితో “మీరు ఆశీర్వదిస్తే మరలా మేము వరుణ జపం చేయిస్తామని కోరగా, ప్రపంచ మానవాళీ క్షేమం కోసం చేసే ఇలాంటి వైదిక శాస్త్ర క్రతువులకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని స్వామివారు చెప్పారు. వెంటనే ఇరవైనాలుగు గంటలపాటు ‘వరుణ జపం’ చెయ్యమని అలాగే దాంతోపాటు ‘పంచాక్షరి జపం’ కూడా చెయ్యండని ఆజ్ఞాపించారు. స్వామివారు చెప్పినట్టుగా చేయించారు. అద్భుతాలకే అద్భుతం. కన్ను మిన్ను కానని వర్షం పడింది. అకాశం భూమి ఏకమైందా అన్నట్టుగా వర్షం కురిసింది. రైతులందరూ చాలా సంతోషపడ్డారు. పరమాచార్య స్వామివారి మహిమలని కొనియాడుతూ ఆనందంతో నృత్యం చెయ్యడం ఆరంభించారు. వారి ఆనందం ఉప్పొంగగా “బోలో స్వామిజికి జై హర హర మహదేవ” అంటూ గట్టిగా అంటున్నారు. విన్నవెంటనే అక్కడున్న వారందరికి రోమాంఛితమై మొత్తం అందరూ భక్తి వానలో తడిసిపోయారు. ఇలా వర్షాలు పడడం, స్వామివారి మహిమ దావానంలా మొత్తం బళ్ళారి జిల్లా అంతా వ్యాపించింది. పరమాచార్య స్వామిని దర్శించి ఆశీస్సులు పొందడానికి మొత్తం కర్ణాటక రాష్ట్రం నలుమూలల నుండి తండోపతండాలుగా భక్తులు రావడం ప్రారంభించారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1 442
7
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1 699
8
ఇడ్లీలు - బ్రహ్మానుభూతి తిరుచిరాపల్లి భిక్షందర్ దేవాలయలో ఉండే మా మావయ్య కీర్తిశేషులు శ్రీ సుందరేశ్వర అయ్యర్ ఒకసారి తిరువణ్ణామలై వెళ్లారు. దేవాలయంలో దర్శనం చేసుకుని రమణ మహర్షుల దర్శనం కోసం రమణాశ్రమానికి వెళ్లారు. బహుశా 1940 లేదా 1945 సమయం అప్పుడు అనుకుంటా. భగవాన్ రమణుల గురించి ఎంతో విన్నారు కానీ వారిని మొదటిసారిగా దర్శించుకోబోతున్నారు. భగవానులు అందరితో కలసి ఫలహారము, భోజనం చెయ్యడం చూసి ఆశ్చర్యపోయారు. రమణులు ఇడ్లీలు తినడం చూసి అమితాశ్చర్యానికి లోనయ్యారు. భగవాన్ రమణులు భక్తులకు దర్శనం ఇవ్వడానికి హాలులోకి రాగానే, మా మావయ్య కూడా అందరితోపాటు కూర్చున్నారు. అప్పుడు మా మావయ్యకి ఒక ఒళ్ళు జలదరించే అద్భుతం జరిగింది. రమణుల కళ్ళు మా మావయ్య కళ్ళతో కలిశాయి. వెంటనే మా మావయ్య శరీరం తేలిక అయ్యింది. చాలా ఆనందం కలిగింది. వెంటనే బాహ్యస్మృతిని కోల్పోయారు. కొద్దిసేపటి తరువాత భగవాన్ రమణులు చూపు తిప్పుకోవడంతో మరలా స్మృతి కలిగింది. చుట్టూ ఏం జరుగుతోందో తెలియక, బాహ్యస్మృతి కోల్పోయి అలా ఎంతసేపు ఉన్నారో కూడా వారికి అర్థం కాలేదు. ఇదంతా వారికి చాలా గందరగోళంగా ఉంది. ఎవర్నైనా అడిగి తెలుసుకోవాలనుంది - కానీ ఎవరిని అడగాలి? చివరకు పరమాచార్య స్వామివారిని అడిగి నివృత్తి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. వెంటనే వెళ్ళి మహాస్వామి వారిని దర్శనం చేసుకున్నారు. స్వామివారు విశ్రాంతిగా ఉన్నప్పుడు వారి వద్దకు వెళ్ళి, స్వామివారి పాదాలపై పడి తమ తాతగారి పేరు (శ్రీ నారాయణ అయ్యర్), తండ్రిగారి పేరు (శ్రీ గణపతి అయ్యర్), అమ్మగారి పేరు (శ్రీమతి ఈశ్వరి) చెప్పి, వారి మేనమామ గారైన శ్రీ పైంగానాడు పంచపకేశ అయ్యర్ (పరమాచార్య స్వామివారు మహేంద్రమంగళంలో చదువుకుంటున్నప్పుడు, స్వామివారికి ఋగ్వేదం బోధించినవారు) గారి పేరు చెప్పి, చివరగా తమ పేరు చెప్పి నమస్కరించారు. తరువాత వారికి కలిగిన అనుభవాన్ని చెప్పారు. “ఇటీవలే తిరువణ్ణామలై వెళ్ళాను” స్వామివారు చురునవ్వుతో, “స్వామీ దర్శనం చేసుకున్నావా?” అని అడిగారు. మేమందరమూ “స్వామీ” అని కొలుచుకునే దేవుడు, భగవాన్ రమణులను “స్వామీ” అని సంబోధిస్తూ “స్వామీ” దర్శనం చేసుకున్నవా అని మా మావయ్యని అడిగారు!!! “హా చేసుకున్నాను” “ఏమి? ‘హా చేసుకున్నాను’ అని అంటున్నావు? ఏం జరిగింది?” మా మావయ్య ఏదో చెప్పాలనుకుంటున్నారని, కానీ చెప్పడం సరియా? కాదా? అని శంసయిస్తున్నారని స్వామివారికి తెలుసు. అందుకనే చెప్పమని స్వామివారు ప్రోత్సహిస్తున్నారు. మావయ్య : “లేదు... భగవానుల దర్శనం చేసుకున్నాను. దర్శనం బాగా జరిగింది. వారు అందరితో కూర్చుని భోజనం కూడా చేశారు. . .” స్వామివారు : “అందరితోపాటు తిన్నారు . . .” ఎందుకు దీర్ఘం తీస్తున్నావు? ఎందుకంటే రమణులు ఇడ్లీలు కూడా తిన్నారని కదూ? అందుకేనా? స్వామివారికి తెలియని విషయం ఏదైనా ఉందా? వారి సందేహాన్ని స్వామివారు గ్రహించారు. మావయ్య : “అవును. అవును... తిన్నారు... ఇడ్లీలు తిన్నారు...!” స్వామివారు : “కనుక నీకు అనిపించింది. ‘ఏమిటిది? కంచి మఠంలో స్వామివారు ఇడ్లీలు తినరు, కానీ ఇక్కడ రమణులు ఇడ్లీలను తింటున్నారు’ అవునా?” మావయ్య : “అవును... స్వామీ” స్వామివారు చిరునవ్వుతో చెప్పడం మొదలుపెట్టారు. “రమణులు అన్నీ ఆశ్రమ పరిధులను దాటిపోయారు. వారికి మఠము, నియమము, పరిధి లేవు. కానీ ఇక్కడ అలా కాదు. ఈ మఠానికి సాంప్రదాయాలున్నాయి. నియమాలున్నాయి, హద్దులున్నాయి. మరియు నాకు వాటినాన్నిటిని పాటించి పాలించాలసిన బాధ్యత ఉంది. అందుకే ఇక్కడ ఇడ్లీలు తినరు (తమని చూపుతూ చిరునవ్వుతూ). అర్థమైందా?” మావయ్య : “హా...” తలూపారు మా మావయ్య. స్వామివారు : “సరే. అక్కడ ఇంకేం జరిగింది?” మావయ్య : “మేము సాయంత్రం మహర్షుల దర్శనానికి వెళ్లాము. అప్పుడు నేను రమణుల వైపే తీక్షణంగా చూస్తున్నాను. హఠాత్తుగా వారు నావైపు చూశారు. వారి చూపు నా కళ్ళల్లోకి పడగానే, నాకు ఏదో జరిగింది. నా స్మృతిని కోల్పోయాను. నా శరీరం తేలికైపోయింది. చాలా అద్భుతమైన అనుభవం. అలా ఎంతసేపు ఉండిపోయానో నాకు తెలియలేదు. హఠాత్తుగా నాకు బాహ్యస్మృతి పొందగానే రమణులు వేరేవైపు చూస్తున్నారు...” స్వామివారు : “అంటే, ఏం జరిగిందో నీకు తెలియదు అంటావు?” మావయ్య : “అవును” స్వామివారు : “అంతేకాక, ఎవరికైనా ఆ స్థితి శాశ్వతంగా ఉండిపోవాలని అనుకుంటున్నావు, కదూ?” మావయ్య : “అవును” స్వామివారు చిన్నగా నవ్వారు. కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. తరువాత నిదానంగా చెప్పనారంభించారు. “రమణులు కొద్దిసేపు నీ మనస్సును లేకుండా చేశారు. మనస్సు లేకపోతే, మనస్సు లుప్తమయిపోతే, ఇక ఉండేది ఆనందం మాత్రమే. అటువంటి శాశ్వత ఆనందాన్ని నీకు కాస్త రుచి చూపించారు. నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి వారి దర్శనం చేసుకో” మా మావయ్య స్వామివారికి సాష్టాంగం చేసి నమస్కరించి ఊరికి వెళ్ళిపోయారు. తరువాత, ఎన్నోసార్లు భగవాన్ రమణుల దర్శనం చేసుకున్నారు. ఈ సంఘటనను మా మావయ్య ఎన్నోమార్లు చెబుతూ, ప్రతిసారీ ఆ బ్రహ్మానంద అనుభవాన్ని పొందేవారు. --- విశి నాథన్
1 727
9
మహాస్వామివారు పద్యాన్ని చదివి కన్నదాసన్ తో “నువ్వు చెప్పినది కేవలం శేషాద్రి స్వామివారికి మాత్రమే సరిపోతుంది. ఆయనే తురువణ్ణామలై అర్ధనారీశ్వరుడు. ఆయనే సత్పురుషుడు, మహామనీషి” అని అన్నారు. ”సనాత ధర్మ వైభవాన్ని గురించి మనస్పూర్తిగా రాయి” అని ఆశీర్వదించి పంపారు. అప్పుడే కన్నదాసన్ మనసులో బీజం పడింది. అది చిగురించి, చిన్న మొక్కై, మహావృక్షమై మహత్తరమైన “అర్థముల్లా హిందు మతం; అర్థవంతమైన హిందూ మతం” అనే పుస్తకమై వర్ధిల్లింది. [పూర్వీకులు చేసిన పుణ్యం మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. మరి వింతపోకడలతో స్వధర్మాన్ని ఆచార వ్యవహారాలని మంటగలిపి పాశ్చాత్య సంస్కృతికి బానిసలవుతున్న వారి వంశాలని, ముందు తరాలని కాపాడేది ఎవరు? ఏ పుణ్యం చూపించి భగవంతుడు నిన్ను కాపాడుతాడు. అందుకే ‘కురు పుణ్య మహోరాత్రం’ అన్నారు శంకరులు.] అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు. t.me/KPDSTrust #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1 619
10
నాస్తికుడు ఆస్తికుడైన వేళ చిత్రనిర్మాత సాండొ చిన్నప్ప దేవార్ మరియు ప్రఖ్యాత తమిళ కవి కన్నదాసన్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఒక సినిమా షూటింగ్ నిమిత్తం కార్లో వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. దేవార్ చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నాడు కాని కన్నదాసన్ మాత్రం తీవ్రమైన గాయాలతో స్పృహ కోల్పోవడంతో మాద్రాసులోని ఆసుపత్రిలో చేర్పించారు. దేవార్ కు పరమాచార్య స్వామి అంటే అమితమైన భక్తి. వెంటనే తేనంబాక్కం శివస్థానంలోని బ్రహ్మపురీశ్వర దేవస్థానంలో మకాం చేస్తున్న మహాస్వామి వారిని దర్సించుకోవడానికి వెళ్ళాడు. “ఒక ప్రమాదం జరిగింది” అని స్వామితో చెప్పాడు దేవార్. వెంటనే స్వామివారు “కన్నదాసన్ ఎలా ఉన్నాడు?” అని అడిగారు. తను ఏమి చెప్పకనే మహాస్వామివారు కన్నదాసన్ ఎలా ఉన్నాడు అని అడగటంతో దేవార్ ఆశ్చర్యపోయారు. ప్రమాదం నుండి తను ఎలా బయటపడ్డాడు, కన్నదాసన్ ఎలా తీవ్రంగా దెబ్బతిని అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరాడు అన్న విషయమంతా స్వామివారికి విన్నవించాడు. దేవార్ ఆత్రుతని గమనించి మహాస్వామి వారు “దిగులు పడకు ఏమి పరవాలేదు” అని అతణ్ణి సముదాయించారు. ఆస్పత్రిలో ఉన్న కన్నదాసన్ నుదుటిపైన విభూతి పెట్టి, కొద్దిగా నోట్లో వేసి మిగిలిన దాన్ని దిండు కింద ఉంచమని స్వామివారే స్వయంగా విభూతిని పొట్లం కట్టి ఇచ్చారు. దేవార్ సంకోచిస్తూ విభూతిని అందుకున్నాడు. ఎందుకంటే కన్నదాసన్ పరమ నాస్తికుడు. దైవాన్ని నమ్మేవాడు కాదు. అప్పటికే కన్నదాసన్ ద్రావిడ పార్టీల నాస్థిక కార్యకలాపాల్లో, వాటి వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. బ్రాహ్మణుల గురించి, సనాతన ధర్మం గురించి చాలా చెడుగా మాట్లాడేవాడు. నిజానికి ప్రమాదం జరగడాని వారం రోజులముందు కూడా కంచిలోని శంకర మఠం ఎదురుగుండా జరిగిన ఒక సభలో శంకరాచార్యుల (కంచి పీఠాధిపతుల) చిత్తరువును అవమానపరిచాడు. మరి ఇప్పుడు అటువంటి వ్యక్తికి ఈ విభూతి ఎలా ఇచ్చేది అని ఆలోచిస్తున్నాడు దేవార్. ఆ త్రికాలజ్ఞాని దేవార్ పరిస్థితిని అర్థం చేసుకుని దేవార్ తో ఇలా అన్నారు. ”ఏమి అనుమానపడకుండా వెళ్ళి కన్నదాసన్ నుదుటన ఈ విభూతి పెట్టు. చిన్న మేఘం కాసేపు సూర్యుణ్ణి అడ్డుకున్నట్టు, ఈ నాస్తికత్వం అతణ్ణి అడ్డుకుంది. ఇప్పటి నుండి అతను సూర్యునివలె ప్రకాశిస్తాడు. వారి పూర్వీకులు ఎంతటి మహాత్ములో నీకు తెలుసా? వారి ముత్తాత కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని పునరుద్ధరించారు. వారి తాత కంచి ఏకాంమ్రేశ్వర దేవస్థానాన్ని పునరుద్ధరించారు. వారి తండ్రి కంచి కామాక్షి అమ్మవారి దేవస్తానాన్ని పునరుద్ధరించారు. అతను దేవాలయలాను సంరక్షించే మాహానుభావుల వంశంలో జన్మించాడు. ఇప్పుడు నీకు అర్థమైందా?” దేవార్ ఆస్పత్రికి వెళ్ళి స్వామివారు చెప్పినట్టు చేసాడు. స్వామివారు ఇచ్చిన విభూతిని కన్నదాసన్ నుదుటన పెట్టి కొంచం నోట్లో వేసి, మిగిలినదాన్ని దిండు కింద పెట్టాడు. అప్పుడు సాయం సంధ్యా సమయం. తమిళ సాహిత్యానికి రాజైన కవి అరసు(కవి రాజు) కన్నదాసన్ ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. దేవార్ విశ్రాంతి కొరకై రాత్రికి ఇంటికి వెళ్ళి తన స్నేహితుణ్ణి చూడాలని ఉదయాన్నే మరలా వచ్చాడు. స్పృహలోకొచ్చిన కన్నదాసన్ కు ఏమి చెప్పాలా అని అలోచిస్తూ రాత్రి అంతా గడిపాడు. మరుసటి రోజు ఆసుపత్రికి రాగానే కన్నదాసన్ స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి అలాగే మంచంపై పడుకుని ఉండడం చూసి ఆనందపడ్డాడు. “నేను ఎన్ని రోజులనుండి ఈ ఆసుపత్రిలో ఉన్నాను? నా మొహం చూసుకోవాలి అద్దాన్ని తీసుకుని రా” అని చెప్పాడు. దేవార్ ఆద్దం తెచ్చిచ్చాడు. అద్దంలో తన మొహాన్ని, నుదుటిపై ఉన్న విభూతిని చూసి అతను కోప్పడలేదు. బదులుగా ఎవరు పెట్టారు అని అడిగాడు. దేవార్ కొంచం ధైర్యం తెచ్చుకుని తను పరమాచార్య స్వామిని కలవడమూ, వారి అతణ్ణి అనిగ్రహించడమూ మొదలగు అన్ని విషయాలు కన్నదాసన్ కు చెప్పాడు. అంతా వినగానే కన్నదాసన్ కన్నీళ్ళపర్యంతం అయ్యాడు. “నన్ను కరుణించారా? నా పైన ఇంతటి దయ చూపించారా? కేవలం వారం రోజుల ముందు నా చేష్టలతో, మాటలతో వారిని అవమానపరిచాను. ఎంతటి పాపిని నేను?” అని భోరున విలపించాడు. “పూర్తి స్వస్థత పొందిన తరువాత నేను మొదట నా ఇంటికి వెళ్ళను. ఇంతటి పాపిని అనుగ్రహించిన ఆ మహాత్ముని వద్దకు ముందు నన్ను తీసుకుని వెళ్ళు” అని దేవార్ ను అర్థించాడు. అతని కోరిక ప్రకారం మహాస్వామివారిని దర్శించుకుని తనని క్షమించవలసిందిగా పలువిధాల ప్రార్థించాడు. అప్పటి నుండి నాస్తికత్వం నుండి ఆధ్యాత్మికత వైపు మళ్ళాడు. మనసులో భక్తిభావం పొంగగా మహాస్వామి వారిపై కవిత రాసాడు. మరలా స్వామిని దర్శించినప్పుడు దాన్ని వారికి సమర్పించాడు. ”ఎవరి కనుచూపుచేతనే అన్ని పాపాలు నశించిపోతాయో ఎవరు తిరువాచకానికి సాకార స్వరూపమై నిలచినారో ఎవరు తన మేధస్సు చేత సత్యా జ్ఞానానికి అర్థం చెప్పగలరో ఎవరు ఈ విశ్వాన్ని రక్షించాడానికి వచ్చిన విశ్వనాథుడో ఎవరు అన్ని మతాల చేత తమ దేవుడని ఒప్పబడినాడో అటువంటివారి చరణారవిందములకు మనల్ని సమర్పించుకుందాము రండి! అందరూ తరలిరండి!!”
1 478
11
నువ్వు పుట్టడానికి ముందే 1989లో చైత్ర పౌర్ణమి. పరమాచార్య స్వామివారిని దర్శించుకోవాలని కాంచీపురం వెళ్ళాను. అది సాయం సంధ్యా సమాయం. అప్పుడే చిన్నగా చీకటి పడుతోంది. నేను వెళ్ళేటప్పటికి పరమాచార్య స్వామివారు కచ్ఛపేశ్వర దేవస్థానానికి వెళ్ళి ప్రాకారంలో కూర్చున్నారు. వారి చుట్టూ కొంతమంది భక్తులు ఉన్నారు. నేను వారిముందు నేలపై పడి సాష్టాంగం చెయ్యగానే, నా గురించి అడిగారు. ఆచార్యులవారి ఆంతరంగిక శిష్యుడు ఒకరు వారి మాటల్ని నాకు వినిపించాడు. నేను వారికి సమాధానం ఇవ్వగానే, నేను జన్మించిన ప్రాంతం గురించి అడిగారు. మా నాన్నగారు త్రిశూర్ కు చెందినవారు, మా అమ్మగారు కొడుంగల్లూర్ కు చెందినవారు. రెండూ కేరళలోని ప్రాంతములే. స్వామివారు ఈ ప్రాంతములు పేరు వినగానే, తలపైకెత్తి “ఓహో భగవతి క్షేత్రం” అని అన్నారు. అప్పుడు నేను ఆ సహాయకునితో స్వామివారు ఈ ప్రాంతాలను దర్శించారా అని అడిగాను. నేను ఏమి అడుగుతున్నానో అతడి ద్వారా అడిగి తెలుసుకొని కొద్దిసేపటి తరువాత “అవును చాలా ఏళ్ళ క్రితం... నువ్వు పుట్టడానికి ముందే” అని అన్నారు. అవును అది నిజం. నేను పుట్టడానికి మూడేళ్ళ ముందే మహాస్వామివారు ఆ క్షేత్రాలకు విజయం చేశారు. స్వామివారి సమక్షమంలో అంతటి అసందర్భమైన ప్రశ్న వేసి తప్పుచేశానేమో అని హఠాత్తుగా నా మనసుకు అనిపించింది. కొద్దిగా భయంవేసి అపరాధనా భావంతో వెంటనే నేలపై పడి స్వామివారికి సాష్టాంగం చేశాను. పైకి లేచేటప్పటికి ఆ కరుణామూర్తి నా తప్పుని మన్నించి అనంతమైన ఆశీస్సులని అందిస్తున్నట్టుగా చెయ్యి పైకెత్తి ఆశీర్వదిస్తున్నారు. శ్రీమఠానికి ఏవిధమైన సంబంధంలేని అశేషమైన భక్తకోటిలో మేము కూడా కేవలం ఒకరము మాత్రమే. కాని స్వామివారికి నేను పుట్టిన సంవత్సరం ఎలా తెలుసు? సర్వజ్ఞాని !! సర్వవ్యాపి !! సర్వ స్వతంత్ర !! --- డా. యమ్. పద్మనాభన్, చెన్నై అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1 858
12
Matn yo'q...
1 891
13
పూజ - ప్రసాదం 1945లో పరమాచార్య స్వామివారు మయూరంలో మకాం చేస్తున్నప్పుడు దగ్గర్లోని అణైతాండవపురంలో చంద్రమౌళీశ్వర పూజ చేస్తున్నారు. పూజ పూర్తైన తరువాత ప్రసాదం పెట్టడానికి మఠం ఏనుగుని పూజాస్థలికి తీసుకురమ్మని ఆదేశించారు. పూజ జరుగుతున్న ప్రదేశం చిన్నదిగా ఉండడం, ప్రవేశద్వారం మొక్కజొన్న పొత్తులతో అలంకరింపబడి ఉండడం వల్ల అంతపెద్ద ఏనుగుని లోపలికి ఎలా తీసుకురావాలో అర్థం కాక అక్కడున్నవారు కలవరపడుతున్నారు. ఏనుగుని తీసుకునిరాకపోవడానికి గల కారణాలను పరమాచార్య స్వామివారికి విన్నవించగా, స్వామివారు మావటిని పిలిచి పూజకు ఏనుగును పంపవలసిందిగా ఆజ్ఞాపించారు. మావటి వెంటనే ఏనుగు దగ్గరికి వెళ్ళి దాంతో సంభాషించి పూజకు రావల్సిందిగా మహాస్వామివారు పిలిచారు అని చెప్పి దాని బంధనాలను తొలగించాడు. వెంటనే అది వస్తున్నాను పద అన్నట్టుగా తలాడించి పూజామందిరం ద్వారం వద్దకు వచ్చి అంతపెద్ద తన దేహాన్ని చిన్నదిగా చేసుకుని, వంచుతూ, మెలికలు తిప్పుతూ ఆ ద్వాఅరం గుండా లోపలికి ప్రవేశించింది. పూజ పూర్తి అయ్యేదాకా అక్కడ నిశ్శబ్ధంగా నిలబడి తరువాత ఎలా లోపలికి వచ్చిందో అలాగే బయటకు తిరిగి వచ్చింది. ఏనుగు స్వామివారి మాటల్ని విని అలా ప్రవర్తించడం చూసి అక్కడున్న వారందరూ పారవశ్యంతో అలా చూస్తూ నిలబడిపోయారు. --- యమ్. ఆర్. బాలసుబ్రమణియన్, తిరుచ్చి. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 6 #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
2 109
14
బాలలకు శ్రీచరణుల సందేశం పండుగలను, ఉత్సవాలను విందులు మున్నగు వాటితో గడపడం కన్నా ఏదైనా మంచి పనిని ప్రారంభించడానికి ఉపయోగించి, నియమంగా ఆ పని చేస్తే ఎంతైనా బాగుంటుంది. ఉదాహరణకు శ్రీరామనవమి నాడు శ్రీరామ నామం వ్రాయడం ప్రారంభించి, శ్రీరాముని చిత్రపటాన్ని ముందుంచుకుని రాముని గుణగణాలను తలచుకుంటూ రామనామాన్ని ఉఛ్ఛరించండి. "శ్రీరామ" అని అలా వ్రాసుకుంటూ పోవడం వలన మనసు బుద్ధి మున్నగు వన్నీ మంచి గుణాల మీద, భావాల మీద కేంద్రీకృత మవుతాయి. ఈ ప్రకారం ప్రతిరోజూ చేస్తే చక్కటి అనుశాసనం అలవడుతుంది. మనమంతా ఉత్తమమైన మానవులుగా రూపొందడానికి బాల్యం నుండి తగిన అభ్యాసం ఎంతైనా అవసరం. చిన్ననాటి నుండి వినమ్రత, దైవభక్తి, చక్కటి సత్కార్యక్రమములు చేయవలెనన్న చింతన, క్రమశిక్షణ, మనసు ఒక విషయము నందు లగ్నము చేయడం వంటివి అలవాటు కావలసి వుంది. ఈ నియమములను బాలలు భక్తి శ్రద్ధలతో అభ్యాసము చేయుటయే గాక తల్లితండ్రులు తమ పిల్లలు వీటిని పాటించులాగ శ్రద్ధ వహించవలసింది. బాలురు తమ టైము టేబులు కార్డుపై తమకు ఇష్టం వచ్చిన దేవతల చిత్రం అతికించి ఆ దేవతకు సంబంధించిన శ్లోకాన్నో, పద్యాన్నో వ్రాసుకొని ప్రతినిత్యం ధ్యానం చేయాలి. బాలురు విద్యార్థులు గాన తమ టైము టేబులు కార్డు మీద "సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణిణీ నిత్యం పద్మాలయా దేవి సామాం పాతు సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా" అనే శ్లోకాన్ని వ్రాసుకోవచ్చు. ఇలాంటి శ్లోకాన్ని కొందరు విద్యార్థులో లేక కొన్ని తరగతుల విద్యార్థులో కలిసి ముద్రించవచ్చు కూడా. వీలుంటే తోటి విద్యార్థులకు పంచిపెట్టవచ్చును కూడా. ఇలాంటి వాటికి తల్లితండ్రులు తప్పక సహకరిస్తారు. తప్పక ఒక రూపాయి చొప్పున ఇవ్వకుండా ఉండరు. పాఠశాలలో మోరల్ సూచనల పీరియడ్ లందు ధర్మభోదకములగు కథలను ప్రారంభింపవలసిందిగా బాలలు ఉపాధ్యాయులను కోరవచ్చును. అంతటితో చాలదు. ప్రతి బాల బాలికలు ఇలాంటి పద్యాలను శ్లోకాలను కనీసం యేబదికి తక్కువ కాకుండా కంఠస్థం చెయ్యాలని నా కోరిక. వచ్చేవి వేసవి శెలవులు గదా! ఈ కాలాన్ని ఇలా చక్కగా వినియోగించుకోవచ్చు కూడా. ఇలాంటి శ్లోకాలకు అర్థం తెలుసుకుని వాటిని మంచి ఉచ్చారణతో పఠించగల బాలబాలికలకు మా మఠం మంచి పుస్తకాలను కానుకగా ఇస్తుంది. మంచి బాలసంఘాలను ఏర్పాటుచేసుకోవాలి. పురాణ కథశ్రవణాది కాలక్షేపాలను ఏకాదశి నాడు లేదా శనివారం నాడు సామూహిక భజనలు, ప్రార్థనలు ఇత్యాదులు కూడా నిర్వహించుకోవచ్చును. --- ‘చంద్రశేఖర వచోవిభూతి’ నుండి #KanchiParamacharyaVaibhavam - #కంచిపరమాచార్యవైభవం
2 169
15
ఆ సేవకుని జతలో ఒక యువకుడు కూడా ఉన్నాడు. “ఏయ్! బాలాజీ! నిన్న స్వామివారు చెప్పలేదా రేపు వాళ్ళు వస్తున్నారని? వారు వీరే కదా?” “అవును. మా నాన్న మరియు అమ్మ వచ్చారు!” ఇక రాయడానికి ఏమి లేదు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
2 076
16
“కాదు స్వామి! భౌతిక శాస్త్రం చాలా చాలా అభివృద్ధి చెందింది. ఈ విశ్వమంతా ఒకే పరమాణువు, ఒకే శక్తి; అదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు” “దాన్నే ఇక్కడ శివుడు, శక్తి ఇద్దరూ ఒక్కటిగా అర్ధనారీశ్వరులు అయి ఉన్నారని చెబుతున్నారు”. “కాదు, మేము చెబుతున్న విషయం ఇది కాదు” “అది ఆంగ్లము; ఇది సంస్కృతము. భావానీత్వమ్; “నేను నీవు అవుతున్నాను; ‘నేను’ మరియు ‘నాది’ నీలో కలిసిపోతున్నాము” ఇదే వారు చెప్పింది”. “అది ఇలా కాదు” భాగీరథి మధ్యలో అందుకుని “పదండి వెళ్దాం” అన్నది. “నీవు అద్భుతాలను నమ్మవా?” “లేదు” “పాల్ బ్రంటన్, అర్థర్ కోస్లర్ లాంటివారు దీని గురించి చాలా రాశారు. వారి గురించి నువ్వు వినలేదా?” “లేదు” “చాతుర్మాస్యం కోసం పరమాచార్య స్వామివారు మహబూబ్ నగర్ లో మకాం చేస్తున్నప్పుడు, నీలాగే అమెరికా నుండి ఒకతను దర్శనానికి వచ్చాడు. బస్ స్టాండు నుండి రిక్షాలో వచ్చాడు. స్వామివారి ఆశీస్సులు అందుకున్నాడు. అప్పట్లో స్వామివారు అందరితో మాట్లాడేవారు. నుదుటిపై కుంకుమ ధరించాడు, స్వామివారు ఆపిల్ పళ్ళు ప్రసాదంగా ఇచ్చారు. మఠంలోనే భోజనం చేసిన తరువాత, కొంత డబ్బు ఇవ్వాలని తన పర్సు కోసం చూశాడు. కానీ దాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాడు. పర్సు మాత్రమే కాదు, పాస్ పోర్టుతో పాటు పదిహేను వేల డాలర్ల ట్రావెలర్స్ చెక్ కూడా! అతడు నిశ్చేష్టుడయ్యాడు. వెతకడానికి ఎక్కడికని వెళ్లగలడు? భోజనశాలలోనూ లేదు, రిక్షా అతని ఇంట్లో కూడా లేదు. చివరకు అది ఎక్కడ దొరికిందో తెలుసా? బస్ స్టాండులో అతను కూర్చున్న సీమెంటు బెంచీపై. అప్పటికి వేలమంది ఆ దారిలో వెళ్లివుంటారు. దీన్ని ఏమని అంటావు శివశంకరన్? ఇది అద్భుతం కాదా? దీన్ని మీ భౌతికశాస్త్రం ఏమని నిర్వచిస్తుంది?” “దాన్ని అద్భుతం అని మీరు అనవచ్చు; కానీ నేను దాన్ని ‘సంభావ్యత’ లేదా ‘అవకాశం’ అంటాను. దర్శనం అయ్యిందా, మనం ఇక వెళ్దామా భాగీ”. స్వామివారు చిరునవ్వుతో వెళ్లడానికి అనుమతిచ్చారు. బయటకు వచ్చిన తరువాత, “ఆయనతో కూడా వాదనేనా?” అని అడిగింది భాగీరథి. “ఎందుకు కూడదు? ఆయన కూడా నాలా ఆత్మే కదా? అద్వైతం చెప్పేది అదే కదా?” బయట కాచుకున్న పాల్ రాజ్ “రండి! స్వామివారి దర్శనం చేసుకుందాం. బహుశా ఇంకొక అరగంట ఉంటారు” అన్నాడు. భక్తుల వరుస వీధి చివరి దాకా ఉంది; భాగీరథి పరిగెత్తుకుంటూ వచ్చి వరుసలో చివర చేరింది. అన్నిటినీ మరచిపోయింది. పళ్ళపుడి రంగు చీర కట్టుకున్న ఒక విదేశీ వనిత ధ్యానంలో కూర్చుని ప్రవేశ ద్వారం వైపు చూస్తోంది. లోపల కొద్దిగా చీకటిగా ఉంది. నిదానంగా అక్కడకు చేరుకున్నారు. గదిలోపల శతాయుశ్కులైన పరమాచార్య స్వామివారు జేరగిలబడి కూర్చున్నారు. స్వామివారి తలపై, కాషాయ వస్త్రంపై ఆకులతో చేసిన కిరీటం పెట్టుకున్నారు. మోకాళ్ళు ముడుచుకున్నారు. స్వామివారు ఎవరినీ ప్రత్యేకంగా గమనించడంలేదు. స్వామివారికి దగ్గరలో ఉన్న ఒక బ్రాహ్మణ యువకుడు భక్తుల వరుసను నియంత్రిస్తూ, అప్పుడప్పుడు స్వామివారి మెడలో పూలమాలలు వేస్తున్నాడు. అతను పాల్ రాజ్ ను గుర్తుపట్టి, “ఇది ఎన్నోమారు?” అని అడిగాడు. “తొంభయ్యోసారి! ఈయన అమెరికా నుండి వచ్చారు” “అమెరికా నుండి చాలామంది వస్తుంటారు. రండి మామి, దగ్గరకు వచ్చి దర్శనం చేసుకోండీ” అని వారిని ఆహ్వానించాడు. భగీరథి తనను తాను సంభాళించుకోలేక కన్నీరు పెట్టుకోవడం మొదలుపెట్టడంతో, అవి ఆమె చీరపై పడి కిందకు పడ్డాయి. “పరమాచార్యకు చెప్పండి, కేవలం ఈ క్షణం కోసమే మేము పదివేల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చాము. మా ఆయన ఎంత వాదించినా, లోలోపల, ఎక్కడో కాస్త నమ్మకం ఉంది. మాకు ఒక్కడే కుమారుడు; బాలాజీ అని పేరు పెట్టుకున్నాము. పన్నెండేళ్ళ వరకు బాగానే ఉన్నాడు. కానీ ఆ చెడ్డ దేశంలో, తండ్రికీ కుమారునికి అభిప్రాయ భేదాలు వచ్చి, ఒకరోజు ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. నేపాల్, సిలోన్, జపాన్ ఇలా ప్రపంచమంతా తనకోసం వెతికాము. ఏమైనా జరగరానిది జరిగి చనిపోయాడో లేక బ్రతికే ఉన్నాడో కూడా తెలియదు. మా ఒక్కగానొక్క కుమారుణ్ణి పోగొట్టుకున్నాము. ఈనాటికీ మనసుకు ప్రశాంతత లేదు”. “స్వామివారిని ప్రార్థించండి; సార్ మీరు కూడా”. ఆ యువకుడు స్వామివారి వద్దకు వెళ్ళి, చెవిలో విషయమంతా చెప్పాడు. స్వామివారు చెయ్యెత్తి ఆశీర్వదించారు. పెద్దకళ్లతో కళ్ళజోడులో నుండి ఒకసారి భాగీరథిని చూశారు స్వామివారు. భాగీరథి మనస్సు సంతోషంతో పొంగిపోయింది. ఆ యువకుడు రోజాపూవ్వులను, ఆపిల్ పండును ఇచ్చి, “అంతా సరిపోతుంది. దిగులు పడకండి. పిల్లాడి పేరు ఏమని చెప్పారు?” అని అడిగాడు. “బాలాజి” వారు బయటకు వచ్చారు. “ఎందుకు చిన్నపిల్లలా ఏడుస్తున్నావు” అని అడిగాడు శివశంకరన్. “సినిమాలలో జరిగినట్టు మన అబ్బాయి మన ముందు ప్రత్యక్షమవుతాడు అనుకుంటున్నావా?”. కానీ తను తట్టుకోలేక ఏడుస్తోంది. “భాగీ, ఎంటిది పిచ్చిదానిలా! అందరిముందు ఏమిటిది! రా వెళ్దాం”, మొదటిసారి సానుభూతితో చూపిస్తూ, ఆమెను అనునయిస్తూ, భుజం చుట్టూ చేతులు వేసి తీసుకెళ్తున్నాడు. వారి వెనకాల ఒక సేవకుని గొంతు “మామి, మామి! పరమాచార్య స్వామివారు మీకోసం ఒకరిని పంపారు” అని వినబడింది. “ఎవరది?”
2 072
17
“మీకోసమని ఒకటి కొట్టాను సార్” మరలా అగ్గిమీద గుగ్గిలం అవుతాడని అనుకుంది భాగీరథి, కానీ ఏ కళనున్నాడో సరే అని తీసుకున్నాడు. తీయని కొబ్బరినీళ్లు తాగి, “ఇదొక్కటే ఈ దేశంలో ఇంకా బావుండేది” అన్నాడు. “పాల్ రాజ్, నువ్వు కూడా ఒక కొబ్బరిబోండాం తీసుకో” “లేదు మేడమ్, స్వామివారిని దర్శించుకునేదాకా చుక్క నీరు కూడా తాగను” “మనం వెంట్రుకవాసిలో తప్పించుకున్నాం” “అంతా పరమాచార్య స్వామివారి అనుగ్రహం వల్లనే” అన్నాడు పాల్ రాజ్. “అవునా?” తన వ్యంగ్య ధోరణి మారలేదు. వారు కంచి చేరుకునేటప్పటికి మధ్యాహ్నం మూడు గంటలు అయ్యింది. చెరువుల్లో ఈతకొడుతున్న హంసలు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న తాటి చెట్లు, ఆలయ గోపురాలు కొత్తగా, శోభాయమానంగా ఉన్నాయి. స్వామివారి శతాబ్ధపు ఉత్సవాల కోసం పట్టణం మొత్తం సింగారించుకుంటోంది. ఎక్కడచూసినా చలువ పందిళ్లతో, వెదురు కర్రల బారులతో; గోవులు, ఎద్దులు మరియు కుక్కలు వీధులంతా తిరుగుతున్నాయి. భాగీరథి సంతోషానికి అవధులు లేవు. అక్కడ ఒక పెద్ద పందిరి ఏర్పాటు చేయబడింది. “ఉత్సవాలు ఇక్కడే జరుగుతాయి మేడమ్”. “ఈ ప్రాంతాన్ని చూసినవారెవరైనా ఇది పల్లవ రాజుల రాజధాని అంటే నమ్ముతారా? నువ్వు వాటికన్ చూశావు కదా, ఎలా ఉంది అది? వెయ్యి సంవత్సరాల పురాతన ప్రాంతాన్ని అమెరికా ఎలా కాపాడుకుంటుంది?” “నాకు అది అంతా ముఖ్యం కాదు సార్” “నేను నీతో మాట్లాడడంలేదు పాల్ రాజ్” “మనం నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్ళి, తరువాత ఇతర దేవాలయాలను చూద్దాము” అన్నాడు పాల్ రాజ్. శివశంకరన్ వెంటనే తిరస్కరించి, “ముందు ఏదైనా హోటల్ కు. తరువాతే ఏ కార్యక్రమమైనా” అని ఖరాఖండీగా చెప్పాడు. “లేదు, సార్; మనం స్వామివారిని దర్శించడానికి అరగంట చాలు. అందుకనే అంత వేగంగా కారు నడిపాను”. “వారిని రేపు చూద్దాము, ముందు హోటల్, నాకు చాలా ఆకలిగా ఉంది” ఒక్కటే మూడు నక్షత్రాల హోటల్ ఉంది. అక్కడికి వెళ్ళి, గదిలోకి వెళ్ళగానే శివశంకరన్ మొదలుపెట్టాడు, “స్నానాల గదిలో బొద్దింకలు, గోడలపై రక్తపు మరకలు, మురికి తువ్వాళ్ళు, ఔషధాల వాసన. అమెరికాలో ఉంటే కొద్ది సౌఖ్యం అయినా ఉండేది . . .” భాగీరథి ఇక తట్టుకోలేకపోయింది, “దయచేసి రెండు రోజులపాటు మీ అమెరికాను విడిచిపెట్టి, భారతదేశానికి వస్తారా? మనం ఇక్కడకు వచ్చింది పరమాచార్య స్వామివారి దర్శనం కోసం. నల్లులు లెక్కపెట్టడానికి కాదు” అని ఘాటుగా స్పందించింది. “మనం వచ్చాము అనకు. నువ్వు మాత్రమే వచ్చావు, నాకు ఏమాత్రం ఇష్టం లేదు; నేను ఇవన్నీ నమ్మను; నేను ఆయన్ని చూడకపోయినా పర్లేదు; నాకు తలనెప్పిగా ఉంది” అంతలోనే పాల్ రాజ్ అక్కడకు వచ్చి భాగీరథిని పిలిచి, చిన్న స్వామివారు అమ్మవారి పూజ చేస్తున్నారు అని తెలిపాడు. “వస్తున్నాం పాల్ రాజ్! హలో, లేవండి, వెళ్దాం” “నేను రాను; నువ్వు వెళ్ళు; నేను ఈ గదిలోనే ఉంటాను” “నువ్వు లేకుండా నేను ఒంటరిగా వెళ్ళను” “పాల్ ఉన్నాడు కదా” “సార్, నేను లోపలకు రాను; బయటినుండే స్వామివారిని దర్శించుకుంటే చాలు నాకు” “ఛీ! నీతో ఇదే తలనెప్పి భాగీ” “ఒక్కరోజు, కేవలం ఒక్క రోజు దయచేసి నీ భౌతిక శాస్త్ర విషయాలు మరచిపోలేవా? నీ మొండితనాన్ని వదిలెయ్యలేవా? ఈ మూర్ఖత్వం వల్లే కదా మన ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్నాము?” మండే కళ్ళతో, మౌనంగా భాగీరథివైపు చూసి, “నేనా కారణం, అందుకు నేనొక్కడేనా కారణం?” అన్నాడు. “మరలా అదంతా మొదలుపెట్టొద్దు”. “చెప్పు, నేనొక్కడేనా కారణం”. “సరే, నేను కూడా అందుకు కారణమే”. పాల్ రాజ్ పరిస్థితిని అంచనా వేసి, హోటలు ద్వారం వద్దక కారుతో వేచివుంటానని చెప్పి వెళ్లిపోయాడు. “సరే! నేను వస్తాను; కానీ, నేను చొక్కా తీయను; అప్పుడప్పుడూ పొగ తాగుతాను; నేను నాస్తికుడిని; మతం అనేది కూడా ఒక మత్తుమందు, మోసపూరితమైన ఒక ఆట అని నమ్మేవాణ్ణి” “నాతోపాటు వస్తే చాలు” అన్నది భాగీరథి. మోకాళ్ళదాకా ఉండే నిక్కరుతో, విశ్వవిద్యాలయ టీ షర్టు వేసుకుని, తలపై బేస్ బాల్ టోపీ పెట్టుకుని “సరే పద వెళ్దాం” అన్నాడు. భాగీరథి తన కన్నీళ్లను ఆపుకోలేక ఆలోచిస్తోంది, “ఎందుకు ఈయన ఇంత మొండిగా ప్రవర్తిస్తాడు? ఏదైనా చెడు జరగబోతోందా?” అని. హాలులో వందలమంది భక్తులు కూర్చుని పూజను తిలకిస్తున్నారు. “ఈ పిల్లాడు ఎవరు?” “చిన్న స్వామి” “ఏంటీ పిచ్చి? నేను ఇప్పుడు అతని కాళ్లపై పడాలా?” “అవసరం లేదు” “ఇతను నంబర్ మూడా? మరి రెండో నంబరు ఎక్కడ?” “దయచేసి కాసేపు ఊరికే ఉంటారా?” చాలాసేపటి తరువాత, గోడవారగా వరుసలో వెళ్ళి స్వామివారిని సమీపించారు. శివశంకరన్ మూలలో నిలబడున్నాడు, “ఎందుకు నిలబడున్నారు? కూర్చోండి? ఏమిటి పేరు?” అని అడిగారు జయేంద్ర స్వామివారు. “శివశంకరన్” “ఎక్కడినుండి?” “అమెరికాలోని ప్రిన్స్టన్, నేను భౌతికశాస్త్ర ఆచార్యుడిని” “మఠానికి చాలా దగ్గరి వ్యక్తి అయిన జయరామన్ కూడా ప్రిన్స్టన్ లోనే ఉంటారు, కదా?” “నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ప్రిన్స్టన్ లో ఒకప్పుడు ఐన్ స్టీన్ అనే గొప్ప వ్యక్తి ఉండేవాడు” “నీ భౌతిక శాస్త్రం ఏమని తేల్చింది? ఆదిశంకరులు చెప్పినదే కదా?”
1 644
18
‘ఎక్స్ క్యూజ్ మి! ఎక్స్ క్యూజ్ మి’ అంటూ శివశంకరన్ అతనివైపు పరిగెడుతూ, అతని చెయ్యి పట్టుకున్నాడు. వెంటనే ఆ సహాయకుడు కోపంతో, “ఈ సామాను నీదైతే, చెప్పు; అలాకాక, నాపై చెయ్యి వేశావు అంటే, నేను కూడా నీపై చెయ్యి వెయ్యడానికి ఎంతో సమయం పట్టదు; నువ్వు ధనవంతుడివి అయితే, అది నీ ఇంట్లో ఉంచుకో; ఇక్కడ నేనే అధికారిని” అన్నాడు. “ఏమంటున్నావు? ఏమంటున్నావు?” అంటూ శివశంకరన్ ఇటువైపు తిరిగేటప్పటికి మొహం ఎర్రబడిపోయింది; వెంటనే సార్బిట్రేట్ మాత్ర తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు; కోపాన్ని భాగీరథిపై మరలుస్తూ, “ఇదంతా నీవల్లే! ఎందుకు నన్ను ఇలా కించపరుస్తున్నావు? నేను భారతదేశానికి రాను, ప్రిన్స్టన్ లోనే ఉంటానని నీకు చెప్పాను; నాకు ఇదంతా ఇష్టం ఉండదు; ఎందుకు నన్ను ఇలా వేధిస్తావు? మద్రాసు విమానాశ్రయంలో ఒక లోఫర్ తో నేను ఇలా మాటలు పడాలా?” “రేయ్! ఎవరు లోఫర్ ఇక్కడ? ఒక్క గుద్దు గుద్దానంటే నీ బర్ముడా మొత్తం రక్తసిక్తం అవుతుంది”. “రా, వెళ్దాం! ఎందుకు అతనితో గొడవ” అని భాగీరథి పక్కకు లాక్కెళ్లింది. అలాంటి సమయంలో ఎక్కువ మాట్లాడకూడదని తనకి బాగా తెలుసు. వాళ్ళు బయటకు వచ్చి, తమను తీసుకువెళ్లడానికి రావాల్సిన కారు కోసం చూడసాగారు. ఇతర ప్రయాణీకుల కార్లు రావడంతో, వారందరూ వెళ్ళిపోయారు; వెంటనే ఆ ప్రదేశం మొత్తం ఖాళీ అయిపోయింది. “ఆటో కావాలా? డెబ్బై రూపాయలు మాత్రమే . . . మైలాపూరే కదా?” “నేను ఎక్కడికి వెళ్లాలో నీకెందుకు?” అన్నాడు శివశంకరన్. “ఆయనతో మాట్లాడకు” అంటూ భాగీరథి జోక్యం చేసుకుంది. “నేను ఊరికే అడిగాను మేడమ్. ఎందుకు అలా కోప్పడతారు?” అని ఆటో డ్రైవర్ జవాబిచ్చాడు. అప్పుడు ఒకతను వారి వద్దకు వచ్చి, “మీరు శివరామన్ కదూ?” అని అడిగాడు. “డా. శివశంకర్” “కంచి వెళ్లాల్సినవారు మీరే కదూ? కారు కోసం ప్రదీపా ట్రావెల్స్ వారిని అడిగారు కదూ?” “అవును” “ఉండండి, నేను కారు తెచ్చాను” “నేను శివరామన్ కాదు” “సరే శివశంకర్, రండి! కారు తెచ్చింది మీకోసమే” ఆ డ్రైవరుని చూసి భాగీరథి ముచ్చటపడింది. వారి సామాను తీసుకుని కారు వెనకాల పెట్టి, కారు తలుపు తీసి, వారు లోపలకు వెళ్ళి కూర్చున్న తరువాత తలుపు వేసి, వెళ్ళి డ్రైవరు సీట్లో కూర్చున్నాడు. “ఎటువంటి ట్రావెల్ ఏజెంట్స్ వీళ్ళు? కనీసం పేరు కూడా సరిగ్గా చెప్పరా?” “కొన్నిసార్లు ఇటువంటి పొరపాట్లు జరుగుతాయి, టెలెక్స్ సందేశంలో . . .” డ్రైవరు తన మాటలను పూర్తిచేయ్యడానికి శివశంకరన్ వదల్లేదు, “మీ దేశంలో ఏది సరిగ్గా చేస్తారు గనక?”. “డ్రైవర్ నీ పేరెంటి?” అని అడిగింది భాగీరథి. “పాల్ రాజ్ మేడమ్! ఏసి వెయ్యమంటారా? పాటలు పెట్టమంటారా?” ప్లేయరులో ఏదో కాసెట్ పెట్టాడు, “కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం” అంటూ పాడుతోంది. “నాకు ప్రేమ వద్దు తమ్ముడు” కారు బయలుదేరి వెంటనే ప్రధాన రహదారి పైకి వచ్చింది. “ఎదైనా భక్తి గీతం పెట్టనా?” “మాకు ఏ పాటలూ వద్దు, మమ్మల్ని ప్రశాంతంగా వదిలెయ్యి” పూనమల్లి వైపుకు కారు తిరగగానే, “నిదానంగా వెళ్దాం పాల్ రాజ్. మాకు అంత అవసరం ఏమి లేదు” అన్నది భాగీరథి. “ఈరోజే పరమాచార్య స్వామివారిని దర్శించుకోరా? ఇంకో రెండు గంటల్లో అక్కడికి చేరుకుంటాము”. “రేపు తీరిగ్గా దర్శనం చేసుకుంటాము; అదేమీ నాకు ముఖ్యం కాదు; ఈమె కోసమే; కేవలం దీనికోసమే తను అమెరికా నుండి వచ్చింది” అని జవాబిచ్చాడు శివశంకరన్. “ఓహ్! అవునా? నాకు చాలా ఆనందంగా ఉంది. పెరియవా దైవ స్వరూపులు సార్. నేను ఇప్పటిదాకా ఎనభైఎనిమిది సార్లు దర్శించుకున్నాను; వందకు మరో పన్నెండు తక్కువ; వారి వయసుకు సమానం అవుతుంది”. “పాల్ రాజ్! నువ్వు క్రైస్తవుడివి కదా?” “అవును సార్! అయితే ఏమిటి?” “విడ్డూరం” అన్నాడు శివశంకరన్. “మా ఇంట్లో ఆయన దేవుడు, మీకు తెలుసా? స్వామివారి ఒక్కచూపు చాలు, కోరుకున్నవి దక్కుతాయి” “నీకు జరిగిందా?” “ఎందుకు లేదు? నా కుమార్తె రోజ్ మేరీకి తపాలా శాఖలో ఉద్యోగం దొరకాలి అనుకున్నాను. మరలా దర్శనానికి వెళ్ళేటప్పటికి తనకు నియామక పత్రం వచ్చింది”. “అవునా? ఆయన టెలిఫోన్లో కూడా ఉన్నాడా?”. శివశంకరన్ మాటల్లోని వ్యంగ్యం పాల్ రాజ్ గమనించలేదు. “పెరియవా దేవుడు. దూరం నుండే వారిని దర్శించి వేడుకోండి, మీ కోరిక నెరవేరుతుంది. ఇంతకూ మీకు ఏమి కావాలి సార్?” “కాంచీపురంలో మంచి హోటల్” “మేడమ్, మీకు?” “మనఃశాంతి” “సార్ చాలా చతురులు” “చూడు, పాల్ రాజ్, నాకు ఇటువంటి వాటిపై నమ్మకం లేదు. నా పరిశోధన ప్రకారం నాకు భగవంతుని అవసరం లేదు”. “నాకు కావాలి, సార్” “ముందర చూడు” అని గట్టిగా అరిచాడు శివశంకరన్. పెద్ద లారీని ఢీకొట్టబోతూ వెంట్రుకవాసిలో తప్పి, కారు తారురోడ్డు నుండి క్రిందకు దిగి ఒక చెట్టు వద్ద ఆగింది. శివశంకరన్ కు భయంతో చెమటలు పట్టాయి. పాల్ రాజ్ క్రిందకు దిగి టైరు పంక్చర్ అయినట్టు గమనించాడు. “పదిహేను నిముషాల్లో టైరు మారుస్తాను” అని చెప్పి పనిలోకి దిగాడు. శివశంకర్ సిగరెట్టు వెలిగించాడు; ఆ చెట్టు కిందనే ఒకతను కొబ్బరిబోండాలను అమ్ముతున్నాడు. “ఒకటి కొట్టివ్వనా సార్?” “వద్దు, నాకు తాగాలని లేదు”
1 500
19
అనన్యసామాన్యమైన కరుణ డా. శివశంకరన్ తను కూర్చున్న బోయింగ్ విమానం కిటికీ నుండి బయటకు చూస్తున్నాడు. చెన్నై కొబ్బరి చెట్లు దగ్గర దగ్గరగా వస్తున్నాయి, కాంక్రీటు భవనాలు కొమ్ములలాగా పైకి మొలుస్తూ కనబడుతున్నాయి. నురుగుతో కూడిన సముద్రపు అలల చివరన ఉన్న తెల్లని మట్టి కనుచూపుమేర కనిపిస్తోంది. “మద్రాసు వదిలి సరిగ్గా ఇరవై సంవత్సరాలయ్యింది” అన్నాడు శివశంకరన్. “ఎంతగానో మారిపోయి ఉంటుంది” అంది భాగీరథి. “కేవలం సముద్రం మాత్రమే మారలేదు” భాగీరథి తన చేతిసంచి తెరిచి, దాంట్లో చాలా ఉన్న చిన్న చిన్న సీసాల్లోని ఒక సీసా తీసుకుని, తెరిచి అందులో ఉన్న గులాబి రంగు ద్రావణాన్ని చేతుల్లో వేసుకుని చెక్కిళ్ళకు పూసుకుని, కేవలం పది నిముషాల్లో తన వయస్సును తగ్గించేసుకుంది. చిన్నగా దాని పరిమళం విమానం అంతా వ్యాపించింది. “శంకరాచార్యులను చూడడానికి కూడా ఇలా సింగారించుకోవాలా?” అన్నాడు శివశంకరన్. “కాదు! నా చర్మం ఈ ఎండలను తట్టుకోలేదు” “May I have your attention please” అని పైనున్న స్పీకరు నుండి ప్రకటన మొదలయ్యింది. తరువాత చెప్పిన విషయం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. “ప్రపంచంలోనే అత్యంత చెత్త విమానయాన సంస్థగా భారతీయ విమానయాన సంస్థకు ప్రతీ సంవత్సరం బహుమతి ఇవ్వొచ్చు” అన్నాడు శివశంకరన్. భాగీరథి మౌనంగా ఉండడంతో మరలా తనే, “ప్రపంచంలోనే అత్యంత చెత్త విమానాశ్రయం బాంబే” అని అన్నాడు. భాగీరథి కనుకొనల నుండి అతణ్ణి చూస్తూ, “మొత్తానికి భారతదేశాన్ని దూషించడం మొదలుపెట్టారా?” అన్నది. “నేను నిజమే చెబుతున్నాను. చెప్పు, ఈ దేశం ఎప్పటికైనా పురోగతి చెందుతుందా? విమానాశ్రయంలో తాగడానికి ఒక్క చుక్క నీరు లేదు; కూర్చుని సేదతీరడానికి ఒక్క కుర్చీ లేదు; అమెరికాలో ఖాయమైన మన టికెట్టు గురించి వారికి సమాచారం రాలేదు అన్నారు; విమానం మూడు గంటల ఆలస్యం. అస్సలు ఈ దేశానికి విమానం ఎందుకు?” అని శివశంకరన్ రెచ్చిపోయాడు. భాగీరథి మౌనంగా ఉండిపోయింది. ఎందుకంటే, వాటికి సమాధానం చెప్పుకుంటూ వెళ్తే ఆ చర్చ ఎక్కడికి వెళ్తుందో తనకు తెలుసు. కానీ శివశంకరన్ తన వ్యంగ్య ధోరణిలో, “కాంచీపురంలో ఏదైనా హోటలు ఉంటుందా, లేక మనం ఆరుబయటే ఉండాలా?” అన్నాడు. భాగీరథి ఏమీ బదులివ్వలేదు. “ఒక అల్యూమినియం పాత్రతో . . . ?” మరలా తను మౌనంగానే ఉంది. విమానం రన్ వే ను తాకి ఒక్కసారిగా కుదుపుకు గురయ్యింది. “ఎంత చెత్తగా దించాడు విమానాన్ని” అన్నాడు శివశంకరన్. విమానం నిలిచిపోయింది. “నీకు అంతగా వెళ్ళాలి అని ఉంటే, నువ్వు ఒక్కదానివే వెళ్ళి దర్శనం చేసుకో! నన్ను ఎందుకు మధ్యలో లాగావు?”. “నువ్వు కూడా వారిని చూడాలి”. “నేను ఎందుకు? నాకు ఇలాంటివాటిపై నమ్మకం లేదు. నేను భౌతికవాదిని, దేవుడు అతీంద్రియశక్తి లేదని విశ్వసించేవాడిని”. తమ సంభాషణను ఈవిధంగా పొడిగించడం ఇష్టంలేక, విషయం వేరేవైపు మరల్చాలని “ఈరోజు ఏం వారం” అని అడిగింది. “భారతదేశానికి వచ్చి, ఈ విమానాల కోసం వేచి చూసిన తరువాత, వారాలు కూడా మర్చిపోయాను”. “ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నారు? ఈ జనాలకు ఏరోబ్రిడ్జ్ ఎందుకు?”. ప్రయాణీకులందరూ ఆదరాబాదరాగా బయటకు వెళ్ళే ద్వారంవైపు పరిగెత్తారు. “మూడు గంటలసేపు కూర్చుని ప్రయాణం చేశారు. మూడు నిముషాల పాటు కూర్చోలేరా? ఏం భారతీయులో ఏమో!” “నువ్వు భారతీయుడివి కావా?” అని అడగాలనుకుంది భాగీరథి. కానీ తెలివితో విషయాన్ని వేరేవైపు మరల్చింది. “నువ్వు మొదటిసారి అమెరికా వెళ్లినప్పుడు, నీవద్ద ఎన్ని డాలర్లు ఉన్నాయి?” అని అడిగింది. “రెండు డాలర్లు! కేవలం రెండే డాలర్లు” అది అతనికి అత్యంత ఇష్టమైన విషయం. ఇప్పటికి ఎన్ని సార్లు చెప్పాడో. “కెన్నడి విమానాశ్రయంలో దిగాను. ఒక ఫోన్ కాల్ చేసుకోవడానికి కావాల్సినంత డబ్బు కూడా లేదు. అప్పుడు నాకు ‘కలెక్ట్ కాల్’ అంటే ఎంటో కూడా తెలియదు. అప్పుడు నాకు . . .” మరలా ఇంకోసారి ఆ కథనంతా వినడానికి భాగీరథి సిద్ధమైంది. ప్రయాణీకులందరూ క్రిందకు దిగిపోయే దాకా ఇద్దరూ సీట్లలోనే కూర్చున్నారు; యాభై అడుగుల దూరం ఎండలో నడిచిన తరువాత ఏసి హాలులోకి వచ్చారు. ఎస్కలేటర్ పనిచేయడం లేదని వ్రాసున్న బోర్డును చూసి వ్యగ్యంగా నవ్వుకున్నాడు శివశంకరన్. “ఈ దేశం తన పేదల ఆకలిని తీర్చి, జనాభాను నియంత్రిస్తే చాలు. ఇంకేం అవసరం లేదు; శాటిలైట్లు మిసైళ్ళు ఎందుకు?” దేశ సమస్యలకు రెండు వాక్యాలలో సులభమైన పరిష్కారం ఇచ్చేశాడు శివశంకరన్. ఏమీ బదులుచెప్పకుండా నడుస్తోంది భాగీరథి. ‘ఇలా చెప్పడం సులభమే కానీ, దాన్ని ఆచరణలో పెట్టడమే పెద్ద సమస్య’. కంచి వెళ్ళేదాకా తను ఇటువంటి చర్చలలో పాల్గొనదల్చలేదు. హాలులో ఒక ట్రాలీ తీసుకోగా, అది కదలడానికి మొరాయించింది. “ఛీ! భారతదేశంలో కనీసం ఒక ట్రాలీని మంచిగా తయారుచెయ్యలేరా?” ‘స్వయంవరంలో’ మెల్లిగా నడచివచ్చే రాకుమారిలా కన్వేయర్ బెల్టుపై సామాను వస్తోంది. అప్పుడు ఒక సహాయకుడు దాన్ని అందుకుని, దానిపై వ్రాసిన సంఖ్యను తప్పుగా చెప్పాడు.
1 408
20
ఆబ్రహ్మకీటజననీ వర్ణాశ్రమవిధాయినీ అది దేవి నవరాత్రుల సమయం. పరమాచార్య స్వామివారు కలకత్తాలో మకాం చేస్తున్నారు. స్వామివారి విడిదిలో చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ నవావరణ పూజ, సుమంగళి పూజ, కన్యా పూజ ఇలా ఇంకా ఎన్నో కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆమె తమిళనాడు నుండి వచ్చి కలకత్తలో స్థిరపడిన మామి. ఒక్కరోజు కూడా అమె వీటిని తప్పలేదు. ఆమె శ్రీ రబీంద్రనాథ్ ఠాగూర్ గారి ఆశ్రమానికి రోజూ వెళుతుండేది. తొమ్మిది రోజుల పాటు పరమాచార్య స్వామివారి కర్యక్రమాలు చూసి మరుసటిరోజు ఠాగూర్ ఆశ్రమానికి వెళ్ళింది. మామూలుగా కలకత్తా వాసులు దేవి ఉపాసకులు. ఠాగూర్ గారు కూడా శ్రీవిద్యోపాసకులు అయినప్పటికి కొద్దిగా ఆధునిక భావాలు కలవారు. సాహిత్యంపై వారికున్న పట్టు జగమెరిగినది. మామి కొద్దిసేపటి తరువాత ఠాగూర్ గారిని కలిసింది. ఇన్నిరోజులూ కనపడలేదేమిటని ఆవిడని అడిగారు. ఆమె పరమాచార్య స్వామివారు వచ్చారని దేవి నవరాత్రుల సందర్భంగా నవావరణ పూజ, సుమంగళి పూజ, కన్యా పూజ జరిగాయి అని చెప్పింది. పరమాచార్య స్వామివారు కూడా దేవి ఉపాసకులే అని ఠాగూర్ గారు అర్థం చేసుకున్నారు. వెంటనే మామిని, “స్వామిజి కన్యాపూజ బ్రాహ్మణ కన్యతో చేశారా? లేదా వేరే అమ్మాయితో చేశారా?” అని అడిగారు. ”లేదు! పెరియవ ఎప్పుడూ సాంప్రదాయాన్ని తప్పరు. కేవలం బ్రాహ్మణ కన్యతోనే కన్యాపూజ చేశారు” అని చెప్పింది మామి. ప్రపంచ ప్రఖ్యాతి వహించిన సాహితీవేత్త, అందరిచేత గౌరవింపబడే ఆధునికవేత్త అయిన ఠాగూర్, శ్రీ లలితా సహస్రనామం నుండి ‘ఆబ్రహ్మకీటజననీ’ అనే నామాన్ని పలికి మామితో ఇలా అన్నారు. “ఆయన గొప్ప దేవి ఉపాసకులు; మరి ఈ నామానికి అర్థం తెలియదా వారికి? చిన్న పురుగు నుండి బ్రహ్మ వరకు ఆ అమ్మవారే తల్లి జగన్మాత. మరి కన్యాపూజకు బ్రాహ్మణ కన్యే ఎందుకు?” ఠాగూర్ లాంటి వారు పరమాచార్య స్వామివారి గురించి అలా అనడం మామికి కొంచం మనస్థాపం కలిగించింది. ఆమె దీన వదనంతో పరమాచార్య స్వామి వద్దకు వచ్చింది. “నిన్న పూజకు రాలేదేమి?” అని మహాస్వామివారు అడిగారు. ”లేదు నేను ఠాగూర్ గారిని కలవడానికి వెళ్ళాను” అని చెప్పి అక్కడ జరిగిన విషయం చెప్పలా వద్దా అని అలోచిస్తోంది. మహాస్వామివారు అర్థం చేసుకుని మామితో, “వారు నాగురించి ఏమి చెప్పలేదా?” అని అడిగారు. ఇక ఆపుకోలేక కళ్ళ నీరు పెట్టుకుంటూ మొత్తం జరిగిన విషయం అంతా స్వామికి తెలిపింది. పరమాచార్య స్వామివారు నవ్వుతూ, “ఇంకా మూడు పదాలు ఉన్నాయి. ఆ శ్లోకం చదివేటప్పుడు అవికూడా కలుపుకోమను” అని చెప్పారు. ఇప్పుడు మామికి ఉత్సాహం కలిగింది. స్వామివారి సమాధానంలో ఎదో విషయం ఉందని గ్రహించి అది ఏంటని అడిగింది. ముందు వెళ్ళి చెప్పు తరువాత చూద్దాం అన్నారు స్వామివారు. ఇక చేసేది లేక వెంటనే మామి ఠాగూర్ దగ్గరకు వెళ్ళి స్వామివారు చెప్పిన విషయం చెప్పింది. ఠాగూర్ గారు గుర్తుతెచ్చుకున్నారు “ఆబ్రహ్మకీటజననీ వర్ణాశ్రమవిధాయినీ - నిజాజ్ఞారూపనిగమా పుణ్యాపుణ్యఫలప్రదా”. పదే పదే మనసులో మననం చేసుకుంటున్నారు. “అహా! అహా! దేవి సహస్రనామాన్ని అర్థం చేసుకోవలసింది ఇలాగన్నమాట. నాకు తెలియదు ఇప్పటిదాకా! వారు సమాధానమిచ్చారు. స్వామివారు నా ప్రశ్నకు సమాధానమిచ్చారు” అని ఉత్సాహపడుతూ వెంటనే అపరాధ భావనతో “స్వామివారు మహాత్ములు. నేను చెప్పినది వారితో చెప్పావా? అరే! తప్పు జరిగిపోయింది”. వారు యోగ్యులైన సాహితీవేత్త. తరువాత ఏమి చెయ్యాలో వారికి తెలుసు. “నేను తప్పకుండా వారిని దర్శించుకోవాలి. దయచేసి ఏర్పాటు చెయ్యండి. కాని అది బహిరంగంగా కాదు. ఎందుకంటే ప్రతి స్వామిజి నన్ను కలవమని ఒత్తిడి చేస్తారు. తప్పక వారిని దర్శించాలి” అని అన్నారు. మామి సంతోషంగా స్వామివద్దకు వచ్చింది. పరమాచార్య స్వామివారు ఒక శేఠ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఠాగూర్ గారు మహాస్వామిని దర్శించుకున్నారు బయట జనానికి తెలియకుండా. ఠాగూర్ గారు వారి రోజువారీలో రాసుకున్నారు. “ఈ కాలంలో కూడా దర్శింపదగిన మహాత్ములు ఉన్నారు. వారిని దర్శించి నేర్చుకోవలసినది ఎంతో ఉంది” ఆ మహాత్ములెవరో చెప్పాల్సిన పనిలేదు. ఎందరో భక్తులు చెప్పారు. కొంతమంది దర్శించుకున్నారు. సాక్షాత్ దేవి అవతారమైన మహాస్వామివారి నుండి వినడం ఠాగూర్ గారి ఉపాసనా ఫలితం కావచ్చు లేదా పెరియవ కారుణ్యం వల్ల కావచ్చు. [శ్లోకార్థం: చిన్న పురుగు మొదలుకుని బ్రహ్మండంలోని పిపీలికాది పర్యంతం వరకు అందరికీ అమ్మవారే తల్లి. అలాగే వర్ణము, ఆశ్రమము అనే పద్ధతిని విధివిధానాలను ఏర్పాటు చేసిన తల్లి కూడా ఆమెయే. కర్మ అంటూ ఎక్కడ ఉంటుందో అక్కడ వర్ణాశ్రమాలు తప్పకుండా ఉంటాయి. మానవుడు బాగుపడడానికి భగవానుడు ఏర్పరచిన వ్యవస్థ వర్ణాశ్రమ వ్యవస్థ. వర్ణవ్యవస్థ సైంటిఫిక్ వ్యవస్థ. ప్రతివర్ణమూ భగవంతుడు తరించడానికి ఇచ్చిన ఒకానొక మార్గము. ఉపాధిగతంగా అసమానత్వమే. చైతన్యగతంగా సమత్వం. ఎక్కువతక్కువలు లేవు] అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
2 254