పాడి పరిశ్రమ
Open in Telegram
పాడి పశువులు, గొర్రెలు, మేకలు మరియు కోళ్ల పెంపకం గురించి సూచనలు సందేహాలు కొరకు సంప్రదించండి. డాక్టర్.జి.రచ్చ రాంబాబు.కడప.ఫోన్. 9618499184 (whatsapp only). Telegram ను ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసి లింకును క్లిక్ చేయుము.
Show more1 459
Subscribers
No data24 hours
-27 days
-6530 days
Posts Archive
1 459
https://www.kviconline.gov.in/pmegpeportal/pmegphome/index.jsp#
అందరి రైతులకు తెలియచేయడం ఏమనగా pmegp పథకం క్రింద పైన తెలిపిన ప్రాజెక్ట్స్ మాత్రమే ఉన్నాయి . గొర్రెలు మేకలు కోళ్ళు పథకం లు అయిపోయాయి. నేరుగా వెబ్సైటు లో అప్లై చేయవచ్చు. ముందుగ బ్యాంకర్ ను సంప్రదించిన తరువాతనే ముందుకు పోగలరు ఎందుకంటే వాళ్ళు మీ యొక్క వివరాలను వాళ్ళ pmegp లాగిన్ నుండి అప్లోడ్ చేసిన తరువాత మాత్రమే మీకు 35 నుండి 50 శాతం వరకు సబ్సిడీ పడుతుంది. బ్యాంకర్ మోస్ట్ ఇంపార్టెంట్.
1 459
అశ్విని పేరిట కొత్త పూస శనగ రకం – ICAR అరుదైన గౌరవం
రాష్ట్రానికి చెందిన దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త నూనవత్ అశ్వినికి అరుదైన గౌరవం దక్కింది. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ICAR) అభివృద్ధి చేసిన కొత్త పూస శనగ రకం "4037"కి ఆమె పేరు పెట్టారు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారంతండాకు చెందిన అశ్విని, తన తండ్రి మోతీలాల్తో కలిసి గత సంవత్సరం కారులో ప్రయాణించగా వరదలో కొట్టుకుపోయి మృతి చెందిన విషాద ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. స్వల్ప కాలంలోనే అశ్విని పరిశోధనలతో తనదైన ముద్ర వేసి వ్యవసాయ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందింది.
ఇప్పుడా గుర్తింపును చరిత్రలో నిలిపే విధంగా, ఆమె పరిశోధనలో భాగంగా అభివృద్ధి చేసిన పూస శనగ వంగానికి 'అశ్విని' అని పేరు పెట్టినట్లు ఐసీఏఆర్ ప్రకటించింది.
దిగుబడి విశేషాలు:
'అశ్విని' పేరుతో విడుదల చేసిన పూస శనగ రకం, హెక్టారుకు 26.73 క్వింటాళ్ల నుంచి 36.46 క్వింటాళ్ల వరకు అధిక దిగుబడి ఇవ్వగలదని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ద్వారా రైతులకు ఆర్థికంగా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది.
యువతలో పరిశోధన పట్ల ఆసక్తిని పెంచేలా, అశ్వినీ జీవితం ఒక ప్రేరణగా నిలిచింది.
