హరేకృష్ణ హరేరామ భక్తి చానల్
关闭频道
ఆధ్యాత్మిక విషయాలు , భగవద్గీత, మానవతా విలువలు, సనాతన ధర్మం, పురాణాలలో ఉన్న నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలు, ప్రముఖ ప్రవచనకారుల ఉపన్యాసాలు, భక్తి గీతాలు, స్తోత్రాలు సామాజిక స్పృహ కలిగిన అంశాలు మొదలైన విషయాలు ఈ చానలలో అప్లోడ్ చేయబడతాయి
显示更多2 104
订阅者
-124 小时
-57 天
-3630 天
帖子存档
రాధాష్టమి :
రాధాష్టమి అనేది శ్రీరాధాదేవి జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే పవిత్రమైన పర్వదినం. భాద్రపద మాసం శుక్లపక్ష అష్టమి తిథిని రాధాష్టమిగా ఆచరిస్తారు. ఈ రోజున భక్తులు శ్రీరాధాకృష్ణులను భక్తిశ్రద్ధలతో పూజించి, రాధాదేవికి అభిషేకాలు, అలంకరణలు, పుష్పార్చనలు నిర్వహిస్తారు. రాధాదేవి కృప వల్ల ప్రేమ, భక్తి, కుటుంబ సౌఖ్యం, మనశ్శాంతి కలుగుతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా రాధాకృష్ణుల నామస్మరణ, భజనలు, కీర్తనలు, ఉపవాసం, పూజలు చేయడం ద్వారా దైవానుగ్రహం లభిస్తుందని పురాణ సంప్రదాయాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడి పరమభక్తురాలైన రాధాదేవిని ఆరాధించే అత్యంత విశిష్టమైన పర్వదినమే రాధాష్టమి.
అనగా నీవు ఎక్కిన శకటమునకు ఎవరు సారధిగా ఉన్నాడు? ఈశ్వరుడు. స్థిత ప్రజ్ఞుడయిన సారధి శకటమును వేయికళ్లతో చూసి నడిపిస్తాడు. శకటములో ప్రయాణిస్తున్న జీవునికి ఏ ప్రమాదము కలుగదు. సారధియే బుద్ధి. ఆ బుద్ధిని కృష్ణ పాదముల దగ్గర పెట్టేయాలి. తెలిసికాని, తెలియక కాని పరమభక్తితో భాగవతంలో దశమ స్కంధార్గత శకటాసుర వృత్తాంతమును విన్నంత మాత్రం చేత శకటాసురుడు – జీవుడు ప్రయాణిస్తున్న ఈ బండి రాక్షసుడు. ఎప్పుడు? ‘ఇదే నేను – అన్నీ నేను చేస్తున్నాను’ అనే భావన ఉన్నప్పుడు. కృష్ణుడు జగదాచార్యుడై వచ్చాడు. అజ్ఞానం బాగా ఉంటుంది దానిని చీల్చడానికి అర్థరాత్రి పుట్టాడు. ఆయనేమి చేశాడు? ‘మనః మనః’ అనకురా, ‘నమః నమః’ అనమని చెపుతాడు. జీవుడు కర్మచేత, భక్తిచేత, జ్ఞానము వైపు నడుస్తాడు. ఈవిధంగా శకటాసుర సంహారం పైకి చిన్న లీల. అంతరమునందు స్వామి పెద్ద రహస్యమును దాచారు.
Srimadhandhra Bhagavatham -- Dasama Skandam -- 6 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu
*శకటాసుర సంహారం*
కృష్ణ లీలలు అన్నీ కూడా మనకు జీవితంలో చేయి ఇచ్చి పైకి ఎక్కించే లీలలు. శకటాసుర సంహారం చాలా చిన్న ఘట్టం. ఎంత విన్నా వేదాంతము వేదాంతముగా ఎప్పుడూ లోపల నిలబడదు. పక్క ఒక ఆలంబనము ఉండాలి. అన్నమును అన్నముగా తినలేరు. పక్కన కూరో, పచ్చడో, పులుసో ఉండాలి. అలాగే వేదాంతము ఎప్పుడూ కథగా ఉండాలి. కథ లేకపోతే ఈశ్వరుడు లీల చేస్తాడు. పరమాత్మ చేసే లీలలు కర్మతో చేసినవి కాదు. అందులో ఏదో పరమార్థం ఉంటుంది. ఆయన లీలల వెనక ఎంతో ఔచిత్యం ఉంటుంది.
ఒకనాడు కృష్ణపరమాత్మ బోర్లా పడ్డాడు. పిల్లలను మొదట్లో పడుకోపెట్టినపుడు ఎటు పడుకున్నవాడు అటే పడుకుంటాడు. పసిపిల్లవాడు మొదట చేసేపని బోర్లాపడడం. పిల్లవాడు బోర్లాపడితే ఆ రోజున ఇంట్లో అదొక పెద్ద ఉత్సవం. బోర్లాపడ్డాడు అని బొబ్బట్లు మొదలయిన పిండివంటలు వండుకు తినేస్తారు.
యశోద అలా చెయ్యలేదు. ముత్తైదువలను పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమలను ఇచ్చింది. వాళ్లకి చీరలు, రవికల గుడ్డలు పెట్టింది. బ్రాహ్మణులను పిలిచి వారికి గోదానము చేసింది. ఈశ్వరునికి అభిషేకం చేసింది. యశోద అన్నిటికి దైవం వైపు చూస్తోంది. యశోద అంటే యశస్సును ఇచ్చున్నదని అర్థము. కీర్తి ఎటు పక్కనుంచి వస్తుందో జీవితము ఎటువైపు నడవాలో యశోదవైపు నుంచి తెలుస్తుంది. పిల్లాడు బోర్లాపడితే మనం బొబ్బట్లు వండుకు తినడం కాదు! శివాలయమునకు వెళ్ళి అభిషేకం చేయించాలి. లేదా రామాలయమునకో, కృష్ణాలయమునకో వెళ్ళి తులసి పూజ చేయించాలి. మనవడు బోర్లాపడే అదృష్టం ఈశ్వరుడు సమకూర్చాడు. పిల్లవాడు వృద్ధిలోకి రావడమును ఈశ్వరానుగ్రహంగా భావించాలి.
నందుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇంటికి అందరూ వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. యాదవుల ఐశ్వర్యం పశువులు, పాడి, పాలకుండలు, పెరుగు కుండలు, నేతి కుండలు, అరటి పళ్ళ గెలలు మొదలయినవన్నీ పెట్టారు. బండికి కూడా ఒక తోరణం కట్టేశారు. ఒక మంచం వేసారు. ఆ మంచం మీద ఒక పరుపు వేసారు. ఆ పరుపు మీద కృష్ణుడిని పడుకోబెట్టారు. ఉత్సవం అంతా కృష్ణుడు బోర్లాపడ్డాడు. అతడికోసం చేస్తున్నారు. ఉత్సవం వేడుకలో పడి ఈయనని మరచిపోయారు. ఈయనకు ఆకలి వేసింది. పడుకున్న పిల్లాడికి కాళ్ళు ఎత్తడం తప్ప ఇంకేమీ రాదు. ఆయన పక్కనే బండి ఉన్నది. ఆయనది చిన్ని అరికాలు. దానికి పెసర గింజలంత చిన్నిచిన్ని వేళ్ళు. అందులోనే శంఖం, చక్రం, నాగలి, అమృతపాత్ర మొదలయిన దివ్యచిహ్నములు. అటువంటి కాలితో బండిని ఒక్క తన్ను తన్నాడు.
ఈయన కాలు తగలగానే ఆ బండి ఆకాశంలోకి ఎగిరిపోయింది. దాని చక్రములు, ఇరుసు అన్నీ ధ్వంసం అయ్యాయి. అక్కడినుండి క్రిందపడిపోయి తుత్తునియలయిపోయాయి. దీనిని చూసి అక్కడ ఉన్న గోపకాంతలు, యశోద, నందుడు పరుగుపరుగున అక్కడికి వచ్చారు. పిల్లవాడిని చూస్తే చాలా చిన్నవాడు. బండి చాలా పెద్దది. ఆకాశమునకు ఎగిరిపోయేలా బండిని కాలితో తన్నడమేమిటి? చాలా ఆశ్చర్యంగా ఉన్నది. యశోద పిల్లవాడిని తీసుకుని సముదాయించింది. ‘అయ్యో! నాన్నా! ఆకలి వేసిందా? నీ కాలు బండికి తగిలిందా? కాలేమీ నొప్పి పెట్టలేదు కదా! అని పిల్లాడిని ఎత్తుకుని పాలిచ్చింది. అది అమ్మ హృదయం. మాతృత్వమునకు ఉన్న గొప్పతనం. మాతృత్వమునందు దేవతాంశ ప్రవేశించి పరాభట్టారికరూపమై నిలబడింది. స్త్రీకి అంత గొప్పతనం వచ్చింది.
కృష్ణుడు ప్రదర్శించిన లీల చాలా చిన్నది. దీనిలో ఉన్న అంతరార్థమును గ్రహించేటందుకు ప్రయత్నించాలి. ఈ శరీరమును భగవంతుడు ఇచ్చాడు. శరీరము మనం నిర్మించుకున్నది కాదు. అన్నింటిని ‘నావినావి’ అంటారు. ‘నావి’ అని చూపించిన ఈ శరీరములో ఏ ఒక్కటీ తనది కాదు. ఏదీ తాను తేకపోయినా ఈశ్వరుడు దీనిని నిర్మాణం చేశాడు. ఈశ్వరునిచే ఇంత గొప్పగా నిర్మింపబడి ప్రసాదింప బడిన ఈ దేహము దేనికొరకు? ఇది శకటము. ఈ బండిని ఎక్కి మీరు తీరమును చేరగలరు. మనము ఈ బండినెక్కి తీరమును చేరడం లేదు. ఎందువలన? దీనిని దేనికోసం ఉపయోగించాలో దానికోసం ఉపయోగిస్తే తీరం చేరుతారు. లక్ష్యం వైపు వెళ్ళడం లేదు. ఈ మానవ శరీర శకటంలో కూర్చుని తాను పొందుతున్న శుభములు ఈశ్వరానుగ్రహములని తలపక అన్నీ ‘నా ప్రజ్ఞ’ అంటూ ఉంటాడు. ‘ఈ పనులను ఈశ్వరుడు చేయించాడు. చేయగలిగాను’ అనడు. జీవుడు ఈశ్వరానుగ్రహము తీసివేసి మాట్లాడుతాడు. ఈశ్వరానుగ్రహము వలన తాను ఆ పనులను చేయగలుగుతున్నాననే భావన మనసులో ఉండాలి. అటువంటి భావన ఉన్నప్పుడు మాత్రమే ఈ శకటమును ఎక్కి లక్ష్యమును చేరతారు. లేకపోతే ఇది ‘శకటతి యితి శకటః’ అవుతుంది.
శం అనగా సుఖము, ఈశ్వరుడు. ఈ శకటమును ఎందుకు ఎక్కారో తెలుసుకుంటే దానిని ఈశ్వరానుగ్రహమని భావించడం ప్రారంభిస్తారు. ఈశ్వరానుగ్రహం తప్పు పనులు చేయించదు. సాత్త్వికమైన ప్రవృత్తిలోనికి తిప్పేస్తుంది.
వందేత్వాం భూదేవీం ఆర్యమాతరం
దేశభక్తి గేయం – బృందగానం
రచన – రాయప్రోలు సుబ్బారావు గారు
ఆకాశవాణి – విజయవాడ
సంస్కృత దేశభక్తి గీతం
