en
Feedback
ⓂⒾⓈ Ⓘⓝⓕⓞ

ⓂⒾⓈ Ⓘⓝⓕⓞ

Open in Telegram

Telegram channel for Information related to 🔅Student Info 🔅Aadhar 🔅CCE 🔅LEP 3Rs 🔅MDM 🔅Cash Book online 🔅TS School app 🔅 School Education GO's 💠Other formats, Proceedings, YouTube tutorials related to School Education Department Telangana💠

Show more
973
Subscribers
No data24 hours
No data7 days
+430 days

Data loading in progress...

Tags Cloud
No data
Any problems? Please refresh the page or contact our support manager.
Incoming and Outgoing Mentions
---
---
---
---
---
---
Attracting Subscribers
September '24
September '24
+1
in 0 channels
August '24
+5
in 0 channels
Get PRO
July '24
+1
in 0 channels
Get PRO
June '24
+1
in 0 channels
Get PRO
May '240
in 0 channels
Get PRO
April '240
in 0 channels
Get PRO
March '240
in 0 channels
Get PRO
February '240
in 0 channels
Get PRO
January '240
in 0 channels
Get PRO
December '23
+3
in 0 channels
Get PRO
November '230
in 0 channels
Get PRO
October '23
+1
in 0 channels
Get PRO
September '230
in 0 channels
Get PRO
August '23
+3
in 0 channels
Get PRO
July '230
in 0 channels
Get PRO
June '23
+3
in 0 channels
Get PRO
May '23
+3
in 0 channels
Get PRO
April '230
in 0 channels
Get PRO
March '230
in 0 channels
Get PRO
February '23
+1
in 0 channels
Get PRO
January '23
+1
in 0 channels
Get PRO
December '22
+1
in 0 channels
Get PRO
November '22
+2
in 0 channels
Get PRO
October '22
+2
in 0 channels
Get PRO
September '22
+3
in 0 channels
Get PRO
August '22
+1
in 0 channels
Get PRO
July '22
+2
in 0 channels
Get PRO
June '22
+1
in 0 channels
Get PRO
May '22
+1 466
in 0 channels
Date
Subscriber Growth
Mentions
Channels
25 September0
24 September0
23 September0
22 September0
21 September0
20 September0
19 September0
18 September0
17 September0
16 September0
15 September0
14 September0
13 September0
12 September0
11 September0
10 September0
09 September0
08 September0
07 September0
06 September0
05 September0
04 September0
03 September0
02 September0
01 September+1
Channel Posts
TSWREIS Common Entrance Test for 5th Class Admission https://schooledu.co.in/admissions/tswreis-common-entrance-test-5th/

2
హే 👋 యూని పేచెక్ గురించి మీకు చెప్పడానికి వస్తున్నాను. ఇది చాలా విషయాలకు సహాయకరంగా ఉంది. Paychekతో, మీరు ఇప్పుడు మీ జీతం రోజుకి ముందు మీ జీతం పొందవచ్చు. దీని అర్థం, బిల్లులు మరియు ఖర్చులు నిర్వహించడం చాలా సులభం. దీనిని ఒకసారి ప్రయత్నించండి. మీరు కూడా ఇది ఉపయోగకరంగా ఉండవచ్చు. అలాగే మీరు సైన్ అప్ చేసిన వెంటనే ✨ ₹500 క్యాష్‌బ్యాక్ పొందండి. ఇక్కడ క్లిక్ చేయండి https://uni-app.onelink.me/yuBA/roxixdyn * ఆఫర్ డిసెంబర్ 31 వరకు చెల్లుబాటు అవుతుంది
314
3
🔖ఇతర పాఠశాల నుండి ట్రాన్స్ఫర్స్ లో వచ్చిన ఉపాధ్యాయులను ఇంపోర్ట్ చేసుకోవడం ఎలా? 🔖ట్రాన్స్ఫర్లు వెళ్లిన ఉపాధ్యాయులను డ్రాప్ బాక్స్ లు వేయడం ఎలా? 🔖రిజైన్ చేసిన ఉపాధ్యాయులను తొలగించడం ఎలా? 👇🏻 https://youtu.be/KhUAT_s38zE https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
374
4
*⭕ప్రధానోపాధ్యాయులకు ఉపయోగపడే UDISE plus వీడియోలు* 📌UDISE plus DCF 2023-24 ఆన్లైన్లో ఏ విధంగా ఎంట్రీ చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. https://youtu.be/SeJOENtSOAk 📌DCF 2022-23 ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. https://youtu.be/MPaSSO40jZI?si=k5qNhXe2RW7e8uwr 📌UDISE Plus లో విద్యార్థుల వివరాలు ఏవిధంగా అప్డేట్ చేయాలో తెలుసుకోండి https://youtu.be/ZQUKoKulc_w?si=JOcn2FD8fPdJB73s https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
307
5
📌టీచర్ DCF లేదా DCR ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి? 📌టీచర్ ప్రొఫైల్ పూర్తిచేసిన ఇన్ కంప్లీట్ చూపిస్తుందా? https://youtu.be/sk1LaGFLbns
234
6
https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
253
7
*🔊ఉపాధ్యాయ ఖాళీలపై ప్రభుత్వం ఆరా* *🔶సీఎస్‌కు విద్యాశాఖ నివేదిక* *🔷ఆగిపోయిన డీఎస్సీపై వాకబు* *🔶కొత్త పోస్టులతో రీ షెడ్యూల్‌?* *🔷18 వేల టీచర్‌ పోస్టులు ఖాళీ* *🔶లెక్క చెప్పిన పాఠశాల విద్య డైరెక్టరేట్‌* *🔷సీఎం సమీక్ష చేసే అవకాశం* *🍥సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో టీచర్‌ పోస్టుల ఖాళీపై కొత్త ప్రభుత్వం ఆరా తీసింది. నిలిచిపోయిన నియామకాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై వాకబు చేసింది. విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాల విద్య డైరెక్టర్‌ సమగ్ర వివరాలతో రూపొందించిన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించారు. దీంతో పాటే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను వివరించారు.* *🌀కోర్టు వివాదంలో ఉన్న అంశాలు, ఎన్నికల కోడ్‌ వల్ల నిలిచిపోయిన డీఎస్సీ పరీక్షను నివేదికలో పేర్కొన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. విద్యాశాఖపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష చేసే అవకాశం ఉంది. దీంతో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు పాఠశాల విద్య డైరెక్టరేట్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.* *💥డీఎస్సీ రీ షెడ్యూల్‌?* *💠ఎన్నికల ముందు 5,089 టీచర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు. రోస్టర్‌ విధానాన్ని స్పష్టం చేశారు. ఈలోగా ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. దీంతో నియామక ప్రక్రియ వాయిదా పడింది. ఆగిపోయిన డీఎస్సీని ముందుకు తీసుకెళ్ళడమా? కొత్త షెడ్యూల్‌ ఇవ్వడమా? అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.* *✳️రోస్టర్‌ విధానం వెల్లడించిన తర్వాత కొన్ని జిల్లాల్లో సాధారణ కేటగిరీల్లో పోస్టులు లేకుండా పోయాయి. స్థానికేతరులకూ కేవలం 15 శాతమే అర్హత ఉండటంతో డీఎస్సీపై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అప్పట్లోనే కొన్ని పో స్టులు కలపాలన్న ఆలోచన గత ప్రభుత్వం చేసింది. కానీ ఇది కార్యాచరణకు నోచుకోలేదు. ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్‌ ఇచ్చే వీలుందని అధికార వర్గాలు అంటున్నాయి.* *💥20 వేలకుపైగానే ఖాళీలు* *🥏విద్యాశాఖలో 20,740 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు లెక్కగట్టారు. 2022లో ప్రభుత్వం 13 వేల ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు 2023లో 5,089 పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహణకు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రస్తుతం విద్యాశాఖ ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలున్నాయనే అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించిన నివేదికలో పేర్కొంది. పదోన్నతులు కల్పించడం ద్వారా హెచ్‌ఎం పోస్టులను భర్తీ చేస్తారు.* *💫స్కూల్‌ అసిస్టెంట్ల పోస్టులు కూడా ఎస్‌జీటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా 70 శాతం భర్తీ చేయాల్సి ఉంటుందని, మిగిలిన 30 శాతం ప్రత్యక్ష నియామకం చేపట్టడం ద్వారా భర్తీ చేయాలనే విషయాన్ని సూచించింది. జిల్లా విద్యాశాఖ అధికారులు కేవలం ఐదు జిల్లాలకే ఉన్నారని, మండల విద్యాశాఖ అధికారుల పోస్టులు 467 ఖాళీగా ఉన్నాయని తెలిపింది. వీటిల్లో ఎన్ని భర్తీ చేస్తారనేది కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. ఉన్నత స్థాయి సమీక్ష తర్వాతే ఓ స్పష్టత వచ్చే వీలుందని అధికారులు తెలిపారు.*
242
8
*🔊తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత!* *🍥సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతకు తెలంగాణ పోలీస్ శాఖ గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2009 నుంచి 2014 జూన్ రెండో తేదీ వరకు తెలంగాణ ఉద్యమకారుల మీద ఉన్న కేసుల వివరాలు సమర్పించాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమీషనర్లను తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఆదేశాలు జారీ చేశారు* *🛟2009 మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి 2014 జూన్ రెండవ తేదీ వరకు నమోదైన అన్ని కేసుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే తెలంగాణ ఉద్యమకారుల కేసులను ఎత్తివేయనుంది*
178
9
🔊🌳 *విద్యా వనరుల కేంద్రాలకు అందని నిధులు* ♦️విద్యా వనరుల కేంద్రాలకు అందని నిధులు ♦️ఉమ్మడి జిల్లాలో 55 ఎమ్మార్సీలు, 207 సీఆర్సీలు 💥🗞️ఈనాడు డిజిటల్ గద్వాల్ 🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲 📚ప్రతి రోజూ రిపోర్టుల తయారీ, రిజిష్టర్ల నిర్వహణ, అంతర్జాల వినియోగం ఇలా అన్ని రకాలుగా మండల విద్యావనరుల కేంద్రం(ఎమ్మార్సీ), క్లస్టర్‌ పాఠశాల సముదాయం(సీఆర్సీ) పనులు జరుగుతున్నాయి. పాఠశాలల పర్యవేక్షణ చేపడుతూ.. విద్యా వ్యవస్థను గాడిన పెట్టడంలో వీటి పాత్ర కీలకం. అయినప్పటికీ విద్యాశాఖ అవసరమైన నిధుల కేటాయింపులు చేయకపోవడంతో, ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడిచాయి. అయినా ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవడంతో వాటి నిర్వహణ నామమాత్రంగా మారింది. 🔷 *ఎమ్మార్సీల పరిస్థితి ఇది* : 📚ఆయా మండలాల పరిధిలో పాఠశాలల నిర్వహణ ఎమ్మార్సీల ద్వారా చేపట్టాల్సి ఉంటుంది. ఇలా అయిదు జిల్లాల పరిధిలో పాత మండలాల ప్రకారం.. 55 ఎమ్మార్సీలు, కొత్త మండలాల్లో మరో 18 ఎమ్మార్సీలున్నాయి. కొత్త మండలాల్లో ఇంకా ఎంఈవో, సిబ్బంది నియామకాలు చేపట్టలేదు. పాత మండలాల వారే ఇన్‌ఛార్జులుగా వ్యవహరిస్తున్నారు. దీంతో కొన్ని ఏళ్లుగా పాత మండలాల వారీగానే నిధులు కేటాయిస్తున్నారు. ఈ లెక్కన ఏటా ఒక్కో ఎమ్మార్సీకి రూ.90 వేల చొప్పున అయిదు జిల్లాల పరిధిలో మొత్తం 55 కేంద్రాలకు ఈ విద్యా సంవత్సరం రూ.49.50 లక్షలు అందాల్సి ఉంది. పాఠశాలల నిర్వహణకు ఇప్పటికే నిధులు రాగా, ఎమ్మార్సీలకు మాత్రం ఒక్క విడత కూడా నిధులు కేటాయించకపోవడంతో కార్యాలయాల్లో చిన్నపాటి మరమ్మతులు, విద్యుత్తు బిల్లులు, సమావేశాల నిర్వహణ ఖర్చు, అంతర్జాల వినియోగం, స్టేషనరీ, పత్రికల ఖర్చు కోసం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 🔷 *సీఆర్సీల పరిస్థితి* : 📚పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం సీఆర్సీలను ఏర్పాటు చేసింది. వీటి పర్యవేక్షణ చేసేందుకు గెజిటెడ్‌ హెచ్‌ఎంకు ప్రత్యేకమైన అధికారాలిచ్చింది. ఇప్పటికే పాఠశాలల సముదాయ సమావేశాలు చేపట్టారు. అయినా నిధులు విడుదల కాకపోవడంతో రికార్డుల నిర్వహణ, సమావేశాల ఖర్చులకు జీహెచ్‌ఎంలు ఇబ్బందిపడుతున్నారు. ఫలితంగా పాఠశాలల పర్యవేక్షణ అంతంతమాత్రంగా ఉందనే వాదన వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 207 సీఆర్పీలుండగా, ఏటా ఒక్కో దానికి రూ.33 వేల చొప్పున రూ.68.31 లక్షల నిధులు మంజూరు కావాల్సి ఉంది.
193
10
*🔊స్పౌజ్‌ బదిలీలు చేపట్టాలని టీచర్ల మనవి* *🔶ప్రజాదర్బార్‌లో మంత్రి సీతక్కకు వినతిపత్రం* *🍥హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్పౌజ్‌ బదిలీలు చేపట్టి తమను ఆదుకోవాలని బాధిత ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రజాభవన్‌లో జరిగిన ప్రజాదర్బార్‌లో మంత్రి సీతక్కకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం తీసుకొచ్చిన అశాస్త్రీయ జీవో 317 కారణంగా ఉద్యోగులైన భార్యాభర్తలు వివిధ జిల్లాల్లో పనిచేయాల్సి వస్తోందని, దాంతో తాము తమ కుటుంబాలకు దూరమై ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ వందలాది కిలోమీటర్లు ప్రయాణించలేక, పనిచేసే చోట ఉండలేక ఆరోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్నామని ఆవేదన వెళ్లగక్కారు. కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా తమను ఆదుకోవాలని వారు కోరారు.*
123
11
చింతలమానేపల్లి మండలంలోని 15,921 సర్వే నెంబర్లలోని 54,821 ఎకరాల విస్తీర్ణంకు గాను9 456 సర్వే నెంబర్లలో 5697 ఎకరాల విస్తీర్ణం వివాదంలో ఉంది. జైనూర్‌ మండలంలోని 7,562 సర్వే నెంబర్లలో 36,036 ఎకరాలు ఉండగా 425 సర్వే నెంబర్లలో 2,647 ఎకరాలు వివాదాల్లో ఉన్నట్టు తేలింది. తిర్యాణి మండలంలోని 14,949 సర్వే నెంబర్లకు గాను 1,28,245 విస్తీర్ణం ఉండగా ఇందులో 2,407 సర్వే నెంబర్లలోని 24,513 ఎకరాలు వివాదాల్లో ఉంది. దహెగాం మండలంలోని 24,945 సర్వే నెంబర్లలో 64,372 ఎకరాల విస్తీర్ణం ఉండగా ఇందులో 2,238 సర్వే నెంబర్లలోని 3,816 ఎకరాలు వివాదంలో ఉంది. పెంచికల్‌పేట మంలంలోని 10,794సర్వే నెంబర్లకు గాను 46,527 ఎకరాలు ఉండగా 651 సర్వే నెంబర్లలో 1315 ఎకరాలు వివాదంలో ఉంది. బెజ్జూరు మండలంలోని 15,111 సర్వే నెంబర్లలో 60,258 ఎకరాలకు గాను 540 సర్వే నెంబర్లలో 1462 ఎకరాలు వివాదాల్లో ఉంది. రెబ్బెన మండలంలోని 26,790 సర్వే నెంబర్లలో 54,344 ఎకరాలు విస్తీర్ణం ఉండగా, 1540 సర్వే నెంబర్లలో 4,390 ఎకరాలు వివాదస్పదంగా ఉంది. లింగాపూర్‌ మండలంలోని 4,252 సర్వే నెంబర్లలో 23,766 ఎకరాల విస్తీర్ణం ఉండగా 129 సర్వే నెంబర్లలో 424 ఎకరాలు వివాదంలో నలుగుతోంది. వాంకిడి మండలంలోని 18,004 సర్వే నెంబర్లలో 57,919 ఎకరాలకు గాను 503 సర్వే నెంబర్లలో 1347 ఎకరాలు వివాదాల్లో ఉంది. సిర్పూరు(యు) మండలంలోని 6,063 సర్వే నెంబర్లకు గాను 26,075 ఎకరాల విస్తీర్ణం ఉండగా 56 సర్వే నెంబర్లలో 199 ఎకరాలు వివాదాల్లో ఉన్నట్టు తేల్చారు. సిర్పూరు(టి) మండలంలోని 15,729 సర్వే నెంబర్లకు గాను 64,355 ఎకరాలు ఉండగా ఇందులో 71 సర్వే నెంబర్లలో 402 ఎకరాలు వివాదాల్లో ఉన్నట్టు గుర్తించారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 12,900 సర్వే నెంబర్లలో 72,187 ఎకరాలు వివాదాల్లో ఉండగా రెవెన్యూ రికార్డుల నిర్వహణను ప్రశ్నార్థకంగా మారుస్తోంది*
113
12
*🔊Kumaram Bheem Asifabad: 'ధరణి'కి ఇక మంగళం* *♦️- భూమాత పేరుతో కొత్తగా తెరపైకి మరో పోర్టల్‌* *🔶- ధరణి లోపాలకు చెక్‌ పెట్టేందుకే* *🔹- వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించే అవకాశం ఉందంటున్న అధికారులు* *🍥(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)*గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ధరణి పోర్టల్‌కు త్వరలో మంగళం పాడేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం ఉందంటున్నారు. 2017లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సమగ్ర భూ సర్వే పేరుతో ప్రారంభించిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భారీగా అవకతవకలు, తప్పులు చోటుచేసుకున్నాయి. కబ్జాలో లేని వారిపేర్లను పట్టేదారుల కాలంలో నమోదు చేయడం, కబ్జా కాలమ్‌ పూర్తిగా తొలగించడం వంటి చర్యలతో సాదా బైనామాలపై భూములను కొని కబ్జాలో ఉన్న రైతులు, భూ యజమానులను అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో పలుచోట్ల భూ సంబంధిత వివాదాలు పెరిగి శాంతిభద్రతల సమస్యగా కూడా పరిణమించింది. అంతేకాకుండా ఎన్నో ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూములను పట్టా మార్పిడి చేసుకోనందున భూప్రక్షాళనలో సంబంధిత పాత పట్టేదారుల పేర్లే మళ్లీ రికార్డులకు ఎక్కడంతో సరైన ఆధారాలు లేక రైతులు భూములను కోల్పోవాల్సిన దుస్థితి ఉత్పన్నమైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలాచోట్ల రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. పలుచోట్ల ఆత్మ హత్యలు, ఆత్మహత్యాయత్నాల వంటి ఘటనలు జరిగాయి. ధరణి పోర్టల్‌ ప్రారంభించిన తర్వాత భూ సంబంధిత అక్రమాలు వెల్లువలా బయటపడుతుండటంతో ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలనే డిమాండ్‌ పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ధరణి పోర్టల్‌ రద్దుచేసి దాని స్థానంలో మరింత మెరుగైన రెవెన్యూ విధానాన్ని అమలులోకి తెస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రాబోయే నెల, నెల 15రోజుల కాలంలో భూమాత పేరుతో సరికొత్త పోర్టల్‌ను ఆవిష్కరించేందుకు సన్నహాలు ప్రారంభిస్తున్నట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి భూమాత పోర్టల్‌కు సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం అందకపోయినా ఆ పోర్టల్‌ విధివిధానాలు ఎలా ఉండబోతున్నాయి అన్నదానిపై రెవెన్యూ వర్గాలకు ప్రాథమికంగా కొంత సమాచారం ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ధరణి పోర్టల్‌ను పూర్తిస్థాయిలో సంస్కరించి లోపాలను సవరించడం ద్వారా రికార్డుల మార్పిడికి అవసరమైన అన్ని ఆప్షన్లను కొత్తపోర్టల్‌లో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని అంటున్నారు* *⛺మళ్లీ వీఆర్వోల వ్యవస్థ?* *💥రెవెన్యూలో అత్యంత కీలకమైన విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధరణి పోర్టల్‌ ప్రారంభం తర్వాత గత రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారులు, రెవెన్యూ సహాయకులను తొలగించి వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. అయితే రెవెన్యూ సిస్టంలో గ్రామస్థాయి భూ రికార్డుల నిర్వహణ అత్యంత కీలకం. కానీ గత ప్రభుత్వం గ్రామస్థాయిలో భూముల రికార్డుల మార్పిడి, అవినీతి, అక్రమాలు, అవకతవకల వంటి సాకులు చూపుతూ రద్దు చేయడంతో రెవెన్యూ వర్గాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. భూముల సమగ్ర సర్వే పేరిట చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన పూర్తిగా తూ తూ మంత్రంగా మొక్కుబడిగా పూర్తి చేయడంతో అవే రికార్డుల ఆధారంగా ధరణి పోర్టల్‌లో రైతులు, భూ యజమానుల వివరాలను నమోదు చేశారు. అయితే అప్పట్లో హడావుడిగా చేసిన రికార్డుల నమోదు కారణంగా ధరణి పోర్టల్‌ ప్రారంభించిన తర్వాత సరిచేసే వ్యవస్థ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను తిరిగి పునరుద్ధరిస్తే తప్ప గ్రామస్థాయిలో వాస్తవిక భూ స్థితిగతులు సరి చేయడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు* *♦️మండలాల వారీగా ఇదీ వివాదాల తీరు..* *🌼జిల్లాలోని 15మండలాల్లో రెవెన్యూ వివాదాలకు చిక్కుకున్న ఆసక్తికరమైన గణాంకాలు కన్పిస్తున్నాయి. ఇందులో చాలా మట్టుకు పట్టాల బదిలీ సరిహద్దులకు సంబంధించి ఉన్నప్పటికీ దశాబ్ధాలుగా కబ్జాలో ఉన్న రైతులకు సంబంధించిన వివాదాలే అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో ఆసిఫాబాద్‌ మండలానికి సంబంధించి మొత్తం 23,729 సర్వే నెంబర్లలో 74,691 ఎకరాల విస్తీర్ణం ఉండగా ఇందులో 1,186 సర్వే నెంబర్లలోని 4,314 ఎకరాల భూమి వివాదంలో ఉంది. అలాగే కాగజ్‌నగర్‌ మండలంలోని 29,120 సర్వే నెంబర్లలో 76,422 ఎకరాల విస్తీర్ణం ఉండగా 282 సర్వే నెంబర్లలో 5961 ఎకరాలు విస్తీర్ణం వివాదంలో ఉంది. కౌటాల మండలంలోని 16,026 సర్వే నెంబర్లలో 37,916 ఎకరాల విస్తీర్ణం గాను 1936 సర్వే నెంబర్లలో 5,309 ఎకరాల విస్తీర్ణం వివాదంలో ఉంది. కెరమెరి మండలంలోని 8,270 సర్వే నెంబర్లలో 50,510 ఎకరాలుఉండగా ఇందులో 480 సర్వే నెంబర్లలోని 10,400 ఎకరాలు వివాదంలో ఉంది.
144
13
*▶️సింగరేణి గనుల నుంచి బొగ్గును కొంటున్నా ఆ సంస్థకు ఎప్పటికప్పుడు సొమ్ము చెల్లించడం లేదు. రాష్ట్ర జెన్‌కో కొన్న బొగ్గుకు సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు రూ.6,800 కోట్లకు చేరాయి.*
135
14
*🔊💰విద్యుత్‌ సంస్థల అప్పులు రూ.81,516 కోట్లు* *🔶రెండు డిస్కంల నష్టాలు రూ.50,275 కోట్లు* *🔷సీఎంకు ప్రజంటేషన్‌ ఇచ్చిన విద్యుత్‌శాఖ* *🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 4 విద్యుత్‌ సంస్థల అప్పులు, నష్టాలపై ఆ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి జరిపిన అంతర్గత సమీక్షలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం... రాష్ట్రంలోని రెండు విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు, విద్యుత్‌ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో), విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో)తో కలిపి మొత్తం 4 సంస్థలకున్న అప్పులు తెలంగాణ ఏర్పడిన 2014-15 నాటికి రూ.22,423 కోట్లుంటే ఇప్పుడు రూ.81,516 కోట్లకు చేరాయి. వీటిలో విద్యుత్‌ కొనుగోలు చేసినందుకు బిల్లుల చెల్లింపుల కోసం డిస్కంలు తీసుకున్న స్వల్పకాలిక రుణాలే రూ.30,406 కోట్లున్నాయి. ఈ స్వల్పకాలిక రుణాల వల్ల నెలకు వడ్డీల రూపేణా రూ.1000 కోట్ల అదనపు భారం పడుతోంది. ప్రస్తుత డిసెంబరు నుంచి వచ్చే 2024 మే నెలాఖరుకు రాబోయే ఆరు నెలల్లో కరెంటు బిల్లులు వసూలు, ప్రభుత్వం నెలనెలా ఇచ్చే రాయితీతో కలిపి మొత్తం ఆదాయం రూ.22,781 కోట్లు ఉంటుంది. కానీ ఇదే ఆరు నెలల్లో ఖర్చులు రూ.33,839 కోట్ల వరకు ఉంటాయని డిస్కంల అంచనా. ఆదాయ, వ్యయాల మధ్య లోటు రూ.11,058 కోట్లు ఉంటుందని తేలింది. ఇప్పటికే రెండు డిస్కంల నష్టాలు రూ.50,275 కోట్లకు చేరాయి.* *💥వ్యవసాయ విద్యుత్‌ వినియోగం లెక్కలే లేవు* *🌀వ్యవసాయానికి పూర్తి ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్నా.. వాస్తవంగా ఎన్ని యూనిట్లు వాడుతున్నారనే లెక్కలేమీ లేవని విద్యుత్‌ సంస్థలు ప్రభుత్వానికి తెలిపాయి. రాష్ట్రంలో మొత్తం 27.99 లక్షల వ్యవసాయ బోర్లకు కరెంటు కనెక్షన్లున్నాయి. రాష్ట్రం మొత్తం వినియోగంలో 40 శాతం వ్యవసాయానికి ఉండవచ్చనే అంచనా వేసి ప్రభుత్వం రాయితీ సొమ్ము ఇస్తోంది. రాష్ట్రంలో మొత్తం 1.82 కోట్ల కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. తలసరి వార్షిక వినియోగం 2,349 యూనిట్లు.* *💥నిరంతర సరఫరా చేయాలి* *💠అన్ని వర్గాల వారికి నిరంతరం (24 గంటలూ) కరెంటు సరఫరా చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి డిస్కంలను ఆదేశించారు. ఎక్కడా రాజీ పడవద్దని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీ హామీల అమల్లో భాగంగా ప్రతి ఇంటికీ నెలకు 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా సరఫరా చేయాల్సి ఉందని, దీనికి ఎంత వ్యయమవుతుందో శాస్త్రీయంగా అంచనాలు తయారు చేయాలని ఆయన ఆదేశించారు. అందరికీ 200 యూనిట్లు ఇస్తే ఏడాదికి దాదాపు రూ.4 వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇటీవల రాజీనామా చేసిన ఉత్తర డిస్కం సీఎండీ గోపాలరావు, దక్షిణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల రాజీనామా చేసిన ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ఈ సమీక్ష సమావేశానికి హాజరు కాలేదు. దీనిపై ప్రభాకరరావును ‘ఈనాడు’ ఫోన్‌లో సంప్రదించగా.. ప్రభుత్వం తనను రమ్మని పిలవలేదని.. పిలిస్తే సమావేశానికి వెళ్లేవాడినని ఆయన తెలిపారు.* *💥ఎందుకీ అప్పులు, నష్టాలు...* *▶️ప్రధానంగా నిరంతర (24 గంటలూ) సరఫరాకు అవసరమైనంత విద్యుత్‌ రాష్ట్రానికి సొంతంగా లేదు. బయటి నుంచి ఎక్కువగా కొనాల్సి వస్తోంది. ఉదాహరణకు భారత ఇంధన ఎక్స్ఛేంజి (ఐఈఎక్స్‌)లో అధిక ధరలకు ఏ రోజుకారోజు కొనడం కోసం డిస్కంలు నెలకు రూ.500 కోట్లు వెచ్చిస్తున్నాయి. వీటికితోడు గత తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా ఉత్పత్తి ప్రారంభించిన కొత్తగూడెం 7వ దశ, భద్రాద్రి, ఎన్టీపీసీ ప్లాంటు నుంచి కరెంటు కొనడానికి అధికంగా వెచ్చించాల్సి వస్తోంది.* *▶️అన్నివర్గాల వారు వాడే కరెంటుకు నెలనెలా చెల్లించే బిల్లుల రూపంలో రూ.2,800 కోట్ల ఆదాయం మాత్రమే డిస్కంలకు వస్తోంది. వ్యవసాయానికి, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తి ఉచితంగా, మరికొన్ని వర్గాలకు తక్కువ ధరలకు ప్రభుత్వం కరెంటును సరఫరా చేస్తోంది. ఈ రాయితీల కోసం రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు ప్రతి నెలా మొదటివారంలో రూ.958 కోట్లు విడుదల చేస్తోంది. ఈ రెండూ కలిపితే మొత్తం నెలవారీ ఆదాయం రూ.3,758 కోట్లు అని తేలింది.* *▶️కరెంటు కొన్నందుకు డిస్కంలు నెలనెలా విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.3,305 కోట్లు చెల్లించాలి. ఇవి కాకుండా గతంలో తీసుకున్న అప్పులు, వడ్డీల వాయిదాలకు నెలకు రూ.1,457 కోట్లు కట్టాలి. ఈ రెండూ కలిపితే ఖర్చులు రూ.4762 కోట్లు అవుతోంది. ఇవికాకుండా అప్పుడప్పుడు అనూహ్యంగా కరెంటు డిమాండు పెరిగితే అదనపు వ్యయం తప్పదు.* *▶️థర్మల్‌ కేంద్రాలకు అవసరమైన బొగ్గును రోజూ దాదాపు 50 వేల టన్నుల వరకు కొంటున్నారు. టన్నుకు సగటున రూ.4,750 చొప్పున ధర చెల్లించి కొంటుండగా.. దాన్ని బొగ్గు గనుల నుంచి థర్మల్‌ కేంద్రంవద్దకు చేర్చడానికి టన్నుకు రూ.240 చొప్పున అదనంగా రవాణా వ్యయం భారం పడుతోంది.*
175
15
*🔊మార్చి 1 నుంచి ఇంటర్‌ పరీక్షలు!* *🔶ప్రతిపాదనలు సిద్ధం చేసిన బోర్డు* *🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్‌మీడియట్‌ పరీక్షలను మార్చి 1 నుంచి ప్రారంభించేందుకు ఇంటర్‌ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమోదం తీసుకొని ఈ వారం రోజుల్లో టైంటేబుల్‌ను ప్రకటించనుంది. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఎగ్జామ్స్‌కు, జవాబుపత్రాల మూల్యాంకనానికి ఇబ్బంది లేకుండా ఈసారి కొంత ముందుగా పరీక్షలను ప్రారంభించాలని భావిస్తున్నారు. గత విద్యా సంవత్సరం మార్చి 15 నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్‌ 1-15 మధ్య జేఈఈ మెయిన్‌ చివరి విడత ఎగ్జామ్స్‌ ఉన్నాయి కాబట్టి ఇంటర్‌ పరీక్షలు ముగిసిన తర్వాత కనీస గడువు ఉంటే విద్యార్థులు సన్నద్ధమవడానికి వీలవుతుంది. దానికితోడు ఇంటర్‌ తర్వాతే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలి. ఈసారి జూన్‌ 1వ తేదీ నుంచే ఇంటర్‌ కళాశాలలు ప్రారంభం కావడంతో కనీసం మార్చి 1వ తేదీ నుంచి పరీక్షలు మొదలుపెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్‌ ఉంటాయి.* *💥ఈసారి మార్పులివీ...* *🌀ఈసారి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నైతికత, మానవీయ విలువల ఎగ్జామ్‌ ఉండదు. అందులోని అంశాలను ఆంగ్లం సబ్జెక్టులో మిళితం చేసినట్లు ఇంటర్‌బోర్డు వర్గాలు ఇప్పటికే స్పష్టంచేశాయి. గతంలో రాయని పాత విద్యార్థులకు మాత్రం ఉంటుంది. అయితే మొదటి సంవత్సరంలో పర్యావరణ విద్య పరీక్ష మాత్రం అందరికీ ఉంటుంది.* *💠ఇంటర్‌ ఫస్టియర్‌లో ఆంగ్లం సబ్జెక్టులో 20 మార్కులకు ప్రాక్టికల్స్‌ ఉంటాయి. రాత పరీక్ష 80 మార్కులకే నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్‌ను ఆయా కళాశాలలే నిర్వహిస్తాయి. భాష అనేది మాట్లాడితేనే వస్తుందని భావించి ఈసారి మార్పులు చేశారు. జస్ట్‌ ఏ మినిట్‌ పేరిట.. ఇచ్చిన అంశంపై ఒక నిమిషం ఆంగ్లంలో మాట్లాడటం, ఒక పేరాను చదవడం, సొంతంగా ఏదైనా ఒక అంశంపై రాయడం, ఒక ఆడియో పాఠాన్ని విని ప్రశ్నలు రూపొందించడం లాంటి వాటిని ప్రాక్టికల్స్‌లో చేరుస్తున్నారు.* *💥బ్రిడ్జి కోర్సు పరీక్షకు దరఖాస్తు, ఫీజు అవసరం లేదు* *✳️ఇంటర్‌ బైపీసీ, ఒకేషనల్‌ విద్యార్థులు బీటెక్‌లో చేరేందుకు గణితం బ్రిడ్జి కోర్సును పూర్తి చేసి ఉండాలి. ఇంటర్‌ పరీక్షలప్పుడు చివరిలో బ్రిడ్జి కోర్సు ఎగ్జామ్‌ నిర్వహిస్తారు. అది రాయాలంటే ఫీజు చెల్లించాలి. చాలా మంది విద్యార్థులకు ఇది తెలియడం లేదు. దాంతో వారు పరీక్షలు రాయడానికి వీల్లేకుండా పోతోంది. అందుకే ఈసారి బ్రిడ్జి కోర్సు పరీక్షకు ప్రత్యేకంగా దరఖాస్తు, ఫీజు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందరూ బ్రిడ్జి కోర్సుకు హాజరయ్యేలా హాల్‌టికెట్లపై తేదీలను ముద్రించనున్నారు. ఆసక్తి ఉన్న ప్రతి ఇంటర్‌ బైపీసీ, ఒకేషనల్‌ గ్రూపు విద్యార్థులు హాజరు కావచ్చు.* *💥ప్రత్యేకావసరాల పిల్లలకు ఒక సబ్జెక్టు మినహాయింపు* *🥏ప్రత్యేకావసరాల పిల్లలకు ద్వితీయ భాష పరీక్ష మినహాయింపు ఉంటుంది. అది రాయకున్నా ఇబ్బంది లేదు. చాలా మందికి ఆ విషయం తెలియడం లేదు. సెకండియర్‌లో తెలుసుకొని మినహాయింపు అడిగితే ఫస్టియర్‌లో రాసినందున ఇప్పుడు మినహాయింపు కుదరదని అధికారులు తేల్చిచెబుతున్నారు. దాంతో ఈసారి ప్రథమ సంవత్సరంలో రాసినా రెండో ఏడాది మినహాయింపు ఇవ్వనున్నారు.*
220
16
*🔊మూడేళ్లుగా ఒకే జిల్లాలో ఉంటే బదిలీ* *🔶సీఎస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం* *🔷బెల్లంపల్లి ఆర్డీవో కొనసాగింపు ఉదంతంపై ఆగ్రహం* *🔶6న నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు* *🍥ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో శాసనసభ ఎన్నికల దృష్ట్యా మూడేళ్లకు పైగా ఒకే జిల్లాలో పనిచేస్తున్న వారిని గుర్తించి వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి తాజాగా లేఖ రాసింది. ‘జూన్‌ 2న స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని పాటించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలి’ అని నిర్దేశించింది. బెల్లంపల్లి ఆర్డీవో కె.సురేశ్‌ నాలుగేళ్లకు పైగా ఒకే జిల్లాలో పనిచేస్తున్నా బదిలీ చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆయనకు జూన్‌ రెండో తేదీకి ముందే మూడేళ్ల పదవీకాలం ముగిసినా ఎందుకు బదిలీ చేయలేదో వెల్లడించాలని స్పష్టం చేసింది. దీన్ని ఉదహరిస్తూ వివిధ శాఖల్లో పునఃపరిశీలన జరిపి, ఈ నెల 6లోగా నిబంధనల అమలుపై సమగ్ర నివేదిక పంపాలని ఆదేశించింది. 2024 జనవరి నాటికి సొంత జిల్లాలో గానీ, ఒకే జిల్లాలో మూడేళ్లుగా పనిచేస్తున్నా గానీ, నాలుగేళ్లలో విడతల వారీగా మూడేళ్లు పూర్తి చేసుకున్నా, పదోన్నతులతో కలిపి మూడేళ్లు పూర్తయినా వారిని బదిలీ చేయాలని ఈసీ గతంలో నిర్దేశించింది. జిల్లా ఎన్నికల అధికారులు, ఉప అధికారులు, రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, నోడల్‌ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లు, జాయింటు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, బ్లాక్‌ అభివృద్ధి అధికారు(బీడీవో)లు, వారి సమానస్థాయి అధికారులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. దీనికి అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా బదిలీలు జరిగాయి. తర్వాత పలువురు ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్లు, పోలీసు అధికారులపై ఫిర్యాదులురాగా... వారిని బదిలీ చేయాలని ఈసీ ఆదేశాచ్చింది. తాజాగా బెల్లంపల్లి ఆర్డీవో కె.సురేశ్‌పై ఫిర్యాదు రాగా దానిని తీవ్రంగా పరిగణించింది.* *💥సీఎస్‌ ఆదేశాలు* *🌀ఈసీ ఆదేశాలు వచ్చిన వెంటనే సీఎస్‌ బెల్లంపల్లి ఆర్డీవోను శుక్రవారం బదిలీ చేశారు. రాష్ట్ర హోం, పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖల ముఖ్య కార్యదర్శులకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా శాఖల్లో మూడేళ్లకు పైగా సొంత జిల్లాలో పనిచేస్తున్న వారిని గుర్తించి వెంటనే బదిలీ చేసి, శనివారం నివేదిక ఇవ్వాలని సూచించారు. దీనిని అత్యంత ప్రాధాన్యాంశంగా పరిగణించాలని తెలిపారు. రాష్ట్ర అధికారులు ఇచ్చే వివరాల ఆధారంగా కేంద్రానికి నివేదిక పంపుతామని అందులో పేర్కొన్నారు.* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
221
17
*🔊ఎన్నికలకు 1,87,370 యంత్రాలు* *🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం 1,87,370 యంత్రాలను కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. నవంబరు 30న పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో 72,931 బ్యాలెట్‌ యూనిట్లు, 57,692 కంట్రోల్‌ యూనిట్లతో పాటు 56,748 వీవీప్యాట్స్‌ను ఇవ్వనుంది. ఎన్నికల ప్రక్రియలో 1,96,312 మంది ఉద్యోగులు పని చేయనున్నారు. గతంతో పోలిస్తే సుమారు 20శాతం మేర యంత్రాలు పెరిగినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌ సంస్థ అత్యాధునిక సాంకేతికతతో తయారు చేసిన యంత్రాలనే రాష్ట్రవ్యాప్తంగా వినియోగించనున్నారని ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’ తో చెప్పారు.* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
172
18
*🔊13 శాఖల ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు* *🍥ఇప్పటి వరకు ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు, సైనికులకు మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌కు అవకాశం ఉండేది. ఈసారి నుంచి అత్యవసర సేవల్లో ఉండే ఎయిర్‌పోర్ట్‌ ఉద్యోగులు, ఎఫ్‌సీఐ, భారతీయ రైల్వే, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో, ఆలిండియా రేడియో, విద్యుత్తు, అగ్నిమాపక, వైద్యారోగ్య శాఖ, రోడ్డు రవాణా సంస్థ, సివిల్‌ సప్లయ్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు, ఎన్నికల సంఘం గుర్తించిన మీడియా ప్రతినిధులకు ఈ సౌకర్యాన్ని కల్పించారు. ఎన్నికల శిక్షణ కేంద్రాల్లో ఉద్యోగులు ఇప్పటికే పోస్టల్‌ ఓట్ల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు.* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
143
19
*🔊పాఠాలు చెబుతాం... నైపుణ్యాలు పెంచుతాం* *🔶ముందుకొస్తున్న వివిధ రంగాల నిపుణులు* *🔷దేశవ్యాప్తంగా 9వేల మందికి పైగా దరఖాస్తు* *🔶ఉన్నత విద్యా సంస్థల్లో ప్రొఫెసర్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌ విధానం అమలు* *🍥ఈనాడు, హైదరాబాద్‌: దశాబ్దాల నుంచి మాటలకే పరిమితమైన విద్యాసంస్థలు, పరిశ్రమల అనుసంధానం ఎట్టకేలకు వాస్తవ రూపం దాల్చుతోంది. యూజీసీ ప్రవేశపెట్టిన ప్రొఫెసర్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌(పీవోపీ) విధానం ద్వారా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పాఠాలు బోధించేందుకు వివిధ రంగాల్లో పనిచేస్తున్న... పదవీ విరమణ పొందిన నిపుణులు రంగంలోకి దిగనున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 232 విద్యాసంస్థల్లో పాఠాలు చెప్పేందుకు ఏకంగా 9 వేల మందికి పైగా నిపుణులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో ఓయూ, జేఎన్‌టీయూహెచ్‌, హెచ్‌సీయూ తదితర వర్సిటీలు సైతం ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించాయి. దానివల్ల ప్రస్తుతం ప్రపంచంలో ఎటువంటి నైపుణ్యాలు అవసరం, పరిశ్రమలు ఏమి కోరుకుంటున్నాయో నిపుణ ఆచార్యులు దృష్టి పెట్టి విద్యార్థులను ఆ దిశగా తీర్చిదిద్దుతారని భావిస్తున్నాయి.* *💥కనీస అనుభవం 15 సంవత్సరాలు* *🌀ఇంజినీరింగ్‌, సైన్స్‌, టెక్నాలజీ, సోషల్‌ సైన్స్‌, సీఏ, కామర్స్‌, మీడియా తదితర రంగాల్లో కనీసం 15 సంవత్సరాలు పనిచేసిన వారు పీవోపీ ద్వారా పనిచేసేందుకు అర్హులు. వారికి వారు పనిచేస్తున్న పరిశ్రమలు వేతనం ఇవ్వొచ్చు. వారి సేవలను వినియోగించుకుంటున్నందుకు ఆయా విద్యాసంస్థలూ గౌరవ వేతనం అందించొచ్చు. ఈ రెండూ కాకుండా స్వచ్ఛందంగా పనిచేయొచ్చు. ఇప్పటికే బోధనా రంగంలో ఉన్నవారు, ఆ రంగంలో పనిచేసి పదవీ విరమణ పొందిన వారు అనర్హులు.* *💥10 శాతానికి మించరాదు* *💠ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు యూజీసీ గత మే నెలలో పీవోపీ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు 9 వేల మందికి పైగా నిపుణులు దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆయా విద్యాసంస్థలకు మంజూరు పోస్టుల్లో పీవోపీ కింద బోధించేవారు 10 శాతానికి మించరాదు. ఆయా విద్యాసంస్థలు దరఖాస్తుదారులను ఆహ్వానించి ముఖాముఖీ నిర్వహించి ఎంపిక చేయాలి. గౌరవ వేతనాన్ని కూడా ఆయా సంస్థలే నిర్ణయించుకోవచ్చు. తొలుత... ఏడాది కాలానికి నియమించుకోవచ్చు. గరిష్ఠంగా నాలుగేళ్లకు మించి నియమించుకోరాదు. వారికి ప్రత్యేకంగా విద్యార్హతలు ఏమీ పొందుపరచలేదు. వారు పనిచేసే రంగంలో నైపుణ్యం ఉందా? తమ విద్యార్థులకు అది ఉపయోగపడుతుందా? అనేది అసలు కొలమానం.* *💥8 మందిని ఎంపిక చేశాం* *✳️ఓయూలో బోధించేందుకు 20 మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలుత ఇంజినీరింగ్‌ కళాశాల కోసం వారిలో ఎనిమిది మందిని ఎంపిక చేశాం. ఎండీ, సీఈఓ, జీఎం, ఏజీఎం తదితర ఉన్నత స్థాయుల్లో పనిచేస్తున్న...చేసిన వారిని ఎంపిక చేశాం. విడతల వారీగా ఇతర సబ్జెక్టుల కోసం విస్తరిస్తాం.* *🎙️ఆచార్య రవీందర్‌, ఉపకులపతి, ఓయూ* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
159
20
*యు డైస్ ప్లస్ కి సంబందించిన ముఖ్యమైన వీడియోలు వీడియోలు (UDISE PLUS)📲* *📢అన్ని ప్రధానోపాధ్యాయుల గ్రూపులలో షేర్ చేయండి* ⭕UDISE Plus లో విద్యార్థుల తరగతులను ఈ విధంగా మార్చాలి ఈ వీడియో ద్వారా తెలుసుకోండి https://youtu.be/3f5i-zqNJvs ⭕UDISE Plus లో విద్యార్థులకు ఏ విధంగా TC ఇష్యూ https://youtu.be/eCVhmhWpV8Y ⭕ SEAS అటెండెన్స్ ని ISMS Portal లో ఎంట్రీ ఏ విధంగా చేయాలి https://youtu.be/yhHD5cbaFmw ⭕ UDISE Plus లో విద్యార్థులను ఇతర పాఠశాలల ఇంపోర్ట్/పికప్ చేయడం. https://youtu.be/LmSWVFE0UsM ⭕ UDISE Plus లో విద్యార్థుల ప్రమోషన్ ఆక్టివిటీ ఏ విధంగా చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి https://youtu.be/9cc0zkMRVKE ⭕ 2023-24 ఒకటవ తరగతి విద్యార్థులను ఏ విధంగా నమోదు చేయాలి https://youtu.be/XwQMRm90n5U ⭕ ఆధార్ వ్యాలిడేషన్ ఏ విధంగా చేయాలి. https://youtu.be/SpXTf_hi-is ⭕ ఆధార్ లేని విద్యార్థులను ఏ విధంగా నమోదు చేయాలి. https://youtu.be/hsT3hFSbhtE ⭕ యు డైస్ ప్లస్ లో స్టూడెంట్ డాటా బేస్ లో ఏ విధంగా లాగిన్ అవ్వాలి. https://youtu.be/yvkDhOEor6I ⭕ యు డైస్ ప్లస్ పాస్వర్డ్ మర్చిపోతే ఏ విధంగా రీసెట్ చేసుకోవాలి. https://youtu.be/WJR0iRJEiR8
216