ru
Feedback
All Educational update-1

All Educational update-1

Открыть в Telegram
708
Подписчики
+124 часа
+107 дней
+2430 день
Архив постов
రైల్వేలో 6,565 గ్రేడ్-1, గ్రేడ్-2 టెక్నీషియన్ పోస్టులకు RRB జూన్ 29న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఇప్పటికే షార్ట్ నోటీస్ రిలీజైంది. దాని ప్రకారం గ్రేడ్-1 323, గ్రేడ్-2 6,242 పోస్టులు ఉన్నాయి. జూన్ 30 నుంచి జులై 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పదో తరగతితో పాటు ITI పాసై ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

25,487 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఆన్సర్ కీ వచ్చేసింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కానిస్టేబుల్ (GD)-2026 పరీక్షల ఆన్సర్ కీ విడుదలైంది. 25,487 ఉద్యోగాలకు ఏప్రిల్ 27 నుంచి మే 30 వరకు దేశవ్యాప్తంగా ఈ పరీక్షలు జరిగాయి. జూన్ 15 నుంచి 20 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని SSC తెలిపింది. పూర్తి వివరాలకు https://ssc.gov.in/໕໕.

Custom Commands

photo content

photo content

Repost from KbrGowthamDeals
*✍️ఆధార్ సెంటర్ కోసం ఇలా అప్లై చేసుకోండి* https://youtu.be/E_9FJCeFdKk

AP: నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే ₹3 వేల భృతి దిశగా వెళ్తున్నామని CM CBN వెల్లడించారు. 'అన్నీ చేసేశామని చెప్పడం లేదు. శుభారంభం చేశాం. అనేక హామీలు అమలు చేశాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిస్తాం. ప్రపంచంలోనే మేటైన యువతగా తీర్చిదిద్దుతాం. YCP, కూటమి మ్యానిఫెస్టోల్లో ఎవరెలా అమలు చేశారో చర్చకు సిద్ధం' అని తిరుపతి సభలో పేర్కొన్నారు. కేంద్రంలో BJP 4వసారి గెలుస్తుందని, ఏపీలో కూటమిదే విజయమన్నారు.

*✍️ఏపీలో మెగాడిఎస్సి నోటిఫికేషన్..* *👉పరీక్షలు ఎప్పుడో తెలిస్తే షాక్* https://youtu.be/T4O7dNKz8Ys

AP: రాష్ట్రంలో రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. మొత్తం 229 పనిదినాలు, ఆదివారాలతో కలిపి 87 సెలవులు ఉండనున్నాయి. దసరాకు అక్టోబర్ 12-21 వరకు, క్రిస్మస్ DEC 20-27, సంక్రాంతికి 2027 JAN 11-17 వరకు హాలిడేస్ ప్రకటించింది. ప్రతి శనివారం నో బ్యాగ్ డే ఉండనుంది. పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ MAR 15-31 వరకు జరగనున్నాయి.

AP: టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులు తమ వివరాల్లో పొరపాట్లను హెడ్మాస్టర్ల ద్వారా సవరించుకొనే అవకాశాన్ని ఈ నెల 15 వరకు పొడిగించినట్లు SSC బోర్డు డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. విద్యార్థుల వివరాలను జాగ్రత్తగా వెరిఫై చేసి హెడ్మాస్టర్లు తమ స్కూల్ లాగిన్ ద్వారా పొరపాట్లను సవరించాలని పేర్కొన్నారు. విద్యార్థులు, పేరెంట్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

రాష్ట్రంలోడీఎస్ఈడీ, డీపీ ఎస్ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ డీఈఈసెట్-2026 వెబ్ ఆప్షన్ల షెడ్యూల్ విడుదలైంది. అర్హత సాధించిన అభ్యర్థులు శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని సెట్ కన్వీనర్ రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోని అభ్యర్థులకు జూన్ 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు గడువు పొడిగించి నట్లు తెలిపారు. అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలను ఎంచుకోవడానికి అధికారిక వెబ్సైట్ సందర్శించాలని సూచించారు. వెబ్ ఆప్షన్ ఎడిట్ జూన్ 9న ఉంటుందని, సీట్ల కేటాయింపు 14న, ఫీజు చెల్లింపు, రిపోర్టింగ్ 14 నుండి 17 వరకు, తరగతుల ప్రారంభం జూలై 1 నుండి ప్రారంభమవు తాయని తెలిపారు.

951 ఉద్యోగాలకు నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా ఉన్న సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) సెంటర్లలో 951 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఉద్యోగాన్ని ໙໖ BE/B.Tech, M.Tech, ITI/SCVT, &, MBA/PG, CA, CMA, LLB/LLM . వయసు 30-56 ఏళ్ల మధ్య ఉండాలి. CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరితేదీ జూన్ 20. 366: https://careers.cdac.in/

*BREAKING: AP టెట్ షెడ్యూల్ విడుదల* AP టెట్-2026 షెడ్యూల్ను మంత్రి లోకేశ్ విడుదల చేశారు. ఈ నెల 5వ తేదీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆ రోజు నుంచి జులై 5వ తేదీ వరకు అప్లె చేసుకోవచ్చని వెల్లడించారు. జులై 25 నుంచి హాల్ టికెట్లు రిలీజ్ చేస్తామన్నారు. ఆగస్టు 5 - 21వ తేదీ వరకు పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 15వ తేదీ ఫలితాలు వెల్లడిస్తామని ట్వీట్ చేశారు. ఇక 2026 అక్టోబరులో DSC నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు.

*త్వరలో ఏపీ టెట్👆🏻*
*త్వరలో ఏపీ టెట్👆🏻*

తల్లికి వందనం.. రూ.13,000 రావాలంటే ఇలా చేయండి! AP: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో తల్లికి వందనం కింద విద్యార్థికి రూ.13వేల చొప్పున నగదును తల్లుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతేడాది ఆధార్ లింక్ కాకపోవడంతో చాలా మంది ఈ స్కీమ్కు దూరమయ్యారు. అలాంటి ఇబ్బందులు రిపీట్ కాకుండా ముందస్తుగా బ్యాంకు ఖాతాతో ఆధార్ అనుసంధానం చేసుకోవాలని విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. దాంతో పాటు బ్యాంకుకు వెళ్లి NPCI మ్యాపింగ్ చేసుకోవాలంది.

*25,487 ప్రభుత్వ ఉద్యోగాలు.. పరీక్ష తేదీ మార్పు!* https://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33 *👉సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్లో 25,487 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్ష తేదీని SSC మార్చింది. షెడ్యూల్ ప్రకారం మే 28న ఈ ఎగ్జామ్ జరగాల్సి ఉండగా బక్రీద్ కారణంగా ఒక రోజు ముందుగానే (మే 27) నిర్వహిస్తామని తెలిపింది. పరీక్షకు 2, 3 రోజులు ముందు అడ్మిట్ కార్డులు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పింది. కాగా మొత్తం పోస్టుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 1,105 ఖాళీలున్నాయి* *Web Site: https://ssc.gov.in/ .*

*✍️APPLY NOW: ఇంటర్ అర్హతతో 394 ఉద్యోగాలు* *నేషనల్ డిఫెన్స్ అండ్ నేవల్ అకాడమీలో రెండో విడత ఉద్యోగాలకు UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. 394 ఖాళీల్లో ఆర్మీ 208, నేవీ 42, ఎయిర్ఫోర్స్లో మిగతావి భర్తీ చేస్తారు. పురుషులకు 370, మహిళలకు 24 ఉద్యోగాలు ఉన్నాయి. జూన్ 9లోపు దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 13న ఎగ్జామ్ నిర్వహిస్తారు. దరఖాస్తుకు 1 జనవరి 2008-2011 మధ్య జన్మించి, ఇంటర్ పాసైన అవివాహిత యువతకే అవకాశం ఉంటుంది. upsc.gov.in .*

TG: రాష్ట్రంలోని నిరుద్యోగ మహిళలకు శుభవార్త. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,982 పోస్టులను ఈ ఏడాదిలోగా భర్తీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కలెక్టర్ల ఆధ్వర్యంలో త్వరలోనే జిల్లాల వారీగా నోటిఫికేషన్లు ఇవ్వనుంది. ఇందులో హెల్పర్ పోస్టులు 12,882, టీచర్ ఉద్యోగాలు 3,100 ఉన్నాయి. కాగా హెల్పర్ పోస్టులకు టెన్త్, టీచర్ ఉద్యోగాలకు ఇంటర్ ఉత్తీర్ణతను కనీస అర్హతగా నిర్ణయిస్తారని సమాచారం.

5,000 అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లో 5,000 అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. APలో 188, TGలో 83 ఖాళీలున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత, 20-28 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం ఏజ్లో సడలింపు ఉంటుంది. CBT, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏడాది శిక్షణ కాలంలో నెలకు రూ.15,000 స్టైఫండ్ చెల్లిస్తారు. 366: https://bankofbaroda.bank.in/

*పదో తరగతిలో 540 మార్కులు సాధించిన విద్యార్థులకు విద్యాదాన్ స్కాలర్షిప్స్.* *40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులైతే 450 మార్కులు
*పదో తరగతిలో 540 మార్కులు సాధించిన విద్యార్థులకు విద్యాదాన్ స్కాలర్షిప్స్.* *40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులైతే 450 మార్కులు సాధించినా అర్హత.*