en
Feedback
BringBackYSJAGAN - YSRCP 🇸🇱

BringBackYSJAGAN - YSRCP 🇸🇱

Open in Telegram

TEAM JAGAN ANNA🇸🇱🇸🇱 🔹ᴡᴇʟᴄᴏᴍᴇ ᴛᴏ ᴏᴜʀ ᴄʜᴀɴɴᴇʟ 🙏🏻 🔸ᴅᴏɴ'ᴛ ᴍᴜᴛᴇ 🔇 🔸TRUST ME - I'LL GIVE U🔸 ⚡ PERFECT STUFF ⚡ 🇾 🇸 🇯 🇦 🇬 🇦 🇳 🇦 🇳 🇳 🇦 💙

Show more
1 958
Subscribers
-124 hours
-117 days
-4430 days
Posts Archive
తాడేపల్లి వైఎస్సార్‌సీపీలో చేరిన పొన్నూరు నియోజకవర్గ టీడీపీ నేతలు శ్రీ వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన మండవ గౌతమ్‌, మండవ లక్ష్మీ నీరజ గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు మండవ గౌతమ్‌, మండవ లక్ష్మీ నీరజ బుధవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ సమక్షంలో వారు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా మండవ గౌతమ్‌, మండవ లక్ష్మీ నీరజలను శ్రీ వైయస్‌ జగన్‌ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పొన్నూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి సమర్థంగా, అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. శ్రీ వైయస్‌ జగన్‌ నాయకత్వం, ఆయన సిద్ధాంతాలు, లక్ష్యాలు, ప్రజల పట్ల నిబద్ధతతో కూడిన రాజకీయ ప్రస్థానం తమను ఎంతగానో ఆకర్షించాయని మండవ గౌతమ్‌, మండవ లక్ష్మీ నీరజ వెల్లడించారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. శ్రీ వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి, ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. మండవ గౌతమ్‌ పొన్నూరు నియోజకవర్గ టీడీపీ నాయకుడిగా, నియోజకవర్గ టీడీపీ బూత్‌ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. సుదీర్ఘకాలం సొసైటీ అధ్యక్షుడిగా, పొన్నూరు మార్కెట్‌ యార్డు ఉపాధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. మండవ లక్ష్మీ నీరజ టీడీపీ మండల అధ్యక్షురాలిగా పనిచేశారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీపై పోటీ చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణతోపాటు స్థానిక పార్టీ నాయకులు గుంటుపల్లి అంజయ్య, వేజండ్ల శివకృష్ణ, నూతలపాటి కృష్ణ, కిలారి రమేష్‌, త్రిపురనేని వెంకటస్వామి, రావిపాటి పవన్‌, పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్సీపీలో చేరిన పోలవరం నియోజకవర్గం టి.నర్సాపురం రిటైర్డ్‌ ఎస్‌ఐ వి.జయకుమార్‌ శ్రీ వైయస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన జయకుమార్‌ పోలవరం నియోజకవర్గం టి.నర్సాపురంకు చెందిన రిటైర్డ్ ఎస్‌ఐ వి.జయకుమార్‌ బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన శ్రీ వైయస్‌ జగన్‌ భవిష్యత్తులో సమర్థంగా పనిచేయాలని ఆకాంక్షించారు. శ్రీ వైయస్‌ జగన్‌ నాయకత్వం, ఆయన సిద్ధాంతాలు, లక్ష్యాలు, ప్రజల పట్ల నిబద్ధతతో కూడిన రాజకీయ జీవితం తనను ఎంతగానో ఆకర్షించాయని జయకుమార్‌ వెల్లడించారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న వైయస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉందని, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, తదితరులు

మా కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేని ప్రత్యేక కృతజ్ఞతలు జగన్ గారికి తెలుపుకుంటున్నాం

ఆషాఢ తొలి ఏకాదశి శుభాకాంక్షలు! శ్రీ మహావిష్ణువు కృపతో ఆయురారోగ్యాలు, ఆనందం కలగాలి! ❤️🙏

ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పర్వదినాన్ని భక్తి, విశ్వాసాలతో ఆచరిస్తూ శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటున్నా. శ్రీ మహావిష్ణువు  ఆశీస్సులతో మీ అందరికీ  సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని  మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా.

YSRCP launches district-wide protests on July 28, demanding justice for NEET students, DSC aspirants, and unemployed youth. ✊

తాడేపల్లి వైఎస్సార్సీపీలో చేరిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు శ్రీ వైయస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఒంగోలు నేతలు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఒంగోలు నగర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు టి.నాగలక్ష్మి, జిల్లా కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ సీనియర్‌ నాయకుడు డి.సతీష్‌బాబు తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన శ్రీ వైయస్‌ జగన్‌ భవిష్యత్తులో సమర్థంగా పనిచేయాలని ఆకాంక్షించారు. శ్రీ వైయస్‌ జగన్‌ నాయకత్వం, ఆయన సిద్ధాంతాలు, లక్ష్యాలు, ప్రజల పట్ల నిబద్ధతతో కూడిన రాజకీయ జీవితం తమను ఎంతగానో ఆకర్షించాయని నాగలక్ష్మి, సతీష్‌బాబు వెల్లడించారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న వైయస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉందని, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టి.నాగలక్ష్మి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

కూటమి ప్రభుత్వ బాధితులకు అండగా నిలుస్తున్న వైయస్‌ఆర్‌సీపీ! సమస్య ఏదైనా.. ఇబ్బందులు ఎదురైనా వైయస్ జగన్ గారి వైపు చూస్తున్న బాధితులు మాట ఇచ్చినట్లే బాధిత కుటుంబాలకు ఒక్క నెలలోనే ఏకంగా రూ.79 లక్షలు సాయం #YSJaganCares #YSRCPForPeople@BringBackYsjagan

ఇది జగనన్న మార్క్ పాలన! 🔥

Man of His Word! 🤍🫂 చెప్పిన మాటను చేతల్లో చూపించిన జగనన్న. ఒక్క నెలలోనే బాధిత కుటుంబాలకు ₹79 లక్షల సాయం అందించారు. 🙏