en
Feedback
SRI GURU DEVA DATTA AUDIOS🙏

SRI GURU DEVA DATTA AUDIOS🙏

Open in Telegram

పురాణములు,సచ్చరిత్ర లు,అవధూతల చరిత్రలు ,పండుగ విశిష్టత లు,భక్తి పాటలు,కథలు,పురాణములు గురించి క్విజ్,అంతరార్ధములు,..పెద్దవారికోసం,ఆరోగ్యం సహకరించని వారికోసం,ఉద్యోగాల బిజీ వారి కోసం,పిల్లల కోసం నా చిన్న సహాయం.

Show more
562
Subscribers
No data24 hours
-17 days
-630 days
Attracting Subscribers
September '26
September '260
in 0 channels
August '26
+4
in 0 channels
Get PRO
July '26
+2
in 0 channels
Get PRO
June '26
+7
in 0 channels
Get PRO
May '26
+2
in 0 channels
Get PRO
April '26
+7
in 0 channels
Get PRO
March '26
+1
in 0 channels
Get PRO
February '26
+25
in 0 channels
Get PRO
January '26
+16
in 0 channels
Get PRO
December '25
+8
in 0 channels
Get PRO
November '25
+1
in 0 channels
Get PRO
October '25
+5
in 0 channels
Get PRO
September '25
+8
in 0 channels
Get PRO
August '25
+4
in 0 channels
Get PRO
July '25
+4
in 0 channels
Get PRO
June '25
+2
in 0 channels
Get PRO
May '25
+7
in 0 channels
Get PRO
April '25
+16
in 0 channels
Get PRO
March '25
+22
in 0 channels
Get PRO
February '25
+24
in 0 channels
Get PRO
January '25
+9
in 0 channels
Get PRO
December '24
+10
in 0 channels
Get PRO
November '24
+20
in 0 channels
Get PRO
October '24
+5
in 0 channels
Get PRO
September '24
+19
in 0 channels
Get PRO
August '24
+27
in 0 channels
Get PRO
July '24
+11
in 0 channels
Get PRO
June '24
+6
in 0 channels
Get PRO
May '24
+7
in 0 channels
Get PRO
April '24
+10
in 0 channels
Get PRO
March '24
+6
in 0 channels
Get PRO
February '24
+31
in 0 channels
Get PRO
January '24
+15
in 0 channels
Get PRO
December '23
+26
in 0 channels
Get PRO
November '23
+4
in 0 channels
Get PRO
October '23
+2
in 0 channels
Get PRO
September '23
+3
in 0 channels
Get PRO
August '23
+14
in 0 channels
Get PRO
July '23
+22
in 0 channels
Get PRO
June '23
+5
in 0 channels
Get PRO
May '23
+6
in 0 channels
Get PRO
April '23
+16
in 0 channels
Get PRO
March '23
+8
in 0 channels
Get PRO
February '23
+28
in 0 channels
Get PRO
January '23
+42
in 0 channels
Get PRO
December '22
+9
in 0 channels
Get PRO
November '22
+6
in 0 channels
Get PRO
October '22
+8
in 0 channels
Get PRO
September '22
+11
in 0 channels
Get PRO
August '22
+15
in 0 channels
Get PRO
July '22
+14
in 0 channels
Get PRO
June '22
+9
in 0 channels
Get PRO
May '22
+3
in 0 channels
Get PRO
April '22
+2
in 0 channels
Get PRO
March '22
+90
in 0 channels
Get PRO
February '22
+40
in 0 channels
Get PRO
January '22
+10
in 0 channels
Get PRO
December '21
+23
in 0 channels
Get PRO
November '21
+58
in 0 channels
Get PRO
October '21
+51
in 0 channels
Get PRO
September '21
+32
in 0 channels
Get PRO
August '21
+17
in 0 channels
Get PRO
July '21
+31
in 0 channels
Get PRO
June '21
+65
in 0 channels
Get PRO
May '21
+14
in 0 channels
Get PRO
April '21
+36
in 0 channels
Get PRO
March '21
+449
in 0 channels
Date
Subscriber Growth
Mentions
Channels
08 September0
07 September0
06 September0
05 September0
04 September0
03 September0
02 September0
01 September0
Channel Posts
మహాగణపతి_పురాణము_3వ_రోజు.m4a12.12 MB

2
మహాగణపతి_పురాణము_2వ_రోజు.mp3
20
3
🚩🚩🚩🙏🚩🚩🚩 *మహా గణపతి పురాణం* *2వ రోజు* వినాయకుడు ముందా, పార్వతీ పరమేశ్వరులు ముందా... ఎందుకంటే పార్వతీ మాత శివపార్వతుల కళ్యానానికి ముందు సంకష్ట చతుర్థి వ్రతం ఆచరించింది ఎలా... అయితే మరి వినాయకుడి తల్లి తండ్రులు ఎవరు మరి? మీ జీవని Sri Guru Deva Datta Audios 🚩🚩🚩🙏🚩🚩🚩
20
4
🚩🚩🚩🙏🚩🚩🚩 *మహా గణపతి పురాణం* - *1టవ రోజు* *మహా గణపతి పురాణం యొక్క విశిష్టత సూతుల వారిని శౌనకాది మహా మునులు ప్రశ్నించుట* *వీలు చూసుకొని ఏదో ఒక సమయంలో తప్పక వినగలరు,మీకు నచ్చితే ఇతరులకు share చేయగలరు* మీ జీవని Sri Guru Deva Datta Audios 🚩🚩🚩🙏🚩🚩🚩
30
5
Audio from sri Guru Deva Datta Audios
23
6
శ్రీగురు చరిత్ర-25.m4a
27
7
శ్రీగురు చరిత్ర-24.m4a
36
8
శ్రీగురు చరిత్ర-23.m4a
43
9
శ్రీగురు చరిత్ర-22.m4a
51
10
శ్రీగురు చరిత్ర-21.m4a
68
11
శ్రీగురు చరిత్ర-20.m4a
70
12
శ్రీగురు చరిత్ర-19.m4a
75
13
శ్రీగురు చరిత్ర-18.m4a
78
14
శ్రీగురు చరిత్ర-17.com.m4a
73
15
https://youtu.be/Mu1a-Bz3664?si=Kcd8W9ZLmMvdLVbT
83
16
Document from sri Guru Deva Datta Audios
49
17
Audio from sri Guru Deva Datta Audios
54
18
ఉపమన్యువు గోవులను అడవికి తీసుకెళ్ళాడు. కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది. వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు. ధౌమ్యుడది చూచి, 'నీవు ప్రతిరోజూ సూర్యాస్తమయం వరకూ గోవులను మేపాలి' అన్నారు. మరునాటి నుండి, ఆవులు మేస్తుండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి, సంధ్య వార్చుకుని, దగ్గరలోనున్న బ్రాహ్మణుల యిండ్లలో భిక్ష తెచ్చుకుని భోజనం చేయసాగాడు. అందువలన కొద్దికాలానికి అతని శరీరానికి మంచి పుష్ఠి కల్గింది. అది గమనించిన ధౌమ్యుడు. ఒకరోజున అతనినడిగి కారణం తెలుసుకొని, 'నన్ను విడిచి భోజనం చేస్తున్నావటరా? నిత్యము నీవు చేసుకొచ్చిన భిక్ష నాకిచ్చి, మరల అడవికి పోయి ఆవులను మేపుకొనిరావాలి' అని ఆజ్ఞాపించారు. ఉప మన్యువు అలా చేస్తుండడం వలన ఆకలి అతనిని యెంతగానో బాధించేది. అతను తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువుకర్పించి, రెండవసారి భిక్ష తెచ్చుకుని తినసాగాడు. అందువలన అతడి శరీరం పుష్టిగా వుండడం చూచి ధౌమ్యుడు కారణమడిగి తెలుసుకుని, ఆ రెండవ భిక్షను గూడ తమకే యివ్వమని చెప్పారు. ఉపమన్యువు కొంచెమైనా బాధపడక అలానే చేసి, ఆవుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిన పాలు త్రాగి ఆకలి తీర్చుకోసాగాడు. అందువలన కొద్దికాలంలోనే అతని శరీరం మరింత లావెక్కింది. ఒకరోజు ధౌమ్యులవారు అందుకు కారణము అడిగి తెలుసుకుని, 'ఒరే! పశువుల ఎంగిలి పాలు త్రాగితే పశువు వలె నీవు గూడ బుద్ధిహీనుడవవుతావు. కనుక త్రాగవద్దు' అని నిషేధించారు. ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలివి కావని తలచి, వాటిని ఒక దొప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళలో చింది, అతని కళ్ళు రెండూ కనిపించలేదు. తర్వాత అతడు గోవులను వెదుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు. సూర్యాస్తమయమైనా శిష్యుడింటికి రాకపోయేసరికి, అతనిని వెదుకుతూ ధౌమ్యులవారు అడవికి వెళ్ళారు. ఆయన కేక విని ఉపమన్యువు బావిలోనుండే సమాధానమిచ్చాడు. ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకొని, అశ్వనీ దేవతలను ప్రార్థించమని చెప్పారు. ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టివచ్చింది. వెంటనే అతడు బావినుండి బయటకువచ్చి గురువుకు నమస్క రించాడు. ధౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయిపెట్టి, 'నాయనా! నీ కీర్తి నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది. నీ శిష్యులు గూడ నీ అంతటి వారవుతారు. వారిలో ఉదంకుడనే శిష్యుడు తన గురుభక్తిచేత నాగలోకాన్ని జయించి, నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు. నీ కీర్తిని శాశ్వత మొనర్చగలడు' అని ఆశీర్వదించాడు. అతడు గురుకృప వలన వేదశాస్త్ర పారంగతుడై, యింటికి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించాడు. కాలాంతరంలో ధౌమ్యులవారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది. కనుక, 'నాయనా, గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీలేదు. గురుద్రోహం వలన యిహపరాలలో సుఖమే వుండదు. సరిగదా, నీవెంత తిరిగినా వ్యర్థమే. కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువునే ఆశ్రయించి, ఆయనను ప్రసన్నం చేసుకో! ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనస్సు స్థిరమవుతుంది'. శ్రీ గురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు, 'స్వామీ! నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే. నేను చేసిన అపరాధాలు గూడా ఎన్నో! విరిగిన నా గురువు మనస్సు అతకడంసాధ్యంగాదు. ఇక నేను బ్రతికి ప్రయోజనమేమి? నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను' అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు. అప్పుడు శ్రీగురుని మనస్సు కరిగి, 'నాయనా! తీవ్రమైన పరితాపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది. ఇప్పుడు నీ గురువును మనసారా స్మరించు' అని చెప్పి అతనిని ఆశీర్వదించారు. వెంటనే అతని కంఠం గద్గదమై, శరీరమంతా రోమాంచితమైంది. కన్నులు ఆనంద భాష్పాలతో నిండాయి. అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే, వేదశాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది. అప్పుడు శ్రీ గురుడు, 'నాయనా! నేను చెప్పిన గురు మహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు. నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు. ఆయనే నేనని తెలుసుకో!' అన్నారు. అతడలానే చేసి తర్వాత ముక్తి పొందాడు.ఇలా ఒక సంవత్సర కాలం వైద్యనాధంలో నివసించి, తర్వాత శ్రీనృసింహ సరస్వతి దేశసంచారం చేస్తూ, కృష్ణా తీరంలో వున్న భిల్లవటీ గ్రామంలోని భువనేశ్వరీదేవి సన్నిధి చేరి, అచ్చట కృష్ణ-వేణి సంగమంలో పడమట తీరానవున్న ఉదుంబర వృక్షం క్రింద కొంతకాలం గుప్తంగా నివశించారు." _*రేపటి అధ్యాయం లో మల్లి కలుసుకుందాం...*_ "దిగంబరా దత్త దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా" "దిగంబరా దత్త దిగంబరా నృశింహ సరస్వతీ దిగంబరా" "దిగంబరా దిగంబరా శ్రీ పాదవల్లభ దిగంబరా" "దిగంబరా దిగంబరా అవథూత చింతన దిగంబరా" ఓం ద్రాం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః జయ గురుదేవ దత్త శ్రీ గురు దత్త *సేకరణ : సకల దేవత సమాచారం గ్రూప్.* *🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*
49
19
ఎప్పటికప్పుడు, "నీకింకా బుద్ధి స్థిరంకాలేదు" అని చెప్పి, నాకు వేదముగాని, శాస్త్రంగాని, భాష్యంగాని చెప్పలేదు. అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు. ఆప్పుడాయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు. వెంటనే నేనాయనను విడిచి వచ్చేసాను' అని చెప్పాడు. శ్రీ గురుడు ముక్కుమీద వేలువేసుకొని, 'అయ్యో బ్రాహ్మణుడా! ఎంత పని చేసావు? నీవుచేసిన పని ఆత్మహత్యయంతటి మహాపాపం. నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక, గురువును నిందిస్తున్నావు. నీకింక మనస్సు నిశ్చలమెలా అవుతుంది? దొరికిన కామధేనువు వంటి గురువును విడిచి నీవెక్కడికి పరుగెడితే మాత్రం నీకు జ్ఞానమెలా లభిస్తుంది? గురుద్రోహికి ఇహంలోను, పరంలోనూ సుఖముండదు. అతడికి జ్ఞానమెన్నటికీ కలుగదు అజ్ఞానాంధకారంలో చిక్కుపడవలసిందే. గురువునెలా సేవించాలో తెలిసినవాడికే వేదవేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు. అష్టసిద్ధులూ అతనికి అధీనమవుతాయి. నీవంటి గురుద్రోహి ముఖం చూడడం గూడ అపశకునమవుతుంది. దేవాలయంలో మలవిసర్జన చేసి, అందుకు తిట్టినవాణ్ణి తప్పుపట్టినట్లుంది నీ పని!' అన్నారు. అప్పుడా విప్రుడు భయపడి, దుఃఖంతో స్వామి పాదాల పైబడి, 'పరమగురూ! జ్ఞానసాగరా! బుద్ధిహీనుడనై తెలియక గురుద్రోహం చేసాను. గురువునెలా తెలుసుకోవాలో, సేవించాలో తెలిపి నన్నుద్దరించండి' అని దీనాతిదీనంగా ప్రాధేయపడ్డాడు. శ్రీ గురుడు అతని దైన్యానికి కరిగిపోయి అపార కరుణతో యిలా చెప్పారు.“నాయనా! గురువే తల్లి, తండ్రి. ఆయనయే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రత్యక్షరూపం. నిజమైన మేలుచేయగలవారు ఆయనొక్కరే. ఇందుకు సందేహంలేదు. ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో, పట్టుదలతో గురువును సేవించాలి. అది తెల్పేటందుకు నీకొక పురాణోపాఖ్యానం చెబుతాను విను. ద్వాపరయుగంలో ధౌమ్యుడనే బ్రహ్మర్షి వుండేవారు. ఆయన దగ్గరఅరుణి, బైదుడు, ఉపమన్యువు అను ముగ్గురు శిష్యులు వేదమభ్యసిస్తూ, ఆయనను శ్రద్ధతో సేవిస్తుండేవారు. అహంకారము మొ॥న దోషాలు తొలగి, మనస్సుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యులచేత సేవలు చేయిస్తుండేవారు. అతని సేవనుబట్టి అతని గురుభక్తిని, మనశ్శుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు. ఒకనాడు ధౌమ్యుడు, అరుణిని పిలిచి, 'నీవు మన పొలానికి వెళ్ళి, చెరువునుండి దానికి నీరుపెట్టు, లేకపోతే వరిపైరు ఎండిపోతుంది' అని చెప్పారు. అరుణ్ వెంటనే వెళ్ళి చెరువునుండి కాలువద్వారా నీరుపెట్టాడు. కాని కాలువకు ఒకచోట గండిపడి నీళ్ళన్నీ పల్లానికి పోతున్నాయి. మట్టి, రాళ్ళు ఎంతవేసినా కట్ట నిలువలేదు. అప్పుడతడు, ప్రాణం పోయినా సరే, గురువు చెప్పినది చేసితీరాలన్న నిశ్చయంతో, ఆ గండికి తాను అడ్డుపడుకొని గురువును ధ్యానిస్తున్నాడు. అప్పుడా నీరు అతనిమీదుగా పొలానికి ప్రవహించింది. చీకటిపడినా గూడ అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి ధౌమ్యుడు వచ్చి, పొలం నిండుగా నీరుండడం గమనించారు. కాని శిష్యుడే కనిపించలేదు. అతడు ఏ పులి బారినైనా పడ్డాడేమోనని అనుమానించి, ఆయన శిష్యునికోసం బిగ్గరగా పిలిచారు. అరుణి సమాధాన మీయలేక కొంచెంగా శబ్దం చేసాడు. దానినిబట్టి ధౌమ్యులవారు వచ్చి శిష్యుని లేవనెత్తి, కౌగలించుకొని, సంపూర్ణంగా అనుగ్రహించారు. వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అప్పుడు ధౌమ్యమహర్షి, 'నాయాన! నీవింటికి వెళ్ళి, తగిన కన్యను వివాహమాడి స్వధర్మమాచరించు. కృతార్థుడవవుతావు' అని ఆదేశించారు. అరుణి గురువునకు నమస్కరించి యింటికి వెళ్ళి, లోకపూజ్యుడయ్యాడు. ఒకరోజు ధౌమ్యుడు తన రెండవ శిష్యుని పిలిచి, 'నాయనా! పైరు పంటకొచ్చింది. నీవు రోజూ కావలి కాచి పైరు కోసి, ధాన్యం యింటికి చేర్చు' అని చెప్పారు. బైదుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి, పైరునెంతో జాగ్రత్తగా సంరక్షించి, పంట పక్వానికొచ్చాక కోయించాడు. తర్వాత ధాన్యం రాశిగా పోయించి, ఆ సంగతి గురువుకు చెప్పాడు. ఆయన అతనికొక బండి, ఒక దున్న పోతునూ యిచ్చి, ధాన్యం యింటికి చేర్చమని చెప్పారు. అతడా బండి కాడికి ఒక ప్రక్క ఆ దున్నపోతును కట్టి, మరొక దున్నపోతు లేనందున రెండవ వైపు కాడిని తన భుజాన వేసుకొని ధాన్యం యింటికి తీసుకొస్తున్నాడు. దారిలో ఒకచోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది. అప్పుడు బైదుడు దున్నపోతును విడిపించి, తానొక్కడే బండిని బురదలో నుండి లాగడానికి ప్రయత్నించి, ఆ శ్రమకోర్వలేక స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి ధౌమ్యుడు అక్కడికి వచ్చి చూచి, అతని గురుసేవా దీక్షకు మెచ్చి, అతని మెడనుంచి కాడి తొలగించి అతనిని లేవదీసి కౌగలించుకుని అనుగ్రహించారు. వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొన్నది. గురువు అతనికి సెలవిచ్చి యింటికి పంపారు. కొద్దికాలం లోనే అతడు గూడ అరణి వలె లోకప్రసిద్ధుడయ్యాడు. ఇంక ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తుండేవాడు. అతడు అతిగా భోజనం చేసేవాడు. ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలిచేది గాదు. ధౌమ్యుడు ఆలోచించి, ఒకరోజు అతనిని పిలిచి, 'నాయనా! నీవు గోవులను అడవికి తోలుకొని పోయి మేపుకొని వస్తూండు' అని చెప్పారు.
37
20
kalpana ram: *🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩* *శ్రీ గురుచరిత్ర పారాయణం* *అధ్యాయం - 16* *శ్రీ గణేశాయ నమః* *శ్రీ సరస్వత్యై నమః* *శ్రీగురుభ్యో నమః* *ప్రస్తావన :* అద్వితీయమైన భగవంతుడు సృష్ట్యాదిలో “నేననేకమగుదును గాక" అని సంకల్పించి, తన వినోదార్థం ఈ అనంత సృష్టిజాలాన్ని రచిస్తాడు. ఐనా సకల కళ్యాణ గుణనిధియైన పరమాత్మయొక్క ఇట్టి సంకల్పం కూడ జీవులందరికీ ఒక విధంగా శ్రేయస్కరమే. ప్రళయానికి పూర్వం సర్వజీవులు ఎటువంటి సంస్కారాలను, కర్మఫలాన్ని చేకూర్చుకున్నాయో వాటినుండి తిరిగి ఆ జీవులు సుఖదుఃఖాది అనుభవాలద్వారా శుద్ధమవడానికి ఈ సృష్టి రచన ఒక చక్కని అవకాశం. కాని అజ్ఞానబద్ధులైన ఆ జీవులు పూర్వకర్మ ఫలానుభవము పూర్తయ్యేలోపల, ద్వంద్వాల ప్రభావం చేత మరలా కర్మ సంచయాన్ని పెంచుకుంటాయి. వారిపై కృపవలన ఆ పరమాత్మ శ్రీ దత్తస్వామిగా అవతరించి, శ్రీ పాదస్వామి, శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వంటి సద్గురువుల రూపాలలో జీవులనుద్ధరిస్తాడు కనుకనే సద్గురు సేవ మోక్షానికి మొదటి, చివరిమెట్టూ కూడా. సద్గురువు త్రిమూర్త్యాత్మకుడూ, పరబ్రహ్మమూ గూడ. ఈ విశ్వమంతా ఆయన రూపమే. గురుభావంతో దేనిని అచంచలమైన దీక్షతో సేవించినా మానవుడు గమ్యాన్ని చేరవచ్చు. కాని సామాన్యులకు ఏ వస్తువునైనా, వ్యక్తినైనా పరిపూర్ణమైన గురుభావంతో సేవించడానికి తగిన సంస్కార బలం పుండదని, ఈ అధ్యాయంలోని గురుపరాజ్ముఖుడైన విప్రుని వృత్తాంతం తెల్పుతుంది. “సర్వం ఖల్విదం బ్రహ్మా”, “ఇదంతా బ్రహ్మ" అని శ్రుతులు చెప్పినా అలాటి భావంతో ప్రాణులు వస్తువులతోనూ వ్యవహరించడం పామరుల వలనగాదు. కనుకనే సద్గురువుల రూపంలో శ్రీ దత్తాత్రేయుడే అవతరించి తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చూరగొని వారిని ఉద్దరిస్తాడు. వివేకం లేని భక్తులకు గురువుపట్లకూడ స్థిరమైన భక్తివిశ్వాసాలు ఉండవు. అందుకే ఎక్కువమంది ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. "మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే!" జ్ఞాన సిద్ధికై యత్నించేవాడు వెయ్యికి ఒక్కరుంటారని, అట్టి వారిలో గూడ లక్ష్యాన్ని సాధించేవారే కొద్దిమందో వుంటారనీ భగవద్గీత చెబుతుంది. పూర్ణదత్తావతారమైన గురువు సకల గురుస్వరూపి. కనుక అవివేకంతో గురువుని విడచిన అజ్ఞానాంధుని చేత పూర్వ గురువుని స్మరింపచేసి, అతనికి దర్శనమిచ్చి ఉద్దరించగలరని యీ అధ్యాయం తెల్పుతుంది. శ్రీ సాయి చరిత్రలో యిలాటి లీలలెన్నో చూడవచ్చు. పూర్ణుడైనా, నిజమైన సద్గురుడు నమ్రతతో శాస్త్ర ప్రతిష్ఠను కాపాడుతారు. ధౌమ్యుడు శిష్యునిచేత అశ్వినీ దేవతలను స్తుతింపజేసి తిరిగి కన్నులొచ్చేలా చేశాడు ప్రాయశ్చిత్తకాండలో శ్రీ గురుడలానే చెప్పడం గమనించాలి. శ్రీ సాయి గూడ “విష్ణు సహస్రనామము”, “భాగవతము” మొదలైనవి పఠించమని భక్తులను ప్రోత్సహించేవారు. ఆ గ్రంథాలు చదవడం వలన సద్గురూపదేశం యొక్క విలువగూడ భక్తులకు తెలియగలదు. గురు మహిమను, సేవనూ వివరించే ఈ అధ్యాయం గురుచరిత్రలో ముఖ్యమైనది. *కథారంభము :* నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, "మహాత్మా, అపుడు శ్రీ గురుని ఆజ్ఞననుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులెవ్వరు? అటుపై యేమి జరిగింది?" అని అడిగాడు. సిద్ధయోగి యిలా చెప్పారు: "నామధారకా ! నీవు గురుభక్తులలో ఉత్తముడివి. ఇంతకాలము నన్ను గురుకథ చెప్పమని యెవరూ కోరనందువలన నా మనస్సు నివురుగప్పినట్లయింది. నీవిప్పుడు ఆయన గురించి యింతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతూండడం వలన ఆయన కథలు గుర్తుతెచ్చుకున్నకొద్దీ నా మనస్సు మేల్కొన్నట్లవుతున్నది. ఆనంద పారవశ్యం కలుగుతున్నది. నీవు గూడ నాకెంతో ఉపకారం చేసావు. నీవు వయసులో చిన్నవాడవైనా, శ్రీ గురుని అనుగ్రహం వలన లోకశ్రేష్ఠుడవవుతావు. నీ వంశమంతా పుత్ర, పౌత్ర, ధన, ధాన్యాలతోనూ, సుఖశాంతులతోనూ, విలసిల్లుగాక! శ్రీగురుని చరిత్ర చెబుతాను. అది మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించడంలో కామధేనువు వంటిదని ప్రమాణం చేసి చెబుతున్నాను. శ్రద్ధగా విను శ్రీ గురువు ఆజ్ఞననుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళారు. నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే వుండిపోయాను. అప్పటినుండి ఒక సంవత్సరముపాటు శ్రీ గురుడు వైద్యనాధంలోనే గుప్తంగా వుండిపోయారు. ఒకనాడొక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, 'స్వామీ, నేను ఆత్మసిద్ధికై ఎంతోకాలం తపస్సు చేసినా గాని, నా మనస్సు యే మాత్రమూ ప్రశాంతమవలేదు. కాని మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది. నా మనస్సు స్థిరమవకపోవడానికి కారణ మేమిటి? మీరు లోకాన్ని తరింపజేయడానికి అవతరించిన దైవస్వరూపులు. నన్నను గ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి. మిమ్ములను శరణు వేడుతున్నాను' అన్నాడు. శ్రీ గురుడు నవ్వి, 'నాయనా, నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సేలా చేసావు?' అని అడిగారు. అతడు కన్నీరు కారుస్తూ, 'స్వామీ! మొదట నేనొక గురువునాశ్రయించి చాలాకాలం సేవించాను. కాని ఆయన నాచేత అన్నిసేవలూ చేయించుకుంటూ నన్నెప్పుడూ తిడుతుండేవారు గాని, నాకేమీ నేర్పలేదు.
46