868
Subscribers
No data24 hours
No data7 days
No data30 days
Posts Archive
Repost from C S Maths(Arithmetics & Pure Maths)
క్రింది ఏ రిట్ ప్రభుత్వ ఉద్యోగాల నియామకం లో అవినీతి జరగకుండా నిరోదిస్తుంది?
Repost from C S Maths(Arithmetics & Pure Maths)
జాతీయ అత్యవసర పరిస్థితి 352 లో క్రింది ఏ నిబంధనలు రద్దు కాకుండా ఉంటాయి?
Repost from C S Maths(Arithmetics & Pure Maths)
42 వ రాజ్యాంగ సవరణను క్రింది ఏ కేసులో సుప్రీం కోర్ట్ లో సవాలు చేసారు?
*📚✍️టెట్ పేపర్-1కు ఎలిమెంటరీ*
*ఎడ్యుకేషన్ వారే అర్హులు✍️📚*
*♦️అర్హతలు సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు*
*🌻ఈనాడు, అమరావతి*: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) రాసేందుకు అర్హతలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుంచి 5 తరగతులకు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ)కు నిర్వహించే టెట్-1 పేపర్లు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ ఈడీ), నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎస్ఈడీ) చేసిన వారే అర్హులని పేర్కొంది. ఓసీ లకు ఇంటర్మీడియట్, తత్సమాన విద్యార్హతలో 50శాతం మార్కులు ఉండాలనే నిబంధన పెట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 5% మినహాయింపునిచ్చి.. 45% మార్కులు ఉండాలని పేర్కొంది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారు అర్హులేనంటూ జాతీయ ఉపా ధ్యాయ విద్యామండలి 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ను సుప్రీంకోర్టు రద్దు చేసినందున ఈ సవరణ ఉత్తర్వులు ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. టెట్ నిర్వహణవ్యయాన్ని అభ్యర్థుల దరఖాస్తు ఫీజుల నుంచే భరించా లని సూచించింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక 2022లో ఒకసారి టెట్ నిర్వహించింది. గతంలో ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహించాలనే నిబంధన ఉండగా.. ఒక్క సారే నిర్వహించాలని 2021లో జగన్ సర్కార్ దాన్ని సవరించింది.
*♦️రెండో పేపర్ అర్హత మార్కుల్లో మినహాయింపు*
టెట్ 'పేపర్-2ఏ'కు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులను 40 శాతానికి తగ్గించింది. ఒక్కసారికే ఈ మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గతంలో టెట్ రాసేం దుకు అర్హత మార్కులు 45శాతం కాగా.. దీన్ని 5శాతం తగ్గించింది. డిగ్రీలో 40శాతం మార్కులతో బీఈడీ చేసేందుకు అనుమతిస్తున్నారు. కానీ, టెట్ రాసేందుకు 45శాతం ఉండాలనే నిబంధన గతంలో పెట్టారు. దీనిపై అనేక ఫిర్యాదులు రావడంతో ఎప్పటికప్పుడు మినహాయింపునిస్తున్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️వారంలో డీఎస్సీ!✍️📚*
*♦️6వేలకు పైగా ఖాళీలతో ప్రకటన!!*
*🌻అమరావతి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి)*: సార్వ త్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. నాలుగు న్నరేళ్లుగా పట్టించుకోని ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై జగన్ ప్రభుత్వం దృష్టిపెట్టింది. వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. 6 నుంచి 10 వేల పోస్టులతో ఈ నోటిఫికేషన్ ఉండొచ్చని విశ్వసనీయంగా తెలి సింది. డీఎస్సీపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనా రాయణ సోమవారం విజయవాడలో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఎన్ని ఖాళీలు ఉన్నాయి?ఎక్కడెక్కడ పోస్టులు అవసరమో అధికారులు వివరించారు. ఇప్పటికే ఖాళీలపై అనేకసార్లు రకరకాల లెక్కలు వేయగా, తాజా అంచనాలతో కనీసం 6వేల మందిని భర్తీ చేయొచ్చన్న అంచనాకు వచ్చారు. ఇందులో ఎస్జీటీ పోస్టులే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటుచేసిన ప్రీస్కూళ్లకు కూడా టీచర్లను కేటాయించే వీలుంది. పాఠశాల విద్యాశాఖలో 18,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే 8,366 మంది మాత్రమే అవసరమని పేర్కొంది. ఖాళీ ఉన్నప్పటికీ 10 వేల పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కాగా.. ఎన్నికల కారణంగానే నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
Repost from C S Maths(Arithmetics & Pure Maths)
MATHS DAY సందర్బంగా ప్రతీ కోర్సు పై 50% అదనపు డిస్కౌంట్ ను పొందండి. ఇప్పటి నుండి రేపు రాత్రి 12 వరకు ఈ ఆఫర్ ఉండును.
