en
Feedback
Devotional Telugu

Devotional Telugu

Open in Telegram

An attempt to bring our Hindu Devotional information

Show more
3 565
Subscribers
No data24 hours
No data7 days
No data30 days
Posts Archive
నృసింహశరణ్యం శ్రీశంకరభగవత్పాదులు జగద్గురువులు. ఆయన స్థాపించిన సిద్ధాంతం అద్వైతం. అద్వైతం అంటే జీవుడికి, దేవుడికి భేదం లేదని చెప్పడం. పైకి చూస్తే భేదం ఉన్నట్లు కనబడుతున్నా- లోతుగా చూస్తే ఏ భేదమూ లేదని, జీవుడు కూడా దేవుడిలోని వాడేనన్న నమ్మకం కలుగుతుంది. ఉదాహరణకు చేతిలో మట్టి ముద్దను తీసుకొని, దాన్ని ఒక కుండలా రూపొందించవచ్చు. కుండగా కనిపిస్తున్న మట్టి, నేలలో ఉన్న మట్టి ఒక్కటే. కుండ పగిలిపోతే మట్టిలోనే కదా కలిసిపోయేది? ఎన్నటికైనా మట్టి ఒక్కటే శాశ్వతం, కుండ ఆశాశ్వతం అని తెలుసుకోవడమే అద్వైతం. ఇలాంటి అద్వైత సిద్ధాంతాన్ని ఆసేతుహిమాచలం పర్యటించి, ప్రబోధించిన శంకరులు శివకేశవభేదం లేకుండా దేవతలందరిపైనా అమూల్య స్తోత్రాలను రచించారు. అజ్ఞానాన్ని దూరం చేయాలని ప్రార్థించారు. అందరినీ కష్టకాలంలో ఆదుకొమ్మని వినుతించారు. అందుకే ఆయన జగద్గురువులయ్యారు. శంకరభగవత్పాదులు రచించిన అమూల్య స్తోత్రరత్నం లక్ష్మీనృసింహ కరావలంబస్తోత్రం. ఇందులో జగద్గురువులు మానవాళిపై అపారమైన సహానుభూతితో నృసింహస్వామిని అనేక విధాలుగా కొనియాడారు. చేయూతనిమ్మని వేడుకున్నారు. అందుకే దానికి 'కరావలంబ' (చేయూతను ప్రసాదించే) స్తోత్రం అనే పేరు వచ్చింది. ఓ దేవదేవా! నీవు యోగీశ్వరుడివి. శాశ్వతుడివి. సంసారసాగరంలో నిలిచిన నౌక వంటివాడివి. స్వామీ! నాకు చేయూతనిచ్చి కాపాడు! ఈ సంసారం భయంకరమైన దట్టమైన అడవి వంటిది. ఇందులో కోరికలు అనే సింహాలు సంచరిస్తాయి. కోరలు సాచిన ఆశలు క్రూరమృగాల్లా వెంటాడతాయి. ఈ అడవిలో ఎంతదూరం సంచరించినా భయంపోదు... స్వామీ! ఈ అడవిలో నీ చేయూతనిచ్చి నన్ను కాపాడు. ఎంత ఈ సంసారం ఒక అగాధమైన బావిలాంటిది. ఇది లోతుగా ఉందో తెలియదు. లోతులోకి దిగితే కష్టాలు పాములై కాటువేస్తాయి... ఈ ఘోర కూపంలో నీ చేయూతనిచ్చి నన్ను కాపాడు! ఈ సంసారం సాగరంలాంటిది. ఈ సముద్రంలో భయంకరమైన మొసళ్లున్నాయి. తిమింగిలాలున్నాయి. అంతులేని ఈ సాగరంలో ఈదలేకపోతున్నాను. స్వామీ! నీ చల్లని చేయిని అందించి రక్షించు! ఈ సంసారం విషవృక్షం లాంటిది. ఎంతో ఎత్తుకు ఎగబాకిన ఈ చెట్టు పైనుంచి కిందికి దిగలేకపోతున్నాను. స్వామీ! నీ చేయూతనిచ్చి నన్ను రక్షించు! ఈ సంసారం ఒక మహా విషసర్పం లాంటిది. దాని విషం భయంకరంగా ఉంది. నన్ను కాటువేయడానికి విషసర్పం కోరలుసాచి బుసలు కొడుతోంది. కనుక శేషశయనా! నీ చేయూతను అందించి నన్ను కాపాడు! ఈ సంసారం ఒక దావాగ్ని వంటిది. అడవి అంతా తీవ్రమైన మంటలతో తగలబడిపోతుంటే ఎటూ దారి మంటలలో చిక్కుబడి ఉన్నాను. దేవదేవా! నీ చేయూతనందించి కాపాడు! ఈ సంసారం ఒక వలలాంటిది. కష్టాల వలలో పడి చేపలా కానరాక కొట్టుకుంటున్నాను. స్వామీ! నీ చేయూతనందించి నన్ను రక్షించు! ఈ సంసారం మదపుటేనుగు వంటిది. అది నన్ను తొండంతో పట్టుకొని, నేలకేసి కొట్టి చంపివేయాలని చూస్తోంది. స్వామీ! నీ చేయూతనందించి ఉద్ధరించు! అజ్ఞానం నన్ను గుడ్డివాడిగా చేస్తోంది. ఇంద్రియాలు దొంగల్లా నన్ను నిత్యం దోచుకుంటున్నాయి. వ్యామోహం అనే అగాధంలో పడిపోతున్నాను. స్వామీ! | నీ చేయూతనందించు! నీవే నాకు శరణు! మధుసూదనా! కేశవా! జనార్ధనా! వాసుదేవా! లక్ష్మీనృసింహా! నన్ను రక్షించు! ఈ స్తోత్రాన్ని పఠిస్తే సమస్త భయాలూ దూరమవుతాయంటారు. లక్ష్మీనృసింహుడి కారుణ్యం అమృతంలా వర్షిస్తుందని చెబుతారు.

మంచివాళ్ళకి కష్టాలు ఎందుకు? బాయిజాబాయి సాయికి భోజనం వడ్డిస్తూ- ‘సాయీ! ధర్మంగా జీవించేవారికే ఎక్కువ కష్టాలుంటున్నాయి.. ఎందుకలా?’ అంది. సాయి నవ్వి ‘ఈ ప్రశ్న చాలామంది, అడిగారు. ఇదేం జటిలమైంది కాదు. మనలో సత్వ రజో తమో గుణాలు ఉంటాయి. అయితే ఒక్కొక్కరిలో ఒక్కో గుణం పాలు అధికంగా ఉంటుంది. ధర్మం, న్యాయం, సత్యం- అనే విషయాలను సత్వగుణులు ఒకలా, రజోగుణులు ఇంకోలా, తమోగుణులు మరింత భిన్నంగా అర్థం చేసుకుంటారు. అసలు నిజం ఒకటే అయినా మూడు రకాలుగా చూస్తున్నారు. అందుకే ఇన్నిన్ని భేదాలూ, విభేదాలూనూ. ఈ సత్యాన్ని అర్థంచేసుకుంటే ఘర్షణలతో పనే ఉండదు. సామరస్యం, సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తుంది. ప్రస్తుతం మంచిగా ఉన్నంతలో సరిపోదు. గతంలో ఎవరికైనా హాని చేసి ఉంటే.. ఆ చెడు కర్మల ఫలం ఇప్పుడు వెంటాడుతుంది. ఆ బాధను అంటే కష్టాల తీవ్రతను తట్టుకుని నిలబడాలంటే మన వల్ల ఇక్కట్లపాలైన వారిని క్షమించమంటూ అభ్యర్థించాలి. ఒకవేళ వాళ్లు లేకుంటే.. వారి కుటుంబసభ్యులను వెతుక్కుంటూ వెళ్లి చేతనైన సహాయం చేయాలి’ అంటూ వివరించాడు బాబా.

మంచివాళ్ళకి కష్టాలు ఎందుకు? బాయిజాబాయి సాయికి భోజనం వడ్డిస్తూ- ‘సాయీ! ధర్మంగా జీవించేవారికే ఎక్కువ కష్టాలుంటున్నాయి.. ఎందుకలా?’ అంది. సాయి నవ్వి ‘ఈ ప్రశ్న చాలామంది, అడిగారు. ఇదేం జటిలమైంది కాదు. మనలో సత్వ రజో తమో గుణాలు ఉంటాయి. అయితే ఒక్కొక్కరిలో ఒక్కో గుణం పాలు అధికంగా ఉంటుంది. ధర్మం, న్యాయం, సత్యం- అనే విషయాలను సత్వగుణులు ఒకలా, రజోగుణులు ఇంకోలా, తమోగుణులు మరింత భిన్నంగా అర్థం చేసుకుంటారు. అసలు నిజం ఒకటే అయినా మూడు రకాలుగా చూస్తున్నారు. అందుకే ఇన్నిన్ని భేదాలూ, విభేదాలూనూ. ఈ సత్యాన్ని అర్థంచేసుకుంటే ఘర్షణలతో పనే ఉండదు. సామరస్యం, సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తుంది. ప్రస్తుతం మంచిగా ఉన్నంతలో సరిపోదు. గతంలో ఎవరికైనా హాని చేసి ఉంటే.. ఆ చెడు కర్మల ఫలం ఇప్పుడు వెంటాడుతుంది. ఆ బాధను అంటే కష్టాల తీవ్రతను తట్టుకుని నిలబడాలంటే మన వల్ల ఇక్కట్లపాలైన వారిని క్షమించమంటూ అభ్యర్థించాలి. ఒకవేళ వాళ్లు లేకుంటే.. వారి కుటుంబసభ్యులను వెతుక్కుంటూ వెళ్లి చేతనైన సహాయం చేయాలి’ అంటూ వివరించాడు బాబా.

మార్పు సృష్టిలో ప్రతీదీ కాలానుగుణంగా మార్పు చెందుతుంది. మార్పు అనివార్యం. మార్పు చైతన్య సూచిక. మార్పనేది కంటికి కనిపించనూ వచ్చు, కనిపించకపోనూ వచ్చు. చూడలేకపోయినంత మాత్రాన మార్పు చెందలేదని కాదు. నిత్యం ఒక వ్యక్తిని చూడటం కన్నా, కొంతకాలం తరవాత చూస్తే ఆ వ్యక్తిలోని మార్పు స్పష్టమవుతుంది. మొక్క చెట్టుగా ఎదగడం తెలుస్తుంది. చీకటి వెలుగులు, మానవ, పశుపక్ష్యాదుల జీవితం, రుతువులు ఒక స్థితి నుంచి మరో స్థితికి చేరడానికి క్షణక్షణం మార్పు సంభవిస్తూనే ఉంటుంది. ఆ మార్పులోని దశలు కొంతవరకు అవగాహనకు వస్తాయి. వాటికీ ఆయా దశ సూచక పేర్లు పెట్టుకుంటాం. పరిపూర్ణ స్థితికి చేరాక ఆ ఆవృతం పూర్తవుతుంది. దానికో పేరు స్థిరపడుతుంది. ప్రకృతి పరంగా మార్పులు సహజసిద్ధంగా జరుగుతాయి. అవి మార్చలేనివి. సృష్టిలో కోరుకున్నట్టుగా మార్పు చెందే అవకాశం ఒక్క మనిషికే ఉంది. మానసికంగా, శారీరకంగా ఎలా కావాలంటే అలా మారవచ్చు. అది మానవ జన్మ అదృష్టం, వరం. కంటికి అగుపించని మనసును కనిపెట్టి, అర్థం చేసుకుని, అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలని అనుకోవడంతోటే మనిషి జన్మ ఉత్తమత్వం పొందుతుంది. శరీరం మీద దృష్టి నిలిపి అందచందాలను మెరుగుపరచుకునే వారికన్నా,  మనసును తీర్చిదిద్దుకుని సేవాభావ   దృక్పథంతో మెలగేవారు మాననీయులు. అందం ఎప్పటికీ ఒక్కలా ఉండేది కాదు. అది వయసుతోపాటు రకరకాల మార్పులకు లోనవుతుంది, రుతువుల ప్రభావానికి గురవుతుంది. మనసు అలాకాదు. అది కనిపించదు కాబట్టి మనం ఎలా మలచుకుంటే అలా స్థిరమవుతుంది. వృద్ధాప్యంలో కుర్రతనం ఉరకలెత్తడానికి, యౌవనకాలంలో లక్ష్యం లేక చతికిలబడటానికి మనసుకు మనిషి ఇచ్చే తర్ఫీదే కారణం. మనసు మనిషికి వన్నె తెస్తుంది. హరిశ్చంద్రుడు మనసుకు సత్యం మప్పాడు. రాముడు సకల గుణాలతో మనసును మేళవించాడు. ఒకరు సత్యహరిశ్చంద్రుడైతే, మరొకరు సకల సుగుణాభి రాముడిగా ఆదర్శప్రాయులయ్యారు. సాధారణంగా మనిషి ప్రవర్తనతో అతడి మనసును అంచనా వేస్తారు. తెల్లనివన్నీ పాలు కాదు. నల్లనివన్నీ నీళ్లనీ అనుకోకూడదు. మెరిసేదంతా బంగారం కానేకాదు. నటన- సృష్టిలో మనిషికి మాత్రమే అబ్బిన కళ. మంచితనం, మానవత్వ భావాలతో క్రమంగా మనసును మార్చుకుంటూ తనను తాను తీర్చిదిద్దుకోవలసిన మనిషి, అవసరాలకు అనుగుణంగా నటిస్తుంటాడు. చెడ్డతనాన్ని దాచిపెట్టి మంచితనాన్ని ప్రదర్శిస్తాడు. ప్రపంచానికి అది సహజమా, నటనా అన్న తేడా తెలియనంతగా ప్రవర్తిస్తాడు. నీతి, న్యాయం, నిజం, నిజాయతీలను నిర్వచించిన మనిషి అవినీతి, అన్యాయం, అబద్ధం, మోసం, దగా, కుట్రలకు కేంద్రం అవుతున్నాడు. పాలలో నీళ్లను కలుపుకొంటూ పోతే చివరికి క్షీరం అస్తిత్వం కోల్పోయి నీరవుతుంది. ధర్మం నాలుగు పాదాలపై నిలబడినప్పుడే సమాజం పచ్చగా పది కాలాలు పరిఢవిల్లుతుంది. రాబోయే తరాలకు నిష్కల్మషమైన, నిష్కపటమైన ఆహ్వానం పలుకుతుంది. మనిషి జన్మకు శాశ్వతత్వాన్నిచ్చే ధర్మాన్ని విడిచి తాత్కాలిక సుఖాల కోసం కాసుకు లొంగి అధర్మం బాట పట్టడం, అది కలి ప్రభావం అని సమర్థించుకోవడం ఆత్మవంచన. మనసును ఏమార్చుకుంటూ కాకుండా ఉత్తమంగా మార్చుకుంటూ ఇలలో దైవత్వాన్ని సాధించడమే మానవజన్మకు పరిపూర్ణత. లేదంటే జీవితమే వ్యర్థం!

.

ఆగమాల ఆంతర్యం ఆగమం అనే పదానికి వేదం, శాస్త్రం అనే అర్థాలున్నాయి. దేవతా మూర్తుల ఆరాధనకు సంబంధించిన విధి విధానాలను వేదాలలో చెప్పిన విషయాల సంగ్రహాన్ని సైతం అగమం అంటారు. ఆగమాలు వైదికం, తాంత్రికం అని రెండు రకాలు. భగవంతుడిని ఎలా ఆర్చించాలి. ఎలా ప్రతిష్ఠించాలనే విషయాలను ఆగమాలు తెలుపుతాయి. రోజువారీ నిత్య కర్మలు, ఏదో ఒక ఉద్దేశంతో చేసే నైమిత్తిక కర్మలు, కోరికలు నెరవేరాలని చేసే కామ్య కర్మలు తదితరాల నిర్వహణకు వివరణ ఇస్తాయి. ఉత్సవాలను ఎలా నిర్వహించాలి, ఎలాంటి విషయాలు అధ్యయనం చేయాలి. కర్మలు, ఉత్సవాలు నిర్వహించే యజమాని ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలనే విషయాలను తెలియజేస్తాయి. ఈ ఆగమాలు శైవాగమం, పాంచరాత్రాగమం, వైఖానసాగమం, స్మార్తాగమం. వీటిలో మళ్ళీ శాఖలు, ఉప శాఖలు ఉన్నాయి. శైవ మతం ఇరవై ఎనిమిది ఆగమాలు, రెండు వందలకు పైగా ఉప ఆగమాలను భక్తులకు నిర్దేశించింది. కానీ దక్షిణ భారతదేశంలోని దేవాలయాల్లో పూజాదికాలకు ఆరాధనా పద్ధతులకు కామిక ఆగమం, కారణ ఆగమాలనే శైవులు అనుసరిస్తారు. పాంచరాత్రం, వైఖానస ఆగమాల ప్రకారం వైష్ణవ దేవాలయాల్లో పూజలు నిర్వర్తిస్తారు. అంటారు. కుమారస్వామికి శక్తి అనే నామాంతరం భాగాలుగా విభజించారు. ఈ నాలుగు పాదాల్లో సంబంధించిన మార్గదర్శకాలను పొందుపరచారు. విధులను విశదీకరించారు. మూడోదైన యోగ సర్వజ్ఞతతో సర్వ శక్తిమంతుడిగా పరమాణువు విష్ణువు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు, చతుర్ముఖ బ్రహ్మ, పరమేశ్వరుడు అనే అయిదుగురికి అయిదు రోజుల్లో ఉపదేశించినవి కాబట్టి దీనికి పాంచరాత్రం అనే పేరు వచ్చింది. విఖనస రుషి నుంచి వచ్చింది కాబట్టి వైఖానసం అంటారు. ఈ మార్గానుయాయులు విష్ణువును ముఖ్య దైవంగా కొలుస్తారు. అయినప్పటికీ కొన్ని అలవాట్లు. ఆచారాలు బహుదేవతా ఆరాధనను సూచిస్తాయి. వేదాలను, శాస్త్రాలను(స్మృతులను) అనుసరించి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించే వారిని స్మార్తులు అంటారు. వీరు ఆదిశంకరాచార్యుల వారి అద్వైత వేదాంత తత్వాన్ని అనుసరిస్తారు. వేదం శాస్త్రాలలో చెప్పిన వాటిని స్మార్తాగమాలు ఉంది. కుమారస్వామిని పూజించేవారిని శాక్తేయులు అంటారు. వారు అనుసరించే విధానాలను శాక్తేయం అంటారు. విఘ్నేశ్వరుడి పూజకు సంబంధించిన ఆగమం వినాయక పురాణం. ఇది విఘ్ననాయకుడి పూజాది కాలకు మార్గదర్శకంగా నిలిచింది. ఈ ఆగమాలు తంత్రశాస్త్రాలతో పాటు మరెన్నో పురాణాలు, దేవతా మూర్తులను పూజించే పద్ధతులను విపులంగా సూత్రీకరించాయి. మన పూర్వీకులు ప్రతి ఆగమాన్ని నాలుగు ఆగమాలు నిర్దేశించిన పూజలు, ఆరాధనలను స్పష్టం చేశాయి. చర్యా పాదంలో నిత్యం పూకు కావలసిన భౌతిక సామగ్రికి రెండోదైన క్రియా పాదంలో ఆచరించవలసిన భగవదారాధన ప్రక్రియను, యజ్ఞ యాగాది ఆచరణ పాదంలో మనో నియంత్రణకు సంబంధించిన సూత్రాలను నిర్వచించారు. ఆగమాల్లో చివరి పాదం పూర్తిగా ఆధ్యాత్మిక పార్శ్వాన్ని స్పృశించింది. మోక్ష సాధనకు ఉపకరించే సూచనలను చేసింది... భగవంతుడు ఒక్కడే అని, అతడే పరబ్రహ్మ... పరమాత్మ, పరమ పురుషుడని ఆగమాలన్నీ ఏకగ్రీవంగా బోధించాయి. అతడు సర్వాత్మకుడై, సర్వజ్ఞతతో సర్వ శక్తిమంతుడిగా పరమాణువు నుంచి బ్రహ్మాండం వరకు వ్యాపించాడని వర్ణించాయి.

ఆరోగ్య జీవనం ప్రతి మనిషి ఆరోగ్యం కోరుకుంటాడు. ఇలాంటి ఇచ్ఛ ఉండేది ఒక్క వ్యక్తికి ' మాత్రమే, అది కేవలం వ్యక్తిగతమేనా? కాదు. కార్యాలయాల్లోనూ ఆరోగ్యవంతుల్నే ఉద్యోగులుగా నియమించుకుంటారు. న్యాయస్థానాల్లో తీర్పులు వెలువరించేముందూ వాది ప్రతివాదుల (శారీరక, మానసిక ఆరోగ్యస్థితుల్ని పరిగణనలోకి తీసుకుంటారు. చట్ట సభల్లోకి అడుగు పెట్టే సభ్యుల్నీ అన్ని విధాలా యోగ్యులైన (ఆరోగ్యకరమైన ఆలోచనా దృక్పథమున్న) వారినే ఎన్నుకోజూస్తారు. దేశ భద్రతా దళాల సేనల్ని ఎంపిక చేసేటప్పుడూ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని పరీక్షిస్తారు. బావుల్లోంచి నల్లసిరులు తవ్వి తీసే సింగరేణి కార్మికుల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. లోక కల్యాణార్ధమై ఏ పని చెయ్యాలన్నా ప్రాథమికంగా మనిషి ఆరోగ్యవంతుడై ఉండాలి. అందుకే అన్ని భాగ్యాల్లో కెల్లా ఒక్క ఆరోగ్యాన్ని మాత్రమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లేనని భావిస్తారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మాత్రమే అనేకానేకం సమకూర్చుకోగల సమర్థుడు. అలాంటి దృఢమైనవారే పురోభివృద్ధిలో సాధికారికంగా భాగస్వామి అవుతారు. ఆరోగ్యకరమైన మనసులోంచే సృజనాత్మక ఊటలు జలజలా ఊరతాయి. అవి నూతనావిష్కరణలకు పురుడుపోస్తాయి. పరిశుద్ధమైన మనసు 'దీపం వెలిగే గృహం' లాంటిది. అందులోకి అరిషడ్వర్గాల చోరులు చేరరు. బదులుగా దానిలో 'సచ్చిదానందుడు' కొలువుండజూస్తాడు. ఆరోగ్యం అనేది కేవలం దేహానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. అది- ఏ రోగమూ లేని శరీరంతోపాటు దుఃఖానికి కించిత్తు చోటులేని మానసికం. ఆనందం, సచ్ఛీలత, పరిశుభ్రతల సమ్మిశ్రమం, నైతిక విలువలతో కూడిన జీవన గమనం. తీసుకునేటప్పుడు కన్నా ఇచ్చేటప్పుడే ఎక్కువ ఆనందం కలుగుతుంది. అందువల్లే ఎల్లప్పుడూ ఇచ్చే పంచభూతాత్మక ప్రకృతి తాజాగా ఉంటుంది. నిత్యనూతనం- ఆరోగ్యానికి పర్యాయపదం. ఆకాశమంత ఎత్తు పెరిగిన భారీవృక్షం భగభగమండే ఎండల్లో మాడుతుంది. పెను తుపానులో ఊగిపోతుంది. ప్రకృతి బాధించినా తట్టుకుని చెట్టు అలాగే నిటారుగా నిలబడే ఉంటుంది. కారణం- భూమ్మీద జీవరాశికి తనవంతు సేవలు మరికొంతకాలం అందించాలన్న బలమైన కాంక్షతో ఉండటం. ఆ కోరిక ప్రాకృతికమైంది. అదే పంచ భూతాల్లోంచి రూపుదిద్దుకొన్న మనిషికీ అలాంటి సంకల్పం ఉండాలి. అది ఆరోగ్యకరం. 'మనిషి చేసే సానుకూల ఆలోచనల ఫలితమే వారి ఆరోగ్యం... ప్రతికూల ఆలోచనలే వారి అనారోగ్యం' అని ఆధునిక వైద్యశాస్త్ర విభాగాలూ చెబుతున్నాయి. దుర్గుణాలతో కూడిన మనిషితో ఎవ్వరూ సాన్నిహిత్యం పెంచుకోరు. అంతదాకా ఎందుకు అనారోగ్యానికి గురైన లేదా దుఃఖం బారినపడ్డ మనిషినీ ఓదార్చేందుకు తనవాళ్లు సైతం చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోతారే తప్ప అక్కడే ఉండిపోరు. కానీ- సత్యం, జ్ఞానం, ప్రేమ, ఆనందం, ఆరోగ్యం, ఆప్యాయత, సానుభూతి, దానగుణం.... అనే అప్లైశ్వర్యాలతో తులతూగే మహనీయుల వద్దకు ఎంతోమంది శిష్యులుగా చేరి జీవితకాలం పాటు అక్కడే ఉండిపోతారు. "

ఏం చూస్తున్నాం, ఏం చేస్తున్నాం? మనిషి జీవించి ఉన్నంతవరకు ఏదో ఆలోచన చేస్తూనే ఉంటాడు మంచో, చెడో... ఏదో ఒకటి! మనిషి నిత్య చైతన్యశీలి. తన ఆలోచనను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఆలోచిస్తున్నప్పుడు అంతర్విశ్లేషణ చేసుకోవలసిన అవసరం ఉంటుంది. ఈ ఆలోచన తనకు గాని, ఇతరులకు గాని మేలు చేస్తుందా, కీడు చేస్తుందా వివేకంతో ఆలోచించుకోవాలి, నిర్ణయించుకోవాలి. పెద్దలు ‘మంచిని చూడు, మంచిని విను, మంచి మాట్లాడు’ అని చెప్పారు. ‘నువ్వు చెప్పేది నేను వినను, నేను చెప్పేదే నువ్వు వినాలి’ అన్న ధోరణి మనిషి అహంకారానికి, పతనానికి హేతువవుతుంది. సమాజంలో దురాలోచనతో, స్వార్థంతో, గర్వంతో, అజ్ఞానంతో, అవిద్యతో, అవినీతితో, అకృత్యాలతో ఎంతటి దుర్మార్గానికైనా వెనకాడని వాళ్లను చూస్తున్నాం. అత్యాచారాలు, హత్యాచారాలు, దౌర్జన్యాలు, దోపిళ్లు... ఇలా ఎన్నో అవాంఛనీయ దుర్ఘటనలు చూస్తున్నాం. కారణాలనేకం... సమాజాన్ని ఉద్ధరించాలనుకోవడమనేది తరవాతి సంగతి. మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఎదుటివారి మాట వినాలి. అందులోని మంచీ-చెడూ సమీక్షించుకొని మంచి గ్రహించాలి. విజ్ఞులు, వేదమూర్తులు, ప్రవచనకారుల మాటలు వినడం నేర్చుకోవాలి. ప్రతి మనిషిలోనూ ఏదో ప్రతిభ నిక్షిప్తమై ఉంటుంది. అది గ్రహించి, స్వీకరించే అలవాటు చేసుకోవాలి. సద్గ్రంథ పఠనం చేయాలి. సుభాషితాలను అవగాహన చేసుకోవాలి. అనుభవజ్ఞుల ప్రస్థానాన్ని అనుసరించాలి.

కాలం అమూల్యం "కలయతి ఇతి కాల!' అని కాలానికి నిఘంటువులు నిర్వచనం చెప్పాయి. అంటే అన్నింటినీ తనలో లీనం చేసుకొనేది కాలం. కాలాన్ని గణించాలంటే అత్యంత సూక్ష్మసమయం నుంచి మహాకల్పాల వరకు లెక్కించవలసి వస్తుంది. కాలం అనంతంగా సాగుతూ ఉంటుంది కనుక మనిషి తన పరిధి మేరకే కాలాన్ని లెక్కించగలుగుతాడు. మనిషి ఆయుర్దాయం అనంతకాలంలో చాలా చిన్నది. గడచిపోయిన క్షణం మళ్ళీ రాదు. రెప్పవాల్సి తెరిచేలోగా కాలం గడచిపోతుంది. కాలంతో పరుగులు తీయడం మనిషికి సాధ్యం కాదు. కాలశక్తిని ఆపడం మనిషితరం కాదు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా భూమిపై కొనసాగే పగటివేళలో మనిషి జాగృతుడై జీవన విధానాన్ని దిద్దుకొంటాడు. సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం అయ్యేదాకా మనిషి నిద్రిస్తాడు. ఇది మానవలోకంలోని కాల నియమం. ఇది భూమికే పరిమితం. భూమిని దాటి ఇతర గ్రహాలకు వెళ్తే అక్కడి కాలమానమే వర్తిస్తుంది. 'కాలం గడిచిపోతున్నది అని ఎవడో అంటే 'ఒరే! వెర్రిబాగులవాడా! గడచిపోతున్నది కాలం కాదురా, నీ ఆయుర్దాయమే' అంటుందట కాలం. నిజమే. కాలం గడుస్తున్న కొద్దీ మనిషి ఆయువు తరుగుతుందే కానీ పెరగదు కదా! కాలం మార్పును తెస్తుందని గుర్తించడానికి మనిషి బాల్యం నుంచి కౌమారానికి, కౌమారం క్రమంగా యౌవనానికి, మార్పు మనిషి నుంచి ఉదాహరణ. సంపూర్ణాయుర్దాయం నూటఇరవై ఏండ్లని పెద్దలమాట. అంతకాలం జీవించేవాళ్లు అదృష్టవంతులే. నూరేళ్లు దాటకుండానే గతించేవారే ఎక్కువ. వయసులో ఏమి ఏ చేయాలో కాలం నిర్దిష్ట ప్రణాళికను సూచించింది. బాల్యంలో ఆటపాటలు, కౌమారంలో చదువుసంధ్యలు, యౌవనంలో వైవాహిక జీవనం, వార్ధక్యంలో ఆత్మశాంతి అనేవి సాధారణ విషయాలు. మనిషి ఏ ప్రాయంలో ఏది చేయాలో అది చేయకపోతే, కాలం విలువను జీవన మూల్యాన్ని కోల్పోయినట్లే. బాల్యంలో మనిషి ఆటపాటలతో ఎదిగితేనే క్రమాభివృద్ధి జరుగుతుంది. కౌమారదశలో బడికి వెళ్ళి చదువుకోకపోతే, జ్ఞానాన్ని కోల్పోయినట్లే. యౌవనంలో వైవాహిక జీవనాన్ని అనుభవించకపోతే, యౌవనం తిరిగి రాదు. వృద్ధాప్యంలో శాంతిమయ జీవనం లేకుంటే జీవితం భారంగా మారుతుంది. కాలం పాదరసంలా జారిపోతుంది. పట్టుకుందామనుకుంటే దొరకదు. కాలం కర్పూరంలా హరించుకొనిపోతుంది. కనుమరుగైన తరవాత చింతించి లాభంలేదు. మనిషి తన కంటికి ఎదురుగా ఉన్న వర్తమాన కాలం విలువను గుర్తించాలి. మంచి పనులతో ముందుకు సాగాలి. ప్రతి క్షణాన్ని అమూల్య ధనంగా చూడాలి. వ్యంగా కాలాన్ని గడిపితే సంపదలు చేజారిపోక తప్పదు. దేవతలు సైతం కాలాన్ని అమూల్యంగా భావిస్తారు. కాలం కలిసిరానప్పుడు మౌనం వహిస్తారు. శుభసమయం కోసం వేచిచూస్తారు. తగిన సమయంలోనే అనుగ్రహిస్తారు. కృషిచేసేవారికి కాలం ఎంతో విలువైంది. సోమరులకు కాలం విలువ లేనిదిగా కనబడుతుంది. మంచి పనులు చేసేవారికి ఇరవై నాలుగు గంటలూ అవసరమే. సూయ, చంద్రోదయాలు సక్రమంగా, సకాలంలో జరుగుతున్నందువల్లనే భూమిపై ఆరు రుతువులు క్రమం తప్పకుండా వస్తూ పోతున్నాయి. ఎండలు, వానలు, చలులు ఏర్పడుతున్నాయి. ప్రకృతిలో సమతౌల్యం జారిపోకుండా నిలుస్తోంది. ప్రపంచం సురక్షితంగా ముందుకు సాగుతోంది. కరుణించిన కాలం మనిషి మనుగడ చక్కగా ఉంటుంది. కనుక కాలం కాలం విలువను తెలుసుకొని మనిషి ప్రవర్తించాలి!

కంచి భారతావనిలోని సప్త ముక్తిదాయక క్షేత్రాల్లో కంచి ఒకటి. కాంచీపురం, కంజీవరం, కంచి పేడు దీని నామాంతరాలు. కః- అంటే బ్రహ్మ. బ్రహ్మకు ఇది తపోభూమి. బ్రహ్మదేవుడు అశ్వమేధయాగం చేసి విష్ణువును ప్రసన్నం చేసుకున్న ప్రదేశంగా దీన్ని పురాణాలు పేర్కొన్నాయి. ఆ యాగంలో పాల్గొనడానికి వచ్చినవారికి సదుపాయాలు కల్పించడానికి బ్రహ్మ ఆజ్ఞపై విశ్వకర్మ నిర్మించిన పట్టణమే కంచి అని పురాణోక్తి. బ్రహ్మాండ పురాణంలో కాశి, కంచి రెండింటినీ శివుడు తన నేత్రాలుగా భావిస్తుంటాడని చెప్పడం వల్ల కంచిని ‘దక్షిణ కాశి’గా వ్యవహరించడమూ ఉంది. ‘సత్యవ్రతక్షేత్రం’ అనీ పూర్వం వాడుకలో ఉండేది. కాంచి అంటే మొలనూలు(వడ్డాణం). భూదేవికి నడుముభాగం కంచి క్షేత్రమని ఒక భావన. శక్తి పీఠాల్లో కంచి ఒకటి. సతీదేవి కంకాళం అక్కడ పడిందని, ఇక్కడ దేవి దేవగర్భ అని, భైరవుడు రురుడని ‘తంత్రచూడామణి’ గ్రంథం చెబుతోంది. కాంచీపురం శివకంచి, విష్ణుకంచి అని రెండు భాగాలు. శివకంచిలో 108 శివాలయాలున్నాయి. కామాక్షీదేవి భవ్యమందిరం ఇక్కడిదే. 188 అడుగుల ఎత్తైన గోపురం గల ఏకామ్రనాథాలయంలో పంచ భూత శివలింగాల్లో ఒకటైన పృథ్వీలింగం ఉంది. వేయి స్తంభాల మండపం విశిష్టమైనది. కైలాసనాథ దేవాలయం దక్షిణాత్యశిల్ప రీతుల్ని ప్రతిబింబించే ఆలయం. ముక్తేశ్వర, మతంగేశ్వర, ఐరావతేశ్వర, వల్లీశ్వర, వీరావతేశ్వరాలయాలు ప్రధానంగా ఇసుకరాతి నిర్మాణాలు, వాటి విమానాలు బహు తలాలతో చదరంగా ఉంటాయి. విష్ణుకంచిలో 18 విష్ణుమందిరాలు ఉన్నాయి. వరదరాజ స్వామి ఆలయం అత్యంత ప్రసిద్ధం. వైష్ణవుల 108 దివ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. రామానుజాచార్యులకు ఆలయంతో గొప్ప అనుబంధం ఉంది. ఇక్కడ ఆనంద సరోవరం మధ్యలో ఉన్న మండపంలో జలాంతర్భాగాన అత్తి చెక్కతో నిర్మించిన దేవతా విగ్రహాలుంటాయి. పల్లవ నందివర్మ నిర్మించిన వైకుంఠ పెరుమాళ్‌ ఆలయంలో ఒకదానిపై ఒకటి ఉన్న మూడు గర్భగృహాల్లో మహావిష్ణువు నిలుచున్న, కూర్చున్న, పడుకున్న విగ్రహాలు చూడవచ్చు. అనంతర కాలంలో ఈ నమూనాలో ఇతర ప్రాంతాల్లో దేవాలయాలు నిర్మించారు. కంచి అనగానే కామాక్షి గుర్తుకు వస్తుంది. ఆదిశంకరులు సౌందర్య లహరిలోని ఒక శ్లోకంలో ‘కాంచీ’ అన్న పేరు ఉపయోగించి అమ్మవారి నాలుగు బాహువులు, వాటిలోని ఆయుధాలను వర్ణిస్తూ కామాక్షీదేవి స్వరూపాన్ని ఆవిష్కరించారు. శంకరులు కామాక్షీ ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. శైవ, వైష్ణవ ధర్మాలే గాక జైన బౌద్ధాలకూ కంచి ఆటపట్టుగా నిలిచింది. ‘తిరుపరుత్తి కుండ్రం’ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ‘జైనకంచి’గా వ్యవహరించేవారు. బుద్ధ ఘోషుడు, ధర్మపాలుడు, దిజ్నాగుడు మొదలైన బౌద్ధ విద్వాంసులు ఇక్కడ కొంతకాలం నివసించారు. కంచి ప్రాచీన విద్యాకేంద్రం. ‘ఘటికలు’ అనే వేదపాఠశాలలుండేవి. కదంబరాజు మయూరశర్మ ఇక్కడ వేదాభ్యాసం చేశాడని ప్రతీతి. తొండైమండలంలో భాగంగా ఉన్న కంచి ఒకప్పుడు పల్లవుల రాజధాని. అనంతర కాలంలో చోళులు, పాండ్యుల అధీనంలోకి వెళ్ళింది. రాజరాజ చోళుడు 10వ శతాబ్దంలో కామాక్షి ఆలయాన్ని పునర్నిర్మించాడని చారిత్రకాధారాలు ఉన్నాయి. విజయనగర వీరకంపరాయల మధురా విజయంతో కంచి విజయనగర రాజుల ఏలుబడిలోకి వెళ్ళింది. ఆయా రాజవంశీకుల శాసనాలు కంచిలో విరివిగా గోచరిస్తున్నాయి. కంచి కామకోటి పీఠం దేశంలో ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం. ఆదిశంకరులు నెలకొల్పిన మూలామ్నాయ పీఠంగా భావిస్తారు.

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ 🙏Jai Sri Ram 🙏 ఒక ఊరిలో ఎవరో రామాయణ ప్రవచనం చెప్తున్నారు. ఒక బండోడు శ్రద్ధగా విని అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. "రామాయణం నీకేం అర్ధమైంది?" అని అడిగింది భార్య.... "నాకేం అర్ధం కాలేదు" అన్నాడు బండోడు . ప్రవచనం జరిగిన పది రోజులూ ఇదే తంతు. ప్రవచనం నుండి రాగానే నీకేమర్ధమయింది అని భార్య అడగడం, నాకేం అర్ధం కాలేదని బండోడు చెప్పడం. భార్యకి కోపం నషాళానికి అంటింది. ఇదిగో ఆ గుండ్రాయి తీసుకు పోయి దాన్తో నీళ్ళు పట్రా అంది. బండోడు వెళ్ళి గుండ్రాయిని నీళ్ళల్లో ముంచాడు. గుండ్రాయిలో నీళ్ళు నిలబడవు కదా అలాగే తీసు కొచ్చాడు... భార్య మళ్ళీ తెమ్మంది.... మళ్ళీ వెళ్ళాడు.... అలా పది సార్లు తిప్పింది. చూసావా......ఆ గుండ్రాయితో నీళ్ళు తేలేక పోయావు..... అలాగే పది రోజులు రామాయణం విన్నా నీకు ఏమీ అర్ధం కాలేదు. "నువ్వా గుండ్రాయితో సమానం" అని ఈసడించింది. అప్పుడు బండోడు అన్నాడు. "గుండ్రాయి నీళ్ళు తేలేక పోయిన మాట నిజమే కానీ పదిసార్లు నీళ్ళల్లో మునగడం వల్ల మాలిన్యం అంతా పోయి అది శుభ్రపడింది కదా.....అలాగే రామాయణం నాకేమీ అర్ధం కాకపోయినా పది రోజుల్నుండీ వినడం వల్ల మనసు తేలిక పడ్డట్టు హాయిగా వుంది. మనసు ప్రశాంతంగా వుంది" అన్నాడు. భర్తకి అర్ధం కావల్సిన దాని కన్నా ఎక్కువే అర్ధం అయిందని భార్యకి అర్ధం అయింది ! నవ విధ భక్తి మార్గాల్లో శ్రవణం ఒకటి...విన్నా చాలు. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

మౌనంగానే ఎదగాలి వాక్కును నియంత్రించడమే మౌనం. ఇదొక అద్భుతమైన తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా అవసరం మేరకే వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తోంది. అయిదు శాంతులలో మౌనం ముఖ్యమైనదిగా చెబుతారు. ‘మాట వెండి, మౌనం బంగారం’ అని సామెత. ‘మాట్లాడటం ద్వారా శక్తిని వృథా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు’ అన్నారు స్వామి వివేకానంద.  మౌనం మూడు రకాలు. ఒకటి, వాక్‌మౌనం. వాక్కును నిరోధించడమే వాక్‌మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. ఇలాంటి మౌనం వల్ల పరుష వచనాలు పలకడం, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు చెప్పడం, అసందర్భ ప్రలాపాలు అనే నాలుగు వాగ్దోషాలు హరిస్తాయి. రెండోది అక్షమౌనం. అంటే ఇంద్రియాలను నిగ్రహించడం. మూడోది కాష్ఠమౌనం. దీనినే మానసిక మౌనం అంటారు. మౌనధారణలోనూ మనసు అనేక మార్గాల్లో పయనిస్తుంది. దాన్నీ అరికట్టినప్పుడే కాష్ఠమౌనం సాధ్యపడుతుంది. మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల దివ్యశక్తి ఆవిర్భవిస్తుంది. బాహ్య, అంతర సౌందర్యాలను పెంచుతుంది. మనోశక్తులు వికసిస్తాయి. ఎదుటివారిలో  పరివర్తన  తెస్తుంది. ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమై ఆత్మకు శాంతి లభిస్తుంది. సమయం సద్వినియోగమవుతుంది. పతంజలి మహర్షి తన యోగ సిద్ధాంతంలో మౌనానికి ప్రాధాన్యమిచ్చారు. మౌనాన్ని అవలంబించిన మహాత్ముల్లో రమణ మహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ వంటి వారెందరో ఉన్నారు. ధ్యానానికి మౌనమే పునాది. బహిర్గతంగానే కాదు, అంతర్గతంగానూ మౌనం పాటించనిదే ధ్యానం చేయడం అసాధ్యం. నిరంతర యోగసాధకులైన మహర్షులు మౌనంగా ధ్యానం కొనసాగిస్తారు. రోజూ అరగంట మౌనంగా ఉంటే శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు నెరవేరతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ,  టీవీ కార్యక్రమాలు చూస్తూ, కంప్యూటర్‌ ముందు కూర్చుని అంతర్జాలం చూడటం కాదు. కళ్లు మూసుకుని మాటను, మనసును మౌనంలోకి జార్చేస్తే మనసు తేలిగ్గా ఉంటుంది. ఎంతో మంది అనుభవపూర్వకంగా చెబుతున్న విలువైన మాట ఇది. ఆచి తూచి మాట్లాడటం చేతకానితనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును అది తెలియజేస్తుంది. ‘చేజారిన కాలం, పెదవి దాటిన పలుకు’ వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలిసి తీరాలి. ప్రతి రోజూ ఎన్నో రకాల ఆలోచనలు మనల్ని పట్టి పీడిస్తుంటాయి. వాటి ప్రభావం మన మాటలపై, చేతలపై పడుతుంది. అవి ఓ చక్రం తిరిగినట్టు తిరుగుతాయి. ఆ చక్రాన్ని ఆపే శక్తే ‘మౌనం’. ఏ సాధన అయినా మౌనం వల్లనే సాధ్యమవుతుంది. భగవంతుడి సాన్నిధ్యానికి చేర్చే అసలైన సాధనం మౌనమే. మనందరం మౌనంగానే ఎదుగుదాం!

ఇంట్లో మనం నలుగురికి లేదా 5గురికి వంట చేయగలం.అంతకంటే ఎక్కువ మందికి చేయటం కొంచెము కష్టమైన పని.మరి 50 లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. మహాభారతం లో కురుక్షేత్ర యుద్ధ సమయంలో50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండినవారు ఎవరు? ఆసక్తికరమైన ఈ విషయం తెలుసుకోండి. మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి 50లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్నా ఇద్దరు రాజులు పాల్గొన లేదు.అందులో ఒకరు విదర్భ రాజైన రుక్మి,,రెండవది బలరాముడు.ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి. దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది.ఉడిపిరాజైన నరేషుడు సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్లినప్పుడు కౌరవులు తమ వైపు నిలబడాలని మరో వైపు పాండవులు తమవైపు నిలబడాలని కోరుతారు. అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటూ వెళ్ళకుండా సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడు.అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాలు గురించి ఏమైనా ఆలోచించారా?ఎవరు వండి పెడతారు? అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు. మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేషుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు. అప్పుడు నరేషుడు ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తున్నది, నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు. అందువల్ల నేను,నా సైన్యం ఇరువర్గాల యుద్ధంలో పాల్గొనము.వారందరికి భోజనం చేసి పెడతాము అని ఉడిపిరాజు చెపుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు రాజా మీ ఆలోచన చాలా అద్భుతమైనది,50 లక్షల మందికి భోజనం వండటం అంటే మామూలు మాటలు కాదు. ఇది మీ వల్లే సాధ్యమవుతుంది,అందరికీ భోజనాలు తయారుచేయమని చెపుతాడు. 50 లక్షల మందికి భోజనాలు వండాలంటే భీముడు మరియు అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది కానీ ఈ సమయంలో పోరాడటం భీముడు కు ముఖ్యం.అందువల్ల భీముని యుద్ధక్షేత్రం వదిలి రాలేడు.అందువల్ల నువ్వొక్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్ధుడు అని వంట వండమని కోరతాడు శ్రీ కృష్ణుడు. నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు నరేష్ ఎలా వండేవాడు అంటే.. సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా,వృధాకాకుండా వండేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయ్యేది. అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా వండేవాడు నరేశుడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయోవారు. ఇది ఎలా సాధ్యం?అంత మంది చనిపోతున్నా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు,అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఎలా వండుతున్నారు అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు. అసలు నరేశునికి ఎలా తెలుస్తుంది? ఈ రోజు ఇంతమంది మాత్రమే చనిపోతారని,మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలి అని?.. ఇలా18 రోజులు గడిచిపోయాయి.పాండవులు గెలిచారు.పట్టాభిషేకం జరుగుతుంది.అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుడుని అడుగుతాడు.. మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు.కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను అని అంటాడు. ఎందుకంటే 50 లక్షల మందికి సైన్యమునకు వంట చేయడం అంటే మాటలు కాదు అది కూడా ఒక మెతుకు కూడా మిగలకుండా వృధాకాకుండా వండడం అంటే మాటలు కాదు.ఇది మహా అద్భుతం ఇలా ఎలా చేశావు? అని అంటాడు. అప్పుడు నరేషుడు నవ్వుతూ మీరు గెలిచారు కదా దాని యొక్క గొప్పతనం ఎవరికి ఇస్తారు అని అడిగాడు. అప్పుడు యుధిష్టరుడు శ్రీకృష్ణుడే దీనికి మూలమని మా విజయం యొక్క గొప్పతనం మొత్తం శ్రీకృష్ణునికి చెందుతుంది అని చెప్తాడు. అప్పుడు నరేష్ మీరు గెలవడానికే కాదు, నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం.కాబట్టి ఈ గొప్పతనమంతా శ్రీకృష్ణుని కే చెందుతుంది అని చెప్తాడు. ఇది విని సభలో ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురి అవుతారు. ఇది ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు ఎలా కారణం అని నరేషుడుని అడుగుతారు. అప్పుడునరేషుడు అసలు రహస్యాన్ని అందరి ముందు ఇలా చెప్తాడు... శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాత్రి పెసరకాయలు తినేవాడు.నేను లెక్క పెట్టి పెట్టే వాడిని. శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్లీ పెసరకాయలను లెక్కపెట్టే వాడిని... శ్రీ కృష్ణుడు ఎన్ని కాయలుఅయితే తింటాడో దానికి వెయ్యిరెట్లు సైన్యం చనిపోయేవారు.. ఆంటే శ్రీకృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు అంటే 50 వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు. దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం వండే వాడిని అని చెప్పాడు. ఈ కారణం వల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండే వాడిని అని చెప్పాడు. ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణలీలకు ముగ్ధులు అవుతారు. ఈ కథ మహాభారత కథలలో ఒక అరుదైన కథ. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారు.

photo content

మత్స్యగిరి నారసింహుడు 🔔🔔🔔🔔🔔 హైదరాబాద్ నుంచి భువనగిరి రోడ్డులో వలిగొండ మండలంలో వెంకటాపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామ పరిధిలో సముద్రమట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉన్న కొండమీద చేపరూపంగా వెలసిన నరసింహస్వామి ఆలయం ఉన్న ప్రాంతాన్ని మత్స్యగిరి అంటారు. ఈ కొండ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంత ఎత్తులో ఉన్న ఆ కొండమీద మూడు పవిత్ర కొలనులుంటాయి. వాటిలో విష్ణు నామాలలాంటి నామాలతో ఉన్న అనేక చేపలుంటాయి. వాటి ఆహారం పెరుగు. అక్కడికి వచ్చే భక్తులు పెరుగు ప్యాకెట్లు కొని ఆ కొలనులో వేస్తే గుంపులు గుంపులుగా నామాలతో ఉన్న ఆ చేపలు నీటి పైకి వస్తాయి. అలాంటి ఆ సుందరమైన కొండమీద సరస్సులో వెలసిన స్వామి మత్స్యగిరి నరసింహస్వామి. ఈ విగ్రహం ఒక సాలగ్రామం. తల నరసింహుడిగా, శరీరమంతా చేప రూపంలో ఉంటుంది. మనకు దర్శనంలో స్పష్టముగా అలాగే కనిపిస్తుంది. జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నుంచి, బహుళ విదియ వరకూ ఐదు రోజుల పాటు ఇక్కడి స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో భక్తులు చాలా మంది వస్తారు.. ధనుర్మాసంలో ఉదయం ఆరునుంచీ, సాయంత్రం ఆరు వరకూ ఆలయం తెరిచే ఉంటుంది .. ఇక్కడికి ఎక్కువగా భక్తులు భూత, ప్రేత భయాలున్నవారిని, మతి స్థిమితం లేనివారిని తీసుకు వచ్చి దర్శనం చేయిస్తే తగ్గుతాయని నమ్ముతారట. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి... ఆయన ఆలయం కూడా చాలా బాగుంటుంది. కొండ ఎక్కేటప్పుడు 100 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. స్థల పురాణం: వేములు అనే ఋషులు తపస్సు చేసుకోడానికి ప్రశాంతమైన స్థలం కోసం వెతుకుతూ, ఈ కొండ మీదకు వచ్చారని, అక్కడి జలపాతాలు అవీ చూసి అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవారట. కొంత కాలానికి దుష్ట శక్తులేవో వచ్చి తపో భంగం చేసేవిట. ఋషులు విష్ణువును ప్రార్థిస్తే ఆయన మత్స్య నారసింహుడిగా వచ్చి ఆ దుష్ట శక్తులను సంహరించాడట. అప్పుడు ఋషులు విష్ణుమూర్తిని ఇక్కడే ఉండమని ప్రార్థిస్తే అక్కడి కొలనులో సాలగ్రామ రూపంగా వెలిసాడని కొండమీద ఆలయంలోని అర్చకులు చెప్పారు. ఇప్పటికీ ఋషులు సూక్ష్మ రూపంలో అక్కడే తపస్సు చేసుకుంటూ ఉంటారని చెప్పారు. వేములు అనే ఋషులు తపస్సు చేస్తుంటారు కనుక ఈ కొండకు వేములకొండ అనే పేరుకూడా ఉంది. కొలను ఒడ్డున ఉన్న ఆలయంలోని విగ్రహం సాలగ్రామం గాను, పైన ఆలయంలో నారసింహ విగ్రహంగాను దర్శనమిస్తాడు స్వామి. లక్ష్మీ అమ్మవారు, గోదాదేవి ఆలయాలు ఉన్నాయి. అంత ఎత్తుగా ఉన్న ఆ కొండమీద ఎంతపెద్ద కొలనులు, వాటిలో నామాలతో ఉన్న ఆచేపలు, వాటి ఆహారం పెరుగు అని తలుచుకున్నప్పుడల్లా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. తలుచుకునే కొద్ది దైవలీలలు ఆశ్చర్యమే కదా! ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఈ కొలనులో నీరు తాగితే దీర్ఘరోగాలు నయమౌతాయని, తెగుళ్లు వచ్చే పొలాలమీద చల్లితే పొలం సస్యశ్యామలంగా ఉండి, పంట పుష్కలంగా పండుతుందని అక్కడి రైతుల నమ్మకమట... తప్పక దర్శించుకోవలసిన క్షేత్రం... కానీ నడువలేనివారు వెళ్లవద్దు. రెండు కిలోమీటర్లు కొండ పైకి నడిచే వెళ్ళాలి. కారు వెళ్ళదు. 🔔🔔🔔🔔🔔

గౌరవ మర్యాదలు ప్రతి మనిషీ గౌరవం కోరుకుంటాడు. మర్యాద మన్ననలు పొందాలనుకుంటాడు. గుర్తింపు లభించగానే ఉత్సాహం రెట్టింపు అవుతుంది. మెప్పులు, అభినందనలు అందగానే మనసు సంతోషంతో నిండిపోతుంది. అందరూ మెచ్చే ఘనకార్యాలు చేసేందుకు మనసు పురి విప్పుతుంది. రావాల్సిన సమయంలో గుర్తింపు రాకపోతే జీవనోత్సాహంపై నైరాశ్యపు నీడలు కమ్ముకుంటాయి. అడుగులు ముందుకు వెయ్యడం ఆగిపోతుంది. ఇది మనసు నైజం. అందుచేత దాన్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. కోరిక నెరవేరలేదని వ్యక్తి మీద లేదా వ్యవస్థ పైనా మనసు అలకబూనుతుంది. అలా చేయడమూ ప్రతీకారం తీర్చుకోవడమే అవుతుంది. అది ప్రాకృతిక ప్రామాణిక సూత్రాలతో కూడిన ధార్మిక (సాధికారిక) జీవన విధానానికి విరుద్ధం. చప్పట్లు, బహుమానాలు, పథకాలు, పురస్కారాలు ఎదుగుదలను కాంక్షించే ఉత్ప్రేరకాలు. అవి కృషిని కీర్తిస్తాయి, ప్రోత్సహిస్తాయి. మరొకరికి స్ఫూర్తినిస్తాయి. అవి రానంత మాత్రాన కుంగిపోకూడదు. ఒక చిరునవ్వు, చిన్న పలకరింపు- గౌరవించడం కిందకే వస్తాయి. అవి మనుషుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయి. ఒక మహాసభలో ఎందరో మహానుభావులున్న వేదిక మీంచి ఎవరో మిమ్మల్ని పేరు పెట్టి పిలవడం మీ చెవులకు మధురమైన సంగీతంలా వినిపిస్తుంది. ఆ క్షణాల్లో అమితానందం సొంతమవుతుంది. రక్త సంబంధీకులు, బంధువులు, ఆత్మీయులు శుభకార్యాల పేరిట మీ ఇంటికి వస్తే, ఇంటిల్లపాదీ ఎదురెళ్ళి ఘన స్వాగతం పలుకుతారు. అది సామూహిక మర్యాద. కొందరు చెమ్మగిల్లిన కళ్లతో హృదయాల్ని తాకుతారు. అది ఆత్మలు పెనవేసుకున్న ఆలింగనం. నేలపై కూర్చున్నవాళ్లు సైతం లేచి నిలబడినప్పుడే వచ్చిన అతిథికి గౌరవం ఇచ్చినట్లు భావిస్తారు. ఇదంతా భారతీయ సంప్రదాయంలో ఇప్పటికీ సజీవంగా ఉంది. ఒక్కోసారి ఎవరి బలం వారికి తెలియదు. అలాంటి సమయాల్లో ప్రాజ్ఞులు, అనుభవజ్ఞులు ముందుకు వచ్చి ‘మనిషి’ అనేవాడు ఎంతటి శక్తిమంతుడో తెలపాలి. అసాధ్యాల్ని సుసాధ్యం చేసే అసామాన్యుడు అని అతడికి ఎరుక చెయ్యాలి. శ్రీరాముడు సీతమ్మను వెతికే ఘట్టంలో హనుమంతుడి బలం అతడికే తెలియదు. ఆ విషయాన్ని అతడికి ఇతరులు గుర్తుచేశారు. అతణ్ని గొప్పగా పొగిడారు. అది విన్న ఆంజనేయుడిలోని అంతఃచైతన్యం జాగృతమై అతణ్ని ఘనుణ్ని చేసింది. ఊరూరా దేవుణ్ని చేసింది. ‘మనం ధర్మాన్ని కాపాడితే అదే ధర్మం మనల్ని రక్షిస్తుంది’ అని శాస్త్రం చెబుతోంది. ధర్మాన్ని కాపాడటం అనేక రూపాల్లో జరుగుతుంది. అంతరించిపోతున్న కళను కాపాడటం, ఆ కళాకారుల్ని గౌరవించడం అంటే, ఒక విధంగా ధర్మాన్ని కాపాడటమే అవుతుంది. కళల్ని నమ్ముకుని కొంతమంది పేద కళాకారులు అరకొర జీవనం సాగిస్తూంటారు. వారి ముఖాల మీదే రంగులు ఉంటాయి గానీ తెరవెనక వారి జీవితాల్లో చీకట్లు కమ్ముకుని ఉంటాయి. కాలే కడుపులతో కళను బతికిస్తున్నది వాళ్లే. ఆ కళాపోషణ ఉపరితలం మీంచి చూస్తే కేవలం జీవనభృతి కోసం అన్నట్లుగా అగుపడుతుంది గానీ- ఒక గొప్ప సాంస్కృతిక సంపదను ముందుతరాలకు అందించే సాధికారిక ప్రక్రియగా భావించాలి. అటువంటి కళాకారుల్ని తప్పకుండా గౌరవించాలి

సూర్య జయంతి పుణ్యప్రదమైన మాఘమాస సప్తమిని సూర్య జయంతిగా జరుపుకోవడం ఆచారం. సూర్య జయంతి నాడు అర్కపత్రాలు (జిల్లేడు ఆకులు) రేగు ఆకులు శరీరంపై పలుచోట్ల ఉంచుకుని స్నానం చేయడం వల్ల సప్తవిధ పాపాలు హరించుకు పోతాయని శాస్త్ర కథనం. రథసప్తమినాడు ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడి జీవిత విశేషాలు విన్నా చదివినా మంగళకరమని పెద్దలు చెబుతారు. పుట్టిన తరువాత గొప్ప పనుల్ని చేసి కొంతమంది ప్రసిద్ధికెక్కుతారు. అద్భుతాల్ని ఆవిష్కరించడానికే కొంతమంది జన్మిస్తారు. సూర్యభగవానుడి జననం అలాంటిదే. కశ్యప మహర్షికి పదముగ్గురు భార్యలు. వారిలో దితి అదితి దనువు అనే ముగ్గురు భార్యలు ప్రధానమైనవారు. దితికి దైత్యులు దనువుకు దానవులు (దైత్యులు దానవులు ఇద్దరూ రాక్షసులే అయినప్పటికీ స్వభావం పరంగా దైత్యుల కన్నా దానవులకు కోపం ఎక్కువ) జన్మించారు. అదితికి సత్వగుణ ప్రధానులైన దేవతలు పుట్టారు.యజ్ఞంలో అర్పించే హవిస్సును స్వీకరించే బాధ్యతను బ్రహ్మదేవుడు దేవతలకు మాత్రమే అప్పజెప్పాడు. చెడు ప్రవర్తన కలిగిన రాక్షసులు హవిర్భాగాలను బలవంతంగా గ్రహించడం మొదలుపెట్టారు. ప్రశ్నించిన దేవతలపై రాక్షసులు ఎదురు దాడి చేసేవారు.తన బిడ్డలకు జరుగుతున్న అవమానాలకు అదితి బాధపడింది. ఒకరోజు ఆకాశంలో ప్రకాశిస్తున్న రవి బింబాన్ని చూస్తూ అనేకరకాలుగా ప్రస్తుతించింది. ఆమె ప్రార్థనలకు సంతోషించిన దివాకరుడు ప్రత్యక్షమయ్యాడు. అదితి ఆనందించి దేవతలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయనకు చెప్పింది. భాస్కరుణ్ని తనకు పుత్రుడిగా జన్మించి శత్రునాశనం చేయమని వేడుకుంది. ప్రభాకరుడు ప్రశాంతచిత్తుడై వరమిచ్చాడు. సూర్యుడి అనుగ్రహం పొందిన సంతోషంతో అదితి అనేక విధాలైన వ్రతాల్ని చేస్తూ ఉపవాసాలు ఆచరించింది. గర్భవతి అయిన అదితి శరీరం ఉపవాసాల కారణంగా క్షీణించింది. కశ్యప మహర్షి తన భార్య పరిస్థితికి కలత చెందాడు. అదితి దగ్గరికొచ్చి కోపంగా ఇలా ఉపవాసాలుంటూ అండాన్ని చంపేస్తావా ఏమిటి అని ప్రశ్నించాడు. రాక్షసుల్ని సంహరించే సంతానాన్ని పొందడానికి ఈవిధంగా చేస్తున్నానని అదితి ఉద్రేకంతో సమాధానమిచ్చింది. కశ్యపుడికీ అదితికీమధ్య వివాదం జరగగా ఆవేదనతో అదితి పిండాన్ని విడిచిపెట్టింది. అందులో నుంచి గొప్ప కాంతి కలిగిన శిశువు బయటికొచ్చాడు. ఆ సమయంలో ఆకాశవాణి ఈ పిల్లవాడు మార్తాండుడుగా ప్రసిద్ధుడవుతాడని పలికింది.కొంతకాలం తర్వాత మార్తాండుడు దేవతలతో కలిసి రాక్షస సంహారం చేసి ప్రాణులన్నిటికీ సంతోషం కలిగించాడు. లోకకల్యాణ కారకమైన ఆ రోజు సూర్య జయంతిగా ప్రశస్తికెక్కింది

వసంత పంచమి సకల సంపదలకు ఆధారం విద్య. వాక్కు, బుద్ధి, మేధ, ధారణ, శ్రద్ధ, ప్రతిభ, స్ఫురణ వంటి మనోమయమైన అంశాలన్నీ విద్యాపరంగా కీలకమైనవి. లౌకిక విద్యలకు, పారమార్థిక విద్యకు అధినేత్రి- సరస్వతి. జ్ఞానయుతమైన విద్యల సమాహార రూపమే ‘సరస్వతి’ అని వేదం ప్రతిపాదించింది. సర్వత్రా వ్యాపించిన శక్తితత్త్వానికి సరస్వతి అని పేరు. మానవ దేహంలో ‘సోహం’ అనే ప్రాణవాయువు సంచార ప్రక్రియను సరస్వతిగా యోగశాస్త్రంలో వ్యవహరిస్తారు. సమస్త సృష్టిలో తేజరిల్లే జీవకళకి ప్రతిరూపంగా శారదను, శబ్ద బ్రహ్మమయ సప్తస్వర నాదానురక్తికి సంకేతంగా బ్రహ్మరూపాన్ని దేవీభాగవతం దర్శించింది. ప్రణోదేవీ సరస్వతీ- అంటూ రుగ్వేదం వాణీ వైభవాన్ని కీర్తించింది. సరస్వతీ శాస్త్రమయీ- అని లలితా సహస్రనామావళి స్తుతించింది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి- అనే నాలుగు రూపాల సమష్టి రూపం శ్రీ భారతి. సత్వగుణ శోభితంగా విలసిల్లే సరస్వతిని ప్రకృతిలో ఉత్పాదక శక్తికి ప్రతిఫలనంగా ‘శారదా తంత్రం’ పేర్కొంది. మాఘ శుద్ధ పంచమినాడు అఖిల విద్యా  వరదాయినిగా, జ్ఞానవల్లీ సముల్లాసినిగా సరస్వతి అభివ్యక్తమైందని బ్రహ్మాండ పురాణం ప్రస్తావించింది. బ్రహ్మ సృజించిన జగత్తు ఓ సందర్భంలో పూర్తిగా నిస్తేజంగా, నిశ్శబ్దంగా మారిందంటారు. సృష్టి స్తంభించిపోవడంతో దేవతలు కలవరపడ్డారు. బ్రహ్మను శరణువేడారు. అప్పుడు విరించి, తన దివ్య కమండలంలోని పవిత్ర జలాన్ని భూమిపై చిలకరించాడంటారు. మంత్రపూరితమైన జలం నుంచి బ్రాహ్మీశక్తి ఉద్భవించిందంటారు. రెండు చేతులతో వీణను మోగిస్తూ, మరో రెండు చేతుల్లో అక్షరమాలిక పుస్తకాన్ని ధరించి శ్రీవిద్య అవతరించింది. ప్రణవ బ్రహ్మాత్మకంగా, విజ్ఞాన ఘనరూపిణిగా శ్రీమాత ఆవిష్కారమై లోకాలన్నింటా జ్ఞానదీప్తుల్ని ప్రసరింపజేసింది. సృష్టి నిర్మాణం, నిర్వహణా శక్తులన్నింటిలో సర్వోత్కృష్టమైన మూలకారక శక్తి మహాసరస్వతి అని జగద్గురు ఆదిశంకరులు సౌందర్యలహరిలో శ్లాఘించారు. చంద్రమౌళిగా ఈశ్వరుడు, చంద్రకళాధరిగా సరస్వతి వర్ధిల్లుతూ, ఇద్దరూ చంద్రుణ్ని సిగపువ్వుగా అలంకరించుకున్నారు. మహేశ్వరుడి స్త్రీ రూపమే మహాసరస్వతి అని, ఈశ్వరానుగ్రహం ఉపాసనా సంప్రదాయంలో సరస్వతిగా ఆకృతి దాల్చిందని శివమహిమ్న స్తోత్రంలో పుష్పదంతుడు వెల్లడించాడు.

గోపాలక విద్య శ్రీకృష్ణుడు మురళీధరుడు. ఆయన నాద వినోదుడు. శ్రావ్యమైన మురళీ నాదంతో జీవరాశులన్నింటినీ మైమరపించి మురిపించాడు. ఆ మురళి వల్లే ఆయన పురాణపురుషుడైనాడని రాగ గోవిందంలో మీరాబాయి కీర్తించింది. వెదురుతో చేసిన పిల్లనగ్రోవిది ఎంత అదృష్టమో కదా... ఆయన అధరాలను తాకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఆస్వాదించి రాగాలను సృజిస్తోందని మీరాబాయి గానం చేసింది. అథర్వణ వేదానికి సంబంధించిన కృష్ణోపనిషత్తులో మురళిని గురించిన వివరాలు ఉన్నాయి. ఇది అత్యంత ప్రాచీనమైన వాద్యమని, దీని నుంచి వెలువడే రాగాలను పంచ భూతాలు తమలో లీనం చేసుకొంటాయని కృష్ణోపనిషత్తు చెబుతోంది. ఆదిమజాతి మానవులు సాధు జీవాలను మచ్చిక చేసుకోవడానికి తమ నోటితో రాగయుక్తమైన ధ్వనులు సృజించి వాటికి ఆనందం చేకూర్చేవారట. ఆ తరవాత వెదురు బొంగు నుంచి పిల్లనగ్రోవిని తయారుచేసి రాగ ధ్వనులతో వాటి చెవులకు ఇంపు చేకూర్చేవారని నీలకంఠ శాస్త్రి రాసిన పుస్తకం వేదకాలం నాటి భారతీయ సంస్కృతిని చాటుతోంది. శ్రీకృష్ణుడు ఆలమందల పోషణలో భాగంగా వేణువును ఊదుతూ వాటిని రంజింప జేసేవాడు. అవి మోరలెత్తి ఆ వేణుగానాన్ని వింటూ ఆహారాన్ని నెమరు వేసుకొంటూ ఆనందాన్ని వ్యక్తం చేసేవి. అథర్వణ వేద విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఆవులు సైతం తొమ్మిది రకాల భావావేశపూరిత అనుభూతులకు లోనవుతాయని ఒకటో శతాబ్దానికి చెందిన పలకాప్యుడు, ఆ తరవాతి తరం నాటి శాలిహోత్రుడు పేర్కొన్నారు. నింపాదిగా కూర్చుని ఆహారాన్ని నెమరు వేసుకుంటూ నిమీలిత నేత్రాలతో ఆవు ఉంటే సాంత్వనంతో నిమ్మళంగా ఉన్నదని గుర్తు. ఆవు చెవులు నిటారుగా ఉంటూ రెప్పలార్చకుండా ఉంటే వ్యాకులతతో కూడిన ఒత్తిడిలో ఉన్నట్లు భావిస్తారు. కళ్లు మాటిమాటికీ మూసుకొంటూ కళ్లలో తెలుపు భాగం ఎక్కువగా కనిపిస్తే అది భయంతో శరీరంలో ఎక్కడో నొప్పిని అనుభవిస్తున్నట్లుగా సంకేతం. కళ్లు మూసుకుని నిద్రిస్తున్నట్లుగా ఉంటే ఆవు సేదతీరుతున్నట్లు గోపాలకులు గమనిస్తారు. నడకలో విశ్వాసం, ధైర్యం కనపడితే పశువులు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుసుకొంటారు. అవి తలను నేలవైపు దించి అడుగులు వేస్తుంటే సౌఖ్యంగా లేనట్లు భావిస్తారు. అలా వాటి అవస్థలను గుర్తెరిగి మురళిని శ్రీకృష్ణుడు ఊదేవాడట. ఆలమందలు అలా ఊరట చెందేవి. సంగీతం తీయని మాటకన్న మధురమైందని సామవేదం చెబుతోంది. గోపాలుడికి పశుపోషణతోపాటు వాటి నైజం బాగా తెలుసునని శ్రీకృష్ణోపనిషత్తు వివరిస్తోంది. ఆహారంతో పాటు శ్రావ్యమైన సంగీతాన్ని ఆవులు ఆస్వాదిస్తాయని నందుడు శ్రీకృష్ణుడికి చెప్పాడంటారు. ఆలమందల అలవాట్లను క్షుణ్నంగా పరిశీలించి వాటిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి వేణునాదాన్నే ఎన్నుకున్నాడు మాధవుడు. ఉదయమే ఆవుల పొదుగులు పాలతో నిండి ఉన్నప్పుడు భైరవి రాగాన్ని మధురంగా పిల్లన గ్రోవిపై ఊదేవాడు. ఈ రాగాన్ని వింటూ ఆవులు కడివెడు పాలు ఇచ్చేవట. భైరవి రాగాన్ని వినగానే గోప బాలకులందరూ చద్ది అన్నాలు కట్టుకొని పశువులను వెంటపెట్టుకొని అడవి వైపు వెళ్ళేవారట. పచ్చిక బయళ్లలో మేసి మధ్యాహ్నం ఆవులు తీరికగా కూర్చున్నవేళ మధ్యమావతి పలికించాలంటారు. రాత్రి పశువులు నిద్రించేవేళ హిందోళం చాలా మంచి రాగమని చెబుతారు. శ్రీకృష్ణుడికి, ఆయన వెంట తిరిగే గోప బాలురకు తెలిసిన ఈ విద్యను గోపాలక విద్య అంటారు. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానికి ముందు ఈ గోపాలక విద్యను పాండవులలో అందరికన్నా చిన్నవాడైన సహదేవుడికి అందించాడని భారతం చెబుతోంది.