cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

పాడి పరిశ్రమ

పాడి పశువులు, గొర్రెలు, మేకలు మరియు కోళ్ల పెంపకం గురించి సూచనలు సందేహాలు కొరకు సంప్రదించండి. డాక్టర్.జి.రచ్చ రాంబాబు.కడప.ఫోన్. 9618499184 (whatsapp only). Telegram ను ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసి లింకును క్లిక్ చేయుము.

Show more
Advertising posts
1 640Subscribers
No data24 hours
-17 days
-1730 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

Show all...
పొదుగుపై గోరు వెచ్చని నీరు టెక్నిక్ | Cow Milk

#raitunestham #livestockfarming #gircow #desicow #desicowbreeds ఆవులను ఆరోగ్యంగా ఉంచుకుంటేనే రైతు పాడిలో అభివృద్ధి సాధిస్తారు. ముఖ్యంగా పాలు పితికే సమయంలో కొన్ని టెక్నిక్స్ పాటించడం ద్వారా పొదుగు వాపు వంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. పాల దిగుబడిలోనూ వృద్ధి సాధించవచ్చు అని చెబుతున్నారు పశు వైద్య నిపుణులు డాక్టర్ జి. రాంబాబు. ------------------------------------------------------------------------------------------ ☛ Subscribe for latest Videos -

https://youtu.be/hD-XGUUnFp0

☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​ ☛ Follow us on -

https://www.facebook.com/Rytunestham​...

☛ Follow us on -

https://twitter.com/rythunestham​​​​

Show all...
దేశీ ఆవులకి ఉచిత ఆపరేషన్లు, మందులు.. ఎక్కడంటే ? #cow #treatment #cattlehealth #raitunestham

#raitunestham #livestockfarming #Gosadassu రిజిస్ట్రేషన్ లింక్ 👉👉 :

https://bit.ly/DesiCowHealthCamp

...

👍 1
ప్రకృతి, సేంద్రియ వ్యవసాయానికి మూలాధారమైన దేశీయ ఆవు జాతుల రక్షణ, అభివృద్ధే లక్ష్యంగా రైతునేస్తం ఫౌండేషన్... కర్షక సేవా కేంద్రం నిర్వహణలో. 2024 ఫిబ్రవరి 11న ఆదివారం... దేశీ గోవుల ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరుగుతోంది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులో గల రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణలో... అన్ని హంగులు, ప్రముఖ పశు వైద్యుల పర్యవేక్షణలో ఈ ఆరోగ్య శిబిరం సేవలు అందించనుంది. దేశంలోనే ప్రపథమంగా కేవలం దేశీ గో జాతుల కోసమే నిర్వహిస్తోన్న ఈ ఆరోగ్య శిబిరం.... ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతుంది. గో సంరక్షణపై సదస్సు ఉదయం 10 నుండి 4 గంటల వరకు వుంటుంది… దేశీ గోవుల ఉచిత ఆరోగ్య శిబిరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పశువైద్య నిపుణులు పాల్గొంటారు. కార్యక్రమంలో భాగంగా నాలుగు శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గోవుల్లో గర్భకోశ వ్యాధులు - పొదుగు మరియు పాల ఉత్పత్తి... ఆరోగ్య సమస్యలు... శస్త్రచికిత్సల కోసం శిబిరాలు ఉంటాయి. గర్భ కోశ వ్యాధుల శిబిరంలో.... యుక్త వయసు వచ్చినప్పటికీ ఎదకు రాని పెయ్యలు... ఎదకు వచ్చినప్పటికీ కట్టు నిలవని ఆవులు... ఈచుకుపోతున్న ఆవులకి చికిత్సలు అందించడం జరుగుతుంది. అలాగే ఇతర అన్ని రకాల గర్భ కోశ సమస్యలకు వైద్యులు చికిత్స చేస్తారు. పొదుగు, పాల ఉత్పత్తికి సంబంధించిన శిబిరంలో.... పొదుగు వాపు... పాలలో రక్తం రావడం... రొమ్ము నుంచి చీము కారడం.. పొదుగు గడ్డలు మొదలైన పొదుగుకి సంబంధించిన సమస్యల మరియు పాల ఉత్పత్తికి సంబంధించి వైద్య నిపుణులు చికిత్స అందిస్తారు. శస్త్ర చికిత్సల శిబిరంలో... మందగుది, తోక గురుజు, కన్ను క్యాన్సర్, కొమ్ము మాద, కంతులు, గడ్డలు, మొదలైన వాటికి పశు వైద్యులు సర్జరీలు నిర్వహిస్తారు. మరో శిబిరంలో ఇతర ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా... అలాంటి గోవులకి పశు వైద్య నిపుణులు కావాల్సిన చికిత్సలు చేస్తారు. గోవులను పూర్తిగా పరిశీలించి.. ఆరోగ్య సమస్యలకు ఔషధాలను ఉచితంగా అందిస్తారు. గోవు ఆరోగ్య స్థితికి అనుగుణంగా.. ఆయుర్వేద, హోమియో, అల్లోపతి వైద్య విధానాల్లో ఏది బాగా పనిచేస్తుందో తెలిపి... అందుకు సంబంధించిన మందులను గో పోషకులకి ఉచితంగా అందించడం జరుగుతుంది. కార్యక్రమంలో భాగంగా.... గోవుల ఆరోగ్య రక్షణపై గో పోషకులకి వైద్య నిపుణులు సమగ్ర అవగాహన కల్పిస్తారు. మొక్కలు, మూలికలతో కూడిన ఖర్చులేని ఆయుర్వేద వైద్యం... తక్కువ ఖర్చుతో చేసే హోమియో చికిత్స... సాధారణ అల్లోపతి వైద్య విధానాలపై అవగాహన సదస్సు జరుగుతుంది. తేలికపాటి వ్యాధులకి రైతు స్థాయిలోనే ఆయా విధానాల్లో చికిత్సలకు అందించే పద్ధతులపై పూర్తి వివరాలు తెలియజేస్తారు. దేశీ గోజాతుల అభివృద్ధి కోసం పిండమార్పిడి ప్రక్రియ,(EMBYO TRANSFER TECHNOLOGY, ),లింగ వీర్య విశిష్టత ( SEXED SEMEN),గోసంతతి అభివృద్ధి (Herd fertility) విషయాలలో ప్రభుత్వ కార్యక్రమాలు గురించి వివరించటం జరుగుతుంది . శిబిరంలో వైద్య సేవలు, శస్త్రచికిత్సలు, ఔషధాలు ఉచితంగా అందించడం జరుగుతుంది. ఉదయం 12 గంటలలోపు వచ్చే ఆవులకు మాత్రమే చికిత్స అందించడం జరుగుతుంది. దేశీ గో జాతుల ఆరోగ్య రక్షణ తద్వారా వాటి అభివృద్ధి కోసం నిర్వహిస్తోన్న ఈ ఉచితఆరోగ్య శిబిరానికి గో పోషకులు అందరూ ఆహ్వానితులే. శిబిరానికి హాజరయ్యే గో పోషకులకి మధ్యాహ్నం చిరుధాన్యాలతో భోజన సదుపాయం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే గో పోషకులకి ముందు రోజు అనగా... ఫిబ్రవరి 10, శనివారం రాత్రి బస సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఈ ఆరోగ్య శిబిరంలో పాల్గొనాలని అనుకునే దేశీ గో పోషకులు... తప్పనిసరిగా ముందుగానే పేర్లు నమోదు చేసుకోవాలి. గోవుల సంఖ్య, వాటి ఆరోగ్య వివరాలు, కావాల్సిన చికిత్స తదితర వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా పేర్లు నమోదు చేసుకోగలరు. లేదా 70939 73999 ఫోన్ నంబర్ లో సంప్రదించి వివరాలు తెలియజేసి పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. కేవలం దేశీ గో జాతుల కోసం నిర్వహిస్తోన్న ఈ ఆరోగ్య శిబిరంలో సంకర జాతి ఆవులు, గేదెలకు చికిత్సలు అందించడం జరగదు. కావున.. ఈ విషయాన్ని గుర్తించి సంకర జాతి ఆవులు, గేదెలను శిబిరానికి తీసుకురాకూడదని తెలియజేస్తున్నాం. దేశీయ గో జాతులను రక్షించి.. వాటి సంతతిని పెంచాల్సిన బాధ్యత ప్రతి రైతు.. గో పోషకులపై ఉంది. ఈ సంకల్పన సాధనకు తాము నిర్వహిస్తోన్న ఈ ఉచిత ఆరోగ్య శిబిరం తోడ్పడగలదని... మహోన్నత ఆశయంతో నిర్వహిస్తోన్న కార్యక్రమంలో అధిక సంఖ్యలో దేశీయ గో జాతుల పోషకులు పాల్గొంటారని ఆశిస్తున్నాం. https://bit.ly/DesiCowHealthCamp రెఫరెన్స్ -DR G RAMBABU
Show all...
👍 1
Show all...
రైతునేస్తం Books Bundle offer | 50 % Discount | 9676797777 , 9705383666

#raitunestham #raitunesthampablication #books ఈ 62 పుస్తకాలు మీ వద్ద ఉంటే... రైతు, ప్రకృతి - సేంద్రియ వ్యవసాయం, పశు పోషణ, జీవాల పెంపకం.... మిద్దెతోటలు.. పెరటి తోటల పెంపకం.. ఆహారం - ఆరోగ్యానికి సంబంధించిన సమస్త సమాచారం మీ వద్ద ఉన్నట్లే. ఈ మొత్తం 62 పుస్తకాల ధర... 12740 /- రూపాయలు. కానీ రైతునేస్తం పబ్లికేషన్స్ బండిల్ ఆఫర్ కింద... ఈ పుస్తకాల కొనుగోలుపై 50 శాతం ప్రత్యేక డిస్కౌంట్ ప్రకటిస్తోంది. అంటే... 62 పుస్తకాలు కేవలం 6370 /-రూపాయలకే లభిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం... ఎంతోవిలువైన సమాచారాన్ని అందించే పుస్తకాలను వెంటనే ఆర్డర్ చేయండి. లేదా నేరుగా రైతునేస్తం కార్యాలయాన్ని సంప్రదించి కొనుగోలు చేయండి. పుస్తకాల కోసం సంప్రదించాల్సిన చిరునామా, ఫోన్ నంబర్లు…. హైదరాబాద్ లో… రైతునేస్తం పబ్లికేషన్స్… నంబర్ 6-2-959, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్, ఖైరతాబాద్, హైదరాబాద్ - 500004 ఫోన్ నంబర్లు - 9676797777, 040-23395979 పని దినాళ్లో మాత్రమే బుక్ స్టోర్ ఓపెన్ ఉంటుంది. అది కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే.. గమనించగలరు. గుంటూరులో.. డోర్ నంబర్ 8-198, పుల్లడిగుంట దగ్గర, కొర్నెపాడు పోస్ట్, వట్టిచెరుకూరు మండలం, గుంటూరు జిల్లా, 522017 ఫోన్ నంబర్లు - 9705383666, 0863 -2286228 పని దినాళ్లో మాత్రమే బుక్ స్టోర్ ఓపెన్ ఉంటుంది. అది కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే.. గమనించగలరు. --------------------------------------------------------------------------------------------- ☛ Subscribe for latest Videos -

https://youtu.be/NPQ0I1u8EKo

☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​ ☛ Follow us on -

https://www.facebook.com/Rytunestham​...

☛ Follow us on -

https://twitter.com/rythunestham​​​​

It makes me very glad to share Book published for ANIMAL HUSBANDRY ASSISTANTS. Tq so much to Dr M srinivasulu reddy sir Assistant Director, giving me as co-author opportunity. Tq so much to all my friends & well wishers🌹🌹🌹🌹🌹 If anyone want to book online link below. https://www.vijayampublications.com/product-page/village-animal-husbandry-assistant-vaha-bit-bank
Show all...
👍 2 2
GPS Ear Tags for Cattle: పశువుల కాయడం చాలా కష్టం. పది పశువులు పొలానికి తీసుకెళ్లాలంటే ఒక మనిషి తప్పనిసరిగా వాటి వెంట ఉండాల్సిందే. అయితే అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతికతతో వేలాది పశువులను ఒకరే అది కూడా ఇంటి వద్ద నుంచే మేపవచ్చు. నేటి కాలంలో పశువులు కాయాలంటే మనుషులు కూడా దొరకడం లేదు. పశువులు కాయడం చిన్నతనంగా తయారైంది. పశువులను మేపే వారంటే సమాజంలో గౌరవం లేకపోవడంతో ఈ రంగంలోకి ఎవరూ రావడం లేదు. దీంతో దేశంలో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. దీనివల్ల పాలలో కల్తీలు పెరిగి ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. వీటన్నింటికీ ఈ కొత్త విధానం పరిష్కారం చూపుతుంది. పశువులను ఇంటి వద్ద నుంచే ఎలా నియంత్రిస్తారనేగా మీ అనుమానం? అదే ఇప్పుడు చూద్దాం. ఇలా చేయాలి ముందుగా పశువులను మేపే పొలాన్ని జియో ట్యాంగింగ్ చేసి జీపీఎస్‌కు అనుసంధానం చేసుకోవాలి. జీపీఎస్‌తో పనిచేసే స్పీకర్లను పశువుల మెడలో వేయడం ద్వారా వాటిని నియంత్రిస్తారు. పశువు ఏదైనా పొలం సరిహద్దు దాటుతుందని జీపీఎస్ ద్వారా హెచ్చరికలు రాగానే స్పీకర్ నుంచి శబ్దాలు వస్తాయి. వైబ్రేషన్స్ పశువులను అలర్ట్ చేస్తాయి. దీంతో అది వెనక్కు మళ్లుతాయంటున్నారు శాస్త్రవేత్తలు. సరిహద్దు దాటే సమయంలో జీపీఎస్ సిస్టమ్ ఇంట్లో ఉన్న వ్యక్తిని అలర్ట్ చేస్తుంది. ఎవరైతే జీపీఎస్ యాప్‌ను ఫోన్లో ఉంచుకుంటారో వారికి పశువుల వివరాలు ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటాయి. పశువులు తప్పిపోయినా జీపీఎస్ పట్టిస్తుంది పశువుల మేతకు వెళ్లి తప్పిపోతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులు వేసవిలో పశువులను పొలాలకు వదిలేస్తూ ఉంటారు. అలా వెళ్లిన పశువులు దారి తప్పి పోవడం, లేదా దొంగలు వాటిని తరలించడం చేస్తుంటారు. దీంతో రైతులకు భారీగా నష్టం వస్తుంటుంది. అదే జీపీఎస్ అమర్చిన బాక్సులకు పశువుల మెడలో ఉంచితే అవి ఎక్కడున్నాయో యజమాని ఫోన్‌కు సమాచారం అందిస్తున్నారు. దీని ద్వారా తమ పశువులను సులభంగా గుర్తించవచ్చు. ఇంకా అందుబాటులో లేదు ప్రస్తుతం ఇలాంటి జీపీఎస్ విధానం మన దేశంలో అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతానికి ప్రయోగ దశలోనే ఉంది. ఈ విధానంలో కొన్ని లోపాలున్నా, వాటిని సరిదిద్దుకుని త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ జీపీఎస్ విధానం అతి తక్కువ ఖర్చుతోనే ప్రతి పశువుకు ఏర్పాటు చేసుకోవచ్చు. భారీగా బంజరు భూములు ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆస్ట్రేలియా,అమెరికా లాంటి దేశాల్లో ఇలాంటి విధానాలు విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఒకటి రెండు పశువులు అయితే పొలాలకు పెంచిగ్ వేసుకోవడం ఉత్తమ మార్గంగా నిపుణులు చెబుతున్నారు.
Show all...
👍 4
Show all...
దూడలకు కళ్ళు కనపడక పోవడము/రేచీకటి/అంధత్వం- ప్రథమ చికిత్స:| DR G RAMBABU #drrambabu #pashupriya

దూడలకు కళ్ళు కనపడక పోవడము/రేచీకటి/అంధత్వం- ప్రథమ చికిత్స:WHATSAPP CHANNEL:

https://whatsapp.com/channel/0029Va9iUmZKbYMM2LwTLz1V

పాడి పశువులు, గొర్రెలు, మేకల...