కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)
విరాళాలు పంపాల్సిన వివరాలు. A/C Name : Kanchi Paramacharya Dharmika Seva Trust ® A/C. No : 50200059599164 IFSC Code : HDFC0001753 Branch : HDFC Bank UPI ID : 7259859202@hdfcbank Gpay/Phone pay/BHIM/freecharge 7259859202
显示更多📈 Telegram 频道 కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి) 的分析概览
频道 కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి) (@kpdstrust) 泰卢固语 语言赛道中的 是活跃参与者。目前社区聚集了 16 583 名订阅者,在 宗教与灵性 类别中位列第 5 089,并在 印度 地区排名第 25 500 位。
📊 受众指标与增长动态
自 невідомо 创建以来,项目保持高速增长,吸引了 16 583 名订阅者。
根据 29 六月, 2026 的最新数据,频道保持稳定运转。过去 30 天订阅人数变化为 -161,过去 24 小时变化为 -10,整体触达仍然可观。
- 认证状态: 未认证
- 互动率 (ER): 平均受众互动率为 12.29%。内容发布后 24 小时内通常能获得 4.91% 的反应,占订阅者总量。
- 帖子覆盖: 每篇帖子平均可获得 2 038 次浏览,首日通常累积 815 次浏览。
- 互动与反馈: 受众积极参与,单帖平均反应数为 0。
📝 描述与内容策略
作者将该频道定位为表达主观观点的平台:
“విరాళాలు పంపాల్సిన వివరాలు.
A/C Name : Kanchi Paramacharya Dharmika Seva Trust ®
A/C. No : 50200059599164
IFSC Code : HDFC0001753
Branch : HDFC Bank
UPI ID : 7259859202@hdfcbank
Gpay/Phone pay/BHIM/freecharge 7259859202”
凭借高频更新(最新数据采集于 01 七月, 2026),频道始终保持新鲜度与高覆盖。分析显示受众积极互动,使其成为 宗教与灵性 类别中的关键影响点。
| 日期 | 订阅者增长 | 提及 | 频道 | |
| 30 六月 | 0 | |||
| 29 六月 | 0 | |||
| 28 六月 | 0 | |||
| 27 六月 | 0 | |||
| 26 六月 | 0 | |||
| 25 六月 | 0 | |||
| 24 六月 | +2 | |||
| 23 六月 | 0 | |||
| 22 六月 | 0 | |||
| 21 六月 | 0 | |||
| 20 六月 | 0 | |||
| 19 六月 | 0 | |||
| 18 六月 | 0 | |||
| 17 六月 | 0 | |||
| 16 六月 | +3 | |||
| 15 六月 | 0 | |||
| 14 六月 | 0 | |||
| 13 六月 | +3 | |||
| 12 六月 | +3 | |||
| 11 六月 | 0 | |||
| 10 六月 | 0 | |||
| 09 六月 | 0 | |||
| 08 六月 | +3 | |||
| 07 六月 | 0 | |||
| 06 六月 | 0 | |||
| 05 六月 | 0 | |||
| 04 六月 | +2 | |||
| 03 六月 | 0 | |||
| 02 六月 | 0 | |||
| 01 六月 | 0 |
| 2 | నా ప్రాణం కాపాడిన దేవుడు
ఒకసారి చెంగల్పేట్ జిల్లా న్యాయలయ తనిఖీ కోసం చెన్నైనుండి హైకోర్టు న్యాయావాది ఒకరు వచ్చారు. మామూలుగా అతను చెయ్యవలసిన పనులు చాలా ఉంటాయి కనుక అతను ఒక నిర్దుష్టమైన ప్రణాలిక వేసుకుని వస్తుంటారు. అలా తనిఖీ కోసం వచ్చిన సందర్భంలో అతను త్వరగా చెన్నై వెళ్ళిపోవాలి. కనుక తనిఖీ తరువాత చెన్నై వెళ్తూ పరమాచార్య స్వామివారిని మాత్రం దర్శించాలని అనుకున్నారు.
కావల్సిన ఏర్పాట్లు చేసి నేను కూడా వారితో పాటు కార్లో కాంచీపురంలోని శ్రీమఠానికి వెళ్ళాను. మహాస్వామి వారిని దర్శించుకున్నాము. స్వామివారు ఆ జడ్జితో మాట్లాడిన తరువాత అతణ్ణి కంచిలోని కొన్ని ముఖ్యమైన దేవాలయాలకు తీసుకుని వెళ్ళమని నాతో చెప్పారు.
ఈ విషయం జడ్జితో చెప్పడానికి నేను భయపడుతున్నాను. అతను వెంటనే చెన్నై వెళ్ళిపోవాలి, కాని నేను మహాస్వామి వారి ఆజ్ఞను తృణీకరించలేను. చివరికి ఎలాగో విషయాన్ని చెప్పాను. ఆయన అన్యమనస్కంగానే ఒప్పుకున్నాడు. నేను ఆయన్ని కొన్ని దేవాలయాలకు తీసుకుని వెళ్ళాను. చివరికి రెండు గంటల ఆలస్యంగా జడ్జి చెన్నైకి బయలుదేరారు.
అప్పటికే పెద్దగా గాలి వీస్తూ జోరుగా వర్షం పడుతోంది. మేము హైవే సమీపించగానే, గాలులకు రోడ్డుపై అడ్డంగా పడిన ఒక చెట్టుని తొలగిస్తున్న కొంతమంది కార్మికులని చూశాము. విషయం ఏంటని అడుగగా దాదాపు గంటన్నర క్రితం విపరీతంగా వీచిన గాలులకి ఆ పెద్ద చెట్టు పడిపోయిందని వెంటనే కొంతమంది కార్మికుల సహాయంతో దాన్ని తొలగించడానికి మొదలుపెట్టారని చెప్పారు. అప్పుడే మాకు స్వామివారి మాటల్లోని అంతరార్థం తెలిసింది.
మేము మహాస్వామివారి మాటలు కనుక పెడచెవినపెట్టి బయలుదేరిఉంటే ఆ చెట్టు మాకారు పైన పడి ఉండేది లేదా మా ప్రయాణం కొబసాగించడానికి వీలు లేకుండా అక్కడ చిక్కుకుని ఉండేవాళ్ళం. స్వామివారి కారుణ్య పలుకుల వల్ల ఆరోజు మేము రక్షింపడ్డాము. ఈ విషయాన్ని నేను ఎప్పటికి మరచిపోలేను.
--- పి.కె. రామనాథన్, చెన్నై - 24, మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 2
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం | 990 |
| 3 | అప్పు - ఆలస్యం
నా కుమార్తె పెళ్ళికొరకు కొంత ధనం అవసరమై కాంచీపురంలోని ముదలియార్ గారిని అప్పు అడిగాను. తను నాకు ఇవ్వడానికి ఒప్పుకుని, ఫలానా రోజు మధ్యాహ్నం మూడుగంటలకు వచ్చి కలవాల్సిందిగా చెప్పాడు. నేను చెంగల్పేట్ నుండి బయలుదేరి అతను చెప్పిన రోజు కాంచిపురం చేరుకున్నాను. ఆయనను కలిసే ముందు ఒకసారి కంచి పరమాచార్య స్వామివారిని దర్శించుకుందామని శ్రీమఠానికి వెళ్ళాను. మద్యాహ్నం రెండుగంటలకే నాకు మాహాస్వామివారి దర్శనం లభించింది.
అంతేకాక ఎప్పుడూ లేనిది మహాస్వామివారు ఆ ఎండలో తీరుబడిగా అన్ని విషయాలు నాతో ముచ్చటించడం మొదలుపెట్టారు. నా మనస్సంతా మూడుగంటలకు ముదలియార్ దగ్గరకు వెళ్ళాలని ఉంది. వెళ్ళడానికా స్వామివారు అనుమతి ఇవ్వట్లేదు. ఆఖరికి సాయింత్రం అయిదున్నరకి స్వామివారు నన్ను వెళ్ళనిచ్చారు.
వెంటనే ముదలియార్ ఇంటికి పరుగులాంటి నడకతో చేరుకున్నాను. చెప్పిన సమయానికి రానందున అతను మనసు నొచ్చుకుని ఇస్తాడన్న డబ్బులు ఇవ్వడేమో అని మనసులో చాలా భయంగా ఉంది. భయం భయంగానే ఇంటి తలుపు తట్టాను. ఆయనే స్వయంగా తలుపు తీసి ప్రేమతో లోపలికి ఆహ్వానించాడు. ఆయన నాతో, “నేను నిన్ను మూడుగంటలకు రమ్మన్నాను. కాని నేను కొద్దిగా పనిఉండి బయటకు వెళ్ళి ఇదిగో ఇపుడే వచ్చాను. అంతేకాక పంచాగం చూస్తే ఈరోజు సాయింత్రం ఆరుగంటల దాకా సమయం మంచిది కాదు అని తెలిసింది. నిన్ను ఆరుగంటలకు రమ్మని చెప్పి ఉంటే బావుండేది అని అనుకున్నాను. కాని నీకై నువ్వే మంచి సమయానికి వచ్చావు. ఇప్పుడు ముహూర్తం కూడా భేషుగ్గా ఉంది. ఇప్పుడు తీసుకో నీకు అప్పుగా ఇస్తానన్న ధనం” అని అన్నారు.
నన్ను ఎవరో తలపై గట్టిగా కొట్టినట్టు అనిపించింది. నాకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వకుండా పరమాచార్య స్వామివారు అంతసేపు నన్ను అక్కడ ఎందుకు ఉంచుకున్నారో ఇప్పుడు అర్థం అయ్యింది.
--- పి.కె. రామనాథన్, చెన్నై-24. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 6
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/paramacharyavaibhavam
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం | 1 294 |
| 4 | 没有文字... | 1 314 |
| 5 | Vijaya Yatra of Shri Kanchi Kamakoti Peetadhipati Jagadguru Pujyashri Shankara Vijayendra Saraswati
Shankaracharya Swamiji to New Delhi
- Tentative SCHEDULE- 30thJune - 7th July 2026 | 1 |
| 6 | దుప్పటి - దయ
పరమాచార్య స్వామివారు సతారాలో మకాం చేస్తున్నారు. అది చలికాలం. స్వామివారు బాలు మామకి ఒక దుప్పటిని ఇచ్చి కుంబకోణం పట్టు పాట్టికి ఇవ్వమని చెప్పారు. కుంబకోణం పట్టు పాట్టి పరమాచార్య స్వామివారికి పెద్ద భక్తురాలు. ఆమెకు సంతానం లేకపోవడంతో ఆమెకున్న రెండు ఇళ్లనూ కంచి మఠానికి ఇచ్చివేసింది. ఆమె చాలా మంచి మనసు కలది. అందరితోనూ బాగా కలివిడిగా ఉండేది.
ఆరోజు రాత్రే మహాస్వామివారు నిద్రనుండి మేలుకొని, బాలు మామని నిద్రలేపి దుప్పటిని పాట్టికి ఇచ్చావా? అని అడిగారు. బాలు మామ ఆ విషయం మరచిపోవడంతో అలా చూస్తూ నిలబడిపోయారు.
వెంటనే వెళ్లి ఆమె ఎక్కడుందో వెతికి ఆమెకు దుప్పటి ఇమ్మని పరమాచార్య స్వామివారు ఆదేశించారు. అది మధ్యరాత్రి కావడంతో చలి చాలా తీవ్రంగా ఉంటుందని, బయటకు వెళ్ళడానికి బాలు మామ భయపడి ఉదయం ఇస్తానని చెప్పారు.
“లేదు! ఇప్పుడే ఈ దుప్పటి తనకి చేరాలి. ఈ రాత్రి చాలా చలిగా ఉంది” అని చెప్పారు స్వామివారు. ఇక చేసేదిలేక ఆ రాత్రిలో ఆమెను వెతుకుతూ వెళ్ళారు బాలు మామ. వెతకగా వెతకగా చివరికి కబిలేశ్వర్ ఇంటి దగ్గర కనపడ్డారు పాట్టి. ఆమె చెలికి తాళలేక గజ గజ వణుకుతూ నేలపై పడుకుని ఉంది. మహాస్వామివారు ఎందుకు ఆ క్షణమే ఆ దుప్పటి ఇమ్మని చెప్పారో బాలు మామకు ఆపుడు అర్థం అయ్యింది. పాట్టి ఆ దుప్పటిని తీసుకోని కప్పుకుంది. జగద్రక్షకుని రక్షణలో ఉన్నట్టు తన్మయత్వం పొందింది పాట్టి. స్వామివారి కరుణ అపారం కదా!
ఇలాంటి సంఘటన ఒకటి బాలు మామ జీవితంలో కూడా జరిగింది. ఇంతటి కరుణను స్వయంగా అనుభవించారు బాలు మామ. ఒకసారి తీవ్రమైన చలికాలంలో దేవాలయ ఆవరణంలో పడుకున్నారు బాలు మామ. కప్పుకోవడానికి దుప్పటి కూడా లేదు. ఉదయం నిద్రలేవగానే ఇంతటి తీవ్రమైన చలిలో ఇంత సుఖంగా పడుకున్నానేమిటా అని ఆశ్చర్యం వేసింది మామకి. చూడగా వారిపై ఒక శాలువా కప్పబడి ఉంది. ఎవరో మఠంలో ఉన్న తన తోటివారు ఎవరో కప్పి వెళ్ళుంటారని అనుకోని దాని విషయం మరచిపోయారు.
నాలుగు రోజులు గడిచిపోయాయి. స్వామివారు బాలుమామ దగ్గరున్న శాలువా చూసి చాలా బావుందని అది ఎక్కడిదని అడిగారు. మఠంలోని వారే ఎవరో తనపై కప్పి వెళ్ళారని చెప్పారు బాలు మామ. అది విని స్వామివారు చిన్నగా నవ్వి, అది నేనే అన్నట్టుగా స్వామివారు చేతితో సైగ చేశారు.
“ఆ చల్లని నేలపై పైవస్త్రం కూడా లేకుండా పడుకుని ఉన్నావు. మరి మీ అమ్మగారు నిన్ను అలా చూస్తే ఏమనుకుంటారు?” అని అన్నారు.
పరమాచార్య స్వామివారి అపార కరుణ చలికాలంలో వెచ్చదనం, ఎండాకాలంలో నీడ, వర్షాకాలంలో గొడుగు వంటిది. మనల్ని మనం వారికి సమర్పించుకొని జీవితంలో సుఖసంతోశాలను పొందుదాం
--- శ్రీ ప్రదోషం మామ గృహం ‘రేర్ జెమ్స్’ నుండి.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/KPDSTrust
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం | 1 463 |
| 7 | Video from Rajavikram Paruchuru | 1 392 |
| 8 | Video from Rajavikram Paruchuru | 60 |
| 9 | కాశీలోని మానససరోవర్ ఘాట్ లో మన ట్రస్ట్ సహాయ సహకారాలతో జరిగే నిత్య నారాయణ సేవ | 1 330 |
| 10 | అనారోగ్యం - అరటిదూట
ఒక భక్తురాలికి ఆమె కొడుకు తప్ప వేరే ఆధారం లేదు. ఆ అబ్బాయికి ఏదో చర్మవ్యాధి వచ్చి వేగంగా శరీరమంతా వ్యాపించి బాధిస్తోంది. వొళ్ళంతా చాలా దురదగా ఉంటుంది ఆ అబ్బాయికి. బాధ తట్టుకోలేక గోకితే చర్మం పగిలి తీవ్ర రక్తస్రావమయ్యి, పెద్ద పుండు పడేది. ఆ మాతృహృదయం పిల్లవాడి బాధను చూడలేకపొయింది. పరమాచార్య స్వామి దగ్గరకు వచ్చి తన కష్టాలని చెప్పుకుంది.
"మీ అనుగ్రహం వల్లనే నా కొడుకు వ్యాధి నయం అవ్వాలి పెరియవ. నేను మందుల ఖర్చు కూడా భరించలేని స్థితిలో ఉన్నాను. మీరు తప్ప నాకు దిక్కు లేదు" అని వేడుకుంది.
మహాస్వామివారు ఆమెను ఆమె కొడుకుని మఠంలోనే ఉండమని చెప్పారు. ఆ పిల్లవాడితో, "నేను భిక్ష చేసాక మిగిలినది తప్ప నువ్వు ఏమీ తినకు, తాగకు - కాఫీ, టీ, పాలు కూడా ఏమీ తీసుకోకూడదు" అని ఆజ్ఞాపించారు. ఆ తల్లి చాలా సంతోషంతో గురు ఆదేశాన్ని పాటించడానికి అంగీకరించింది.
స్వామివారు శ్రీమఠం వంట బృందానికి కొన్ని సూచనలు ఇచ్చి, తాను మరలా చెప్పేదాకా వాటిని పాటించవలసిందిగా సూచించారు. స్వామివారు కేవలం అరటిచెట్టు యొక్క దూట లోపలి భాగాన్ని మాత్రమే భిక్షగా స్వీకరించేవారు. వంటవాడు అరటి దూటను ముక్కలుగా తరిగి కొంచెం ఉప్పువేసి ముక్కల్ని ఉడికించేవాడు. మహాస్వామి వారు దాన్ని భిక్షగా స్వీకరించి కొద్దిగా మజ్జిగను త్రాగేవారు. స్వామివారు తినగా మిగిలిన అరటి దూట పదార్థాన్ని, మజ్జిగని ఆ పిల్లవాడికి పెట్టేవారు. మొదట్లో అతనికి ఈ భోజనం సహించేది కాదు. కాని తనకి గురూచ్చిష్టం తినే భాగ్యం కలిగింది అని గ్రహించి ఆనందంగా పెట్టింది తినేవాడు.
ఒక 10 రోజులయ్యాక దురద మరియు చర్మం పైన ఉన్న మచ్చలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టసాగాయి. రోజులు గడుస్తున్న కొద్దీ వ్యాధి తగ్గి చర్మం తేటపడి ఆరోగ్యంగా తయారౌతోంది. మండలం రోజులయ్యేసరికి అతని చర్మ వ్యాధి పూర్తిగా నయమయ్యి ఆ పిల్లవాడు కొత్త తేజస్సుతో ప్రకాశిస్తూ కనిపించాడు. ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు.
"నా కొడుకు అదృష్టాన్ని ఏమని చెప్పగలను. పూర్వ జన్మ పాప కర్మ వలన ఈ చర్మ వ్యాధి వచ్చింది అని అనుకున్నాను. కాని, పూర్వ జన్మ పుణ్య ఫలం వల్లనే ఈ వ్యాధి వచ్చింది. ఎందుకంటే మండలం రోజుల పాటు ప్రతి రోజూ పరమాచార్య స్వామి ఉచ్చిష్ఠం తినే భాగ్యం ఎవరికి కలుగుతుంది" అని ఆ తల్లి ఆనంద పడింది
"ఇది కేవలం అరటిదూట లోని ఔషధ గుణాల వలన మాత్రమే తగ్గింది" అని మహాస్వామివారు అన్నారు.
"అరటి దూట ఔషధం అతని బాధను నివారించడానికి ఒక నెపం మాత్రమే. కేవలం మీ ఉచ్చిష్టాన్ని భుజించడం వల్లనే అది తగ్గింది" అని ఆ తల్లి పరిపూర్ణ కృతఙ్ఞతా భావంతో స్వామికి నమస్కరించింది.
--- సుజాత విజయరాఘవన్, ‘ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డివైన్’ పరమాచార్య అనుభవాల సంగ్రహం 1
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం | 1 518 |
| 11 | ఉత్సవానికి వస్తావా?
అవి నేను కాలేజిలో చదువుకుంటున్న రోజులు. అప్పుడు పరమాచార్య స్వామివారు అంటే తెలుసు కాని, వారిపై ప్రత్యేకమైన భక్తీ ఏమి లేదు. హఠాత్తుగా ఒకసారి స్వప్న దర్శనం ఇచ్చారు మహాస్వామి. కాని అది ఎదో ఊహ అని కొట్టిపారేయలేను. వారు తరచుగా స్వప్న దర్శనం ఇస్తూనే ఉన్నారు.
మరి ఆ స్వప్న దర్శనాలను గౌరవించాలి కదా? అందుకే ప్రతి గురువారం ఉపవాసం చెయ్యడం ప్రారంభించాను. అప్పటినుండి ప్రతి గురువారమూ నాకు దర్శనభాగ్యం ప్రసాదించేవారు. అది చాలా సంతోషకరమైన విషయం. కాని ఎంతోకాలం నిలువలేదు.
మహాస్వామివారు కలలో రావడం ఆగిపోయింది. నా వల్ల ఏమి తప్పు జరిగిందో అర్థం కాలేదు. ఆ రోజు గురువారం. నా మంచంపై కూర్చుని నిద్రకుపక్రమిస్తూ కళ్ళుమూసుకుని, “కనీసం ఈరోజైనా మీ దర్శనభాగ్యం నాకు కలగాలి” అని వేడుకున్నాను.
ఊహు! పెరియవ రాలేదు.
రెండురోజుల తరువాత పరమాచార్య స్వామివారు నా కలలో కన్పించారు. “ఇంతకుముందు పరమాచార్య స్వామివారు తరచుగా నాకు స్వప్న దర్శనం ఇచ్చేవారు. ఈమధ్య అస్సలు రావడం లేదు” అని బాధతో స్వామివారిని అడిగాను.
మహాస్వమైవారు చిన్నగా నవ్వి, “నాకు వయసైపోయింది కదా! నేను ఇప్పుడు ముసలివాణ్ణి. నేను దిన్ని మోసుకుని అంట దూరం రాలేను కనుక నువ్వే నా దర్శనానికి రా” అని దండం వైపు చూపిస్తూ చెప్పారు.
“పరమాచార్య స్వామి అనుగ్రహం నేను తప్పక రాగాలను”
“మరి ఉత్సవానికి వస్తావా?”
“మీ అనుగ్రహం ఉంటే తప్పక వస్తాను పెరియవ”
కల చదిరిపోయింది. నాకు ఏమి అర్థం కాలేదు. నేను ఏ ఉత్సవానికి వెళ్ళాలి? దానికి పరమాచార్య స్వామి దర్శనానికి సంబంధం ఏమిటి?
కాని ఆ ఆశ్చర్యకర సంఘటన మరుసటి రోజునే జరిగింది. మా పెద్దమ్మ చెన్నైలో ఒక వివాహానికి వెళ్ళాల్సి ఉంది. తనతో రమ్మని నాకు చెప్పింది. “నీవు కూడా వస్తే, అలాగే కాంచీపురం వెళ్లి పరమాచార్యుల దర్శనం చేసుకుందాము” అని చెప్పింది.
నేను వెంటనే అంగీకరించాను.
మరుసటిరోజు కంచి మఠం ప్రధాన ద్వారం దగ్గరకు చేరుకోగానే, ఊరెరిగింపుగా వచ్చిన కామాక్షి అమ్మవారు అక్కడ నిలబడి ఉంది. అక్కడ చాలామంది భక్తులు ఉన్నారు. అమ్మవారి చుట్టూ ముగ్గురు పెరియవలూ(మహా పెరియవ, పుదు పెరియవ, బాల పెరియవ) ప్రదక్షిణం చేస్తున్నారు.
“ఏమిటి ఈరోజు విశేషం” అని అక్కడున్న ఒకావిడని అడిగాను.
“నీకు తెలియదా? కామాక్షి అమ్మవారి ఆలయ ఉత్సవం జరుగుతోంది” అని చెప్పిందావిడ.
నాకు కలిగిన ఆశ్చర్యం ఆనందం గురించి చెప్పాల్సిన పనిలేదు. “ఉత్సవానికి వస్తావా?” అన్నది కేవలం కల కాదు. అది దైవ సంకల్పం.
--- జానా కణ్ణన్, మైలాపూర్. మహా పెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 5
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం | 1 745 |
| 12 | ఘటస్థ - పటస్థ
పరమాచార్య స్వామివారు చెక్కబల్లకు ఆనుకుని కాళ్ళు చాపుకుని కూర్చుని ఉండటం అందరూ చూసే అద్భుత దృశ్యం. ముఖ్యంగా స్వామివారు మేనాలో కూర్చుని దర్శనం ఇస్తున్నప్పుడు స్వామివారు కాళ్ళు చాపుకునే ఉంటారు.
“మహాస్వామి వారు కళ్ళు పెట్టుకోవడానికి ఒక మెత్తటి పాదపీఠం తయారుచేస్తే ఎలా ఉంటుంది?”
వెంటనే రబ్బరుతో తయారుచేసిన తేలికగా, మెత్తగా ఉన్న స్పాంజిని తీసుకుని వచ్చి పెద్దగా వలయాకారంగా కత్తిరించాను. దాన్ని వెల్వెట్టు గుడ్డతో కప్పి, ఎనిమిడ్ దళాల కమలం పువ్వు ఆకారంలో కుట్టాను. మధ్యలో వేరొక రంగుతో కుట్టి, చుట్టూతా లేసుతో చెక్కగా అలంకరించాను.
నేను స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారు మేనాలో కూర్చుని ఉన్నారు.
నేను మా అమ్మగారు కలిసి స్పాంజితో చేసిన పాదపీఠాన్ని పరమాచార్య స్వామి వారికి సమర్పించాము (మేనా ముందర ఉన్న నేలపైన పెట్టాము). వెంటనే స్వామివారు “అష్టాదళం” అని అన్నారు. మేనా లోపల నుండి కాళ్ళను బయటకు తీసి, ఆ పాదపీఠంపై ఉంచారు. మాకు అంతో సంతోషం కలిగింది. ఇద్దరమూ పులకించిపోయాము. స్వామివారు “సరే అక్కడ ఉంచి వెళ్ళండి” అని అనకుండా భక్తితో సమర్పించిన ఆ పాదపీఠాన్ని తము స్వీకరిస్తున్నట్టుగా వెంటనే తమ పాదాలతో పావనం చేశారు. ఇంతకంటే భాగ్యం ఏముంటుంది?
పక్కనే ఒక సేవకుడు నిలబడి ఉన్నారు. “లలితా సహస్రనామ ధ్యాన శ్లోకం తెలుసునా?” అని అడిగారు స్వామివారు.
ఒక నిముషం పాటు ఆలోచించి, “అరుణాం కరుణా తరంగితాక్షీం . . .” మొదలుపెట్టాడు ఆ సేవకుడు.
“వేరొకటి”
“సింధూరారుణ విగ్రహాం . . .”
“హా అదే! చూడు, అక్కడ ఒక పండితుడు నిలబడి ఉన్నాడు కదా! తన వద్దకు వెళ్లి ఈ శ్లోకంలో వచ్చే ‘రత్నఘటస్థ-రక్తచరణాం’ అన్నదానికి అర్థం అడుగు” అని ఆదేశించారు.
ఆ సేవకుడు పండితుని వద్దకు వెళ్లి తిరిగొచ్చి స్వామివారితో ఇలా చెప్పాడు. “దాని అర్థాన్ని ఆయన, ‘అమ్మవారు తన ఎర్రని పాదాలను అమూల్యమైన రత్నములచే చెయ్యబడిన నీటి కుండపై ఉంచింది’ అని చెప్పారు పెరియవా”.
మేనా పక్కనే మరొక్క పండితుడు ఉన్నాడు. అతనివైపు చూసి మహాస్వామి వారు, “శాస్త్రిగారూ! చాలాకాలం నుండి నాకు ఒక సందేహం ఉంది. అదేంటంటే, ‘ఎందుకు అమ్మవారు తన పాదాలను ఘటం పైన ఉంచింది? అది ఇక్కడ అంత సరి లేదు అనిపిస్తోంది కదా?’” అని అన్నారు.
అందుకు ఆ పండితుడు అవునన్నట్టు తల పంకించాడు. “మరి దానికి నీవు ఏమని వివరణ ఇస్తావు” అని స్వామివారి నుండి అడిగించదలుచుకోలేదు ఆ పండితుడు.
“అది ఇక్కడ అంత అర్థవంతంగా లేదు కదా?”
“అవును పెరియవా”
“ఇప్పుడు ఈ పాదపీఠాన్ని చూడడంతో నా అనుమానం నివృత్తి అయ్యింది” అని స్వామివారు ఇలా విశ్లేషించారు.
“అమ్మవారు తన ఎర్రని పాదాలను ఇటువంటి పాదపీఠంపై ఉంచారు అన్నది సరిగ్గా ఉంటుంది. ‘ఘటస్థ’ అని ఉన్న చోట ‘పటస్థ’ అని ఉంచితే సరిపోతుంది అని అనిపిస్తుంది. ‘పటం’ అంటే బట్ట, అంటే మెత్తని పాదపీఠం. ఈ పదము ముందు ‘పాటస్థ’ అనే ఉన్నదేమో, అది వాడుకలో ‘ఘటస్థ’ అయి ఉండవచ్చు అని నా ఆలోచన. కాబట్టి మనమ ‘పాటస్థ’ అంటే ‘బట్టపై’ అంటే ‘మెత్తని ఉన్ని బట్టపై’(ఎందుకంటే అది అమ్మవారి లేలేత పాదాలకు ఇబ్బంది పెట్టదు) అనే సమ వాచకాన్ని మనం తీసుకోవాలి.”
ఇది విన మాకు కలిగిన ఆశ్చర్యానందాల నుండి బయటపడడానికి చాలా సమయమే పట్టింది.
ఈ వెల్వెట్ పాదపీఠం!
ఏ అర్హతా లేని, ఏమీ తెలియని నా సమర్పణ వల్ల మహాస్వామివారి అనుమానం నివృత్తి అయినది అని చెప్పటం ఒక్క పరమాచార్య స్వామివారికే సాధ్యం.
పరమాచార్య స్వామివారు కరుణ, ఆనందం వల్ల హృదయం ద్రవమై కళ్ళ నుండి వచ్చే నీరు, రెండూ ఆక్కడితో ఆగలేదు.
--- జానా కణ్ణన్, మైలాపూర్. మహాపెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 5
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం | 1 786 |
| 13 | లాల్గుడి లాలింపు
1975లో ప్రముఖ వాయులీన(Violin) విద్వాంసులు లాల్గుడి జయరామన్ గారు, ధర్మపత్ని శ్రీమతి రాజలక్ష్మితో కలిసి కాంచీపురం శివార్లలోని తేనంబాక్కంలో మకాం చేస్తున్న పరమాచార్య స్వామి దర్శనానికి వెళ్ళారు. అయన ఆశ్రమం చేరేసరికి అక్కడ వాతావరణం ఒకింత అందోళనగా ఉంది. స్వామి సిబ్బంది వర్గంలో ఉన్న ఒక సభ్యుని ప్రవర్తన నచ్చని స్వామివారు ఆశ్రమంలోని ఒక గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసి కాష్ఠమౌనం పాటిస్తున్నారు.
ఆ కాష్ఠమౌనం నియమాలు సామన్యమైనవి కావు. ఆహారపానీయాలు లేకుండా శరీరంలో ఏ మాత్రం కదలిక లేకుండా మౌనులై ఉంటారు. ఈ సమయంలో స్వామివారి దర్శనం కష్టం అని తలచి లాల్గుడి గారు స్వామి వారికి కనీసం కొన్ని కీర్తనలను అంజలిగా సమర్పించి వెళ్ళిపోదామని తలచి వాయులీనంపై కీర్తనలు వాయించడం మొదలుపెట్టారు.
స్వామివారికి ఇష్టమైన సామరాగంలో స్వరపరచిన కీర్తన వాయించిన తరువాత, అభోగి రాగంలో గోపాలకృష్ణ భారతి స్వరపరచిన "సభాపతిక్కు వేరు దైవం సమానగుమా?(సభాపతి అంటే చిదంబరం నటరాజ స్వామికి సమానమైన వేరు దైవమున్నదా?)" అనే కీర్తన అందుకున్నారు. ఆ కీర్తనలోని అనుపల్లవి అయిన, "కృపానిధి ఇవరపోలై కిడైక్కుమో ఇంద భూమి తణ్ణిల్ (నీ వంటి కరుణాంతరంగులు ఈ భూమిపై ఇంకొకరు కలరా)" అని వాయిస్తూ ఉండగా స్వామివారు ఉన్న గది కిటికి అకస్మాత్తుగా తెరుచుకుంది. కీర్తన అయిపోవస్తుండగా స్వామి వారు తలుపులు తీసి, చెయ్యెత్తి ఆశీర్వదిస్తూ అభయ హస్తంతో బయటకు వచ్చారు.
--- శ్రీమతి లక్ష్మీ దేవనాథ్, ‘ఎన్ ఇన్క్యూరబల్ రొమాంటిక్’ నుండి
ఆ కీర్తన యమ్.యస్. అమ్మ గళంలో
https://www.youtube.com/watch?v=2LwfhsiO3B4
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం | 1 773 |
| 14 | పగుళ్లు మాయం
పరమాచార్య స్వామివారి భక్తురాలైన శ్రీమతి కనకమ్మ రామస్వామి ఒక సంఘటనను శ్రీ రా. గణపతి గారి ద్వారా మనకు చెబుతున్నారు.
శ్రీమతి కనకమ్మ రామాస్వామికి ఉన్న ఒకేఒక కోరిక, పరమాచార్య స్వామివారి దివ్య చరణాలకు గంధం పాదుకలు సమర్పించాలని. విశ్వాన్ని తమలో ఇముడ్చుకున్న పాదాలు అవి.
గంధం ముద్దలో స్వామివారి పాద కమలాల అచ్చు తీసుకుని, వాటిని తన ఇంటిలోని పూజా మందిరంలో ఉంచుకుని రోజూ పూజ చేసుకోవాలన్నది ఆమె ఆశ. గంధం ముద్దలు తయారుచేసుకుని స్వామివారి దర్శనానికి వెళ్లింది.
పరమాచార్య స్వామివారు గురు, పరమ గురువుల బృందావనాలు ఉన్న కలవైలో ఈ సంఘటన జరిగింది. ఆమె భక్తికి, ఆమె కుటుంబ సభ్యుల విశ్వాసానికి, ధర్మబద్ధమైన భక్తుల కోరికలు తీర్చడం కోసం స్వామివారు ఆ గంధంలో తమ పాదాలను ఉంచారు. స్వామివారు ఎంతసేపు వారి పాదాలను అలా పెట్టారు అంటే, స్వామివారికి జలుబు చేస్తుందేమో అని ఇతర భక్తులు కలవరపడే అంతసేపు. ఈ సంఘటన శుక్ల నామ సంవత్సర పురట్టాసి మాసం కృష్ణపక్ష షష్ఠి బుధవారం రోజున జరిగింది.
శ్రీమతి కనకమ్మ సంతోషంతో ఇంటికి తీసుకునివెళ్లింది. మూడు నెలలు గడచిన తరువాత ఆమె ఏదో విషయమై కలవరపడడం మొదలయ్యింది.
గంధంలో తేమ ఇంకిపోయి ఎండిపోవడం మొదలవ్వడంతో పగుళ్లు కనిపించడం మొదలయ్యింది. ఆమె రోజూ స్వామివారి పాదాలకు ప్రార్థిస్తూ ఆ పగుళ్ళ గురించి విచారిస్తోంది. ఈ విషయం ఎబరికి చెప్పాలో అర్థం కాక, ఇక నేరుగా స్వామివారికే చెప్పాలని నిశ్చయించుకుంది. ఆరోజు స్వామివారి దర్శనం కోసం చాలామంది భక్తులు వేచివున్నారు.
వరుసలో నిలబడి స్వామివారి ముందుకు రాగానే, పూలతో కప్పిన గంధం పాదుకలను స్వామివారికి ఇవ్వగలిగింది కానీ, పగుళ్ళ గురించి చెప్పడానికి కుదరలేదు. స్వామివారు తమ తలపై ఉన్న శమీ పూలమాలను పాదుకలపై ఉంచి ఆమెకు వెనక్కిచ్చారు. పగుళ్ళ గురించి స్వామివారికి చెప్పనందుకు ఆమె బాధపడుతోంది.
వసంత పంచమి రోజున మాయవరంలో సీతా పాట్టి పాఠశాలలో ఉన్న ఆచార్యుల సన్నిధిలో ఆ పాదుకలను ప్రతిష్టించమని మహాస్వామి వారు ఆదేశించారు. ఈ మాటలు చెప్పి వరుసలో నిలబడ్డ మరో భక్తునితో మాట్లాడడం మొదలుపెట్టారు. స్వామివారు శమీ పూలమాలతో ఆశీస్సులను అందించినా, ఆ పగుళ్ళ విషయం చెప్పలేకపోయినందుకు ఇంకా బాధపడుతూనే ఉంది. చెన్నైకి వెళ్తూ కూడా ఆలోచనలన్నీ దీనిపైనే ఉన్నాయి. ఈ విషయం ఎవరికైనా చెప్పి, దాన్ని బాగుచేసే ఉపాయం ఏదైనా తెలుసుకోవాలి అనుకుంది. ఏదైనా స్వామివారు అనుకున్నట్టుగానే జరుగుతుంది అని తనని తాను సముదాయించుకుంది. ఇంటికి చేరుకున్న తరువాత దాన్ని బాగు చేసే ఉపాయాల గురించి ఎవరినైనా అడుగుదామని అనుకుంది. ఆ పాదుకలపై ఉన్న పూలను తొలగించగానే ఆశ్చర్యంగా పగుళ్లు అన్నీ మాయం!!
పగుళ్ళన్నీ ఏమయిపోయాయి? అన్ని నెలలపాటు కనిపించిన పగుళ్లు ఒక్కరోజులో ఎలా మాయం అయ్యాయి? మహాస్వామివారు చూడగానే ఇలా అయ్యిందా? లేదా స్వామివారి దివ్యసన్నిధిలో ఉండడం వల్లనా? లేక శమీ పూలమాల వీటిపై ఉంచడం వల్ల జరిగిందా?
ఆ ఆశ్చర్యం నుండి తేరుకోవడానికి కనకమ్మకు చాలా సమయమే పట్టింది. ఆ పగుళ్లు ఎంతలా బాగు ఆయ్యాయి అంటే, మరలా ఇక పగుళ్లు రానట్టుగా అయ్యింది. స్వామివారి ఆదేశానుసారం వసంతపంచమి దాకా వాటిని పూజించింది. రత్నాలతో అలంకరించి, వాటిని ఒక గాజు పెట్టెలో పెట్టింది. శ్రీ గురు శరణం అన్న శ్లోకాన్ని కూడా చెక్కించి ఈ పాదుకాలతోపాటు ప్రతిష్టించలాని అనుకుంది.
వాటిని మాయవరంకు తీసుకునివెళ్ళడానికి ముందు పరమాచార్య స్వామివారిని దర్శించుకోవాలని కాంచీపురం వచ్చారు. ఆశీస్సుల కోసం మరలా స్వామివారికి సమర్పించారు. స్వామివారు ఆ పాదుకలను ధరించి సరిగ్గా ఉన్నాయా లేదా అని చూశారు. ముందరికాళ్లపై కూర్చుని ఆచమనం చేశారు. స్వామివారు ఎడమకాలిపై నీరు చెల్లుకోగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ఎడమకాలే కదా కుంచితపాదం? ఆ ఎడమకాలే కదా యముణ్ణి తన్ని ఆయుష్షు ప్రసాదించేది? అందుకనే స్వామివారు ఎడమకాలు ఎంచుకున్నారు.
దేన్నంతటినీ చూస్తున్న కనకమ్మ ఆనందించడం పోయి ఇంకా కంగారు పడ్డారు. నీళ్ళు వెయ్యడంవల్ల వాటిపై ఉన్న పాదముద్రలు పోతాయేమో అని ఆవిడ భయం. మరలా ఆ పాదుకలు ఆకృతి కోల్పోయి గంధం ముద్దగా మారిపోతాయేమో.
కానీ ఆ పాదుకలు అలాగే ఉన్నాయి. దీన్ని చూడగానే శ్రీమతి కనకమ్మ ఎంతో సంతోషపడింది. పరమాచార్య స్వామివారు కాక ఇంతటి లీల ఎవరు చెయ్యగలరు? 30-01-1990న ఎంతో వైభవంగా ఆ పాడుకలను ప్రతిష్టించి ఈనాటికీ పూజలు చేస్తున్నారు.
--- “శ్రీ మహాపెరియవా మహిమై” పత్రిక నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం | 1 862 |
| 15 | సన్యాసి సంకల్పం
ఒకసారి పరమాచార్య స్వామివారు ఆంధ్ర దేశంలోని కర్నూలులో చాతుర్మాస్యం చేస్తున్నారు. పరమాచార్య స్వామివారిని సాక్షాత్ ఈశ్వర స్వరూపంగా భావించే శ్రీ జనార్ధనానంద సరస్వతి అనబడే సన్యాసి ఒకరు ఈ పుణ్యదినాలలో మహాస్వామివారితో గడపాలని నిశ్చయించుకున్నారు. వారు పాదయాత్రగా విజయావాడ నుండి బయలుదేరి వస్తున్నారని మహాస్వామి వారికి కబురందింది.
ఆ విజయవాడ స్వామి పాదయాత్ర మొదలుపెట్టిన రెండు మూడు రోజులకి, పరమాచార్య స్వామివారు మఠంలో పనిచేస్తున్న శ్రీ ఏకాంబరం మరియు శ్రీ మెట్టూర్ రాజులను ఒక కారులో విజయవాడ వెళ్లవలసినదిగా ఆదేశించారు. అలాగే పూజ్యశ్రీ విజయవాడ స్వామివారిని కలిసి వారిని కారులో ఇక్కడికి తీసుకురావలసిందిగా చెప్పారు.
అక్కడున్న భక్తులు ఈ మాటలను విని అయోమయంలో పడ్డారు. సన్యాసులు కారులో తిరగడం మహాస్వామివారు ఎన్నటికి ఒప్పుకోరు. అలా చెయ్యమని ఆదేశించరు కూడా. ఎందుకంటే అది సన్యాస ధర్మానికి విరుద్ధం కనుక.
ఆ విజయవాడ స్వామివారిని ఎలా కలుసుకోవాలో వీరికి తెలియదు. జనార్ధనానంద సరస్వతి స్వామివారు తమ పర్యటనకు ముందుగానే ప్రణాళిక వేసుకోలేదు కనుక వార్తాపత్రికలలో కూడా ఎక్కడా సమాచారము లేదు. వారిద్దరూ గుంటూరు చేరుకొని చుట్టుపక్కల ప్రాంతాలలో వెదకసాగారు. చివరికి వారికి ఆ స్వామివారు శివాపురం అనే ఒక చిన్న గ్రామంలో తారసపడ్డారు.
వచ్చినవారి నోటివెంట పరమాచార్య స్వామివారి ఆదేశాన్ని వినగానే విజయవాడ స్వామివారు అమితాశ్చర్యానికి లోనయ్యారు. ఆనందంతో, సంభ్రమాశ్చర్యాలతో పరమాచార్య స్వామివారిని సాక్షాత్తు ఆ కైలాస వాసి పరమేశ్వరుడే అని వేనోళ్ళ కొనియాడారు.
మహాస్వామివారిని దర్శించాలనే కోరికతో ఆ ముందురోజు వరకూ కర్నూలు వైపు పాదయాత్ర చేశారు. హటాత్తుగా కాలినరం ముడిపడి ఇబ్బంది పెట్టడంతో శివపురంలో ఆగవవలసి వచ్చింది. చాలా ఆందోళన చెందిన స్వామివారు మహాస్వామి వారిని ఇలా కొనియాడారు. “ఈశ్వరా! కైలాసనాథుడవైన నీకు కనీసం ఒక ముసలి ఎద్దు అయినా వాహనంగా ఉంది. కానీ ఇప్పుడు కంచినాథుడుగా, పరమాచార్యులుగా వచ్చిన నీవు, ఉన్న ఆ ఎద్దును కూడా వదిలిపెట్టి మొత్తం దేశం అంతా పాదచారియై తిరగడానికి నిర్ణయించుకున్నావు”
వారు చికిత్స తీసుకుని పాదయాత్రగానే కర్నూలుకు వెళ్లాలని నిర్ణయించుకుని ఉంటే వారు తడుపారు చాతుర్మాస్యానికే చేరేవారు. విజయవాడ స్వామీ బాధను చూసి మహాస్వామివారే వారికి చేయూతనివ్వదలచి వారిని పిలుచుకుని రావడానికి కారుని పంపారు. వారు సాక్షాత్ శంకరావతారులు కాబట్టే ఇది స్వామివారికి సాధ్యమైందని గ్రహించారు జనార్ధనానంద సరస్వతి స్వామి.
కాలినెప్పితో బాధపడుతున్న స్వామివారు అతికష్టంపై కారు ఎక్కి కూర్చున్నారు. కర్నూలుకు ప్రయాణించి పరమాచార్య స్వామివారి దివ్యసన్నిధికి చేరుకున్నారు. చాతుర్మాస్య సంకల్పంతో పాటు వారి కాలి నరం బాధను కూడా మహాస్వామివారు కరుణతో తొలగించారు.
--- ‘ప్రదోషం మామ గృహం న్యూస్ లెటర్’ నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/KPDSTrust
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం | 1 273 |
| 16 | పరమాచార్య ప్రసాద మహిమ
పరమాచార్య స్వామివారి భక్తుడైన శ్రీ జయరామన్ చెన్నై పశ్చిమ మాంబళంకు చెందిన గొప్ప భక్తుడు మరియు స్వామివారికి ఎంతో సేవ చేసుకున్నవారు. వారి కుటుంబం మొత్తం మహాస్వామివారికి మరియు కామకోటి మఠానికి విధేయులు. పశ్చిమ మాంబళంలో ఉన్న శంకర మఠం భూమి విరాళం కోసం వీరు ఎంతగానో సహాయం చేశారు.
ఒకసారి మహాస్వామివారు ఆంధ్రదేశంలోని సుబ్బనాయుడు ఖండ్రిగ అనే గ్రామంలో మకాం చేస్తున్నారు. అప్పుడు జయరామన్ తన భార్య పట్టమ్మాళ్, కుమార్తె నాగలక్ష్మి, అల్లుడు వాసుదేవన్, మనవడు చంద్రశేఖరన్ తో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు. మహాస్వామివారు ఆ పిల్లవాడు చంద్రశేఖరన్ ను ప్రేమతో దగ్గరకు పిలిచి, అతని వివరాలు, చదువు గురించి అడిగారు. స్వామివారు ఆ పిల్లవానికి బోలెడంత పటికబెల్లం ముక్కలు ఇచ్చి నీ వద్దనే ఉంచుకో అని చెప్పి ఆశీర్వదించారు. చేతుల్లో ప్రసాదాన్ని గట్టిగా పట్టుకుని బయటకు వచ్చాడు.
బయట పచ్చిక బయళ్ళు ఉండడంతో, అందులో ఆడుకోవడం మొదలుపెట్టాడు. దగ్గర్లోనే పెద్ద మెట్లబావి ఉంది. ఆడుకుంటూ అజాగ్రత్తతో అందులోకి పడిపోయాడు. అక్కడ బావి ఉన్నట్టు బయటివారికి కనపడదు. బావి ఎక్కువ లోతు ఉండి ఎక్కువ నీళ్లతో ఉంది. ఆ పిల్లవాడి తండ్రి వాసు, పిల్లాడి కోసం అంతా వెతుకుతూ బావి వద్దకు వచ్చాడు. బావిలోనికి వెళ్లడానికి మెట్లు ఉండడం గమనించాడు. పిల్లాడి చొక్కా మెట్ల వద్ద ఇరుక్కుని ఉండడం గమనించాడు.
ఆత్రంగా మెట్లు దిగి ఏమిటా అని చూస్తే అది తన కుమారుడే. గట్టిగా అరుస్తూ పిల్లాణ్ణి పైకెత్తాడు. అక్కడ ఉన్నవారందరూ పరిగెత్తుకుని వచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ పిల్లాణ్ణి పైకి తీసుకునివచ్చి, ఎడ్లబండి చక్రంపై పడుకోబెట్టి కడుపులో ఉన్న నీటిని బయటకు తీశారు. పిల్లవాడికి స్మృతి వచ్చిన వెంటనే పరమాచార్య స్వామి వారి వద్దకు తీసుకువెళ్ళి జరిగిన విషయం తెలిపారు. స్వామివారు ఆశీర్వదించి, “పిల్లవాని చేతిలో ఏముంది?” అని అడిగారు.
అప్పుడు గమనించారు అందరూ పిల్లవాడు పిడికిలి మూసుకునివుండడం. స్వామివారు ఆశీర్వదించి ఇచ్చిన పటికబెల్లం పిల్లవాని చేతిలో ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. పరమాచార్య ప్రసాదం గురించిన మహిమను ఏమని వర్ణించగలం! ఆ పిల్లవానికి ఉన్న గండాన్ని స్వామివారు ప్రసాదంగా ఇచ్చిన పటికబెల్లం తీసేసింది. ఆ పిల్లవాడు పెద్దవాడై మంచి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, స్వామివారి ఆశీస్సుల వల్ల జీవితంగా స్థిరపడ్డాడు.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం | 1 348 |
| 17 | అంబాసిడర్ కారు - ఫియట్ కారు
గోవిందపురం శ్రీ నటరాజ అయ్యర్ పరమాచార్య స్వామివారి అనుగ్రహానికి, కరుణకు పాత్రులు. జి ఆర్ ఎన్ బిల్డర్స్ పేరుతో జనాలకు నిర్మాణ సేవలను అందించేవారు. మహాస్వామి వారిపై అచంచలమైన భక్తితో శ్రీమఠానికి ఎంతగానో సేవ చేశారు. స్వామివారు శ్రీశైలంలో ఉన్నప్పుడు తన స్నేహితునితో కలిసి ఒక అంబాసిడర్ కారులో దర్శనానికి వెళ్లారు.
స్వామివారిని దర్శించుకుని, తిరిగివెళ్లడానికి అనుమతి తీసుకుని చెన్నైకు వస్తుండగా; కారు ఫ్యాను బెల్టు తెగిపోయి కారు ఆగిపోయింది. తెలియని ప్రదేశంలో ఇలా జరగడంతో కాస్త కంగారు పడ్డారు. ఏమి చెయ్యాలో తోచక నిదానంగా దగ్గర్లోనే ఉన్న పెట్రోలు బాంకు దాకా వచ్చి కారును ఆపారు.
మహాస్వామి వారి వద్ద నుండి ప్రసాదం తీసుకుని స్వామివారి అనుమతితోనే బయలుదేరినా ఈ అర్ధరాత్రిలో ఎందుకు ఇలా జరిగిందా అని ఇద్దరూ ఆలోచిస్తున్నారు. ఇలా జరిగేలాగా ఉంటే ఎందుకు స్వామివారు మేము వెళ్లడానికి అనుమతిచ్చారు? భక్తితో స్వామివారిని ప్రార్థిస్తున్నారు. అప్పుడు ఆ పెట్రోలు బంకుకి ఒక ఫియట్ కారు వచ్చి ఆగింది. అందులో ఉన్నవారు పెట్రోలు పొయ్యమని బాంకు సిబ్బందిని అడిగారు. ఈ సమయంలో ఎందుకు ఇక్కడ ఉన్నారని వీరిని అడిగారు. కారు బెల్టు తెగిపోవడంతో కారు నడపడానికి కుదరక ఇక్కడున్నామని నటరాజ అయ్యర్ చెప్పాడు.
దాంతో ఆ ఫియట్ కారు వ్యక్తి తను ఎప్పుడు కారులో బయటకు వెళ్ళినా ముందుజాగ్రత్తగా అవసరమైన కొన్ని కారు వీడిభాగాలను వెంట తెచ్చుకుంటానని, తనవద్ద ఉన్న బెల్టును తీసుకుని క్షేమంగా ఇంటికి చేరమని చెప్పాడు. నటరాజ అయ్యర్ కు ఆశ్చర్యం కలిగింది. అంత రాత్రిలో ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి, కారు ఫ్యాను బెల్టు ఇచ్చి సహాయం చెయ్యడం కేవలం పరమాచార్య స్వామివారి కృప అని హృదయం ద్రవించింది. మనస్సులోనే స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.
ఇందులో మరింత ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఆ అజ్ఞాత వ్యక్తి ఫియట్ కారులో వచ్చాడు. దూరప్రయాణాలకు వెళ్ళేటప్పుడు తన కారుకు సంబంధించిన విడిభాగాలనే పెట్టుకుంటాడు. కానీ ఆ ఫ్యాను బెల్టు మాత్రం తన ఫియట్ కారుది కాకుండా అంబాసిడర్ కారుది తెచ్చుకున్నాడు. ఎందుకు ఆ తప్పు చేశాడు? అతను తప్పు చేయలేదు. నటరాజ అయ్యర్ ని కాపాడడానికి మహాస్వామి వారు చేసిన దివ్యలీల ఇది. ఇలాంటి లీలలు చేసి భక్తులను కాపాడడం మహాస్వామి వారి సిద్ధులకు తార్కాణం.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం | 1 346 |
| 18 | అతిథి సేవ - భక్తుల భాగ్యం
వేసవికాలం ఎండలు, తాపం తీవ్రంగా ఉన్న రోజులు. పరమాచార్య స్వామివారి దర్శనం కోసం కొందరు భక్తులు ఎండలకు చెమట పట్టి నీరసించినా, ఉష్ణోగ్రతలను లెక్కచేయకుండా వచ్చారు. వారు దాహంతో ఉన్నప్పటికీ, స్వామివారిని దర్శించాలన్న తపన వారికి దేహ తాపాన్ని గుర్తు రానివ్వడంలేదు. స్వామివారు అంతేవాసులతో, "కాశీ నుంచి వచ్చిన బిల్వఫలాల రసాన్ని వారికి ఇవ్వండి" అని ఆదేశించారు. భక్తులు ఆనందంతో మురిసిపోయారు. స్వామివారు వారిమీద చూపిన కరుణ, వారి హృదయాలను చల్లబరిచింది. వెంటనే, తనకు గాలి విసురుతున్న అంతేవాసిని పిలిచి, అదే విసనకర్రతో ఆ అతిథులకు కూడా అలాగే విసరమని ఆదేశించారు. అతిథులు నిశ్చేష్టులయ్యారు. “ఇది సరి కాదు. మేము సాధారణ భక్తులం, స్వామివారికి ఉపయోగించే విసనకర్ర మాకు ఉపయోగించరాదు” అని చెప్పారు.
వెంటనే స్వామివారు నవ్వుతూ చెప్పారు, “అందరిలోనూ ఉండే చైతన్య స్వరూపమైన పరమాత్మ ఒక్కడే. ఆ విసనకర్రకు అన్నీ శరీరాలు ఒక్కటే, తేడా లేదు."
ఈ మాటలు విన్న భక్తుల హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. ఉపనిషత్ సారంలా అనిపించాయి. స్వామివారు మరలా ఇలా చెప్పారు, “ఇప్పుడు ప్రతీచోటా ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, ఫ్రిజ్లు వచ్చేశాయి. అందుకే మనం అతిథులను ఎలా స్వాగతించాలో, ఎలా సేవించుకోవాలో మర్చిపోయాము. అతిథికి విసనకర్రతో గాలి వీచడం, చల్లని తాగునీరు ఇవ్వడం ఇవన్నీ మరిచిపోయాం. పిల్లలకు వీటి ప్రాముఖ్యత అర్థం కావడం లేదు. అందుకే మీకు బిల్వరసం ఇచ్చి, విసరమని చెప్పాను వారికి. దీన్ని చూసి కొందరైనా మన సంస్కృతిని అచరిస్తారు.”
“బిల్వవృక్షం దేవతావృక్షం. బిల్వదళాలలో బంగారం ఉంటుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. శివపూజలో వాడిన బిల్వదళాలను ప్రతిరోజూ ప్రసాదంగా స్వీకరింస్తే శరీరం బంగారంలాగా ప్రకాశిస్తుందని అంటారు. బిల్వఫలం గుజ్జును తలకు రాసి స్నానం చేస్తే, అది చల్లదనాన్ని ఇస్తుంది. కంటి చూపుకు చాలా మంచిది. ఇప్పుడు బిల్వ వృక్షాలు చాలా అరుదయ్యాయి. శివాలయాల్లోనూ చాలా పాత చెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. బిల్వమొక్క నాటడం, దాన్ని పోషించడం పుణ్యప్రదమైన కార్యం. ఇది 'శ్రీవృక్షం' అని పిలవబడే పవిత్ర వృక్షం. దీన్ని నాటితే ధనసంపత్తి పెరుగుతుందని కూడా చెబుతారు.”
స్వామివారు చెప్పడం ముగించగానే, ఓ రైతు మహిళ స్వామివారి దర్శనానికి వచ్చారు. ఆమె కూడా బాగా అలసిపోయి కనిపించారు. స్వామివారు ఆమెకు కూడా బిల్వరసం, చల్లని మజ్జిగ ఇవ్వమని అంతేవాసులను ఆదేశించారు స్వామివారు. బయట ఎండలు మండిపోతున్నాయి, కానీ స్వామివారి గుండెలో మాత్రం చల్లని జల్లు కురుస్తోంది. అందరూ అందులో తడిచి నెమ్మదిని పొందుతున్నారు.
--- శ్రీమఠం బాలుమామ, మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 3
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/KPDSTrust
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం | 1 311 |
| 19 | శివానందలహరి చదువుతున్నావిడ
మా అమ్మాయి వివాహం చాలా ఆలస్యం అవుతూ ఉంది. అన్ని రకాలుగా సరిపోయిన సంబంధాలు కూడా ఎదో ఒక కారణం వల్ల తప్పుకుంటున్నాయి. ఇది నాకు చాలా దిగులు కలిగించే విషయం అయ్యింది. పరమాచార్య స్వామివారే దారి చూపాలని నేను కోరుకుంటున్నాను. నేను, నా భర్త స్వామివారిని దర్శించుకోవాలని నిర్ణయించుకుని అక్టోబరు 31, 1985న కాంచీపురం వెళ్ళాము.
ఆరోజు శని ప్రదోషం కావడంతో స్వామివారి దర్శనం కోసం చాలామంది భక్తులు వచ్చారు. స్వామివారి సమక్షంలో శ్రీమతి పద్మా సుబ్రహ్మణ్యం మరియు శ్రీమతి శ్యామలా బాలకృష్ణన్ పాడుతున్నారు. మా వంతు రాగానే, ఏమి కావాలని అడిగారు స్వామివారు.
“త్వరగా మా కుమార్తె వివాహం జరగడానికి మీ ఆశీస్సులు కావాలి. తన జాతకాన్ని మీ చేతులతో తాకి, దానిపై కాస్త కుంకుమ పెట్టి . . .”
ఒక పళ్ళబుట్టపై అమ్మాయి జాతకాన్ని ఉంచి స్వామివారికి దగ్గరగా పెట్టాము. స్వామివారు జాతకాన్ని చేతితో తాకలేదు కాని, దూరం నుండే ఆశీస్సులను అందించారు.
“మీకు అమ్మవారి అనుగ్రహం ఉంది. నెల రోజులలో మంచి సంబంధం కుదురుతుంది” అని అన్నారు.
నేను ప్రసాదం తీసుకుని ఇప్పుడు స్వామివారి అధిష్టానం ఉన్న చోట ఉండే చెట్టు కింద కూర్చుని శివానందలహరి చెప్పుకుంటున్నాను. స్వామివారికి దాదాపు ముప్పై అడుగుల దూరంలో కూర్చుని ఉన్నాను. పెద్ద పెద్ద వరుసలలో నిలబడివున్న భక్తులు దర్శనం చేసుకుంటూ చిన్నగా ముందుకు సాగుతున్నారు.
కళ్ళు మూసుకుని ఒక ముప్పై శ్లోకాలు చెప్పుకుని ఉంటాను. అప్పుడు ఒక శాస్త్రిగారు నా వద్దకు వచ్చి నాతో, “పరమాచార్య స్వామివారు మిమ్మల్ని రమ్మన్నారు” అని అన్నారు.
“నేను ఇప్పుడే ప్రసాదాన్ని స్వీకరించాను” అని బదులిచ్చాను.
“శివానందలహరి చదువుతున్న ఆవిడని పిలుచుకునిరమ్మని పెరియవా నన్ను ఆదేశించారు” అన్నారు ఆ శాస్త్రిగారు. నేను నిశ్చేష్టురాలినయ్యాను. వెంటనే స్వామివారి వద్దకు వెళ్లాను.
“నీవు ఎవరు? ఎక్కడి నుండి వస్తున్నావు? నీ భర్త ఎక్కడ?” అని అడిగారు స్వామివారు.
నేను బీసెంట్ నగర్ నుండి వస్తున్నానని తెలిపి నా భర్తకోసం వెతకనారంభించాను. నా భర్త దొరకగానే మరలా స్వామివారి సమక్షంలోకి వచ్చి నమస్కరించాము.
స్వామివారు మమ్మల్ని ఆశీర్వదించి, “అమ్మవారి అనుగ్రహం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. అ అనుగ్రహమే నిన్ను చూసుకుంటుంది” అని తెలిపారు. మేము ప్రసాదం తీసుకుని వచ్చేశాము.
కొన్ని రోజులు గడచిన తరువాత మా అబ్బాయి అడిగాడు, “ఏంటి అమ్మా! నెలలోపల ఎదో జరుగుతుందని చెప్పారు అన్నావు. కాని ఏమి జరగలేదు” అని. పెరియవా చూసుకుంటారులే అని అన్నాను నిశ్చయంగా.
మేము అయిప్పసి నెలలో స్వామివారి దర్శనం చేసుకున్నాము. డిసెంబరు 16 నుండి మార్గళి మాసం ప్రారంభం అవుతుంది. డిసెంబరు 14న మ అమ్మాయి వివాహం నిశ్చయమైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అనుకుంటా.
--- సరస్వతి త్యాగరాజన్. vandeguruparamparaam.blogspot.in నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం | 1 326 |
| 20 | తలలో గడ్డ - తలపై మట్టి
వారికి పెళ్లయి రెండు నెలలే అయ్యింది, కానీ ఆ దంపతులు అప్పుడే ఒక విషాదకర విషయం వినవలసివచ్చింది. అవును, ఆ అబ్బాయి తలలో గడ్డ (ట్యూమర్) పెరిగింది అని వైద్యులు ధృవీకరించి చెప్పారు.
"ఇది చాలా సులువు! శస్త్రచికిత్స చేసి ఆ గడ్డను తొలగించేద్దాం!" అని వైద్యులు చాలా తేలికాగా చెప్పేశారు. కానీ ఆ అమ్మాయి మాత్రం చాలా కలతచెందింది, "నా భర్తకు ఏమవుతుంది?" అని.
ఆ దంపతులిద్దరూ తేనంబాక్కానికి వచ్చారు స్వామివారి దర్శనం కోసం, అప్పటికి వెళ్లాల్సిన విహారయాత్రకు వెళ్ళకుండా. ఆ అమ్మాయి కన్నీరుతో, "పెళ్లై ఇంకా రెండు నెలలే అయ్యింది. అంతలోనే ఇలాంటి విషయం వినవలసి వచ్చింది. స్వామివారు ఏమి ఆదేశిస్తే అదే చేస్తాను. నా భర్త బాగుపడాలి" అని స్వామివారితో మొరపెట్టుకుంది.
కొంతసేపు స్వామివారు మౌనం వహించారు. "నాకు శస్త్రచికిత్సపైన నమ్మకం లేదు. అది కూడా తలపై చేయడం సరైంది కాదు." ఆ దంపతులిద్దరూ స్వామివారు చెప్పబోయే విషయాన్ని చెవులు, కళ్ళు రిక్కించి వింటున్నారు.
"ఇప్పుడు ఏం జరుగుతుంది? ధర్మం గెలుస్తుందా లేక యమధర్మ రాజు గెలుస్తాడా?"
"కావేరి నది ఒడ్డున ఉన్న ఏదైనా క్షేత్రానికి వెళ్లండి. అక్కడి స్వామిని దర్శించుకోండి. ప్రతి ఉదయం కావేరి తీరంలో కూర్చుని, తలకి పూర్తిగా మట్టిని పూసుకొని అరగంట ఉండాలి. ఆ తరువాత స్నానం చేసి, సంధ్యావందనం చేసి, స్వామి దర్శనానికి వెళ్లాలి. మీరు ఎవరయినా సదాచార సంపన్నులయిన ఇంటిలో ఉండాలి. స్వయంగా వండుకుని తినాలి. ఇలా నలభై రోజుల పాటు – అంటే ఒక మండలము – చేస్తే అన్నీ బాగుపడతాయి" అని స్వామివారు ఖచ్చితంగా చెప్పారు.
ఆ దంపతులు దాన్ని పరమేశ్వర వాక్కులుగా స్వీకరించి, తిరుచ్చి దగ్గర కావేరి తీరంలోని ఒక క్షేత్రంలో ఉన్నారు. ఆ అబ్బాయి ప్రతిరోజూ స్వామివారు చెప్పిన విధంగా చేయసాగాడు.
నలభై రోజుల తర్వాత వారు తిరిగి చెన్నైలోని వైద్యులను కలవగా, వారు పరీక్షించి, "లేదు... లేదు... గడ్డ పూర్తిగా కరిగిపోయింది!" అని ఆశ్చర్యపోయారు.
ఆ అమ్మాయి మరలా స్వామివారి సమక్షానికి వచ్చి ఆనందంతో, కృతజ్ఞతతో ఏడుస్తూ నిలుచుంది. "నేను ఏమి చేశాను? 'వైద్యో నారాయణో హరిః' అని విన్నావు కదా? ఇది తెలుసు కదా నీకు!" అని అన్నారు స్వామివారు. కాని స్వామివారు భేషజం భీషక్ (వైద్యులకే వైద్యుడైన ఆది వైద్యుడు) కదా.
ఇది ఆయుర్వేదమా, సిద్ధ వైద్యమా లేక ప్రకృతి చికిత్సా? ఇది పరమాచార్య స్వామివారు అనుగ్రహించిన 'సిద్ధ సంకల్ప' చికిత్స! ఇది దివ్యమైన వైద్యం!
--- శ్రీమఠం బాలు మామ, ‘కంచి మహాన్ దర్శన్’ నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/KPDSTrust
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం | 1 570 |
现已上线!2025 年 Telegram 研究 — 年度关键洞察 
