Govt Updates
Відкрити в Telegram
🇮🇳 కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్లు, స్కీములు, ఉద్యోగాలు, మరియు తాజా అప్డేట్స్ — అన్నీ ఒకే చోట! 📢 ఇప్పుడే “Govt Updates” ఛానల్లో జాయిన్ అవ్వండి. Follow the Govt Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029V
Показати більше7 250
Підписники
+124 години
+237 днів
+730 день
Архів дописів
7 249
అన్ని ఎన్నికల సేవలు.. ఇక ఒకే ఒక్క యాప్లో! 🗳️📱
భారత ఎన్నికల సంఘం (Election Commission of India) ప్రవేశపెట్టిన ECINET యాప్ ద్వారా ఓటర్లకు కావాల్సిన అన్ని సేవలు ఇప్పుడు మీ మొబైల్లోనే అందుబాటులో ఉన్నాయి.
యాప్ ద్వారా మీరు పొందగల సేవలు:
* 📝 ఓటర్ రిజిస్ట్రేషన్ ఫారాలు
* 🔍 ఓటర్ లిస్ట్లో మీ పేరును కనుగొనడం
* 💳 ఇ-ఓటర్ కార్డ్ (e-EPIC) డౌన్లోడ్ చేసుకోవడం
* 📄 మీ అప్లికేషన్ స్టేటస్ను ట్రాక్ చేయడం
* 📞 BLO మరియు ఎన్నికల అధికారులను సంప్రదించడం
*⚠️ ఏదైనా ఫిర్యాదును సబ్మిట్ చేయడం
ఓటరు నమోదు నుండి పోలింగ్ వరకు.. అన్నీ కేవలం ఒక క్లిక్తో!
7 249
July 1st నుండి : Aadhaar App లో
మీ Aadhaar, మీ Family Member Aadhaar కి
Mail ID add or Update
Self గా Free గా చేసుకోవచ్చు
మీ family లో అందరికీ ఒకే మెయిల్ ఐడి కూడా ఇవ్వొచ్చు.
Aadhaar App
Services
E-mail Add/Updated
Enter Email ID
Submit OTP
Complete Face Authentication
Submit
Aadhaar App Link 🔗
https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.pehchaan
7 249
ఆ పిల్లలకు నెలకు రూ.4వేలు
AP: అనాథ పిల్లలకు నెలకు ₹4వేల చొప్పున ఇచ్చే 'మిషన్ వాత్సల్య' పథకానికి GOVT దరఖాస్తులు స్వీకరిస్తోంది. తల్లిదండ్రులిద్దరూ లేని పిల్లలకే కాకుండా ఈసారి పేరెంట్స్లో ఎవరో ఒకరు లేని పిల్లలు, విడాకుల జంటలు/యాసిడ్ బాధితులు/ప్రాణాంతక వ్యాధిగ్రస్థుల పిల్లలకూ ఇస్తారు. పిల్లల వయసు 2026 MAR31కి 18 ఏళ్లలోపు ఉండాలి. 18 ఏళ్ల వరకు దీన్ని ఇస్తారు. దరఖాస్తుకు అంగన్వాడీ, CDPOను సంప్రదించాలని అధికారులు సూచించారు.
7 249
డీమ్డ్ యునివర్సిటీల్లో డిగ్రీ చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు
ఏపీ ప్రభుత్వం డీమ్డ్ యూనివర్సిటీల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ (PMS-RTF) ప్రయోజనాలను విస్తరించింది.
▪️ఏపీ డీమ్డ్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్ వర్తిస్తుంది.
▪️కేంద్ర ప్రభుత్వం వాటాగా:
ఎస్సీ విద్యార్థులకు 60%, ఎస్టీ విద్యార్థులకు 75% నిధులు అందిస్తారు.
▪️రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన వాటాను:
ఎస్సీలకు 40%, ఎస్టీలకు 25% P4 (Public-Private-People Partnership) విధానంలో దాతలు, పారిశ్రామికవేత్తలు, HNIs, సంస్థల సహకారంతో సమకూరుస్తారు.
▪️ఒక విద్యార్థిని స్పాన్సర్ చేసిన వారు, అతని/ఆమె కోర్సు పూర్తయ్యే వరకు రాష్ట్ర వాటాను కొనసాగించాలి.
▪️ఎస్సీ విద్యార్థుల స్కాలర్షిప్ మొత్తం ఆధార్తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఎస్టీ విద్యార్థుల విషయంలో నిధులు నేరుగా కళాశాల ఖాతాకు జమ చేయబడతాయి.
7 249
ఒక జిల్లా స్థాయి అధికారి ఉద్యోగులను "కొట్టి అయినా పని చేయించుకోండి" అని ప్రోత్సహించడం లేదా ఆదేశించడం చట్టవిరుద్ధం, మరియు ఇది క్రమశిక్షణా రాహిత్యం.
దీనిపై బాధిత ఉద్యోగులు క్రింది చట్టపరమైన మరియు శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది.
శాఖాపరమైన చర్యలు (Departmental Action): ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి ( Andhra Pradesh Civil Services (Conduct) Rules లేదా CCS (Conduct) Rules) ప్రకారం, ఏ అధికారి కూడా తోటి ఉద్యోగులతో అమర్యాదకరంగా ప్రవర్తించడం, హింసను ప్రోత్సహించడం లేదా బెదిరించడం చేయకూడదు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary), ఉన్నతాధికారులకు లేదా విజిలెన్స్ విభాగానికి ఆధారాలతో లిఖితపూర్వక ఫిర్యాదు చేయవచ్చు.
క్రిమినల్ కేసులు (Criminal Action): అధికారి చేసిన వ్యాఖ్యల తీవ్రతను బట్టి, భౌతిక దాడికి పాల్పడమని చెప్పడం లేదా బెదిరించడం వంటి వాటికి Indian Penal Code (IPC) కింద కేసులు నమోదు చేయవచ్చు.సెక్షన్ 503/506 (Criminal Intimidation)
బెదిరింపులకు పాల్పడినందుకు. సెక్షన్ 114/115/117: నేరం చేయడానికి ఇతరులను పురికొల్పినందుకు (Abetment).ట్రిబ్యునల్ లేదా కోర్టులను ఆశ్రయించడం (Tribunals/Courts): ఈ వ్యాఖ్యల వల్ల ఉద్యోగుల పని వాతావరణం దెబ్బతింటే లేదా మానసిక వేధింపులకు గురైతే, వారు CAT (Central Administrative Tribunal) లేదా రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించవచ్చు.
మానవ హక్కుల సంఘం (Human Rights Commission): ఉద్యోగుల హక్కులకు భంగం కలిగినట్లు భావిస్తే, రాష్ట్ర లేదా జాతీయ మానవ హక్కుల సంఘానికి (NHRC) ఫిర్యాదు చేయవచ్చు.ఇలాంటి పరిస్థితుల్లో సాక్ష్యాలను (ఆడియో, వీడియో లేదా వ్రాతపూర్వక ఆదేశాలు) పదిలపరుచుకుని పై అధికారులకు ఫిర్యాదు చేయడం సముచితం.
7 249
తేదీ 30 జూన్ 2026
సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్ గారు ఈఆర్ఓ తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మాటలు
ఏవమ్మా ఈఆర్ఓ ఇలా అయితే నువ్వు అయిపోతావ్ బోటం పర్ఫామెన్స్ తక్కువ ఉన్నవాళ్లను విజయవాడకి పిలుస్తారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అమరావతికి..
రిప్లై సార్ నేను మాట్లాడుతున్నాను బిఎల్ వాళ్లతో సరిగా రెస్పాన్స్ లేదు సార్ పర్సనల్గా ఇవి కూడా చేస్తున్నాను.
లాగిపెట్టి ఒకటి కొట్టండి, పనిచేయకపోతే ఒకటి తన్నండి..... బుద్ధి ఉండాలి ఏం పని లేక పని చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటి? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలిగా ఎవరైనా కేర్ లెస్ గా ఉంటే ఊరుకునేది లేదు ఎలక్షన్ కమిషనర్ విషయంలో.
కొత్తవలన అపాయింట్ చేసినప్పుడు ప్రొపెర్ గా ఒకరోజు వారికి ట్రైనింగ్ ఇవ్వాలి కంప్లీట్ గా ఇండక్షన్ ప్రోగ్రాములకు ట్రైనింగ్ ఇవ్వాలి. .
7 249
చరిత్రలో ఈ రోజు/2026, జూన్, 30
సంఘటనలు
1893: ఎక్సెల్సియర్ అనే పేరు గల వజ్రాన్ని (నీలం - తెలుగు రంగు 995 కేరట్స్ బరువు) కనుగొన్నారు.
1914: మహాత్మా గాంధీ ని, దక్షిణ ఆఫ్రికా లో, భారత ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో మొదటిసారిగా అరెస్టు చేసారు.
1935: ఆస్టరాయిడ్#1784 (బెన్గెల్లా) ని సి.జాక్సన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
1948: రేడియోలో వాడే ట్యూబులకి బదులుగా ట్రాన్సిస్టర్స్ని వాడవచ్చునని బెల్ లాబరేటరీస్ ప్రకటించింది.
1960: జైరీ (పూర్వపు బెల్జియన్ కాంగో) అనే దేశం, బెల్జియం నుంచి స్వాతంత్ర్యం పొందింది.
1962: రువాండా, బురుండీ అనే రెండు దేశాలు స్వాతంత్ర్యం పొందాయి.
1971: రష్యన్ వ్యోమ నౌక సోయుజ్ రోదసి నుంచి తిరిగి భూమి మీదకు వస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యోమగాములు మరణించారు.
జననాలు
1833: మండపాక పార్వతీశ్వర శాస్త్రి, సంస్కృతాంధ్ర కవి, పండితులు. (మ.1897)
1906: త్రిభువన్, నేపాల్ రాజు (మ. 1955).
1928: జె.వి. సోమయాజులు, రంగస్థల, సినిమా, బుల్లితెర నటుడు. (మ.2004)
1934: చింతామణి నాగేశ రామచంద్ర రావు, భారతీయ శాస్త్రవేత్త, భారతరత్న పురస్కార గ్రహీత.
1939: సుంకర వెంకట ఆదినారాయణరావు, పేరుపొందిన ఎముకల వైద్యనిపుణుడు.
1941: ఉప్పలపాటి సైదులు, పౌరాణిక రంగస్థల కళాకారుడు.
1948: తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు.
1969: సనత్ జయసూర్య, శ్రీలంక క్రికెట్ క్రీడాకారుడు
1970: అరవింద్ స్వామి , చలనచిత్ర నటుడు, మోడల్, పారిశ్రామిక వేత్త.
1973: సితార , ప్రముఖ దక్షిణ భారత చిత్రాల నటి
1977: శివాజీ , తెలుగు చలనచిత్ర నటుడు, వ్యాఖ్యాత .
1977: సురేఖ వాణి, తెలుగు,తమిళ చిత్రాల సహాయ నటి.
1978: ఇంద్రజ , తెలుగు, మళయాల చిత్రాల నటి, గాయని.
1982: అల్లరి నరేష్, సినిమా నటుడు, తెలుగు సినిమా దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ ద్వితీయ కుమారుడు.
మరణాలు
1897: మండపాక పార్వతీశ్వర శాస్త్రి, సంస్కృతాంధ్ర కవి, పండితులు. (జ.1833)
1917: దాదాభాయి నౌరోజీ, భారత జాతీయ నాయకుడు. (జ.1825)
1953: బలిజేపల్లి లక్ష్మీకాంతం, స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల, సినిమా నటులు. (జ.1881)
1961: లీ డి ఫారెస్ట్, తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే 'ఫోనో ఫిల్మ్' ప్రక్రియను కనుగొన్న అమెరికన్ ఆవిష్కర్త. (జ.1873)
1967: వామన్ శ్రీనివాస్ కుడ్వ, సిండికేట్ బ్యాంకు వ్యవస్థాపకులలో ఒకరు. (జ.1899)
1984: రాయప్రోలు సుబ్బారావు, తెలుగు కవి. (జ.1892)
1985: కె.హెచ్. ఆరా, చిత్రకారుడు (జ. 1914)
1988: సుత్తి వీరభద్ర రావు, తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో, నాటక కళాకారుడు. (జ.1947)
2014: సూర్యకళ, పాతతరం తెలుగు చలన చిత్ర నటి, పలు దక్షిణాది భాషల్లో నటించిన నటి(జ.1942)
2019: నల్లగారి రామచంద్ర తెలుగు కథా రచయిత, కవి, నవల, నాటక రచయిత. (జ.1939)
7 249
📢*IVRS Calls to Parents* #
A. *MDM పై 3 ప్రశ్నలు*...
1. ఎగ్ నాణ్యత బాగుందా లేదా
2. చిక్కి నాణ్యత బాగుందా లేదా
3. ఎండిఎం రుచికరంగా మెనూ ప్రకారం అందిస్తున్నారా లేదా
B. *టీచర్స్ బోధనపై 4 ప్రశ్నలు*...
1. మీ పాఠశాల ఉపాధ్యాయులు నిర్ణీత సమయానికి వస్తున్నారా
2. ప్రతిరోజు మీ పిల్లలకు పాఠాలు చెబుతున్నారని మీరు భావిస్తున్నారా, మీ పిల్లలు మీకు చెప్పారా.
3. పాఠశాల మౌలిక వసతులు పరిశుభ్రంగా మీ పిల్లలకు సౌకర్యవంతంగా ఉన్నాయా
4. మీ పిల్లలకు ఉపాధ్యాయులు అర్థమయ్యేటట్లు పాఠాలు చెబుతున్నారని మీరు భావిస్తున్నారా మీ పిల్లలు మీకు చెప్పారా.
7 249
AP DEPARTMENTAL TESTS HALL TICKETS 30/06/2026 అనగా మంగళవారం నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు
7 249
1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు వరుస కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు
హీరో మోటో కార్ప్, జీ రాంజీ, రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభోత్సవంలో పాల్గొననున్న సీఎం
నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాలలో సీఎం పర్యటనలు
జిల్లా పర్యటనల సమయంలో అక్కడే బస చేయనున్న సీఎం.
అమరావతి:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 1వ తేదీ నుంచి వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనల్లో పలు సంక్షేమ, అభివృద్ది కార్యమాల్లో సిఎం పాల్గొననున్నారు. 1వ తేదీ పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పర్యటించనున్నారు. అదే రోజు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో ద్విచక్ర వాహనాల సంస్థ హీరో మోటో కార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది. దాదాపు రూ.750 కోట్ల పెట్టుబడులతో హీరో సంస్థ ఈ పార్ట్స్ సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది. దీనికి శంకుస్థాపన చేయనున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. 2వ తేదీ ఉదయం తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ ఆజీవికా మిషన్ (VB G RAM G) ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం తిరుపతి పట్టణంలో ప్రైవేటు హోటల్ లో జరిగే GSDP కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్ నకు హాజరవుతారు. ఈ వర్క్ షాప్ నకు నీతి ఆయోగ్ సభ్యులతో పాటు, పీఎం ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు హాజరవుతారు. రెండవ తేదీ రాత్రి తిరుపతిలోనే సిఎం బస చేస్తారు. 3వ తేదీ ఉదయం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించనున్నారు. అనంతరం మూడు రోజుల పర్యటనలో భాగంగా అక్కడి నుంచి సిఎం చంద్రబాబు కుప్పం బయలుదేరి వెళతారు. 3 తేదీ నుంచి 5 వతేదీ వరకు సిఎం కుప్పంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 5వ తేదీన అమరావతికి తిరిగి చేరుకుంటారు.
7 249
EHS సమాచారం.
EHS కార్డ్లో Family Children (పిల్లలు) అప్డేట్ చేసే విధానం:
🟢 Step–1:
👉 EHS అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయాలి
👉 https://www.ehs.ap.gov.in
🟢 Step–2:
👉 Employee Login లో
👉 మీ User ID & Password తో లాగిన్ అవ్వాలి
🟢 Step–3:
👉 Family Details / Family Members ఆప్షన్ క్లిక్ చేయాలి
🟢 Step–4:
👉 పిల్లల వివరాల వద్ద
👉 ఆధార్ నంబర్ నమోదు చేసి,
👉 లేటెస్ట్ ఆధార్ ఫోటో (200kB) అప్లోడ్ చేయాలి
🟢 Step–5:
👉 వివరాలు సేవ్ చేసిన తరువాత
👉 అవి DDO Login కి పంపబడతాయి
🟢 Step–6:
👉 సంబంధిత DDO Approval ఇచ్చిన తర్వాత మాత్రమే
👉 పిల్లల వివరాలు EHS కార్డ్లో పూర్తిగా అప్డేట్ అవుతాయి
🟢 Step–7:
👉 అప్డేట్ పూర్తయిన తర్వాత
👉 హాస్పిటల్లో పిల్లల చికిత్సకు EHS సౌకర్యం అందుబాటులో ఉంటుంది
🟢 ముఖ్య గమనిక:
👉 DDO ఆమోదం లేకుండా EHS అప్డేట్ పూర్తి కాదని
👉 అందరూ గమనించగలరు.
7 249
SIR గణన ఫారం ఎలా పూర్తి చేయాలో అర్థం అవ్వడం లేదా? అయితే మీరు తప్పకుండా ఈ వీడియో చూడండి.
7 249
చేయరు, ఆ జిల్లాలో రిక్రూట్మెంట్ ద్వారా నింపుకుంటారు కానీ ప్రస్తుతం మనం పనిచేస్తున్న జిల్లా నుండి ఇంకో జిల్లాకు బదిలీ అనేది ఉండదు. స్థానిక వాసులు అయినా సరే.
15. ఇలా అయితే జూనియర్లు అందరికీ అన్యాయం జరిగినట్టే కదా...?
అలా అనుకోవడం తప్పు. ఉత్తరుల ప్రకారం విభజన జరుగుతుంది తప్ప స్థానికత ఆధారంగా జరగదు. ఖాళీల లభ్యతను బట్టి జూనియర్లు కూడా తమ సొంత జిల్లాకు వెళ్లే అవకాశం ఉంటుంది...
16. నేను 2007 లో సెకండరీ గ్రేడ్ టీచర్ గా జాయిన్ అయినాను. 2021 లో స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొందినాను. జిల్లా కేటాయింపు లో నా కేడర్ సీనియారిటీ ఏది అవుతుంది...?
మీరు ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ కేడర్ సీనియారిటీ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు...
17. 2007లో సెలెక్ట్ అయిన సెకండరీ గ్రేడ్ టీచర్ కు ఇంకా ప్రమోషన్ రాలేదు. అలాంటప్పుడు కేడర్ సీనియారిటీ ఏది తీసుకుంటారు...?
ప్రస్తుతం తను పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్ సీనియారిటీని తీసుకుంటారు...
Utf
18. అలా అయితే 2021లో ప్రమోషన్ పొందిన స్కూల్ అసిస్టెంట్ తన కేడర్లో జూనియర్ అవుతాడు కదా...?
అవును ఒకే సంవత్సరంలో ఒకే కేడర్లో నియామకం అయినా వారిలో ఎవరైనా ఒకరు ముందే ప్రమోషన్ పొందితే ప్రమోషన్ కేడర్ లో వాళ్ళు జూనియర్లు గానే ఉంటారు, ప్రమోషన్ రానివాళ్లు వాళ్ల పాత కేడర్ లో సీనియర్లుగానే ఉంటారు. ఇక్కడ జిల్లాల పంపకం విషయంలో కేవలం కేడర్ సీనియారిటీని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు అంతేకానీ మొదటి నియామకపు తేదీ కాదు...
మొత్తం మీద ఉద్యోగులను ఆలోచింపజేస్తున్న జిల్లాల కేటాయింపు విషయంలో ఆలోచించవలసినది ఏమిటంటే... కేవలం కేడర్ సీనియారిటీ ఆధారంగానే ప్రస్తుతం పని చేస్తున్న జిల్లా ఏ పూర్వపు జిల్లాలో ఉందో ఆ జిల్లాలకు మాత్రమే అవకాశం ఉంటుంది కానీ స్థానిక జిల్లాకు కాదు స్థానికత అనే పదాన్ని ఇక్కడ వదిలివేయండి. మన సొంత జిల్లాకి మనల్ని పంపడం కాదు కేవలం మనం పని చేస్తున్న జిల్లా ఏదైతే ఉందో అది ఇంతకుముందు ఏ పూర్వపు జిల్లాలో ఉందో ఆ పూర్వపు జిల్లా ఎన్ని జిల్లాలుగా విభజన చెందిందో ఆ జిల్లాలకు మాత్రమే వెళ్లడానికి అవకాశం ఉంటుంది. కేవలం సీనియారిటీ, ప్రిఫరెన్షియల్ కేటగిరీల ఆధారంగానే విభజన జరుగుతుంది. తప్పనిసరిగా అందరు ఉద్యోగులు ఆప్షన్ ఇచ్చుకోవాల్సిందే. ఇదే ప్రక్రియ జోనల్ విషయంలో మరియు మల్టీ జోనల్ విషయంలో కూడా జరుగుతుంది...
7 249
Bifurcation of Employees
జిల్లాల కేటాయింపు అంటే మన సొంత జిల్లాకు మనల్ని పంపించడం కాదు...
మనం ప్రస్తుతం ఏ జిల్లాలో పనిచేస్తున్నామో, ఆ జిల్లా మరియు దాని పూర్వపు జిల్లాను ప్రాతిపదికగా తీసుకుంటారు...
1. ఎలా విభజన చేపడుతారు...?
ఉమ్మడి జిల్లా ఆధారంగా సీనియారిటీ లిస్టులు తయారు చేస్తారు. ఉమ్మడి జిల్లా నుండి ఎన్ని జిల్లాలు అయితే విడిపోయాయో అన్ని జిల్లాల నుండి ఆయా కేడర్లకు సంబంధించిన ఉద్యోగుల అందరి సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని జాబితా రూపొందిస్తారు. ఆ జాబితా ఆధారంగానే జిల్లాల కేటాయింపు జరుగుతుంది...
2. పోస్టుల విభజన ఎలా ఉంటుంది...?
ఉమ్మడి జిల్లాలోని పోస్టులను ఆయా నూతన జిల్లాలకు కేటాయించడం జరుగుతుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా ఉంటాయి. ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు కేటాయిస్తారు అనేది ఎంపిక ప్రక్రియకు ముందే తెలుస్తుంది...
3. ఎంపికలో ప్రాధాన్యతలు ఏమైనా ఉంటాయా...?
ఉత్తర్వులలో సూచించిన ప్రిఫరెన్షియల్ కేటగిరీలకు మరియు ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఉంటుంది...
4. అందరు ఉద్యోగులు ఆప్షన్ ఇవ్వాలా...?
తప్పనిసరిగా ఇవ్వవలసిందే. ఆప్షన్ ఇవ్వకపోతే పోస్టులు ఖాళీగా ఉన్న ఏదో ఒక జిల్లాకు అలాట్ చేయబడతారు...
5. పూర్వపు జిల్లాలోని కొన్ని మండలాలు వేరే పూర్వపు జిల్లాలో కలిశాయి. అప్పుడు ఎలా చేస్తారు...?
ఏదైతే పూర్వపు జిల్లాలోని మండలాలు ఇంకో పూర్వపు జిల్లాలో కలిసాయో, కలిసిన మండలాలు కలిగిన పూర్వపు జిల్లా వాసులందరికీ ఏ ప్రస్తుత జిల్లాలో అయితే ఆ మండలాలు కలిశాయో ఆ ప్రస్తుత జిల్లాకు రావడానికి అవకాశం ఉంటుంది...
6.ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది...?
సీనియారిటీ జాబితాల ఆధారంగా మనం ఆప్షన్లు పెట్టుకోవలసి ఉంటుంది. అంటే ఒక ఉద్యోగి పూర్వపు ఉమ్మడి జిల్లాలో ఎన్ని జిల్లాలుగా విభజన జరిగిందో అన్ని జిల్లాలకు మొదటి, రెండు, మూడు, నాలుగు ఇలా ఐచ్చికాలను పెట్టుకోవలసి ఉంటుంది. సీనియారిటీ ఆధారంగా కేటాయింపు జరుగుతుంది...
7. ప్రస్తుతం నేను నా స్థానిక జిల్లాలో పనిచేయడం లేదు. ఉమ్మడి జిల్లాలోని వేరే జిల్లాలో పనిచేస్తున్నాను. నా స్థానిక జిల్లాకు వెళ్లడానికి అవకాశం ఉంటుందా...?
ఉంటుంది కానీ సీనియారిటీ ఆధారంగానే ఉంటుంది. దొరికితే దొరకవచ్చు లేదంటే లేదు...
8. ఒకవేళ నేను ప్రస్తుతం పని చేస్తున్న జిల్లా కాకుండా ఉమ్మడి జిల్లాలోని ఇంకో జిల్లాకు ఎంపిక అయితే మళ్లీ అక్కడ పోస్టింగ్ ఇస్తారా...?
తప్పనిసరిగా ఇస్తారు...
9. ఒకవేళ నేను ప్రస్తుతం పని చేస్తున్న జిల్లాను ఎంపిక చేసుకొని దానిని పొందితే మళ్ళీ పోస్టింగ్ ఇస్తారా...?
ఇవ్వరు. మీరు ప్రస్తుతం పని చేస్తున్న జిల్లాలో, పనిచేస్తున్న స్థానంలోనే ఉండవలసి ఉంటుంది...
10. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులై చెరో జిల్లాకు వెళ్ళిపోతే పరిస్థితి ఏమిటి...?
ఇలాంటి సందర్భంలో మీ సీనియారిటీని బట్టి ఇద్దరు ఒకే జిల్లా ఎంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ చెరో జిల్లా వెళ్ళిపోతే పోస్టింగ్ పొందిన తర్వాత మళ్లీ స్పౌజ్ కేటగిరి అవకాశం ఇవ్వవచ్చు కానీ అది ఎప్పటికి అవుతుందో చెప్పలేం. అందుకే ముందుగా ప్రణాళిక వేసుకోవడం ఉత్తమం. ఒకవేళ స్పౌజ్ కేటగిరీ కింద భార్య వద్దకు భర్త లేదా భర్త వద్దకు భార్యను పంపించే ప్రయత్నంలో డిమాండ్ ఉన్న జిల్లాకు అవకాశం ఉండకపోవచ్చు. ఖాళీల లభ్యతను బట్టి అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా మన సీనియారిటీని బట్టి ప్రణాళిక వేసుకోవలసిన అవసరం ఉంది...
11. నేను జూనియర్ ని, నా సొంత జిల్లా మంచి పట్టణం, అందరూ అదే కోరుకుంటారు, నాకు నా సొంత జిల్లా వెళ్లడానికి అవకాశం ఉండదా...?
ఆప్షన్లు ఇచ్చుకున్న తర్వాత మీ సొంత జిల్లా అలాట్ కాకపోతే మీరు ఏ జిల్లాకు అలాట్ అవుతారో అదే జిల్లాలో పనిచేయవలసి ఉంటుంది...
12. నా స్థానిక జిల్లా అలాట్ కాకపోతే వేరే జిల్లాలో శాశ్వతంగా పని చేయవలసిందేనా...?
అవును. తప్పనిసరిగా మనం ఎన్నుకున్న జిల్లానే మనకు శాశ్వత జిల్లా అవుతుంది. ఒకవేళ భవిష్యత్తులో పరస్పర బదిలీలకు అవకాశం ఇస్తే చెప్పలేం కానీ అది కేడర్ వారీగానే ఉంటుంది ఉదాహరణకు విద్యాశాఖ అయితే కేడర్, సబ్జెక్టు, మీడియం, మేనేజ్మెంట్... వీటి ఆధారంగానే జరుగుతుంది...
13. నేను ఎంపిక అయిన డిపార్ట్మెంట్ కాకుండా వేరే డిపార్ట్మెంట్లో ఫారిన్ సర్వీస్ కింద పని చేస్తున్నాను. నాకు జిల్లా ఎలా కేటాయిస్తారు...?
తప్పనిసరిగా అందరికీ జిల్లాలు కేటాయించడం జరుగుతుంది. మీరు ఎంపిక అయిన డిపార్ట్మెంట్లో సీనియారిటీ జాబితాలో మీరు కూడా ఉంటారు. మీరు ఇచ్చే ఆప్షన్స్ బట్టి జిల్లా కేటాయించడం జరుగుతుంది. ఫారిన్ సర్వీస్ కాలం ముగిసిన తర్వాత పేరెంట్ డిపార్ట్మెంట్ కు వెళ్ళినప్పుడు మీకు ఏ జిల్లా అయితే కేటాయించబడుతుందో ఆ జిల్లాలో వెళ్లి పని చేయవలసి ఉంటుంది...
14. సీనియర్లు అందరూ మంచి జిల్లాకు వెళ్లిపోతే రెండు, మూడు సంవత్సరాలలో ఆ జిల్లాలో రిటైర్మెంట్ ద్వారా ఖాళీలు ఏర్పడతాయి కదా, అప్పుడు ఆ జిల్లా స్థానికత కలిగిన జూనియర్లను ఆ జిల్లాలకు బదిలీ చేస్తారా...?
Вже доступно! Дослідження Telegram за 2025 — головні інсайти року 
