💥*ఙ్ఞానమార్గo*💥🪴Gnyanamaargam🪴
🔥ఆత్మఙ్ఞానమే ధ్యానమార్గo🔥 🙏ధ్యానమార్గమే ఙ్ఞానమార్గo🙏
Show more1 258
Subscribers
No data24 hours
-17 days
-930 days
Posting time distributions
Data loading in progress...
Find out who reads your channel
This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.Publication analysis
Posts | Views | Shares | Views dynamics |
01 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🟥🟥🟥🟥🟥🟥🟥🟥🟥🟥 | 154 | 0 | Loading... |
02 Media files | 155 | 0 | Loading... |
03 🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒
💙💙💙💙💙💙💙💙💙
ఈ వారము మూడవ ప్రశ్న
(28 4 2024)
ఈ గడ్డి పేరేమిటి?
💙💙💙💙💙💙💙💙💙
🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒 | 155 | 1 | Loading... |
04 నర్మదానది పుష్కరాలు 2024
పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానం. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి.
పుష్కర సమయములో ఆయానదులలో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు.
బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే.
పుష్కర కాలము సాధారణంగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరం అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరం అని వ్యవహరిస్తారు.
ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.
పుష్కర సమయంలో పిండ ప్రదానం
సాధారణంగా నదీ స్నానాలలో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు చేసి పితరులను తృప్తి పరచి వారి ఆశీశ్శులు అందుకోవడం శుభప్రథమని విశ్వసిస్తారు.మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం, తొమ్మిదవ రోజున అన్న శ్రాద్ధం, పన్నెండవ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని ఋషులు చెప్పారని పురాణాలు చెప్తున్నాయి.
(శ్రాద్ధకర్మలు ఉపనయనం, వివాహం అయిన పురుషులు తండ్రి మరణాంతరం మాత్రమే చేయాలి)
పుష్కరకాల స్నానం
నీటిలో రెండు శక్తులున్నాయని వేదం చెప్తుంది. దాహార్తిని తీర్చడం, శుభ్రపరచడం అనే రెండు బాహ్య శక్తులైతే అంతరంగికంగా మేధ్యం, మార్జనం అనే శక్తులున్నాయని వేదం వివరిస్తుంది.
మేధ్యం అంటే నదిలో స్నానంచేసి మూడుసార్లు మునక వేస్తే తెలిసి తెలియక చేసే పాపాలు పోతాయని అలాగే మార్జన అంటే నీటిని చల్లుకోవడం అంటే సంప్రోక్షణ చేయడం దీని వలన ద్రవ్య శుద్ధి జరుగుతుందని పురాణాల వర్ణన.
నీరు నారాయణ స్వరూపం కనుక ఆయన స్పర్శచే పాపాలు స్నానంద్వారా పటాపంచలు అవుతాయని విశ్వసిస్తారు.
తీర్ధ స్నానం ఉత్తమం దానికంటే నదీ స్థానం ఉత్తమం దానికంటే పుష్కర సమయ నదీస్నానం ఉత్తమోత్తమం.
ఆ సమయంలో దేవతలలంతా పుష్కరునితో నదిలో ప్రవేశీస్తారని హిందువుల విశ్వాసం.
త్రికరణాలతో చేసే పాపాలు పోతాయని, పుష్కర స్నానం ఒకసారి చేస్తే పన్నెండు సంవత్సరాల కాలం పన్నెండు పుణ్య నదులలో స్నానంచేసిన పుణ్యం లభిస్తుందని, అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని ఋషి వాక్కు. మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది.
నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని నదీ జలాలలో స్నానమాచరిస్తే మాంద్యం, అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది.
ఇసుకతో కాని, మట్టితో కాని పార్థీవ శివలింగాన్ని చేసి పూజించాలంటారు.
నదీ తీరంలోని ఇసుకను నదిలోకి వేయాలంటారు. పురోహితులు భక్తుల తలపై మూడు దోసిళ్ల నీళ్లతో ఆశీస్సులు అందజేస్తారు.
పుష్కరం అనేది నదులను పూజించడానికి అంకితం చేయబడిన భారతీయ పండుగ.
ఇది భారతదేశంలోని 12 ప్రధాన పవిత్ర నదుల ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రాలలో, పూర్వీకుల ఆరాధన , ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీతం మరియు సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో జరుపుకుంటారు.
ఈ వేడుక ప్రతి నదిలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ప్రతి నది ఒక రాశితో ముడిపడి ఉంటుంది మరియు ప్రతి సంవత్సరం పండుగకు సంబంధించిన నది ఆ సమయంలో బృహస్పతి ఏ రాశిలో ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది.
నర్మదా పుష్కరం సాధారణంగా 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే నర్మదా నది పండుగ. ఈ పుష్కరాన్ని బృహస్పతి వృషభ రాశి (వృషభ రాశి)లోకి ప్రవేశించినప్పటి నుండి 12 రోజుల పాటు జరుపుకుంటారు.
ఈ సంవత్సరం నర్మదా పుష్కరలు 2024 మే 1 నుండి ప్రారంభం అయ్యి మే 12న ముగుస్తాయి.
అమర్కంటక్ ఆలయం, ఓంకారేశ్వర్ ఆలయం, చౌసత్ యోగిని ఆలయం, చౌబీస్ అవతార్ ఆలయం, మహేశ్వర్ మహేశ్వర్ ఆలయం, నెమవార్ సిద్ధేశ్వర్ మందిరం మరియు భోజ్పూర్ శివాలయం చాలా పురాతనమైనవి మరియు ప్రసిద్ధమైనవి.
పన్నెండు జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర్ ఒకటి మరియు నరమదా నదిలో పవిత్ర స్నానం చేయడానికి అమ్రార్కంటక్ ఉత్తమమైన ప్రదేశాలు.
ఓంకారేశ్వర్లో నర్మదా నది ఒడ్డున అనేక అందమైన ఘాట్లు నిర్మించబడ్డాయి.
ఈ నది ప్రవాహం నిరంతరం మరియు స్థిరంగా ఉంటుంది మరియు నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది.
ఘాట్లపై నది లోతు ఎక్కువగా ఉండదు. మరియు భక్తులు సులభంగా స్నానాలు చేయవచ్చు.
భక్తులు లోతు నీటిలోకి వెళ్లకుండా కాపాడేందుకు ఇనుప వలలు, పట్టుకునే చైన్లను ఏర్పాటు చేశారు.
వారి భద్రత కోసం సేఫ్టీ బోటు కూడా ఏర్పాటు చేశారు.
ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న కోటి తీర్థ ఘాట్ అన్ని ఘాట్లలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
ఇక్కడ స్నానం చేయడం వల్ల కోట్లాది తీర్థయాత్రల పుణ్యం లభిస్తుంది.
ఓంకారేశ్వర్లోని ఇతర ముఖ్యమైన ఘాట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
చకర్ తీర్థ ఘాట్,
గౌముఖ్ ఘాట్,
భైరోన్ ఘాట్,
కేవల్రామ్ ఘాట్,
నగర్ ఘాట్,
బ్రహ్మపురి ఘాట్,
సంగం ఘాట్,
అభయ్ ఘాట్ | 100 | 0 | Loading... |
05 💚💚💚💚💚💚💚💚
ఈ వారము రెండవ ప్రశ్న
(28 4 2024)
ఈమె ఎవరు?
💚💚💚💚💚💚💚💚 | 85 | 0 | Loading... |
06 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*సత్సాంగత్యం:*
*సజ్జన సాంగత్యం, సత్సంభాషణం, సత్కర్మాచరణం ఇవే మనలోని ధార్మిక ప్రవృత్తిని దృఢంగా తయారు చేస్తాయి.*
*మంచి స్నేహితులు ఉంటే ఎంతటి దూరమైన ప్రయాణం కూడా దగ్గరే అనిపిస్తుంది. అలాగే సజ్జన సాంగత్యం వల్ల జీవన ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది.*
*సజ్జన సాంగత్యం అనేది సుగంధ పరిమళ ద్రవ్యాల వంటిది. వీటి వద్దకు వెళితే చాలు, ముట్టుకున్నా, ముట్టుకోక పోయినా సువాసన మనకు అంటుకుంటుంది.*
*అందుకే మానవ జన్మ పొందిన మనం నిరంతరం సజ్జన సాంగత్యం కలిగి ఉండాలి.*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 | 88 | 0 | Loading... |
07 Media files | 83 | 1 | Loading... |
08 🙏🙏🙏🙏
*మౌడ్యమి (మూఢమి)*
*సమగ్ర పరిశీలన*
******
*శుక్ర మూఢమి :*
26-04-2024 న శుక్ర మూఢమి ప్రారంభమై
01-07-2024 న శుక్ర మూఢమి త్యాగం జరుగును.
*గురు మూఢమి :*
05-05-2024 న గురు మూఢమి ప్రారంభమై
03-06-2024 న గురు మూఢమి త్యాగం జరుగును.
ప్రతి గ్రహాం రవికి 12 డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు గ్రహాలు అస్తంగత్వం చెందుతాయి. ఆ గ్రహాం తన కారకత్వాలను కోల్పోవుతుంది. ఆ గ్రహాం కోల్పోయిన బలాన్ని రవి స్వీకరిస్తాడు.
ఆ గ్రహాం యొక్క కారకత్వాలను రవి తన మహాదశలలో ఇస్తాడు.
ఏగ్రహాం అయితే అస్తంగత్వం చెందుతుందో ఆగ్రహాం ఏకారకత్వాలను తెలియజేస్తాయో ఆ కార్యక్రమాలను చేయకూడదు.
*కుజుడు:-*
కుజుడు అస్తంగత్వం చెందినప్పుడు ఆపరేషన్స్, యుద్ధాలు, రక్షణ సంభంధ నిర్ణయాల, పోలీస్ ఉద్యోగంలో చేరుట ఇంకాకుజ గ్రహానికి సంబందించిన మొదలగు పనులు చేయకూడదు.
*బుధ,శుక్ర మూడమిలలో*
అన్నప్రాశన తరువాత కార్యక్రమాలు చేయరాదు. అన్నప్రాశన ముందు కార్యక్రమాలు చేసుకోవచ్చును.
*గురువు:-*
గురువు మూడమిలలో సుఖానికి, దనానికి,సంబందం లేని పనులు చేసుకోవచ్చు, గురువు అస్తంగత్వం చెందినప్పుడు ఉపనయనం చేయటం మంచిది కాదు.
*శని:-*
శని అస్తంగత్వం చెందినప్పుడు ఉపాసన, దీక్ష, తపస్సు, మెడిటేషన్ వంటి పనులు చేయరాదు.
మూడమి అన్ని గ్రహాలకు ఉన్న *గురు, శుక్ర మౌడ్యమి మాత్రమే* మానవులపై ప్రభావం చూపుతుంది.
ఈ మూడమిలో జప, హోమాది శాంతులు గ్రహా శాంతికి అభిషేకాలు గండనక్షత్ర శాంతులు అన్ని వ్రతాలు చేయవచ్చును.
*శుక్ర మూఢమి*
బుధుడు, శుక్రుడు భూకక్ష్యకు లోపల ఉండి సూర్యుని చుట్టూ తిరుగుతూ బుధ శుక్రులు భూమి కంటే వేగంగా తిరుగుతూ సూర్యుని యొక్క అవతలి వైపుకి వెళ్ళినప్పుడు భూమి పైన ఉన్న మనకు బుధ, శుక్రులు కనిపించరు. అట్టి సమయాన్నే బుధ అస్తంగత్వం, శుక్ర అస్తంగత్వం అంటారు. శుక్రుడు అస్తంగత్వం అయినప్పుడు శుక్ర మౌడ్యమి అంటారు.
శుక్రుడు సూర్యునికి అవతలి వైపునకు వెళ్ళినప్పుడు *“ప్రాక్ అస్తంగత్వం”* అని,
శుక్రుడు సూర్యునికి భూమికి మద్య అస్తంగత్వం అయినప్పుడు *"పశ్చాద అస్తంగత్వం"* అంటారు.
మౌడ్య కాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు. అందువల్ల మౌడ్య కాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి.
గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి.
*శుభ గ్రహమైన శుక్రునకు మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిథ్థము.*
మౌఢ్యమిని మూఢమిగా వాడుక భాషలో పిలుస్తారు.
ఈ మూఢమి సమయంలో నూతన కార్యక్రమములు చేయకూడదు.
మూఢమి అంటే చీకటి.
శుక్రుడు సూర్య గ్రహమునకు ముందూ, వెనుక 10 డిగ్రీల దూరము లోపు శుక్రుడున్నట్లయితే అస్తంగత్వమునకు గురి అవును. అనగా శుక్రుడు తన తేజస్సును, ప్రభావాన్ని, శుభత్వాన్ని కోల్పోవును. అందువల్ల ఆ కాలములో చేసే శుభకార్యాలకు శుభ గ్రహమైన శుక్ర బలం ఉండదు కాబట్టి శుభ కార్యాలు చేయరాదు. కాబట్టి నిషేథ కాలముగా పరిగణించారు.
అలాగే ముఖ్యముగా పెళ్ళిచూపులు, వివాహ, చేయరాదు, వాహన కొనుగోలు చేయరాదు.
*శుక్ర మౌఢ్యమి* ఏర్పడినప్పుడు సమస్త జీవకోటి శృంగార సంబంథమైన విషయాల్లో బలహీనత ఏర్పడుతుంది. వీర్యకణాలలో జీవత్వం, పటుత్వం ఉండదు.
శుక్రమౌఢ్యమి కాలంలో ప్రసవం జరిగినప్పుడు శుక్ర గ్రహ, రవిగ్రహ శాంతి చేయాలి.
శుక్రదశ మహా దశ మరియు శుక్రుని అంతర్దశ నడుస్తున్న వాళ్ళు చాలా జాగరూకులై ఉండాలి.
శుక్ర మౌఢ్యమి కాలములో ప్రకృతి సంపద క్షీణిస్తుంది. సముద్రం ఆటు, పోటులలో మార్పులు వస్తాయి.
శుక్ర గ్రహ పాలిత ద్వీపాలకు, ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి.
స్త్రీల మీద అత్యథికంగా అత్యాచారాలు జరిగే అవకాశాలుంటాయి. శుక్రుడు సంసార జీవితానికి –శృంగార జీవితానికి కారకుడు.
జాతకములో శుక్రుడు బలహీనముగా ఉంటే సంసార జీవితం సజావుగా సాగదు..
ఇలాంటి వారు ఇంద్రాణీ దేవి స్తోత్రం పారాయణం చేయండి.
🙏🙏🙏🙏 | 91 | 0 | Loading... |
09 Media files | 84 | 0 | Loading... |
10 *🌹🌹 గురువెంత గొప్పవాడో తెలుసా 🌹🌹*
*బ్రహ్మ స్థానే కృతం పాపం*
*విష్ణు స్థానే విన శృతి*
*విష్ణు స్థానే కృతం పాపం*
*శివ స్థానే విన శృతి*
*శివ స్థానే కృతం పాపం*
*గురు స్థానే విన శృతి*
*గురుస్థానే కృతం పాపం*
*నాస్తి స్థానే విన శృతి*
*బ్రహ్మ వద్ద చేసిన తప్పులు విష్ణువు వద్ద చెప్పిదిద్దు కొనవచ్చు*
*విష్ణువు వద్ద చేసుకున్న తప్పులు శివుని వద్దచెప్పి దిద్దు కొనవచ్చు*
*శివుని వద్ద చేసిన తప్పులు గురువు వద్ద చెప్పిదిద్దు కొనవచ్చు*
*గురువు వద్ద చేసిన తప్పులు వేరే ఎవరి వద్ద చెప్పిదిద్దు కొనలేము*
*అంతటి గొప్ప వ్యక్తి గురువు అని మన వేదాలలో చెప్పబడింది కనుక గురువును గౌరవిద్దాం*
*గురువు గారు చెప్పిన మాటను పాటిద్దాం*
*🌹🌹🌹🌹🌹🌹 | 81 | 0 | Loading... |
11 Media files | 74 | 0 | Loading... |
12 Media files | 85 | 0 | Loading... |
13 Media files | 86 | 0 | Loading... |
14 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*సాష్టాంగ నమస్కారం*
➖➖➖
*సాష్టాంగ నమస్కారం యొక్క విశిష్టత*
అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారము అని అంటారు.
సాష్టాంగ నమస్కారము అంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో నమస్కారము చేయుట అని అర్ధము.
సాష్టాంగ నమస్కారం చేసేటపుడు చదివే శ్లోకం:
*ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః౹౹*
అష్టాంగాలు అంటే...
"ఉరసా" అంటే తొడలు,
"శిరసా" అంటే తల,
"దృష్ట్యా" అనగా కళ్ళు,
"మనసా" అనగా హృదయం,
"వచసా" అనగా నోరు,
"పద్భ్యాం" అనగా పాదములు,
"కరాభ్యాం" అనగా చేతులు,
"కర్ణాభ్యాం" అంటే చెవులు.
ఇలా ‘8’ అంగములతో కూడిన నమస్కారం" చేయాలి.
మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు.
అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నేలకు తగిలించాలి.
ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభం వెనుక వుండి చేయాలి.
1). ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతి నేలకు తగలాలి.
2). శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి.
3). దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.
4). మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మనఃస్పూర్తిగా చేయాలి.
5). వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం. అంటే నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి.
అంటే "ఓం నమో నారాయణాయ" అని అంటూ నమస్కారం చేయాలి.
6). పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.
7) కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.
8) కర్ణాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చెవులు కూడా నేలకు తగులుతూ
(అటూఇటూతిప్పి) ఉండాలి.
*స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు!* `
ఆడవాళ్లు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి.
అంటే కాళ్లు, చేతులు, నుదురు, మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని (కళ్ళు, మనసుతో ఐదు)శాస్త్రం చెబుతుంది.
సాష్టాంగ ప్రణామము చేయటానికి ఎనిమిది అంశాలు అవసరమౌతాయి. అవి ఛాతి (రొమ్ము),నుదురు, శబ్దం,మనస్సు,కాస్త ఎడంగా పెట్టి నమస్కార రూపంలో ఉంచిన చేతులు, కళ్ళు,మోకాళ్ళు మరియు పాదాలు.
సాష్టాంగ నమస్కారం చేయునప్పుడు రెండు పాదాల ముందుభాగం మోకాళ్ళు, ఛాతి మరియు నుదురు మాత్రమే నేలకు ఆనించి ఉంచాలి. అలా సాష్టాంగ పడ్డప్పుడు చేతులను తలభాగం పైకి ఎత్తి నమస్కరిస్తూ దేవతను ప్రార్థించాలి.
అలా ప్రార్థిస్తున్నప్పుడు దేవుడి మంత్రాలను లేక శ్లోకాలను ఉచ్చరిస్తూ, దేవుడి విగ్రహంపై దృష్టిని ఉంచి మనస్సులో దేవుడిని ధ్యానించాలి.
ఈ పద్దతిలో నమస్కారం అనేది స్త్రీల శరీర నిర్మాణానికి తగినట్లు ఉండదు... స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేసేటపుడు, ఉదరం, పాలిండ్లు, కటి ప్రదేశం నేలకు తగిలే అవకాశం ఉంది. అందువలన గర్భస్థ మహిళలకు, పిల్లలకు పాలిచ్చే మహిళలకు చాలా కష్టంగా ఉండి ప్రమాదం సంభవించవచ్చు.ఆధునిక శాస్త్రం సైతం స్త్రీలు ఇలాటి ప్రణామాలు చేయడం ద్వారా వారి గర్భాశయం స్థాన భ్రమంశం అయ్యే అవకాశం ఉందని తెలియజేయడం జరగింది.
అందుకని మన పెద్దలు ‘స్త్రీలు మోకాళ్ళపై ఉండి నమస్కరించడమో, ధ్యానించడమో లేక మోకాళ్ళపై ఉండి మోకరిల్లడమో(పంచాంగ నమస్కారం) చేస్తే చాలు అని చెప్పారు. అందుకే మరొక ప్రాణికి జన్మనిచ్చి చైతన్య వంతులను చేయగలిగిన అమ్మలకు ఇందులో వెసులు బాటు కలిగించారు.
పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి.
దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి.
నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టాంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺 | 73 | 0 | Loading... |
15 Media files | 74 | 0 | Loading... |
16 ❤️❤️❤️❤️❤️❤️❤️
మన ఆత్మజ్యోతిని ప్రకాశవంతంగా ఉంచితే అది ప్రపంచానికే తన కాంతిని ప్రసరింపజేస్తుంది.
భగవంతుడు బాహ్యంగా ఎక్కడో ఉన్నాడని వెతికేకన్నా మన అంతరంగంలోనే ఉన్న ఆయనను కనుగొనేందుకు ప్రయత్నించాలి. అక్కడ నుండే ఉన్నతాశయాలు ప్రభవిస్తాయి.
అవి ఏ విధంగా ఫలిస్తాయో జీవితమే నిర్ణయిస్తుంది. అందరిలోనూ ఆశయాలు ఉంటాయి, కానీ కొందరు మాత్రమే వాటికి తగినట్లుగా జీవించగలరు.
తమవల్ల ఏదీ సాధించబడదని ముందే నిర్ణయించుకున్నవాళ్ళు పెద్దగా సాధించేది ఏదీ ఉండదు. కానీ ఆశయసాధనే లక్ష్యంగా పెట్టుకున్నవారి జీవితం ఫలవంత మవుతుంది.
అందువల్ల ఆదర్శాలను అర్థాంతరంగా వదలివేయకూడదు, సాధించే వరకూ ముందుకు సాగుతూనే ఉండాలి.
💚💚💚💚💚💚💚 | 86 | 0 | Loading... |
17 Photo from Dr Raj | 95 | 0 | Loading... |
18 *నిత్యశాంతి*
‘నేనెక్కడ ఉన్నాను అని కాకుండా ‘నాలో ఏముంది అనే విషయాన్ని వివేకంతో ఆలోచించగల వారే సాధకులు.
‘నాకేముంది అని కాకుండా ‘నేనెలా ఉన్నాను అని తమను తాము చూసుకోగల సాధకులే ఏనాడైనా ప్రగతిని సాధిస్తారు.
మనకు ఆనందం కావాలి కాని, దుఃఖం కోసం శ్రమిస్తున్నాం. మనకు మోక్షం కావాలి కాని, బంధం వైపు నడుస్తున్నాం.
ఆనందాన్ని, మోక్షాన్ని, పొందే శక్తి మనకు ఉంది. ఇది దైవశక్తి. దుఃఖాన్ని, బంధాన్ని పెంచుకునే శక్తి కూడా మనకు ఉంది. ఇది అసురశక్తి. ఈ రెండూ మనలోనే ఉన్నాయి. వీటి మధ్యే ఘర్షణ.
నిప్పు అగ్నిని బాధించదు, నీళ్లను బాధిస్తుంది. కారణం, నిప్పు స్వభావం నీళ్ల స్వభావానికి విరుద్ధమైనది. నిప్పు మీద నీళ్లు కళపెళలాడుతాయి. పొయ్యి మీద నుండి దించిన కొంతసేపటికి నీళ్లు యధాస్థితికి చేరుకుంటాయి.
చల్లదనం నీటి సహజ స్వభావం.
కాని దుఃఖము, అశాంతి-వాటిని కల్పించే రాగద్వేషాలు మనిషి స్వభావం కాదు. అందుకే నిరంతరం దుఃఖం నుండి విడిపడి శాంతిని పొందాలి అని మనిషి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆకలిదప్పులు దేహానికే కాదు, మనసుకూ ఉన్నాయి.
ఆశలు, ఆవేశాలు, ఆవేదనలు, ఆందోళనలు, మానసికమైన ఆకలిదప్పులు. ఆకలిదప్పులను భరించలేనట్లే కొందరు ఆవేశాలను, ఆవేదనలను కూడా భరించలేరు.
యోగః చిత్తవృత్తి నిరోధః యోగం ద్వారా చిత్తవృత్తులను నిరోధించి శాంతిని పొందవచ్చునని కొందరి అభిప్రాయం.
మాట వినని పిల్లవాడిని కొడితే ఏమి ఉపయోగం? తాత్కాలికంగా అల్లరి ఆపి ఆ తరువాత మళ్లీ మొదలుపెడతాడు. అలాగే మనసులోని కోరికల్ని అణగద్రొక్కితే ఏం ప్రయోజనం? అవి బీజరూపంలో అడుగున ఉండి, అను కూల వాతావరణంలో అంకురిస్తాయి. కోరికల్ని లేకుండా చేయడం యోగానికి సాధ్యపడదు.
నీళ్లను అగ్నిమీద పెడితే కాగి, ఆవిరై, పాత్ర ఖాళీ అవ్ఞతుంది. జ్ఞానాగ్నిలో మనసు తప్తమైతే కోరికలు నిర్వీర్యమై అదృశ్యమవ్ఞతాయి.
యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతి మాప్నోతి నైష్ఠికీం కర్మయోగి కర్మఫలాలను త్యజించి పరమశాంతిని పొందుతున్నాడు.
యుక్తః అంటే యోగయుక్తుడు. రాగద్వేషాల వల్ల అశాంతి ఆవరించింది కనుక రాగద్వేషాల నుండి విడిపడగానే హృదయంలో శాంతి నిండుతూ ఉంది.
రాగద్వేషాల నుండి విడిపడిన కర్మయోగికి కర్మలతో సంబంధం లేదు.
కర్మఫలాలతో సంగత్వం లేదు. రాగద్వేషాలు ఉన్నపుడే కర్మలలో మంచి, చెడు అనే భేదం కనిపిస్తూ ఉంది.
రాగద్వేషాలు ఉన్నపుడే అనుకూలం ఫలం, ప్రతికూల ఫలం అనే భావన కలుగుతూ ఉంది. రాగద్వేషాలు తటస్థపడిన కర్మయోగికి ఏ ఫలమైన నిష్ఫలమే. ఎందుకని? అతనికి కావలసింది మోక్షఫలం. మోక్షం కర్మఫలం కాదు.
రాగద్వేషాల నుండి విడిపడి కర్మఫలాల యందు సంగత్వం లేనపుడే సంఘర్షణ దూరమై మనసులో శాంతి కలుగుతూ ఉంది.
ధ్యానాత్కర్మ ఫలత్యాగః త్యాగాచ్ఛాంతి రనంతరమ్ ధ్యానము కంటే కర్మ ఫలత్యాగం ఉన్నతం. కర్మ ఫలత్యాగం వల్ల శాంతి కలుగుతూ ఉంది.
ధ్యానం మనిషి ఎంత కాలమని చేయగలడు? ధ్యానం ఆగగానే మళ్లీ అశాంతి మొదలవ్ఞతుంది.
కర్మఫలత్యాగం వల్ల కలిగే శాంతి దేశకాలపరిస్థితులపై ఆధారపడి ఉన్నది కాదు. అది సహజమైన స్వతస్సిద్ధమైన శాంతి. నీటికి చల్లదనం లాగ శాంతి మనిషి సహజస్థితి.
🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺 | 101 | 1 | Loading... |
19 Media files | 85 | 0 | Loading... |
20 🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓
💎💎💎💎💎💎💎💎💎💎💎
హజ్ఞానం కలగాలంటే దీన్ని తొలగించుకోవాలి!!
🌹🌹🌹🌹🌹🌹
ధూమేనావ్రియతే వహ్నిర్యథా దర్శో మలేనచ యథోల్బేనావృతో గర్భస్తధాచద తేనేడమావృతమ్ః||
పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మానిచేత గర్భంలో ఉన్న శిశువు కప్పబడి ఉన్నట్టు. ఈ కామము దాని వలసపుట్టే క్రోధము, మనలో ఉన్న ఆత్మజ్ఞానమును కప్పి ఉంచుతుంది
ప్రతి జీవిలో ఆత్మ జ్యోతి మాదిరి వెలుగుతూ ఉంటుంది. ఆ జ్యోతి ప్రాపంచిక విషయములతో చేరితే జీవాత్మ, పరమాత్మ వైపు తిరిగితే తన స్వస్వరూపము అయిన ఆత్మ స్వరూపము. ఈ జీవాత్మకు కామము, క్రోధము ఒక పొరవలె ఏర్పడి కప్పి ఉంచుతాయి.
ఎలాగంటే….
అద్ధం ఉంది దానికి మురికి పడితే అద్దంలో మన ముఖం కనపడదు. ఆ మురికిని తుడిచి వేస్తే అద్దం నిర్మలంగా ఉంటుంది. అలాగే నిప్పు ఉంది, పొగ రావడం మొదలయితే అగ్ని కనిపించదు. ఊదితే మండుతుంది అప్పుడు పొగ ఉండదు. ఈ కామము క్రోధము అనే పొరలు మనకు మనం సృష్టించుకున్నవేకానీ ఎక్కడి నుండి రావు. ఈ కామము క్రోధము అనే పొగ, మురికి పోగానే జీవాత్మ స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ తుడవడమే సత్సాంగత్యము, నిష్కామ కర్మ భావన లేకుండా కర్మలు ఆచరించడం.
జ్ఞానము సంపాదించడం, కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయడం. దీనితో జీవాత్మకు పట్టిన మురికి తొలగి పోతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. పొగతో కప్పబడి నప్పుడు అగ్నికి గానీ, మురికితో కప్పబడినప్పుడు అద్దానికి కానీ, మాచితో కప్పబడినప్పుడు శిశువుకు గానీ ఎటువంటి హానీ జరగదు. అవి తమ తమ స్వస్వరూపాలతోనే ఉంటాయి. కేవలం పొగ, మురికి మాత్రమే వాటిని కప్పి ఉంచుతుంది. ఆ మురికి తీసేస్తే వాటి నిజమైన స్వరూపాలు ప్రకటితమౌతాయి. దీని వలన మనకు తేలిందేమిటంటే మనం ఆనంద స్వరూపులము. మనలో ఉన్న ఆత్మ ఎల్లప్పుడు మనతోనే ఉంటుంది. కాని మనం కామము, కోరికలు, అవి తీరకపోతే కోపము అనే వాటితో ఆ ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాము. అవి తీసేస్తే మరలా ఆనంద స్వరూపులము అవుతాము.
మనం అందరం శివస్వరూపులము శివ అంటే ఆనందము. అంటే మనం అందరం ఆనంద స్వరూపులము. అని తెలుసుకుంటే మనకు మనం మసి పూసుకోము. చాలా మంది నా జీవితం ఇంతే నేనింతే నాకు సుఖం లేదు ఈ జీవితానికి సుఖం లేదు అని అనుకుంటూ తమలో తాము బాధపడుతుంటారు. అది తప్పు, అందరూ ఆనంద స్వరూపులే, మనం ఆ ఆనందాన్ని చేచేతులా నాశనం చేసుకొని ఏడుస్తున్నాము అంతే. కాబట్టి ఆ పొగను మురికిని తొలగిస్తే నిత్యం ఆనందంగా ఉంటాము.
పోనీ ఇదేమన్నా కష్టమా అంటే అదీ లేదు. కాస్త విసిరితే పొగపోయి మంట వస్తుంది. కాస్త నీటిలో తడిపి తుడిస్తే అద్దం స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. వైద్యులు మావి తొలగించి శిశువును బయటకు తీస్తారు. ఇవన్నీ దైవయత్నాలు కాదు, పురుష ప్రయత్నాలు, ఈ కామము క్రోధమును తొలగించుకోడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి కానీ నా ఖర్మ ఇంతే అని ఏడుస్తూ కూర్చోకూడదు. సోమరితనం పనికి రాదు. కాస్త ప్రయత్నం చేస్తే ఈ కామ క్రోధములను జాయించడం అంత కష్టమేమీ కాదు అని భగవానుడు మనకు భరోసా ఇస్తున్నాడు.
కామము మానవునిలో ఉన్న ఆలోచనా శక్తిని, వివేచనా శక్తిని తగ్గిస్తుంది, అంధకారంలో పడేస్తుంది. అందుకే కామాంధుడు అని కూడా మనం అంటూ ఉంటాము. కామంతో కళ్లు మూసుకుపోయినవాడు. ఇక్కడ కామము అంటే కేవలం స్త్రీవాంఛ అనే అర్థంలో వాడినా, కామము అంటే కోరిక అని అర్ధం చేసుకోవాలి. కామము అంటే మనలో ఉన్న తీరని కోరికలు అని అర్థం.
ఈ శ్లోకంలో అగ్ని, అద్దము, శిశువు అనే మూడు ఉదాహరణలు చెప్పాడు పరమాత్మ, ఈ మూడు ఉదాహరణలు కూడా చాలా ముఖ్యమైనవి. అగ్నినుండి పొగ వస్తుంటే, ఊదితే పొగ పోయి అగ్ని మండుతుంది. అలాగే కొన్ని కోరికలు ఉఫ్మని ఊదితే చాలు ఎగిరిపోతాయి. ఎక్కువ శ్రమపడనక్కరలేదు. కాని మరి కొన్ని కోరికలు ఉంటాయి. చాలా బలంగా ఉంటాయి. అవి అద్దానికి పట్టిన మురికిలాంటివి. అద్దానికి పట్టిన మురికిని బట్టతీసుకొని నీటిలో తడిపి అద్దం మీద రుద్దాలి. అప్పటికీ పోకపోతే డిటర్జెంట్ తో క్లీన్ చేయాలి. అంటే కొంత శ్రమతో కూడిన పని. అలాగే మరి కొన్ని కోరికలు చాలా బలంగా ఉండి, ఎప్పటికీ తీరవు. ఎంతో శ్రమపడితేనే గానీ ఆ కోరికల ప్రభావం నుండి బయట పడలేము. ఆ కోరికల ప్రభావంనుండి బయట పడటానికి కొంత కాలము వేచి ఉండాలి. ఓపికగా ఉండాలి. ఎలాగంటే
శిశువుకు కప్పిన మాయను వెంటనే తీసివేయలేము. తొమ్మిది నెలలు నిండి శిశువు బయటకు వస్తేనే గానీ, ఆ మాయను తీసివేయలేము. అలాగే కొన్ని కోరికలు. కాలక్రమేణా పోవలసిందేకానీ, మన ప్రయత్నం వలన పోవు, కాబట్టి మనలో ఉన్న జ్ఞానాన్ని కప్పిఉంచిన ఈ కామాన్ని ముందు తొలగించుకోవాలి...
సంసారమనే విషవృక్షానికి
అమృతముతో సమానమైన రెండు ఫలములు ఉంటాయి.
ఒకటి సద్గ్రంథపఠనం,
రెండోది సత్పురుష సహవాసం.
గ్రంథాలు చదివినా..వాటిని అర్థము చేసుకోగలిగే విజ్ఞానం అవసరం. కానీ సత్సాంగత్యానికి.. ‘సత్పురుషుడా.. కాదా?’ అని గుర్తించగలిగిన వివేకం ఉంటే సరిపోతుంది.
అందుకే మన పెద్దలు ‘‘సత్సంగశ్చ, వివేకశ్చ నిర్మలం నయనద్వయం’’ అన్నారు. సత్సాంగత్యం వల్ల మానవుడు పొందవలసిన సకల శుభాలూ పొందగలడు. | 90 | 0 | Loading... |
21 ఇది కలియుగం. యుగధర్మం ప్రకారం మూడు భాగాలు అధర్మం. ఒక భాగం ధర్మం. ధర్మాధర్మ విచక్షణ కలవారెవరైనాలౌకిక వ్యావహార సరళిని పరిశీలిస్తే యుగ ధర్మ ప్రభావం స్పష్టంగా కనపడుతుంది. అప్పుడు మనం కాల ప్రవాహములో పడి కొట్టుకొని పోవడమా! లేక చైతన్యవంతులమైన మానవులుగా విజ్ఞతతో మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమా అనేది మన నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సందర్భములో.. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన *‘ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే’*
అనే మాట స్ఫురిస్తుంది. ‘ధర్మాన్ని నెలకొల్పడానికి ప్రతియుగంలో అవతరిస్తాను’ అన్న భగవద్వాక్యం ప్రకారం.. ఎక్కువ మోతాదులో ఉన్న అధర్మం కన్నా తక్కువగా ఉన్న ధర్మమే జయించగలదు. *‘ధర్మోరక్షతి రక్షితః’* ధర్మాన్ని మనం కాపాడితే ధర్మపక్షపాతియైున భగవంతుడు మనను కాపాడుతాడు. భగవంతుడు సత్పురుష పక్షపాతి కావున సత్సాంగత్యము చేసిన మనను కూడా రక్షిస్తాడు. దాని వలన మనకు కలిగే లాభం.. అనంతం, అపరిమితం.
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః
ఇది పారలౌకికం. ఈ లోకానికి సంబంధించి.. సత్సహవాసం వల్లమనిషి సంస్కరింపబడతాడు. వ్యక్తులు సంస్కరింప బడితే సమాజం బాగుపడుతుంది. అప్పుడు దేశం సుఖశాంతులతో వర్థిల్లుతుంది. సత్సాంగత్యం ప్రభావం వర్ణనాతీతం. సత్పరుషులైన సప్తర్షులను కలవడం వలనే బోయవాడు వాల్మీకిగా మారి ప్రపంచప్రసిద్ధి గాంచిన రామాయణ మహాకావ్య రచన చేయగలిగాడు. నాస్తికుడైన ‘నరేంద్రుడు’.. రామకృష్ణ పరమహంస అనే గురువును పొందడం వల్లనే వివేకానందుడుగా మారి భారతదేశానికి, హిందూమతానికి ప్రపంచ ప్రఖ్యాతి కలిగించాడు.
సువాసనగల, అందమైన పూలతో సాంగత్యము చేసి హారంగా మారడం వల్లనే దారానికి భగవంతుని కంఠసీమలో స్థానం లభించింది. పూలలో దాగుండే కొన్ని చిన్న కీటకాలు ఆ పరమేశ్వరుని శిరోభాగమును చేరగలుగుతున్నాయి. ఈ విధంగా సత్సాంగత్యానికి సత్ఫలితం ఉన్నట్లుగానే.. దుస్సాంగత్యానికి దుష్ఫలితం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి, మానవులు సత్సాంగత్యం ద్వారా సత్ఫలితాలు పొందగలరని ఆశిద్దాం🌹
🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓
💎💎💎💎💎💎💎💎💎💎💎 | 91 | 0 | Loading... |
22 _*సముద్ర తీరాన ఒక కుర్రాడు ఆడుకుంటూ ఉండగా ఓ చెప్పు కనిపించకుండా పోయింది. అతను వెంటనే "ఈ సముద్రం మహా దొంగ" అని రాశాడు. కాస్తంత దూరంలో ఒక వ్యక్తి అదే సముద్రంలో వల వేసి చేపలు పట్టాడు. ఆ రోజు తాననుకున్న దానికన్నా ఎక్కువ చేపలు దొరకడంతో "ఈ సముద్రం గొప్ప దాత" అని రాశాడు. ఇంకొక వ్యక్తి ఈదుకుంటూ ప్రమాదవశాత్తు మునిగి పోయాడు. అతని తల్లి "ఈ సముద్రం నా కొడుకులాంటి అమాయకులను పొట్టన పెట్టుకున్న మహమ్మారి"అని రాసింది. ఒక పెద్దతను సముద్రంలోకి వెళ్లి ముత్యాలు సేకరించి విజయవంతంగా ఒడ్డుకు చేరి ఆ ఇసుకలో "ఈ సముద్రం ఒకటి చాలు జీవితమంతా హాయిగా బ్రతికేస్తాను" అని రాశాడు. అనంతరం ఒక పెద్ద అల వచ్చింది. వీరందరూ రాసిన మాటలను తుడిచి పెట్టేసింది. రకరకాల అభిప్రాయాలను సముద్రం తన అలలతో తుడిచేసుకుంది. అలాగే మన జీవితంలో ఎవరెవరో ఏదేదో అన్నారని బాధపడరాదు.. ఇంకా ఇతరులు ఏవేవో చెప్పిన మాటలన్నింటిని విని ఎవరిపైనా చెడు అభిప్రాయానికి రాకూడదు. వారిని కూడా మంచిగా మార్చేందుకు ప్రయత్నం చేయాలి. ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తారు. చేదు అనుభవం ఎదురైనప్పుడు అలా ఎందుకు జరిగిందో అని ఆలోచించండి. దాని తొలగించి ముందుకు అడుగు వేయండి... మన ఆలోచనలను బట్టి భగవంతుని తోడుగా చేసుకుంటాడు.. వినయం విధేయతతో విజయం మీ సొంతం.
🍁🍁🍁🍁🍁🍁🍁🍀🍀 | 87 | 0 | Loading... |
23 Media files | 88 | 1 | Loading... |
24 Audio from Dr Raj | 89 | 0 | Loading... |
25 Media files | 99 | 0 | Loading... |
26 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
❤️ 28/04/2024 ❤️
💛 మూల నక్షత్రం
💚 తిథి చతుర్దశి
🧡 ఆది వారం
💜 (బహుళ / కృష్ణ) పక్షం
💙 ఉత్తర భాద్ర కార్తె
🤎చైత్ర మాసం
🖤 వసంత బుుతువు
❤️🩹 వేసవి కాలము
💖 ఉత్తరాయణం
💝 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 | 107 | 0 | Loading... |
27 Media files | 120 | 0 | Loading... |
28 Good morning 🌞 | 122 | 0 | Loading... |
29 🟥🟥🟥🟥🟥🟥🟥🟥🟥
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 | 122 | 0 | Loading... |
30 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🟥🟥🟥🟥🟥🟥🟥🟥🟥 | 250 | 0 | Loading... |
31 Media files | 257 | 0 | Loading... |
32 ఈవారం మూడవ ప్రశ్న
(21 4 2024)
ఈ పుట్టగొడుగు పేరేమిటి? | 1 | 0 | Loading... |
33 Media files | 241 | 1 | Loading... |
34 🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡
ఈవారం రెండవ ప్రశ్న
(21/04/2024)
ఇతను ఎవరు?
🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡 | 1 | 0 | Loading... |
35 Media files | 140 | 2 | Loading... |
36 Media files | 125 | 2 | Loading... |
37 నిన్ను నిన్నుగా ఇష్టపడే వారికి నీవు ఏంటో చెప్పనవసరం లేదు, నీవంటే ఇష్టం లేని వారికి నీవు ఏంటో చెప్పినా అర్థం కాదు! గెలవాలి అనే ఆశతో కాదు, గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పటికైనా విజయం మీ సొంతం అవుతుంది. నీకు నీ మీదున్న నమ్మకమే విజయానికి తొలిమెట్టు...
💚💚💚💚💚💚💚💚💚💚💚 | 116 | 1 | Loading... |
38 అన్నమాచార్య కీర్తన
గానం : వాణిజయరాం
ఏ లోకమున లేదు ఇంతటి డైవము మరి జోలీ దవ్వి దవ్వి ఎంత సోదించినను
మంచి రూపునానెంచితే మారుని గన్న తండ్రి
ఇంచుకంత సరిలేదు ఇతనికి
మించు సంపాదలానైతే మేటి లక్ష్మీకాంతుడు పొంచి ఈతానీకి
నీరు పురుదించగలరా
తగ ప్రతాపమున దానవవాంత కుదీతడు తగుల నీతని మారుదైవాలు లేరు
పొగరు మగతనాన పురుషోత్తమూదీతడు
వేగటై ఈతని పాటి వేతకిన లేరు
పట్టి మొదలెంచితేను బ్రహ్మ గన్న తండ్రీతడు మట్టున నింతది వారు మరి వేరి ఇట్టి వెంకటేశుడుకి వరదుడు ట్ట కట్టుగోన నితరులు గురిచేయగలరా
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 | 108 | 0 | Loading... |
39 Media files | 92 | 0 | Loading... |
40 అన్నమాచార్య కీర్తన
గానం : వాణిజయరాం
ఏ లోకమున లేదు ఇంతటి డైవము మరి జోలీ దవ్వి దవ్వి ఎంత సోదించినను
మంచి రూపునానెంచితే మారుని గన్న తండ్రి
ఇంచుకంత సరిలేదు ఇతనికి
మించు సంపాదలానైతే మేటి లక్ష్మీకాంతుడు పొంచి ఈతానీకి
నీరు పురుదించగలరా
తగ ప్రతాపమున దానవవాంత కుదీతడు తగుల నీతని మారుదైవాలు లేరు
పొగరు మగతనాన పురుషోత్తమూదీతడు
వేగటై ఈతని పాటి వేతకిన లేరు
పట్టి మొదలెంచితేను బ్రహ్మ గన్న తండ్రీతడు మట్టున నింతది వారు మరి వేరి ఇట్టి వెంకటేశుడుకి వరదుడు ట్ట కట్టుగోన నితరులు గురిచేయగలరా
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 | 1 | 0 | Loading... |
Photo unavailable
🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒
💙💙💙💙💙💙💙💙💙
ఈ వారము మూడవ ప్రశ్న
(28 4 2024)
ఈ గడ్డి పేరేమిటి?
💙💙💙💙💙💙💙💙💙
🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒
15510
నర్మదానది పుష్కరాలు 2024
పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానం. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి.
పుష్కర సమయములో ఆయానదులలో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు.
బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే.
పుష్కర కాలము సాధారణంగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరం అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరం అని వ్యవహరిస్తారు.
ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.
పుష్కర సమయంలో పిండ ప్రదానం
సాధారణంగా నదీ స్నానాలలో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు చేసి పితరులను తృప్తి పరచి వారి ఆశీశ్శులు అందుకోవడం శుభప్రథమని విశ్వసిస్తారు.మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం, తొమ్మిదవ రోజున అన్న శ్రాద్ధం, పన్నెండవ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని ఋషులు చెప్పారని పురాణాలు చెప్తున్నాయి.
(శ్రాద్ధకర్మలు ఉపనయనం, వివాహం అయిన పురుషులు తండ్రి మరణాంతరం మాత్రమే చేయాలి)
పుష్కరకాల స్నానం
నీటిలో రెండు శక్తులున్నాయని వేదం చెప్తుంది. దాహార్తిని తీర్చడం, శుభ్రపరచడం అనే రెండు బాహ్య శక్తులైతే అంతరంగికంగా మేధ్యం, మార్జనం అనే శక్తులున్నాయని వేదం వివరిస్తుంది.
మేధ్యం అంటే నదిలో స్నానంచేసి మూడుసార్లు మునక వేస్తే తెలిసి తెలియక చేసే పాపాలు పోతాయని అలాగే మార్జన అంటే నీటిని చల్లుకోవడం అంటే సంప్రోక్షణ చేయడం దీని వలన ద్రవ్య శుద్ధి జరుగుతుందని పురాణాల వర్ణన.
నీరు నారాయణ స్వరూపం కనుక ఆయన స్పర్శచే పాపాలు స్నానంద్వారా పటాపంచలు అవుతాయని విశ్వసిస్తారు.
తీర్ధ స్నానం ఉత్తమం దానికంటే నదీ స్థానం ఉత్తమం దానికంటే పుష్కర సమయ నదీస్నానం ఉత్తమోత్తమం.
ఆ సమయంలో దేవతలలంతా పుష్కరునితో నదిలో ప్రవేశీస్తారని హిందువుల విశ్వాసం.
త్రికరణాలతో చేసే పాపాలు పోతాయని, పుష్కర స్నానం ఒకసారి చేస్తే పన్నెండు సంవత్సరాల కాలం పన్నెండు పుణ్య నదులలో స్నానంచేసిన పుణ్యం లభిస్తుందని, అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని ఋషి వాక్కు. మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది.
నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని నదీ జలాలలో స్నానమాచరిస్తే మాంద్యం, అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది.
ఇసుకతో కాని, మట్టితో కాని పార్థీవ శివలింగాన్ని చేసి పూజించాలంటారు.
నదీ తీరంలోని ఇసుకను నదిలోకి వేయాలంటారు. పురోహితులు భక్తుల తలపై మూడు దోసిళ్ల నీళ్లతో ఆశీస్సులు అందజేస్తారు.
పుష్కరం అనేది నదులను పూజించడానికి అంకితం చేయబడిన భారతీయ పండుగ.
ఇది భారతదేశంలోని 12 ప్రధాన పవిత్ర నదుల ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రాలలో, పూర్వీకుల ఆరాధన , ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీతం మరియు సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో జరుపుకుంటారు.
ఈ వేడుక ప్రతి నదిలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ప్రతి నది ఒక రాశితో ముడిపడి ఉంటుంది మరియు ప్రతి సంవత్సరం పండుగకు సంబంధించిన నది ఆ సమయంలో బృహస్పతి ఏ రాశిలో ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది.
నర్మదా పుష్కరం సాధారణంగా 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే నర్మదా నది పండుగ. ఈ పుష్కరాన్ని బృహస్పతి వృషభ రాశి (వృషభ రాశి)లోకి ప్రవేశించినప్పటి నుండి 12 రోజుల పాటు జరుపుకుంటారు.
ఈ సంవత్సరం నర్మదా పుష్కరలు 2024 మే 1 నుండి ప్రారంభం అయ్యి మే 12న ముగుస్తాయి.
అమర్కంటక్ ఆలయం, ఓంకారేశ్వర్ ఆలయం, చౌసత్ యోగిని ఆలయం, చౌబీస్ అవతార్ ఆలయం, మహేశ్వర్ మహేశ్వర్ ఆలయం, నెమవార్ సిద్ధేశ్వర్ మందిరం మరియు భోజ్పూర్ శివాలయం చాలా పురాతనమైనవి మరియు ప్రసిద్ధమైనవి.
పన్నెండు జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర్ ఒకటి మరియు నరమదా నదిలో పవిత్ర స్నానం చేయడానికి అమ్రార్కంటక్ ఉత్తమమైన ప్రదేశాలు.
ఓంకారేశ్వర్లో నర్మదా నది ఒడ్డున అనేక అందమైన ఘాట్లు నిర్మించబడ్డాయి.
ఈ నది ప్రవాహం నిరంతరం మరియు స్థిరంగా ఉంటుంది మరియు నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది.
ఘాట్లపై నది లోతు ఎక్కువగా ఉండదు. మరియు భక్తులు సులభంగా స్నానాలు చేయవచ్చు.
భక్తులు లోతు నీటిలోకి వెళ్లకుండా కాపాడేందుకు ఇనుప వలలు, పట్టుకునే చైన్లను ఏర్పాటు చేశారు.
వారి భద్రత కోసం సేఫ్టీ బోటు కూడా ఏర్పాటు చేశారు.
ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న కోటి తీర్థ ఘాట్ అన్ని ఘాట్లలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
ఇక్కడ స్నానం చేయడం వల్ల కోట్లాది తీర్థయాత్రల పుణ్యం లభిస్తుంది.
ఓంకారేశ్వర్లోని ఇతర ముఖ్యమైన ఘాట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
చకర్ తీర్థ ఘాట్,
గౌముఖ్ ఘాట్,
భైరోన్ ఘాట్,
కేవల్రామ్ ఘాట్,
నగర్ ఘాట్,
బ్రహ్మపురి ఘాట్,
సంగం ఘాట్,
అభయ్ ఘాట్
10000
Photo unavailable
💚💚💚💚💚💚💚💚
ఈ వారము రెండవ ప్రశ్న
(28 4 2024)
ఈమె ఎవరు?
💚💚💚💚💚💚💚💚
8500
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*సత్సాంగత్యం:*
*సజ్జన సాంగత్యం, సత్సంభాషణం, సత్కర్మాచరణం ఇవే మనలోని ధార్మిక ప్రవృత్తిని దృఢంగా తయారు చేస్తాయి.*
*మంచి స్నేహితులు ఉంటే ఎంతటి దూరమైన ప్రయాణం కూడా దగ్గరే అనిపిస్తుంది. అలాగే సజ్జన సాంగత్యం వల్ల జీవన ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది.*
*సజ్జన సాంగత్యం అనేది సుగంధ పరిమళ ద్రవ్యాల వంటిది. వీటి వద్దకు వెళితే చాలు, ముట్టుకున్నా, ముట్టుకోక పోయినా సువాసన మనకు అంటుకుంటుంది.*
*అందుకే మానవ జన్మ పొందిన మనం నిరంతరం సజ్జన సాంగత్యం కలిగి ఉండాలి.*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
8800
🙏🙏🙏🙏
*మౌడ్యమి (మూఢమి)*
*సమగ్ర పరిశీలన*
******
*శుక్ర మూఢమి :*
26-04-2024 న శుక్ర మూఢమి ప్రారంభమై
01-07-2024 న శుక్ర మూఢమి త్యాగం జరుగును.
*గురు మూఢమి :*
05-05-2024 న గురు మూఢమి ప్రారంభమై
03-06-2024 న గురు మూఢమి త్యాగం జరుగును.
ప్రతి గ్రహాం రవికి 12 డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు గ్రహాలు అస్తంగత్వం చెందుతాయి. ఆ గ్రహాం తన కారకత్వాలను కోల్పోవుతుంది. ఆ గ్రహాం కోల్పోయిన బలాన్ని రవి స్వీకరిస్తాడు.
ఆ గ్రహాం యొక్క కారకత్వాలను రవి తన మహాదశలలో ఇస్తాడు.
ఏగ్రహాం అయితే అస్తంగత్వం చెందుతుందో ఆగ్రహాం ఏకారకత్వాలను తెలియజేస్తాయో ఆ కార్యక్రమాలను చేయకూడదు.
*కుజుడు:-*
కుజుడు అస్తంగత్వం చెందినప్పుడు ఆపరేషన్స్, యుద్ధాలు, రక్షణ సంభంధ నిర్ణయాల, పోలీస్ ఉద్యోగంలో చేరుట ఇంకాకుజ గ్రహానికి సంబందించిన మొదలగు పనులు చేయకూడదు.
*బుధ,శుక్ర మూడమిలలో*
అన్నప్రాశన తరువాత కార్యక్రమాలు చేయరాదు. అన్నప్రాశన ముందు కార్యక్రమాలు చేసుకోవచ్చును.
*గురువు:-*
గురువు మూడమిలలో సుఖానికి, దనానికి,సంబందం లేని పనులు చేసుకోవచ్చు, గురువు అస్తంగత్వం చెందినప్పుడు ఉపనయనం చేయటం మంచిది కాదు.
*శని:-*
శని అస్తంగత్వం చెందినప్పుడు ఉపాసన, దీక్ష, తపస్సు, మెడిటేషన్ వంటి పనులు చేయరాదు.
మూడమి అన్ని గ్రహాలకు ఉన్న *గురు, శుక్ర మౌడ్యమి మాత్రమే* మానవులపై ప్రభావం చూపుతుంది.
ఈ మూడమిలో జప, హోమాది శాంతులు గ్రహా శాంతికి అభిషేకాలు గండనక్షత్ర శాంతులు అన్ని వ్రతాలు చేయవచ్చును.
*శుక్ర మూఢమి*
బుధుడు, శుక్రుడు భూకక్ష్యకు లోపల ఉండి సూర్యుని చుట్టూ తిరుగుతూ బుధ శుక్రులు భూమి కంటే వేగంగా తిరుగుతూ సూర్యుని యొక్క అవతలి వైపుకి వెళ్ళినప్పుడు భూమి పైన ఉన్న మనకు బుధ, శుక్రులు కనిపించరు. అట్టి సమయాన్నే బుధ అస్తంగత్వం, శుక్ర అస్తంగత్వం అంటారు. శుక్రుడు అస్తంగత్వం అయినప్పుడు శుక్ర మౌడ్యమి అంటారు.
శుక్రుడు సూర్యునికి అవతలి వైపునకు వెళ్ళినప్పుడు *“ప్రాక్ అస్తంగత్వం”* అని,
శుక్రుడు సూర్యునికి భూమికి మద్య అస్తంగత్వం అయినప్పుడు *"పశ్చాద అస్తంగత్వం"* అంటారు.
మౌడ్య కాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు. అందువల్ల మౌడ్య కాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి.
గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి.
*శుభ గ్రహమైన శుక్రునకు మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిథ్థము.*
మౌఢ్యమిని మూఢమిగా వాడుక భాషలో పిలుస్తారు.
ఈ మూఢమి సమయంలో నూతన కార్యక్రమములు చేయకూడదు.
మూఢమి అంటే చీకటి.
శుక్రుడు సూర్య గ్రహమునకు ముందూ, వెనుక 10 డిగ్రీల దూరము లోపు శుక్రుడున్నట్లయితే అస్తంగత్వమునకు గురి అవును. అనగా శుక్రుడు తన తేజస్సును, ప్రభావాన్ని, శుభత్వాన్ని కోల్పోవును. అందువల్ల ఆ కాలములో చేసే శుభకార్యాలకు శుభ గ్రహమైన శుక్ర బలం ఉండదు కాబట్టి శుభ కార్యాలు చేయరాదు. కాబట్టి నిషేథ కాలముగా పరిగణించారు.
అలాగే ముఖ్యముగా పెళ్ళిచూపులు, వివాహ, చేయరాదు, వాహన కొనుగోలు చేయరాదు.
*శుక్ర మౌఢ్యమి* ఏర్పడినప్పుడు సమస్త జీవకోటి శృంగార సంబంథమైన విషయాల్లో బలహీనత ఏర్పడుతుంది. వీర్యకణాలలో జీవత్వం, పటుత్వం ఉండదు.
శుక్రమౌఢ్యమి కాలంలో ప్రసవం జరిగినప్పుడు శుక్ర గ్రహ, రవిగ్రహ శాంతి చేయాలి.
శుక్రదశ మహా దశ మరియు శుక్రుని అంతర్దశ నడుస్తున్న వాళ్ళు చాలా జాగరూకులై ఉండాలి.
శుక్ర మౌఢ్యమి కాలములో ప్రకృతి సంపద క్షీణిస్తుంది. సముద్రం ఆటు, పోటులలో మార్పులు వస్తాయి.
శుక్ర గ్రహ పాలిత ద్వీపాలకు, ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి.
స్త్రీల మీద అత్యథికంగా అత్యాచారాలు జరిగే అవకాశాలుంటాయి. శుక్రుడు సంసార జీవితానికి –శృంగార జీవితానికి కారకుడు.
జాతకములో శుక్రుడు బలహీనముగా ఉంటే సంసార జీవితం సజావుగా సాగదు..
ఇలాంటి వారు ఇంద్రాణీ దేవి స్తోత్రం పారాయణం చేయండి.
🙏🙏🙏🙏
9100
*🌹🌹 గురువెంత గొప్పవాడో తెలుసా 🌹🌹*
*బ్రహ్మ స్థానే కృతం పాపం*
*విష్ణు స్థానే విన శృతి*
*విష్ణు స్థానే కృతం పాపం*
*శివ స్థానే విన శృతి*
*శివ స్థానే కృతం పాపం*
*గురు స్థానే విన శృతి*
*గురుస్థానే కృతం పాపం*
*నాస్తి స్థానే విన శృతి*
*బ్రహ్మ వద్ద చేసిన తప్పులు విష్ణువు వద్ద చెప్పిదిద్దు కొనవచ్చు*
*విష్ణువు వద్ద చేసుకున్న తప్పులు శివుని వద్దచెప్పి దిద్దు కొనవచ్చు*
*శివుని వద్ద చేసిన తప్పులు గురువు వద్ద చెప్పిదిద్దు కొనవచ్చు*
*గురువు వద్ద చేసిన తప్పులు వేరే ఎవరి వద్ద చెప్పిదిద్దు కొనలేము*
*అంతటి గొప్ప వ్యక్తి గురువు అని మన వేదాలలో చెప్పబడింది కనుక గురువును గౌరవిద్దాం*
*గురువు గారు చెప్పిన మాటను పాటిద్దాం*
*🌹🌹🌹🌹🌹🌹
8100