AP GOVT INFORMATION | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమగ్ర సమాచారం
Open in Telegram
Admin: Shivaram Mallavarapu, BBA LLB This is the channel giving updates of instant government schemes information and official news of various government departments and political updates.
Show more3 224
Subscribers
No data24 hours
-57 days
-3030 days
Data loading in progress...
Similar Channels
No data
Any problems? Please refresh the page or contact our support manager.
Tags Cloud
No data
Any problems? Please refresh the page or contact our support manager.
Incoming and Outgoing Mentions
---
---
---
---
---
---
Attracting Subscribers
September '26
September '26
+4
in 0 channels
August '26
+16
in 0 channels
Get PRO
July '26
+18
in 0 channels
Get PRO
June '26
+13
in 0 channels
Get PRO
May '26
+59
in 0 channels
Get PRO
April '26
+35
in 0 channels
Get PRO
March '26
+42
in 0 channels
Get PRO
February '26
+131
in 0 channels
Get PRO
January '26
+19
in 0 channels
Get PRO
December '25
+26
in 0 channels
Get PRO
November '25
+57
in 0 channels
Get PRO
October '25
+95
in 1 channels
Get PRO
September '25
+362
in 0 channels
Get PRO
August '25
+140
in 0 channels
Get PRO
July '25
+231
in 0 channels
Get PRO
June '25
+312
in 0 channels
Get PRO
May '25
+426
in 1 channels
Get PRO
April '25
+1 162
in 2 channels
Get PRO
March '25
+793
in 0 channels
Get PRO
February '250
in 0 channels
Get PRO
January '25
+65
in 0 channels
| Date | Subscriber Growth | Mentions | Channels | |
| 08 September | +1 | |||
| 07 September | 0 | |||
| 06 September | +1 | |||
| 05 September | +1 | |||
| 04 September | +1 | |||
| 03 September | 0 | |||
| 02 September | 0 | |||
| 01 September | 0 |
Channel Posts
కొత్త పింఛన్లకు తొలిరోజు 75 వేల దరఖాస్తులు
ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద పింఛనుకోసం తొలిరోజు కొత్తగా 75 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సోమవారం నుంచి ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ధ్రువీకరణ పత్రాలు తీసుకుని ఉదయం నుంచే సచివాలయాల వద్ద దరఖాస్తుదారులు బారులు తీరారు. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు ఒకేసారి ఎక్కువ మందివి దరఖాస్తు చేసేందుకు ప్రయత్నించడంతో సర్వర్ నెమ్మదించింది.
| 2 | ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు 11లోగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలంటూ ఎస్ఈసీ ఆదేశం
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఫొటో గుర్తింపు ఓటర్ల జాబితాల ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రామ పంచాయతీల వారీగా ఇటీవల ప్రచురించిన ఓటర్ల జాబితాల్లో నుంచి మళ్లీ ఎంపీ టీసీ, జడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఈ నెల 11లోగా జాబితాలు ప్రచురించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖను ఎస్ఈసీ ఆదేశించారు. జడ్పీటీసీ స్థానాలకు జడ్పీ సీఈవోలు, ఎంపీటీసీ స్థానాలకు ఎంపీడీవోలు జాబితాలు ప్రచురించాలని సూచించారు. | 278 |
| 3 | ఏపీ ఎప్ సెట్ - 2026 MPC, Bipc స్ట్రీమ్ అడ్మిషన్లు ఆఖరి విడత వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల | 277 |
| 4 | ఇకపై 25 రోజులకే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సదుపాయం
ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ బుకింగ్ వ్యవధిలో కీలక మార్పులు చేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని గృహ వినియోగదారులందరికీ ఒకేవిధంగా 25 రోజుల వ్యవధిని నిర్ణయించింది. ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా కేంద్ర ప్రభుత్వం గతంలో నిబంధనలను మార్పు చేసింది. రీఫిల్ బుకింగ్ కోసం నగర, పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజులు వేచి ఉండాల్సి వచ్చేది. కొత్త నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని గృహ ఎల్పీజీ వినియోగదారులకు (పట్టణ, గ్రామీణ) రీఫిల్ బుకింగ్ కనీసం 25 రోజుల వ్యవధి తప్పనిసరి. ఈ మార్పు వెంటనే అమలులోకి వస్తుందని సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. | 287 |
| 5 | పట్టణ ప్రాంతాల్లో పింఛన్ దరఖాస్తుకు.. ఇంటి పన్ను ఎసెస్మెంట్ నంబర్ తప్పనిసరి కాదు
ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద పింఛను అర్హతకు పట్టణ ప్రాంతాల్లో హౌస్ ట్యాక్స్ ఎసెస్మెంట్ నంబర్ నమోదుకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. సోమవారం స్వర్ణ వార్డు సచివాలయాల్లో కొత్త పింఛనుకు దరఖాస్తు సందర్భంగా ఎదురైన ఇబ్బందులను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో పింఛను మంజూరుకు దీన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. ఇప్పుడు దాన్నుంచి మినహాయింపునిచ్చారు. ఈ మేరకు స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సచివాలయాల శాఖ వెబ్సైట్లో మార్పులు చేయనున్నారు. బుధవారం నుంచి ఇది అమల్లోకి రానుంది. | 276 |
| 6 | కొత్త ఫించన్ దరఖాస్తుకు కావలసిన పత్రాలు:
▪️ఆధార్, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం.
▪️వృద్ధాప్య పింఛన్లకు వయో నిర్ధారణ సర్టిఫికెట్. లేదా ఆధార్.
▪️వితంతు పింఛన్లకు భర్త డెత్ సర్టిఫికెట్. భర్త ఆధార్.
▪️వివాహిత ఒంటరి మహిళలు విడాకుల సర్టిఫికెట్.
▪️అవివాహిత ఒంటరి మహిళలు తహసీల్దార్ సర్టిఫికెట్.
▪️దివ్యాంగులకు(40% వైకల్యం) సదరం సర్టిఫికెట్.
▪️చేనేత కార్మికులు జౌళిశాఖ ఇచ్చే సర్టిఫికెట్.
▪️మత్స్యకారులు మత్స్యశాఖ ఇచ్చే సర్టిఫికెట్.
▪️డప్పుకళాకారులు, చర్మకారులు సాంఘిక సంక్షేమ శాఖ ఇచ్చిన ధ్రువపత్రం.
▪️కల్లుగీత కార్మికులకు ఎక్సైజ్ శాఖ సర్టిఫికెట్.
▪️ట్రాన్సో జెండర్లు జిల్లా వైద్య బోర్డు ఇచ్చే ధ్రువపత్రం
ఇదీ.. షెడ్యూల్!
▪️దరఖాస్తుల స్వీకరణ: సెప్టెంబరు 7 నుంచి 16 వరకు.
▪️ఎవరికి ఇవ్వాలి: గ్రామ/వార్డు సచివాలయంలోని డిజి టల్ అసిస్టెంట్
▪️ఈ-కేవైసీ: ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఈ-కేవైసీ తనిఖీ బాధ్యత డిజిటల్ అసిస్టెంట్లే.
▪️అర్హత పరిశీలన: స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు, ఆర్టీజీఎస్, సెర్చ్ విభాగాలు చేస్తాయి.
▪️క్షేత్రస్థాయి పరిశీలన: ఈ నెల 17 నుంచి 21లోగా పూర్తి.
▪️అర్హత నిర్ణయం: ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్/జి ల్లా/రాష్ట్రస్థాయి అధికారులు.
▪️అర్హత నిర్ణయానికి పట్టే సమయం: ఈ నెల 22-24వ తేదీ వరకు.
▪️తుది ఆమోదం: ఈ నెల 25 నుంచి 26వ తేదీలోగా సెర్చ్ తుది ఆమోదం. | 470 |
| 7 | నేటి నుంచి 16వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాలలో కొత్త పింఛన్లు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. | 461 |
| 8 | ఐటీఐ లాబ్స్ లో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానం
ఏలూరు, భీమవరం, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ ప్రభుత్వ ఐటీఐల్లో ఉపాధి, శిక్షణ శాఖ, నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యాన ఏఐ డేటా, ఏఐ ప్రయోగశాలలు ఏర్పాటు చేయనున్నట్లు కాకినాడ ప్రాంతీయ ఉప సంచాలకుడు మురళీధర్ తెలిపారు. ఒప్పంద విధానంలో 5 డేటా అన్నోటేటర్, 5 డేటా క్యూరేటర్, 10 కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ కొలువులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఔత్సాహికులు ఈ నెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు https:///govtitikakinada.org వెబ్ సైట్ సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. | 525 |
| 9 | ఉత్తమ జర్నలిస్టు అవార్డులు దరఖాస్తులకు నోటిఫికేషన్ విడుదల | 506 |
| 10 | సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈనెల 10, 11 తేదీల్లో ఏపీ సచివాలయంలో 8వ కలెక్టర్ల సదస్సు.. హాజరుకానున్న మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు | 634 |
| 11 | ఓటర్ లిస్ట్ విడుదల.. చెక్ చేసుకోండి!
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్ ముమ్మరం చేసింది. అందులో భాగంగా 58 అర్బన్ లోకల్ బాడీలు, విజయనగరం కార్పొరేషన్లో ని ఫొటో ఓటర్ల జాబితాను రిలీజ్ చేసింది. వీటిల్లో 1,971 వార్డులు ఉన్నాయి. ఈ లిస్టులో మీ పేరు ఉందో? లేదో? తెలుసుకోవడానికి కింద క్లిక్ చేయండి. ఇక రాష్ట్రంలోని మిగతా కార్పొరేషన్లు/మున్సిపాలిటీలు/ నగర పంచాయతీల ఓటర్ల జాబితా త్వరలో రిలీజ్ కానుంది.
👇👇
https://sec-ems.ap.gov.in/apsec/ | 662 |
| 12 | డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ (2 సం.లు) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల | 708 |
| 13 | No text... | 715 |
| 14 | ఇద్దరు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం
▪️సీనియర్ ఐపీఎస్ లు విశాల్ గున్ని, కాంతి రాణాటాటా లకు ఊరట.
▪️విధుల్లోకి తీసుకుంటూ సీఎస్ జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు.
▪️రేపటితో ముగియనున్న సస్పెన్షన్ గడువు.. ఈలోపే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. | 717 |
| 15 | విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల తేదీలు ఖరారు
▪️అక్టోబర్ 11 నుంచి 20 వరకూ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలు.
▪️అక్టోబర్ 11న బాలా త్రిపురసుందరీదేవి అలంకరణ.
▪️12న గాయత్రీదేవి అలంకరణ.
▪️13న అన్నపూర్ణాదేవి అలంకరణ.
▪️14న మహాచండీదేవి అలంకరణ.
▪️15న లలితా త్రిపురసుందరీదేవిగా దుర్గమ్మ దర్శనం.
▪️16న సరస్వతిదేవి అలంకరణ.
▪️17న మహాలక్ష్మీదేవి అలంకరణ.
▪️18న దుర్గాదేవి అలంకరణ.
▪️19న మహిషాసురమర్థిని అలంకరణ.
▪️20న రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనం.
▪️20న సాయంత్రం కృష్ణా నదిలో హంస వాహనంపై తెప్పోత్సవం. | 692 |
| 16 | No text... | 631 |
| 17 | నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం
రాష్ట్ర మంత్రి మండలి సమా వేశం గురువారం ఉదయం 10.30కు సచివాలయంలో జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సీఆర్డీయే అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. | 715 |
| 18 | రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, ఏపీ ఐటీ శాఖ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | 774 |
| 19 | డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో MBBS, BDS కోర్సుల్లో సెల్ఫ్ ఫైనాన్స్, మేనేజ్మెంట్ కోటాలో సీట్లకు నోటిఫికేషన్ విడుదల | 776 |
| 20 | ఆర్కియాలజీ డిగ్రీ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
▪️సెప్టెంబరు 3నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.
బ్యాచిలర్ ఆఫ్ ఆర్కియాలజీ (బీఆర్క్) కోర్సు ప్రవేశాలకు ఉన్నత విద్యాశాఖ షెడ్యూల్ ను విడుదల చేసింది. సెప్టెంబర్ 3 నుంచి 8 తేదీలలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ఉంటుంది. సెప్టెంబర్ 4 - 9 మధ్య ఆన్లైన్ సర్టిఫికేట్ల పరిశీలన, 15న తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 19 - 21 మధ్య వెబ్ ఆప్షన్ల నమోదు, 24న సీట్ల కేటాయింపు జరగనుంది. 25 నుంచి 28 మధ్య ప్రవేశాల ప్రక్రియ చేపడతారు. 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఉన్నతవిద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. | 646 |
