uk
Feedback
apvsws.com

apvsws.com

Відкрити в Telegram

Grama / ward sachivalayam all in one portal... గ్రామ వార్డ్ వాలంటీర్ మరియు సచివాలయ ఉద్యోగులు సమగ్ర సమాచారం.... అధికారుల ఉత్తర్వులు , ప్రకటనలు , ప్రచురణలు .. సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ , మొబైల్ ఫోన్ లు , యాప్ లు సమస్యల పరిష్కారం కొరకు...

Показати більше

📈 Аналітичний огляд Telegram-каналу apvsws.com

Канал apvsws.com (@apvsws) у мовному сегменті Телугу є активним учасником. На даний момент спільнота об'єднує 22 094 підписників, посідаючи 10 586 місце в категорії Новини і ЗМІ та 19 211 місце у регіоні Індія.

📊 Показники аудиторії та динаміка

З моменту свого створення невідомо, проект продемонстрував стрімке зростання, зібравши аудиторію у 22 094 підписників.

За останніми даними від 01 липня, 2026, канал демонструє стабільну активність. Хоча за останні 30 днів спостерігається зміна кількості учасників на -273, а за останні 24 години на -8, загальне охоплення залишається високим.

  • Статус верифікації: Не верифікований
  • Рівень залученості (ER): Середній показник залученості аудиторії становить 34.31%. Протягом перших 24 годин після публікації контент зазвичай збирає 13.98% реакцій від загальної кількості підписників.
  • Охоплення публікацій: В середньому кожен допис отримує 7 585 переглядів. Протягом першої доби публікація в середньому набирає 3 090 переглядів.
  • Реакції та взаємодія: Аудиторія активно підтримує контент: середня кількість реакцій на один пост – 0.

📝 Опис та контентна політика

Автор описує ресурс як майданчик для висловлення суб'єктивної думки:
Grama / ward sachivalayam all in one portal... గ్రామ వార్డ్ వాలంటీర్ మరియు సచివాలయ ఉద్యోగులు సమగ్ర సమాచారం.... అధికారుల ఉత్తర్వులు , ప్రకటనలు , ప్రచురణలు .. సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ , మొబైల్ ఫోన్ లు , యాప్ లు సమస్యల పరిష్కారం కొరకు...

Завдяки високій частоті оновлень (останні дані отримано 02 липня, 2026), канал підтримує актуальність та високий рівень охоплення публікацій. Аналітика показує, що аудиторія активно взаємодіє з контентом, що робить його важливою точкою впливу в категорії Новини і ЗМІ.

22 094
Підписники
-824 години
-677 днів
-27330 день
Архів дописів

Dear All, Unpaid pensioners data in all Online secretariats has been enabled for payment across all user logins within the respective secretariats.

సచివాలయ ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయిస్తునదే కాక.. ఎవరైనా సరిగా పని చేయకపోతే వారి మీద భౌతిక దాడి చేసి అయినా పని చేయించండి అని దుర్భాషలు ఆడుతూ సచివాలయ ఉద్యోగులను వేధిస్తున్నారు.. !!

📢 నూతన జిల్లాలకు సర్దుబాటు సమాచారం ⏩Presidential order 2025 అనుగుణంగా Employees &Teachers ను  కొత్త జిల్లాలకు , జోన్లకు "సీనియారిటీ& ఆప్షన్"  ప్రాతి పదికగా  శాశ్వత  తరలించేందుకు GAD వారి FORMAT లో  సీనియారిటీ  జాబితాలు సిధ్ధ మగుచున్నవి. ఈ నెలాఖరు లోగా  ప్రక్రియ వేగం పుంజు కొనును . GAD ,వారి ఆమోదం తర్వాత Options తీసుకొని బదిలీ జరుగును. అంతా "ఆన్ లైనే" జరుగుతాయని సమాచారం. స్పష్టత వస్తుంది ⏩GAD వారి నుండి సమగ్ర మార్గదర్శకాలు త్వరలో విడుదల కానున్నాయి ⏩ఉద్యోగి / ఉపాధ్యాయుడు ఇచ్చే ఆప్షన్  &సీనియారిటీ  ఆధారంగా సర్దుబాటు ఉండును.Spouse ప్రయారిటీ ఉండదు.కేవలం Widow, PBD, Cancer, Neuro & Open hearty Surgery ,Liver/Kidney Transplantation వారికి మాత్రమే అవకాశాన్ని బట్టి Priority ఇవ్వబడును ⏩ప్రతి జిల్లాలో, ప్రతి కేడర్ లో  15% SC (A/B/C) 6% ST ఉద్యోగులు , ఉపాధ్యాయులు ఉండే‌విధంగా సర్దు బాటు ఉండును ⏩Presidential order2025 ప్రకారము HS HMతో సహా Zp & Mpl టీచర్లందరూ అలాగే ZP MEO లూ జిల్లా కేడరే.  వీరి బదలాయింపు ఉమ్మడి జిల్లా పరిధి లోనే జరుగును .ఎలాంటి మార్పు ఉండదు.Govt  HS HM/MEO లందరూ Zonal cadre కేడర్ వారీగా ఉమ్మడి జిల్లా  సీనియారిటీ  Lists ఆధారంగా తరలింపు ఉండును. ⏩జిల్లా Local  Status కు  ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా అందరూ  లోకలే.నూతన జిల్లాకు లోకలా కాదా అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు ⏩నూతన  జిల్లాలకు తరలింపు పూర్తయిన తర్వాత అంతర్ జిల్లా బదిలీలు, Spouse&Mutual Grounds పై జరుగును ⏩కొత్త జిల్లాల కు బదలాయింపు Effect వలన Present  Place  నుండి   బదిలీ అయితే కొత్త జిల్లాల్లో Place కొరకు Councling లో పాల్గొనాలి.అక్కడ అన్ని Priorities యథాతథంగా  ఉంటాయి.జిల్లా మార్పు Effect కాని వారి Present Place లో ఎలాంటి మార్పు ఉండదు ⏩నూతన జిల్లాల , జోన్లో కు  శాశ్వత తరలింపు వలన అన్ని కేడర్ల లోని జూనియర్లు ఇబ్బందే. ఎక్కువ పోస్టులు ఉన్న వెనుకబడిన జిల్లాల వైపుగా  అర్బన్ జిల్లాల లోని జూనియర్ల కు  కదలిక అనివార్యము.

EWS certificate guidelines కుటుంబ ఆదాయం 8 లక్షలు మించకూడదు. కుటుంబం అంటే ఎవరు వస్తారు అనేది ఇక్కడ అసలు సమస్య. అమ్మ నాన్న 18 సంవత్సరాల లోపు తొబుట్టువులు, పెళ్లి అయితే వారి భార్య లేదా భర్త, 18 సంవత్సరాల లోపు పిల్లలు వస్తారు. As per go - office memorandum-O. M. No.36039/1/2019-Estt(Res) 5 ఎకరాల లోపు అగ్రికల్చర్ ల్యాండ్ Residential flat 1000sq. ft Residential plot 100 sq.yards for notified మున్సిపాలిటీస్ Other than notified muncipalities residential plot 200 sq. yards

EWS certificate guidelines కుటుంబ ఆదాయం 8 లక్షలు మించకూడదు. కుటుంబం అంటే ఎవరు వస్తారు అనేది ఇక్కడ అసలు సమస్య. అమ్మ నాన్న 18 సంవత్సరాలనుండి లోపు తొబుట్టువులు, పెళ్లి అయితే వారి భార్య లేదా భర్త, 18 సంవత్సరాల లోపు పిల్లలు వస్తారు. As per go -పఫిస్ memorandum-O. M. No.36039/1/2019-Estt(Res) 5 ఎకరాల లోపు అగ్రికల్చర్ ల్యాండ్ Residential flat 1000sq. ft Residential plot 100 sq.yards for notified మున్సిపాలిటీస్ Other than notified muncipalities residential plot 200 sq. yards

photo content

*ఒక బిఎల్ఓ మిత్రుడు యొక్క ఆవేదన* ప్రస్తుతం నా కూతురు బెంగుళూరు ST జోన్షన్ హాస్పిటల్ లో ఉంటే నీను మాత్రం SIR పంచుతున్నాను, అప్పుడే కాల్ చేశారు వాళ్ళ ఫాదర్ ని పిలిపించండి అని, BLO వర్క్ లో ఉన్నానేను సూపర్ వెజిర్ అడిగితే, కమిషనర్ అడగండి. అన్నారు ఎమర్జెన్సీ అన్నా కూడా వీళ్ళని, వాళ్ళని అడిగి బెంగుళూరు కి బయలుదేరాను.ఫుల్ ట్రాపిక్ ఇంకా హాస్పిటల్ కి చేరుకోలేదు. అప్పుడే మళ్ళీ BLO TC అసలు రిటర్న్స్ BLO SIR ఫార్మ్స్ ఆన్లైన్ చేయాలని, మళ్ళీ సూపెర్వేజర్ call ఎత్తిపారిస్తుత్తులో లోను నువ్వు SIR డిజిటలైజ్ చెయ్ అని, ఏంచేస్తాం ఫార్మ్స్ కూడా హాస్పిటల్ కి తీసుకోనిపోతున్నాను,నవ్వాలో ఏడ్చాలో తెలియదు. ఎదుకు బతకాలి, ఎవరికోసం బతకాలో తెలియడం లేదు మిత్రమే, సమస్య నీ వరకు వస్తే గాని నా భాద మీకు అర్థం అవ్వదు 😭😭😭

photo content

🚨 *రెండుచోట్ల ఓటు నమోదు చేసుకున్నారా? జాగ్రత్త!* ప్రత్యేక సమగ్ర సర్వే (SIR)లో వేర్వేరు రాష్ట్రాల్లో ఎన్యూమరేషన్ పత్రాలు నింపితే భవిష్యత్తులో నోటీసులు వచ్చే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు. ✅ ఒక వ్యక్తికి ఒకే రాష్ట్రంలో ఓటు హక్కు ఉండాలి ✅ రెండు రాష్ట్రాల్లో ఓటు నమోదు చట్టవిరుద్ధం ✅ AI ఆధారిత వ్యవస్థ ద్వారా గుర్తింపు చర్యలు ✅ జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం

Sanction of pension approval authority updation: పెన్షన్ శాంక్షన్ చేసే అథారిటీ నీ అప్డేట్ చేస్తేనే ఈ నెల శాలరీ బిల్ పెట్టుటకు అవకాశం వుంది. గమనించగలరు. ఎలా చేయాలి అనే సందేహం అందరిలో ఉండవచ్చు. ఇంక్రిమెంట్ శాంక్షన్ చేసే వారికే పెన్షన్ శాంక్షన్ చేసే అధికారం ఉంటుంది. డిజిటల్ అసిస్టెంట్ / పంచాయతీ కార్యదర్శి - మండల్ ప్రజా పరిషద్ఆఫీసర్ వెల్ఫేర్ - అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ మహిళా పోలీస్ -SP సర్వేయర్ - AD ఇంజనీరింగ్ అసిస్టెంట్ - పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అగ్రికల్చర్ అసిస్టెంట్ - AD ANM- మెడికల్ ఆఫీసర్ Fisheries / వెటర్నరీ అసిస్టెంట్ - AD అన్ని కూడా outside department ఏ. ఒక్క డిజిటల్ అసిస్టెంట్ మరియు పంచాయతీ కార్యదర్శి మాత్రమే విత్ ఇన్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేయాలి గమనించగలరు.

photo content
+4

ఈ కార్యక్రమంలో AP GWSE JAC రాష్ట్ర చైర్మన్ గుర్రంకొండ సురేంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బగ్గా జగదీష్, అసోసియేట్ చైర్మన్ పిల్లి హరీశ్, కో-చైర్మన్లు చేవూరి వెంకట్, గంటా రామకృష్ణ, బెక్కం రవితేజ, రాష్ట్ర మరియు జిల్లా నాయకులు పువ్వుల కిరణ్ కుమార్, మేరీ రాజు, హంపి రెడ్డి, శ్రీమన్నారాయణ, మణికంఠ, కిషోర్, హనుమంతరావు, మహబూబ్ సుభాని, కృష్ణ చైతన్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (AP GWSE JAC) పత్రికా ప్రకటన తేదీ: 07-06-2026 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి ఉద్యోగులపై పెరుగుతున్న పని భారాన్ని తగ్గించాలి హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడకపోతే ఉద్యమ కార్యాచరణ తప్పదు AP GWSE JAC రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకుల చర్చ విజయవాడ ప్రెస్ క్లబ్‌లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (AP GWSE JAC) ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర కమిటీ నాయకులు, వివిధ శాఖల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు, పదోన్నతులు, పెండింగ్ ఇంక్రిమెంట్లు, హేతుబద్ధీకరణ, డిప్యుటేషన్లు, పెరుగుతున్న పని భారం, ఎన్నికల విధులు తదితర అంశాలపై సమావేశంలో సమగ్ర చర్చ జరిగింది. రాష్ట్ర చైర్మన్ గుర్రంకొండ సురేంద్ర మాట్లాడుతూ... గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తోందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగులు నిరంతరం కష్టపడుతున్నారని అన్నారు. అయినప్పటికీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో SGSW శాఖ కార్యదర్శితో జరిగిన చర్చల్లో ఉద్యోగ సంఘాలకు పలు హామీలు ఇచ్చినప్పటికీ వాటిలో కనీసం కొన్ని కూడా అమలు కాలేదని విమర్శించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, ఉద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తిని నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. ప్రభుత్వానికి సహకరిస్తూ అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. త్వరలోనే ఉన్నతాధికారులకు సమగ్ర వినతిపత్రం అందజేస్తామని, అనంతరం కూడా స్పందన లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బగ్గా జగదీష్ మాట్లాడుతూ... గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రధాన ఆర్థిక సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరు సంవత్సరాల సేవ పూర్తిచేసుకున్నప్పటికీ వేలాది మంది ఉద్యోగులకు ఇప్పటికీ పదోన్నతులు లేకపోవడం బాధాకరమని అన్నారు. పదోన్నతులు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఉద్యోగులకు వెంటనే స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా ఉద్యోగుల ప్రొబేషన్ కాలానికి సంబంధించిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పదోన్నతుల అంశాన్ని పరిశీలించేందుకు ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన 10 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ, ఉద్యోగులు ఇప్పటికే చేరుకున్న పే స్కేల్‌లనే పదోన్నతులుగా చూపించడం ద్వారా అసలు ప్రయోజనం లేకుండా పోతోందని అన్నారు. పదోన్నతులు అంటే కేవలం హోదా మార్పు కాకుండా ఆర్థిక ప్రయోజనం, సేవా భద్రత, భవిష్యత్ అవకాశాలు కూడా ఉండాలని స్పష్టం చేశారు. అసోసియేట్ చైర్మన్ పిల్లి హరీశ్ మాట్లాడుతూ... హేతుబద్ధీకరణ పేరుతో ఉద్యోగులను వివిధ కార్యాలయాలకు డిప్యుటేషన్‌పై పంపడం వల్ల సచివాలయాల పనితీరు దెబ్బతింటోందని అన్నారు. ఒక ఉద్యోగిని ఇతరచోటుకు పంపినప్పుడు అతని బాధ్యతలను మిగిలిన ఉద్యోగులే నిర్వర్తించాల్సి వస్తోందని, దీని కారణంగా ఉద్యోగులపై తీవ్రమైన పని భారం పడుతోందని తెలిపారు. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులు తమ శాఖల విధులతో పాటు వివిధ ప్రత్యేక కార్యక్రమాలు, సర్వేలు, ఎన్నికల సంబంధిత బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులపై అదనపు ఒత్తిడి పెరుగుతోందని, దీనిని ప్రభుత్వం గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. BLO విధులు నిర్వహిస్తున్న వారికి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలి సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో BLOలుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఇతర విధుల నుండి పూర్తి మినహాయింపు కల్పించాలని డిమాండ్ చేశారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అత్యంత కీలకమైనదని, దీనికి సమయం మరియు పూర్తి దృష్టి అవసరమని తెలిపారు. ఒకవైపు ఎన్నికల విధులు, మరోవైపు శాఖల పనులు నిర్వహించడం ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని పేర్కొన్నారు. త్వరలో ఉన్నతాధికారులకు వినతిపత్రం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి రాష్ట్ర ఉన్నతాధికారులకు, సంబంధిత శాఖల అధికారులకు వినతిపత్రం అందజేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించి ఉద్యోగుల హక్కుల సాధన కోసం పోరాటం మరింత ఉద్ధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.

photo content