en
Feedback
గీతామకరందము

గీతామకరందము

Open in Telegram
866
Subscribers
No data24 hours
-27 days
-430 days

Data loading in progress...

Attracting Subscribers
September '26
September '26
+3
in 0 channels
August '26
+13
in 0 channels
Get PRO
July '26
+17
in 0 channels
Get PRO
June '26
+20
in 0 channels
Get PRO
May '26
+18
in 0 channels
Get PRO
April '26
+11
in 0 channels
Get PRO
March '26
+11
in 0 channels
Get PRO
February '26
+14
in 0 channels
Get PRO
January '26
+13
in 0 channels
Get PRO
December '25
+24
in 0 channels
Get PRO
November '25
+14
in 0 channels
Get PRO
October '25
+22
in 0 channels
Get PRO
September '25
+9
in 1 channels
Get PRO
August '25
+10
in 0 channels
Get PRO
July '25
+13
in 0 channels
Get PRO
June '25
+10
in 0 channels
Get PRO
May '25
+11
in 0 channels
Get PRO
April '25
+14
in 0 channels
Get PRO
March '25
+13
in 0 channels
Get PRO
February '25
+17
in 0 channels
Get PRO
January '25
+16
in 0 channels
Get PRO
December '24
+31
in 1 channels
Get PRO
November '24
+10
in 0 channels
Get PRO
October '24
+15
in 0 channels
Get PRO
September '24
+27
in 0 channels
Get PRO
August '24
+28
in 2 channels
Get PRO
July '24
+14
in 1 channels
Get PRO
June '24
+18
in 0 channels
Get PRO
May '24
+47
in 0 channels
Get PRO
April '24
+41
in 0 channels
Get PRO
March '24
+15
in 1 channels
Get PRO
February '24
+32
in 0 channels
Get PRO
January '24
+41
in 0 channels
Get PRO
December '23
+35
in 0 channels
Get PRO
November '23
+8
in 0 channels
Get PRO
October '23
+7
in 0 channels
Get PRO
September '23
+6
in 0 channels
Get PRO
August '23
+9
in 0 channels
Get PRO
July '23
+16
in 0 channels
Get PRO
June '23
+9
in 0 channels
Get PRO
May '23
+18
in 0 channels
Get PRO
April '23
+9
in 0 channels
Get PRO
March '23
+14
in 0 channels
Get PRO
February '23
+720
in 0 channels
Date
Subscriber Growth
Mentions
Channels
08 September0
07 September0
06 September0
05 September+2
04 September0
03 September+1
02 September0
01 September0
Channel Posts
08-08-గీతా మకరందము అక్షరపరబ్రహ్మయోగము -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు, శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి. అ|| పరమాత్మను పొందుటకు అవలంబించవలసిన ధ్యానపద్ధతిని వివరించుచున్నారు- అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా | పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచిన్తయన్ || టీక:- పార్థ= ఓ అర్జునా!, అభ్యాసయోగయుక్తేన = అభ్యాసమనెడి యోగముతో గూడినదియు, న అన్యగామినా = ఇతరవిషయములమీదికి పోనిదియునగు, చేతసా = మనస్సుచేత, దివ్యమ్‌ = అప్రాకృతుడైనట్టియు, (లేక స్వయం ప్రకాశస్వరూపుడైనట్టియు), పరమమ్‌ = సర్వోత్తముడైనట్టియు, పురుషమ్‌ = పరమపురుషుని, అనుచిన్తయన్ = మాటిమాటికి స్మరించుచున్నవాడై, (తమ్‌ ఏవ = ఆ పరబ్రహ్మనే), యాతి = పొందుచున్నాడు. తా:- ఓ అర్జునా! అభ్యాసమను యోగముతో గూడినదియు, ఇతర విషయములపైకి పోనిదియునగు మనస్సుచేత, అప్రాకృతుడైన (లేక స్వయంప్రకాశస్వరూపుడైన) సర్వోత్తముడగు పరమపురుషుని మరల మరల స్మరించుచు మనుజుడు వారినే పొందుచున్నాడు. వ్యాఖ్య:- ఏ ప్రకార మాచరించినచో మనుజుడు ఆత్మసాక్షాత్కారమును బడయ గల్గునో, ఆ పద్ధతి యిచట చెప్పబడినది. ఈ శ్లోకమున ఆత్మరూపపరమపురుషుని జేరుటకు మూడు సదుపదేశములు గావింపబడినవి. అభ్యాసయోగమును శీలించవలెను. (2) చిత్తము (పరమాత్మను విడిచి) ఇతరత్ర పోగూడదు. (3) ఆత్మనుగూర్చియే మరల మరల చింతన చేయవలెను. (1)‘అభ్యాసయోగము’ - గీతయందు భగవానుడు మోక్షప్రాప్తికై కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞానాది వివిధయోగములను గూర్చి తెలిపియుండిరి. ఇపుడీశ్లోకమున మఱియొక విచిత్రమైన యోగమును గుఱించి వచించుచున్నారు. అదియే అభ్యాసయోగము. ఇది ప్రత్యేకముగ ఒక యోగముకాకున్నను అన్ని యోగములతో మిళితమైయుండును. అభ్యాసమునకు ఒక యోగముయొక్క అంతస్తు (Status) నిచ్చి భగవానుడు దీనిని మిక్కుటముగ గౌరవించిరి. కావున ముముక్షువులకది యెంత ప్రధానమైనదో దీనివలన తెలియగలదు. ఏ యోగమైనను అభ్యాసములేనిచో ఎట్లు ఫలించును?కావున అన్ని యోగములకును అభ్యాస మావశ్యకమే అయియున్నది. గీత 6వ అధ్యాయమున మనోనిగ్రహమునకు అభ్యాసవైరాగ్యము లెంతయో అవసరములని భగవాను డిదివఱకే తెలిపియుండిరి*. ‘అభ్యాసవైరాగ్యాభ్యాం తన్నిరోధః’ - అని పతంజలి మహర్షియు ఆ విషయమునే నొక్కిచెప్పిరి. ఈ ప్రకారముగ అధ్యాత్మరంగమున అభ్యాసము ఉన్నతస్థానము నాక్రమించియున్నది. లౌకికక్షేత్రమందును దాని యావశ్యకత అందఱును ఎఱిగినదే. దుర్వాసనలు, దుస్సంకల్పములు అభ్యాసముచే ఎట్లు రూఢిపడునో, అట్లే సద్వాసనలు, సత్సంకల్పములు, దైవవిచారణ అభ్యాసముచే స్థిరత్వమును బడయగలవు. మురికిపోవుటకు సబ్బు, సీకాయ, సున్నిపిండి మొదలైన అనేకవస్తువులున్నను, నీటితో చేరినపుడే అవి మాలిన్యమును బోగొట్ట సమర్థములగునట్లు, ఏ యోగమైనను అభ్యాసయోగముతో మిళితమైనపుడే ఫలితముల నొసంగగల్గును. ‘చేతసా నాన్యగామినా’ - ఇక రెండవ విషయము చిత్తము ఇతరత్ర పరుగిడకుండుట. అనగా అవ్యభిచారరూపమై వర్తించుట. చిత్తము దృశ్యవిషయములందు వ్యాపింపక ధ్యేయవస్తువగు పరమాత్మయందే స్థిరముగ నుండవలెను. దృగ్వస్తువగు ఆత్మ కన్యముగ తోచునదియంతయు అనగా దృశ్యపదార్థజాతమంతయు నశించిపోవునదియేయని నిశ్చయించి దానినుండి మనస్సును వివేకముచే మరల్చి ఆత్మయందే స్థాపనము చేయవలెను. చిత్తము ఊరకనుండజాలదు గనుక దానికి చింతించుటకు ఏదైన వస్తువు నొసంగవలెను. కాబట్టి ప్రాపంచికవస్తువులపై దానిని పోనీయక దైవవస్తువునందే కేంద్రీకరించవలెనని యిచట చెప్పబడినది. ‘అనుచిన్తయన్’ - పరమపురుషుడగు ఆత్మనుగూర్చియే మరల మరల చింతనజేయవలెనని బోధింపబడినది. ‘చిన్తయన్’ అని చెప్పక ‘అనుచిన్తయన్’ అను చెప్పుటచే మాటిమాటికి ఆ దైవచింతనారూప ప్రయత్నమును గావించవలెనని సూచింపబడినది. ఈ ప్రకారముగ సాధనచేయుచురాగా మనుజుడు తప్పక ఆ పరమాత్మపదమును జేరగలడని ‘యాతి’ అను పదముచే గీతాచార్యులు స్పష్టముగా నిరూపించివైచిరి. కాబట్టి ముముక్షువులు భగవద్వాక్యములందు పూర్ణవిశ్వాసముంచి ఆయా సాధనలను గావించి కృతార్థులు కావలెను. ప్ర:- భగవంతు డెట్టివాడు? ఉ:- అప్రాకృతస్వరూపుడు, స్వప్రకాశరూపుడు, సర్వోత్తముడు. ప్ర:- వానిని పొందుట కుపాయమేమి? ఉ:- (1) చిత్తమును దృశ్యవిషయములపైకి పోనీయక (2) పరమాత్మనే అనవరతము చింతన జేయుచు - ఈ ప్రకారముగ సదా అభ్యాసము సలుపుచుండవలెను. ఇదియే మోక్షోపాయము. ప్ర:- భగవద్ధ్యానము చేయువాని చిత్తమెట్లుండవలెను? ఉ:- ధ్యేయమగు పరమాత్మయందుతప్ప మఱి దేనియందును అది ప్రవర్తింపగూడదు. ---------------------- * అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేణ చ గృహ్యతే. (6-35)

2
జీవుడు తన మనోబుద్ధులను నిరంతరము దైవమునకర్పించినచో, బ్రహ్మసాయుజ్యము దానియంతటనదియే వచ్చిచేరును. కావున జనులు తమ మనోబుద్ధులను దృశ్యవిషయములనుండి మరలించి దైవమందు సంస్థాపితము చేయవలెను. అపుడే తాము వాంఛించు పరమానందరూపలక్ష్యము చేకూరగలదు. ప్ర:- దేవుని ఎపుడు స్మరించవలెను? ఉ:- ఎల్లకాలములందు, మాటిమాటికి స్మరించవలెను. ప్ర:- అట్లు నిరంతరము దైవచింతనచేయవలసియుండిన, ఇక జీవిత నిర్వహణ మెట్లు జరుగగలదు ? ఉ:- దైవస్మరణ చేయుచు వారివారివృత్తులను, కార్యములను ధర్మపూర్వకముగ జరుపుకొనవచ్చును (మామనుస్మర యుధ్యచ). ప్ర:- భగవంతుని పొందుటకు ఉపాయమేమి? ఉ:- వారివారి మనోబుద్ధులను భగవంతునకు అర్పించుటయే (అనవరత దైవచింతన గావించుటయే) (మయ్యర్పిత మనోబుద్ధిః).
44
3
08-07-గీతా మకరందము అక్షరపరబ్రహ్మయోగము -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు, శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి అ|| అంత్యకాల దైవసంస్కారముకొఱకై యావజ్జీవిత దైవసంస్మరణమును ప్రోత్సహించుచున్నారు- తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ | మయ్యర్పితమనోబుద్ధిః మామేవైష్యస్యసంశయః || టీక:- తస్మాత్‌= అందువలన, సర్వేషుకాలేషు = అన్నికాలములందును, (ఎల్లప్పుడును) మామ్‌ = నన్ను, అనుస్మర = స్మరింపుము, యుధ్య చ = యుద్ధమును (స్వధర్మమును) గూడ చేయుము, మయి = నా యందు, అర్పిత = సమర్పింపబడిన, మనోబుద్ధిః = మనస్సు, బుద్ధి గలవాడవై, మామ్‌ ఏవ = నన్నే ఏష్యసి = పొందగలవు, అసంశయః = (ఈ విషయమున) సందేహములేదు. తా:- కాబట్టి ఎల్లకాలములందును నన్ను స్మరించుచు (నీ స్వధర్మమగు) యుద్ధమునుగూడ జేయుము. ఈ ప్రకారముగ నా యందు సమర్పింపబడిన మనోబుద్ధులు గలవాడవైనచో నీవు నన్నే పొందగలవు. ఇట సంశయము లేదు. వ్యాఖ్య:- 5వ శ్లోకమున అంత్యకాలమందుగూడ (అన్తకాలే చ) భగవచ్చింతన చేయువారికి పరమాత్మపదవి సంప్రాప్తించునని తాను వచించిన వాక్యమును ‘అంత్యకాలమందు మాత్రమే దైవచింతన చేయవలె’ నని కొందఱు అర్థముచేసికొని జీవితకాలమంతయు సోమరులుగనుండి, విషయచింతనలో గడిపి దైవధ్యానమునకై వార్థక్యము వఱకు లేక మరణకాలమువరకు వేచియుందురేమోయని తలంచి అట్టి ప్రమత్తులకు తగిన పాఠము బోధించుటకు కాబోలు, వారిని తీవ్రముగ హెచ్చరించుటకు కాబోలు భగవానుడీ శ్లోకమును మరల చెప్పినవారైరి. ‘అన్తకాలే చ’ అను పైశ్లోకమునకు ‘తస్మాత్ సర్వేషు కాలేషు’ అను ఈ శ్లోకము భాష్యముగానున్నది. అందువలన (తస్మాత్) ‘ఎల్లకాలములందును నన్ను స్మరింపుము’. ‘తస్మాత్’ అను పదమును ప్రయోగించుటవలన నిరంతర దైవచింతనవలననే పైనదెల్పిన అంత్యకాలసంస్మరణ భాగ్యము లభించునని స్పష్టమగుచున్నది. దీనిచే, కేవలమొక వార్థక్యమే, లేక మరణకాలమే భగవత్స్మరణకు కాలము కాదనియు బాల్యయౌవనములందుగూడ దైవచింతన చేయవలెననియు అర్థమగుచున్నది. ప్రకాశము అంతరించినచో వెంటనే అంధకారమావరించునట్లు, భగవచ్చింతనను మఱచినచో మాయ తత్ క్షణమే వచ్చి జొరబడుటకు అవకాశముకలదు. కాబట్టి సప్తాహాది మహోత్సవములందు అఖండదీపమును వెలిగించుచందమున హృదయకుహరమున దైవస్మృతి నిత్యము వెలుగులాగున చూడవలెను. ‘అనుస్మరన్’ - స్మరన్ అని చెప్పక అనుస్మరన్, అని చెప్పుటవలన పరమాత్మను మాటిమాటికి స్మరించుచుండవలెనని బోధపడుచున్నది. శ్రవణ, మనన, నిదిధ్యాసములను విడువకుండ నాచరించుచుండవలెను. ఏదైనా ఒక భావము హృదయమందు లెస్సగ రూఢిపడవలెననిన స్మరణము చాలదు. అనుస్మరణము (మాటిమాటికి స్మరించుట) ఉండవలెను. ముందుగా టిక్కెట్టు కొని సిద్ధముగానున్నవానికి రైలు ఎప్పుడు వచ్చినను దిగులు లేనట్లు, జీవితకాలమంతయు భగవచ్చింతనగలవానికి చిత్తము భగవన్మయమై, దైవసంస్కారపూరితమై యుండుటవలన ఆతనికి మృత్యువు ఎపుడు తటస్థించినను ఆనందముగనే యుండును. అయితే కొందఱిట్లు ప్రశ్నించుదురు. ’అయ్యా, నిరంతరము దైవమును చింతించుచుండవలెనని చెప్పుచున్నారే, అట్లు చేయుచుండినచో ఇక మా జీవితచర్య ఎట్లు కొనసాగగలదు? కుటుంబమును పోషించుకొనుట ఎట్లు ?’ - అట్టివారికి తగిన సమాధానమును భగవాను డీశ్లోకమందు జెప్పెను. ‘మాం అనుస్మర యుధ్య చ’ - ‘నన్ను స్మరించుచు యుద్ధమునుగూడ జేయుము’ - ఇదియే ఆ సమాధానము. అర్జునుడు క్షత్రియుడు కావున అతని స్వధర్మమగు యుద్ధము ప్రస్తావించబడెను. తక్కినవారు వారి వారి వర్ణోచిత, ఆశ్రమోచిత క్రియలను గావించుచు పరమాత్మను సంస్మరించు చుండవలెనని భావము. జనులు వారి వారి దైనందినకార్యములను - పౌరోహిత్య, వ్యాపార, వ్యవ్యసాయ, సేవాదికృత్యములను నిరాటంకముగ జేసికొనుచు భగవత్స్మరణను మాత్రము విడువకుండ నుండవలెను. అర్జునుడు శ్రీకృష్ణుని ముందుపెట్టుకుని, వారినే చూచుచు, స్మరించుచు యుద్ధమను భీకరకార్యమునే నిర్వహింపగల్గినపుడు, తక్కినవారు భగవత్స్మరణచేయుచు వారి వారి సంసారకార్యములను ఏల నిర్వహింపలేరు? తప్పక నిర్వహించుకొనవచ్చును. అట్లు కావింపవలెననియే భగవదాదేశము. ‘మయ్యర్పిత మనోబుద్ధిః’ - మనుజుని మనస్సు , బుద్ధి ఎప్పుడు నిరంతరము భగవంతునియందే సమర్పితమై యుండునో, అపుడాతడు భగవత్సాయుజ్యమును తప్పక పొందగలడని యిచట చెప్పబడినది. ఇచట మనస్సుతో బాటు బుద్ధినిగూడ జేర్చుటలో ఒక విశేషము కలదు. మనస్సు సంకల్పించును; బుద్ధి నిశ్చయించును. మనస్సు సంకల్పించినదానిని బుద్ధి నిశ్చయించనిచో, ధ్రువపఱచనిచో ఆ పదార్థమునందు మనస్సు నిశ్చలముగ నిలువదు. కాబట్టి మనస్సుతోబాటు బుద్ధినిగూడ కూడగట్టుకొని పరమాత్మయందు నిలుపవలెను. ‘అసంశయః’ - అట్లు చేసినచో నిస్సంశయముగ దైవసాక్షాత్కారము కలుగగలదని నొక్కి చెప్పడమైనది. రెండుశ్లోకముల క్రిందటనే (5వ శ్లోకమున) ‘నాస్త్యత్రసంశయః’ - (ఈ విషయమున సందియము లేదు) అని చెప్పి మరల వెనువెంటనే ‘అసంశయః’ అని పలుకుటవలన ఆ వాక్యములు పరమసత్యములని, వానిపై విశ్వాసముగలిగి తద్రీతి తప్పక ననుష్ఠింపవలెననియు బోధించినట్లైనది. జీవుడు తాను చేయవలసినది చేసినచో, ఈశ్వరుడు తానివ్వవలసినది తప్పక ఇచ్చును.
36
4
08-06-గీతా మకరందము అక్షరపరబ్రహ్మయోగము -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు, శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి. అ|| జీవు డేభావముతో శరీరమును వీడునో ఆ రూపమునే పొందునని వచించుచున్నారు- యం యం వాపి స్మరన్ భావం త్యజత్యన్తే కలేబరమ్ | తం తమేవైతి కౌన్తేయ సదా తద్భావభావితః || టీక:- కౌన్తేయ = ఓ అర్జునా!, (యః = ఎవడు) అన్తే = మరణకాలమందు, యం యం వాపి భావమ్‌ = ఏ యే భావమును (లేక రూపమును), స్మరన్‌= తలంచుచున్నవాడై, కలేబరమ్‌ = శరీరమును, త్యజతి = విడుచుచున్నాడో, (సః = వాడు) సదా = ఎల్లప్పుడును, తద్భావభావితః సన్‌ = ఆయా భావముయొక్క స్మరణముచేగలిగిన సంస్కారముగలవాడై, తం తం ఏవ (భావము) = ఆ యా రూపమునే, ఏతి = పొందుచున్నాడు. తా:- అర్జునా! ఎవడు మరణకాలమున ఏయే భావమును (లేక రూపమును) చింతించుచు దేహమును వీడునో వాడట్టిభావము యొక్క స్మరణచేగలిగిన సంస్కారము గలిగియుండుటవలన ఆ యా రూపమునే పొందుచున్నాడు. వ్యాఖ్య:- మనుజుడు నిరంతరము దేనినిగూర్చి చింతించుచుండునో దానిని గూర్చిన సంస్కారమే అతని చిత్తమున ఏర్పడును. కావున అంత్యకాలమున చిత్తమందు ఏ సంస్కారము యుండునో తదనుగుణ్యమగు జన్మనే (శరీరమునే) యాతడు పొందునని యిట చెప్పబడినది. జడభరతుడు అంత్యకాలమున లేడిని గూర్చి చింతించుచు మఱుజన్మయందు లేడియై పుట్టినట్లు భాగవతమున పేర్కొనబడియున్నది. ‘యద్భావం తద్భవతి’ ఎట్టి భావమును గలిగియుండునో అట్టి రూపమునే పొందును. అయితే ఆ అంత్యకాలసంస్కారము జీవితకాల నిరంతర ప్రయత్నముపై ఆధారపడియున్నది. (సదా తద్భావభావితః). జీవితమంతయు దేనిని చింతించుచుండునో చివరిరోజులలోను అదియే చింతన మనస్సునకు వచ్చును. మరణకాలమందును ఆ సంస్కారమే ప్రబలముగనుండును. అందుచే మరణానంతరము ఆ యా రూపములనే ఆతడు పొందుచుండును. కాబట్టి జీవితమంతయు క్షణికములగు దృశ్యవస్తువులను గూర్చిన విచారణలతో వెళ్లబుచ్చక, పరమాత్మచింతన చేయుచుండుచో అట్టి దైవసంస్కారమే మనస్సునందు రూఢిపడ, అంత్యకాలమందును దైవస్మరణయే ఆతనికి కలుగును. తత్ఫలితముగ నతడు భగవదైక్యమును, ఆత్మసాయుజ్యరూపమోక్షమును బొందును (స యాతి పరమాంగతిమ్). కాబట్టి అంత్యకాలసత్సంస్కారమును రూపొందించుటకొఱకై జీవితమంతను తత్సంబంధమైన అభ్యాసమే చేయవలెను. ప్రపంచములోకెల్ల సర్వోత్తమపదవి, దుఃఖరహితమగు నిరతిశయానందపదవి ఆత్మసాక్షాత్కారమే (భగవత్సాయుజ్యమే) కావున, తద్దైవసంస్కారము మనస్సునందు రూఢిపడుటకొఱకై జీవితమంతయు భగవచ్చింతన, స్మరణ, విచారణ, ధ్యానాదులను నిరంతరము జరుపవలెను. దైవసంస్కారము ఒక్కక్షణములో ఏర్పడునదికాదు. దానికి అనవరతప్రయత్న మవసరము. జీవితమంతయు సదా విషయసముపార్జనయందు , భోగజాలసంగ్రహణములందు గడిపివైచినచో అంత్యకాలమున దైవసంస్కారము, దైవస్మరణము ఎట్లేర్పడగలదు ? కావున అపుడు పశ్చాత్తాపపడవలసి వచ్చును. ఇక్కారణమున బాల్యయౌవనములందే, శరీరము ఆరోగ్యముగ నున్నపుడే, వార్ధక్యము రాకమునుపే జీవుడు పరమార్థసాధనయందు ఆరితేరియుండవలెను , ఉత్తమదైవసంస్కారము నేర్పఱచుకొనవలెను. బంధమునకు మరియు మోక్షమునకు తానే కర్త. ఉత్తమజన్మగాని, నికృష్టజన్మగాని, జన్మరాహిత్యముగాని తనచేతులలోనే యున్నది. అవియన్నియు జీవుని అంత్యకాలభావముపై, సంస్కారముపై ఆధారపడియున్నవి కనుకను, ఆ సంస్కారము యావజ్జీవితసాధనలపై ఆధారపడియున్నది కనుకను, జీవుడు మొదటినుండియు బహుజాగరూకుడై తన చిత్తమును దైవమయముగ గావించుకొనుచుండవలెను. ‘తస్మాత్సర్వేషు కాలేషు …. ’ అను రాబోవు శ్లోకముద్వారా ఈ విషయమునే భగవానుడింకను విశదముగ బోధింపనున్నారు. అయితే జీవితమంతను సత్సంస్కారములు గలిగి అంత్యకాలమున ఒకవేళ కఫవాతపిత్తముల ప్రకోపముచే ఎవనికైన విస్మృతి సంభవించినను, ఆతని సద్గతి కేమియు లోటుండదని గ్రహించవలెను. ప్ర:-జీవుడు మరణానంతరము ఏ రూపమును బొందును? ఉ:- మరణకాలమున ఏ యే భావమును స్మరించునో, లేక ఏ యే రూపమునుగూర్చి భావించునో, ఆ యా రూపమునే పొందును. ప్ర:- అంత్యకాలమున దైవసంస్కార మెట్లేర్పడగలదు ? ఉ:- జీవితమంతయు దైవస్మరణ, దైవచింతనాదులను గావించుటవలన (సదా తద్భావభావితః).
48
5
సావధానస్య బుద్ధస్య పిశాచః కిం కరిష్యతి (యోగవాసిష్ఠము) ఓ రామచంద్రా! అజాగ్రతగనున్నచో నీ చిత్తమును కామము మ్రింగివేయగలదు. జాగ్రతగనున్నవాని చిత్తమును (కామ)పిశాచ మేమిచేయగలదు? ‘మామేవ’ - (నన్నే స్మరించుచు) ‘ఏవ’ అను పదము ప్రయోగించుటవలన ఒక్క భగవంతునితప్ప ఇతరమగు దేనిని చింతించరాదని తెలుపబడినది. ఏలయనిన, అట్లు దృశ్యవస్తువులనుగూడ చింతించుచుండినచో చిత్తమునకు విక్షేపముగలుగ, దైవధ్యానము సరిగాజరుగదు. ధ్యేయమందు మనస్సునకు నిలుకడ చిక్కదు. మనస్సు ఏకాగ్రముగనున్నపుడే దానిబలము హెచ్చును. కాబట్టి ఒకే దైవవస్తువునందు చిత్తమును సంలగ్న మొనర్చియుండవలెనని బోధింపబడినది. ఇక ఆప్రకారముగ అంత్యకాలమందుగూడ భగవత్స్మరణ చేయువానికి కలుగు ఫలితమేమి? ‘మద్భావం యాతి’ - నా స్వరూపమునే పొందును. ఫలితము తెలిసియుండినచో కార్యాచరణమందు విశేషప్రవృత్తి సంభవించును. దైవస్మరణకు ఫలితము దైవసాక్షాత్కారమే, స్వస్వరూపాత్మానుభవమే, మోక్షమే. కాబట్టి అట్లు అంత్యకాలమందును నిరంతర భగవత్స్మరణ, చింతన చేయువాడు ఘోరసంసార దుఃఖమును దాటి పునర్జన్మరహితుడై, శాశ్వతబ్రహ్మపదవి నొందగలడని ఇచట చెప్పబడినది. ఇంతియేకాదు. ఈ విషయమై యెవరికైనను సందేహముదయించునేమోయని తలంచి ‘నాస్త్యత్రసంశయః’ - “ఇట ఏ మాత్రము సంశయములేదు; నిక్కముగ వారు పరమాత్మపదమును బొందగలరు; ఇది ముమ్మాటికిని నిశ్చయము.” అని శ్రీకృష్ణపరమాత్మ కరుణతో నుపదేశించిరి. దయార్ద్రహృదయుడగు భగవానుడు భక్తులపై అపారకరుణను ఈ ప్రకారముగ వర్షించి జనులకు తన వాక్యములపై విశ్వాసమును గలుగజేయుచున్నారు. కాబట్టి ముముక్షువులిక సంకోచమును విడనాడి చిన్న చిన్న ఫలితములుకాక సాక్షాన్మోక్షమే ఫలితముగాగలదియు, నిరతిశయానందమే గమ్యముగాగలదియు నగు ఈ మహత్తర దైవస్మరణను శ్రద్ధాభక్తులతో నిరంతరము కొనసాగించవలెను. ప్ర:- జీవుడు అంత్యకాలమందుగూడ ఎట్టి భావన గలిగియుండవలెను? ఉ:- దైవమునే స్మరించుచు ఇతర భావన యెద్దియు లేకుండవలెను. ప్ర:- దాని ఫలితమేమి? ఉ:- దానిచే నతడు పరమాత్మస్వరూపమునే పొందుచున్నాడు. ప్ర:- కాబట్టి జీవు లెట్లు ప్రవర్తించవలెను? ఉ:- జీవితమంతను, అంత్యకాలమునుగూడ దైవచింతనాదులందే గడుపవలెను.
56
6
08-05-గీతా మకరందము అక్షరపరబ్రహ్మయోగము -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు, శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి. అ|| ఈ ప్రకారముగ అర్జునుని మొదటి యారుప్రశ్నలకు సంక్షేపముగ సమాధానము చెప్పి ఇక చివఱిప్రశ్నయగు అంత్యకాలభగవచ్చింతనమును గూర్చి విస్తారముగ తెలియజేయ ప్రారంభించుచున్నారు- అన్తకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేబరమ్ | యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః | టీక:- యః = ఎవడు, అన్తకాలే చ = మరణకాలమందుగూడ, మాం ఏవ = నన్నే, స్మరన్‌ = స్మరించుచు, కలేబరమ్‌ = శరీరమును, ముక్త్వా = విడిచి, ప్రయాతి = వెడలుచున్నాడో, సః = అతడు, మద్భావమ్‌ = నాస్వరూపమును, యాతి = పొందుచున్నాడు, అత్ర = ఈ విషయమమందు, సంశయ: = సందేహము, నాస్తి = లేదు. తా:- ఎవడు మరణకాలమందు కూడ నన్నే స్మరించుచు శరీరమును విడిచిపోవుచున్నాడో, అతడు నా స్వరూపమును పొందుచున్నాడు. ఇట సంశయమేమియును లేదు. వ్యాఖ్య:- ఇక చివరిదియగు ఏడవప్రశ్నకు భగవాను డిచట సమాధానము చెప్పుచున్నాడు. అంత్యకాలమున నియమితచిత్తులై పరమాత్మనెట్లు తెలిసికొనగలరో ఆ పద్ధతి యిచట వివరింపబడుచున్నది. ‘అన్తకాలేచ’ - మరణసమయమునగూడ ఎవడు పరమాత్మనే స్మరించుచు శరీరమును వీడునో, అతడు తప్పక ఆ పరమాత్మస్వరూపమునే పొందగలడని చెప్పబడినది. ఇచట ‘చ’ అనుపదము బాగుగ గ్రహింపదగియున్నది. సంస్కృతములో ‘చ’ అనగా ‘కూడ’ అని యర్థము. అంత్యకాలమందుగూడ నన్నే స్మరించువాడు ముక్తిని బొందునని శ్రీకృష్ణమూర్తి చెప్పుటవలన, జీవితకాలమందును, అంత్యకాలమందును గూడ దైవచింతన చేయవలసియుండునని స్పష్టమగుచున్నది. అట్లుకానిచో ‘కూడ’ అనుపదమునకు అర్థమేయుండదు. భగవంతుడు ‘అన్తకాల ఏవ’ (అంత్యకాలమందే) అనిచెప్పలేదు. అట్లు చెప్పియుండినచో సోమరులకు చక్కటి అవకాశము చిక్కియుండెడిది. కాని మనుజులను సోమరులుగా తయారుచేయుట భగవానుని యభిమతముకాదు. ‘తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర’ (కాబట్టి ఎల్లకాలములందును నన్ను స్మరింపుము) అని మున్ముందు గీతాచార్యులు ఈ శ్లోకతాత్పర్యమును ఇంకను చక్కగ విశదీకరింపగలరు. జీవితమంతయు నిరంతర దైవచింతనచేయువారికే చివరికాలమున దైవస్మరణ కలుగగలదు. పూర్వజన్మ పుణ్యసంస్కారబలముగల ఏ ఒకానొక మహానుభావునకో తప్ప తక్కిన ఎవరికిని మరణకాలమున అకస్మాతుగ దైవభావము కలుగదు. దానికి పూర్వమెంతయో గొప్పసాధన (Preparation) ఉండవలెను. ఒక నాటకము వేయవలెననిన అందలి పాత్రలు అభినయమును ఎన్నినెలలనుండియో బాగుగ అభ్యసించుచుందురు. ఒక విద్యార్థి పరీక్ష ‘ప్యాసు’ కావలెననిన సంవత్సరమంతయు బాగుగ చదవవలసి యుండును. సరిగా పరీక్ష రోజుననే పుస్తకముతెరచినచో అంతగా ప్రయోజనముండదు. అట్లే మరణకాలమునకు ఎంతయో ముందుగనే మనుజుడు తన చిత్తమును లెస్సగ భగవన్మయముగ నొనర్చియుంచుకొనవలెను. అత్తఱి అంత్యమందు సునాయాసముగ దైవస్మరణ కలుగుటకు అవకాశము యుండును. మఱియు పగలంతయు ఎట్టిభావములతో గూడియుండునో, రాత్రి స్వప్నమందును అట్టిభావములే కలుగుచుండును. ఆ ప్రకారమే జీవితమంతయు ఎట్టి భావములు, సంకల్పములు గలిగియుండునో, అంత్యకాలమందును అవియే జ్ఞాపకమునకు వచ్చును. కాబట్టి అంత్యకాలమున భగవత్స్మరణకలుగుటకు సహాయభూతముగ నుండుటకై జీవితమంతయు భగవచ్చింతన, ధ్యాన, విచారణాదులను లెస్సగ గావింపవలెను. మనస్సు ఉత్తమదైవసంస్కారపూరితము కావలెను. మరణకాలమున ఒక్కొక్కప్పుడు దేహము కఫవాతపిత్తములచే వివశమైయుండును. లేక స్మృతితప్పియుండును. కాబట్టి సరిగా అదేసమయమున అకస్మాత్తుగ దైవచింతన ప్రారంభించదలంచుట ప్రయాసకరముగ నుండును. ఒక్కొక్కప్పుడు అసలు సాధ్యపడనూపడదు. కావున అంత్యకాల సత్సంస్కారముకొఱకై జీవితమంతయు చిత్తమును పరమార్థమయముగ నొనర్చుకొనవలెను. ‘అన్తకాలే చ’ అనిచెప్పుటలో ఇంకొకరహస్యమున్ను కలదు. మాయ మహాబలవత్తరమైనది. అది జీవుని మోసగించుటకై నిరంతరము కాచుకొనియేయుండును. కావున ముముక్షువు దైవవిషయమున అంతిమశ్వాస వదలువఱకును బహుజాగ్రత్తగా నుండవలెను. కనుకనే గీతాచార్యులు ‘అంత్యకాలమందు గూడ నా స్మరణను వదలరాదనియు, అట్లు స్మరించువాడే ముక్తినిబొందు’ననియు సెలవిచ్చిరి. ఏమాత్ర మొకింత దైవవిస్మరణ జరిగినను దానినే మాయ ఊతగదీసికొని విజృంభించి జీవుని సంసారగర్తమున పడద్రోసివేయగలదు. పడవచే సముద్రమునంతను కష్టపడి దాటిదాటి సరిగా తీరమునకు పదిగజములదూరములో అజాగ్రత్తగనున్నచో మనుజు డెట్లు మునిగిపోగలడో ; నిచ్చెన ఎక్కిఎక్కి చివర ఒకమెట్టున్నదనగా అజాగ్రతవహించినచో ఎట్లుపడిపోవునో - ఆలాగుననే జీవితమంతయు దైవకృషిచేసినను, చివరిరోజులలో దానిని వదిలివేసినచో మాయ ప్రవేశించి విమోహమును గలుగజేయవచ్చును. గనుక పై హెచ్చరిక చేయబడినది. ఈ సందర్భమున శ్రీవసిష్ఠమహర్షి శ్రీరామచంద్రునకుగావించిన హితబోధ స్మరింపదగియున్నది. తవ నావహితం చిత్తం కామః కవలయిష్యతి
47
7
08-04-గీతా మకరందము అక్షరపరబ్రహ్మయోగము పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు, శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి. ॥అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్ | అధియజ్ఞోఽహమేవాత్ర దేహే దేహభృతాం వర || టీక:- దేహభృతాంవర = దేహధారులలో శ్రేష్ఠుడవగు ఓ అర్జునా!, క్షరః = నశించునట్టి, భావః = పదార్థము, అధిభూతమ్‌ = అధిభూతము (అనబడును), పురుషః చ = విరాట్పురుషుడు, లేక హిరణ్యగర్భుడే, అధిదైవతమ్‌ = అధిదైవతము (అనబడును), అత్ర దేహే = ఈ దేహమందు, అహమేవ = నేనే (పరమాత్మయే), అధియజ్ఞః = అధియజ్ఞుడు (అనబడుదును). తా:- దేహధారులలో శ్రేష్ఠుడవగు ఓ అర్జునా! నశించుపదార్థము అధిభూత మనబడును. విరాట్పురుషుడు లేక హిరణ్యగర్భుడే అధిదైవతమనబడును. ఈ దేహమందు నేనే (పరమాత్మయే) అధియజ్ఞుడనబడుదును. వ్యాఖ్య:- ‘ఈ దేహమందు అదియజ్ఞుడను నేనే’ అని భగవానుడు చెప్పినందువలన, సమస్తశరీరములందును అధియజ్ఞరూపమున సాక్షాత్ పరాత్పరుడే నివసించుచున్నాడని స్పష్టపఱుపబడినది. భగవంతుడు దూరముగానున్నాడని, ఆకాశముననో, పాతాళముననో ఉన్నాడని తలంచుట వెఱ్ఱి. వారు దేహాంతర్వర్తియై అతిసమీపమున నున్నాడు. కావున ఆత్మపరిశోధనచేసికొని, పంచకోశములను వేఱుచేసి అతనిని కనుగొని పరమశాంతిని బొందవలయును. మఱియు భగవత్సామీప్యమును గుర్తెఱింగి పాపకృత్యముల నెన్నడును చేయరాదు. సమస్తదేహములందును అధియజ్ఞుడై పరమాత్మ విలసిల్లుటబట్టి జనులలో ఒకరు తక్కువని, ఒకరు ఎక్కువని భావింపక సర్వప్రాణులందును సమభావముగల్గి దీనత్వమును వహింపక ఆత్మగాంభీర్యముతో నొప్పారుచు నుండవలెను. ‘దేహభృతాంవర’ - (దేహధారులలో శ్రేష్ఠుడు) అను పదముద్వారా మానవుడు దేహమును ధరించువాడేకాని వాస్తవముగ దేహముకాదని స్ఫురించుచున్నది. ప్ర:- అధిభూత మనగానేమి? ఉ:- నశించు పదార్థమే (సమస్తదృశ్యసముదాయమే) అధిభూత మనబడును. ప్ర:- అధిదైవత మనగానేమి? ఉ:- విరాట్పురుషుడు, లేక హిరణ్యగర్భుడే అధిదైవతము. ప్ర:- అధియజ్ఞుడెవ్వడు? ఉ:- ఈ దేహమందు శ్రీకృష్ణమూర్తియే (సాక్షాత్ పరమాత్మయే) అధియజ్ఞుడు.
52
8
08-03-గీతా మకరందము అక్షరపరబ్రహ్మయోగము -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు, శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి. అ|| అర్జునుని ఏడుప్రశ్నలకును భగవానుడు క్రమముగ సమాధాన మొసంగుచున్నారు- శ్రీ భగవానువాచ:- ॥అక్షరం బ్రహ్మ పరమం స్వభావోఽధ్యాత్మముచ్యతే | భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః || టీక:- పరమమ్‌ = సర్వోత్తమమైన (నిరతిశయమైన), అక్షరమ్‌ = నాశరహితమైనది, బ్రహ్మ = బ్రహ్మము (అనబడును), స్వభావః = ప్రత్యగాత్మభావము, అధ్యాత్మమ్‌ = అధ్యాత్మమని, ఉచ్యతే = చెప్పబడుచున్నది, భూతభావోద్భవకరః = సమస్తప్రాణులకు, వస్తువులకు ఉత్పత్తినిగలుగజేయు, విసర్గః = త్యాగపూర్వకమగు క్రియ (దేవతలనుద్దేశించి మంత్రపూర్వకముగ అగ్నియందు ఆహుతులను సమర్పించుటయను యజ్ఞము మొదలైనవి), కర్మసంజ్ఞితః = కర్మమనుపేరు గల్గియున్నది. తా:- శ్రీ భగవానుడు చెప్పుచున్నారు - సర్వోత్తమమైన (నిరతిశయమైన) నాశరహితమైనదే, బ్రహ్మమనబడును. ప్రత్యగాత్మభావము అధ్యాత్మమని చెప్పబడును. ప్రాణికోట్లకు ఉత్పత్తిని గలుగజేయు (యజ్ఞాదిరూపమగు) త్యాగపూర్వకమైన క్రియ కర్మమను పేరు కలిగియున్నది. వ్యాఖ్య:- అర్జునుడడిగిన ఏడుప్రశ్నలకును క్రమముగ భగవాను డిచట సమాధాన మొసంగుచున్నారు. అందు మొదటిప్రశ్నయగు బ్రహ్మమనగానేమి యనుదానికి సర్వోత్తమమైన (నిరతిశయమైన) నాశరహితవస్తువే బ్రహ్మమని వచింపబడెను. ప్రపంచమున సమస్త దృశ్యపదార్థములున్ను కాలక్రమమున నశించిపోవుచున్నవి. అవి క్షరములు. నశింపని వస్తువొక్కటియే కలదు. అదియే దృగ్రూపమగు పరబ్రహ్మము. అది అక్షరము. నాశరహితమైనది. ‘పరమమ్’, ‘అక్షరమ్’ అని చెప్పుటవలన అది నిరతిశయ అక్షరస్వరూపమనియు, ఏ కాలమందును అది నశింపదనియు, దేశకాలాదులచే నెన్నడును పరిచ్ఛిన్నముకాదనియు స్పష్టమగుచున్నది. ఇక రెండవ ప్రశ్నయగు అధ్యాత్మమనగానేమి యనుదానికి ‘స్వభావమే’ అధ్యాత్మమని చెప్పబడెను. స్వ + భావము = స్వభావము. తనయొక్క భావము. అనగా ప్రత్యగాత్మ రూపమే అధ్యాత్మమని అర్థము. సామాన్యముగ జనులు అజ్ఞానవశమున తాను దేహమని, మనస్సని తలంచుచుందురు. అదియే వారి స్వరూపమని, స్వభావమని భావించుచుందురు. అది చాల పొరపాటని ఈ శ్లోకముద్వారా తెలియుచున్నది. జీవుని వాస్తవస్వరూపము అధ్యాత్మము, అనగా ప్రత్యగాత్మభావమేకాని దేహాదులుకాదు. తాను దేహమని, మనస్సని, ప్రపంచవస్తువని తలంచునంతవఱకు ఎవరికిని శాంతిగాని సుఖముగాని యుండనేరవు. ఏలయనిన అవి క్షరములు. అక్షరవస్తువునందే సుఖము కలదు. కావున తనస్వభావము, తనస్వరూపము ఆత్మయేకాని నశ్వరవస్తుసముదాయము కాదను దృఢనిశ్చయము గలిగియుండవలెను. ఇక మూడవప్రశ్న - కర్మమనగానేమి? భూతకోట్లయొక్క ఉత్పత్తికి హేతువగు యజ్ఞాదులు కర్మయని వచింపబడెను. ఎందుకనగా యజ్ఞముచే వర్షము, వర్షముచే సస్యములు, సస్యములచే ప్రాణుల యుత్పత్తి సంభవించుచున్నది. ఇచట విసర్గః అనగా వదలుట, త్యాగము. యజ్ఞమునందు హోమద్రవ్యములను వదలుదురు. హోమమందు ఆజ్యాదులను వదలుదురు. కావున ‘విసర్గః’ అనుపదమునకు హోమాదులతోగూడిన యజ్ఞాదిక్రియలని చెప్పవచ్చును. లేక, విసర్గః అనగా త్యాగము, త్యాగముతో గూడిన క్రియయనియు చెప్పవచ్చును. (దానమందు ధనమును త్యజించుట ఇత్యాదులు). ‘విసర్గః కర్మసంజ్ఞితః’ అని చెప్పబడినందువలన, త్యాగముతో గూడిన క్రియయే నిజమగు క్రియయని తేలుచున్నది. అదియే ఉత్తమజన్మకు, మోక్షమునకు హేతువగును. ప్ర:- బ్రహ్మమనగానేమి? ఉ:- సర్వోత్తమమైన లేక నిరతిశయమైనవస్తువే బ్రహ్మము. ప్ర:- అధ్యాత్మమనగా నేమి? ఉ:- స్వభావము, ప్రత్యగాత్మభావము అధ్యాత్మమనబడును. ప్ర:- కర్మమనగా నేమి? ఉ:- ప్రాణికోట్ల ఉత్పత్తికి హేతువగు (యజ్ఞాదిరూపమగు) త్యాగపూర్వకమైనక్రియ కర్మయనబడును.
58
9
08-01,02-గీతా మకరందము శ్రీ భగవద్గీత అథ అష్టమోఽధ్యాయః ఎనిమిదవ అధ్యాయము అక్షరపరబ్రహ్మయోగః అక్షరపరబ్రహ్మయోగము -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు, శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి. అర్జున ఉవాచ:- కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ | అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే || అధియజ్ఞః కథం కోఽత్ర దేహేఽస్మిన్మధుసూదన | ప్రయాణకాలే చ కథం జ్ఞేయోఽసి నియతాత్మభిః || టీక:- పురుషోత్తమ = పురుషశ్రేష్ఠుడవగు ఓకృష్ణా!, తత్‌ బ్రహ్మ = ఆ బ్రహ్మము, కిమ్‌ = ఏది? అధ్యాత్మమ్‌ = అధ్యాత్మము, కిమ్‌ = ఏది?, కర్మ = కర్మము, కిమ్‌ = ఏది? అధిభూతం చ = అధిభూతమున్ను, కిమ్‌ = ఎట్టిదిగా, ప్రోక్తమ్ = చెప్పబడినది, అధిదైవమ్ = అధిదైవము, కిమ్‌ = ఏదిగా, ఉచ్యతే = చెప్పబడుచున్నది, మధుసూదన = ఓ కృష్ణా! అస్మిన్ దేహే = ఈ దేహమందు, అధియజ్ఞః = అధియజ్ఞుడు, కః = ఎవడు?, అత్ర = ఈతనిని గూర్చి, కథమ్‌ = ఎట్లు (తెలిసికొనవలెను?), ప్రయాణకాలే చ = ప్రాణ ప్రయాణసమయమందును, నియతాత్మభిః = నియమింపబడిన మనస్సు గలవారిచేత (మనోనిగ్రహము గలవారిచేత) (త్వమ్‌ = నీవు), కథమ్‌ = ఎట్లు, జ్ఞేయః = తెలియబడువాడవు, అసి = అగుచున్నావు? తా:- అర్జునుడడిగెను.. -పురుషశ్రేష్ఠుడవగు ఓ కృష్ణా! ఆ బ్రహ్మమేది? అధ్యాత్మమెయ్యది? కర్మమనగానేమి? అధిభూతమని యేది చెప్పబడినది? అధిదైవమని దేనిని చెప్పుదురు? ఈ దేహమందు అధియజ్ఞుడెవడు? ఆతనిని తెలిసికొనుట ఎట్లు? ప్రాణప్రయాణ సమయమందు నియమితచిత్తులచే మీరెట్లు తెలిసికొనబడగలరు? వ్యాఖ్య:- క్రిందటి అధ్యాయముయొక్క కడపటి రెండుశ్లోకములందు శ్రీకృష్ణమూర్తి బ్రహ్మము, అధ్యాత్మము మున్నగువానినిగూర్చి సంక్షేపముగ తెలియజేయ, అర్జునుడు వెంటనే అందుకొని వానియన్నిటిని సవిస్తరముగ బోధించవలసినదిగా భగవానుని ప్రార్థించుచు ఏడు ప్రశ్నల నడిగెను. అందులకు భగవానుడు మొదటి ఆఱుప్రశ్నలకు సంక్షేపముగ ప్రత్యుత్తరమిచ్చి, చిట్టచివఱి ప్రశ్నయగు అంత్యకాలభగవచ్చింతనమును గుఱించి విపులముగ ప్రబోధించిరి. ఈ ప్రకారముగ పూర్వాధ్యాయముయొక్క చివర సూచనామాత్రముగ తెలియజేయబడినదానిని, మఱు అధ్యాయమున విపులముగ బోధించుటను సమాసవ్యాసపద్ధతి యందురు. అర్జునుని ప్రశ్నలతో ఈ అధ్యాయము ప్రారంభమై భగవానుని జవాబులతో అంతమైనది. అంత్యకాలమున యోగనిష్ఠాపరులు ఎట్టిభావన గలిగియుండినచో బ్రహ్మసాయుజ్య మొందగలరో అనువిషయము అతిముఖ్యమైనది యగుటవలనను, జీవితమంతయు ధ్యానాద్యనుష్ఠానములు సలుపుట అట్టి భగవత్స్థితియందు నిలుకడకలుగుట కొఱకే యగుటవలనను, ఆ ఘట్టమును గీతాచార్యులు చక్కగ విశదీకరించిచెప్పిరి. ‘పురుషోత్తమా’ , ‘మధుసూదనా’ యను పదములద్వారా శ్రీకృష్ణుని స్తుతించుటలో అర్జునుని భక్తిభావము లెస్సగ వెల్లడియగుచున్నది. క్రిందటి అధ్యాయముయొక్క కడపటివాక్యములందు భగవానుడు ‘యుక్తచేతసః’ (నియమితచిత్తులచే) అని చెప్పుటయు ఈ అధ్యాయప్రారంభమున అర్జునుడు ‘నియతాత్మభిః’ (మనోనియమముకలవారిచే) అని మరల పేర్కొనుటయు చూడ నియమితచిత్తులకు, మనస్సును స్వాధీనపఱచుకొనినవారికి మాత్రమే అధ్యాత్మరంగమున ఉత్తమఫలితములు చేకూరగలవనియు, అట్టి మనోనిగ్రహము మోక్షమున కత్యావశ్యకమనియు స్పష్టమగుచున్నది.
77
10
07-30-గీతా మకరందము. విజ్ఞానయోగము -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు, శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః | ప్రయాణకాలేఽపి చ మాం తే విదుర్యుక్తచేతసః || టీక:- యే = ఎవరు, సాధిభూతాధిదైవమ్ = అధిభూత, అధిదైవములతో గూడినట్టియు, సాధియజ్ఞం చ = అధియజ్ఞముతో గూడినట్టియు, మామ్‌ = నన్ను, విదుః = తెలిసికొనుచున్నారో, తే= వారు, ప్రయాణకాలే అపి చ = దేహవియోగకాలమందును, యుక్తచేతసః = (దైవమందు) నిలుకడగల మనస్సుగలవారై (లేక, మనోనిగ్రహముకలవారై), మామ్‌ = నన్ను, విదుః = తెలిసికొందురు. తా:- అధిభూత, అధిదైవ, అధియజ్ఞములతో గూడియున్న నన్నెవరు తెలిసికొందురో వారు దేహవియోగకాలమందును (దైవమందు) నిలుకడగల మనస్సుగలవారై (మనోనిగ్రహముకలవారై) నన్నెఱుంగగలరు. వ్యాఖ్య:- ఎవరు జీవితకాలమంతయు ఆత్మచింతనగలిగియుందురో, వారు అంతిమకాలమందును (దేహవియోగసమయమందును) నియమితచిత్తులై అట్టిదైవానుభవమే కలిగియుందురని ఇచట చెప్పబడినది. అధిభూత, అధిదైవ, అధియజ్ఞరూపములగు సమస్తపదార్థములున్ను పరమాత్మస్వరూపములే యను నిట్టి ఆత్మానుభవము జీవితకాలముగలవారు, అంతిమకాలమందును అట్టి బ్రహ్మానుభవమే కలిగియుందురు. ‘సమస్తము బ్రహ్మమే; ఆ బ్రహ్మమును నేనే’ అను ఈ బ్రహ్మానుభవమును జనులు ఎల్లకాలములందును గలిగియుండవలెను. ఆ యనుభవ మెట్లు కలుగును?దానికి సమాధాన మిచటనే వివరింపబడినది - ‘యుక్తచేతసః’ మనోనిగ్రహముచే (మనోజయముచే) సిద్ధించును. ఇంద్రియములను, మనస్సును జయింపలేనివారి కట్టి సార్వాత్మిక అనుభవము కలుగనేరదు. ఇంద్రియములకు దాసులుగా నుండువారి కట్టి బ్రహ్మానుభవము కలుగదు. జీవితమంతయు ఇట్టి నియమిత చిత్తము కలిగియుండువారికే బ్రహ్మానుభవము సిద్ధించును. కాని కేవలము అంతిమకాలమందుమాత్రమే అని చెప్పలేదు. అంతిమకాలమందుకూడ (ప్రయాణకాలేఽపి చ) అనియే చెప్పబడెను. కాబట్టి ఆరోగ్యము బాగుగనున్నపుడే, ఇంద్రియములు శైథిల్యమునొందకపూర్వమే, దేహశక్తి ఉడుగుటకు ముందే సమస్తసాధనలు గావించి, ఆత్మానుభవము నొందవలసియుండుననియు, అట్లుండిననే చివఱికాలమందుగూడ దైవస్మృతి కలుగగలదనియు స్పష్టమగుచున్నది. ప్రయాణముచేయుటకు ముందుగనే సామాగ్రినంతను ఎట్లు సర్దుకొందురో, దారిబత్తెము సేకరించుకొని సిద్ధముగనుందురో అట్లే దీర్ఘప్రయాణము ప్రారంభమగు ఈ దేహవియోగసమయమునకు పూర్వమే దైవానుభవమును పూర్తిగ పొందియుండవలెను. అన్నిశక్తులున్ను ఉడిగిపోయిన వార్ధక్యమున జీవుడు పరమార్థయత్నములను ఎక్కువగ చేయజాలడు. కాబట్టి ఈ శ్లోకమునందు ఆత్మసాక్షాత్కారరూపలక్ష్యమును జీవితకాలములో చాల ముందుగనే పొందియుండవలెనని సూచింపబడినది. ‘జీవితకాలమందు ఎవరు నన్నెఱుగుదురో, అంత్యకాలమందును వారు నన్నెఱుగగలరు’ అని భగవాను డిచట చెప్పినందువలన అంత్యకాలమున మాత్రము నమ్ముకొని జీవితమంతయు సోమరిగా గడుపరాదని హెచ్చరించినట్లైనది. మఱియు అంత్యకాలమనునది ఫలానిసమయమని ఎవరికిని తెలియదు. కనుక, జీవితమంతయు భగవచ్చింతన యందే గడిపినచో ఇక మృత్యువు ఎప్పుడు వచ్చినను భయములేదు. అంత్యకాలమందు మాత్రమే భగవచ్చింతన చేయవలెననువారి వాదన ఈ శ్లోకముచే పూర్తిగ ఖండింపబడినది. గీతాచార్యులు అధ్యాత్మరంగమున సోమరులకు ఏమాత్రము చోటీయక ఆజీవితపురుషప్రయత్నమునే లెస్సగ చాటినవారైరి. అధిభూత, అధిదైవ, అధియజ్ఞములనగా నెవ్వియో రాబోవు అధ్యాయమున వివరముగ తెలియజేయబడినవి. ప్ర:- దేహవియోగసమయమందును ఎవరు నియమితచిత్తులై ఆత్మానుభవముగలిగియుందురు? ఉ:- ఎవరు పెక్కు సాధనలద్వారా జీవితకాలమంతయు యత్నించి పరమాత్మానుభవమును సంపాదించుకొందురో వారు. ఓమ్ ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే విజ్ఞానయోగోనామ సప్తమోఽధ్యాయః ఇది ఉపనిషత్ప్రతిపాదకమును, బ్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు విజ్ఞానయోగమను ఏడవ అధ్యాయము ఓమ్ తత్ సత్
79
11
07-29-గీతా మకరందము. విజ్ఞానయోగము -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు, శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి అ|| శ్రద్ధాభక్తులతో భగవంతు నాశ్రయించి ప్రయత్నించువారికి కలుగు ఫలితమును వివరించుచున్నారు - జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతన్తి యే | తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలమ్ || టీక:- యే = ఎవరు, జరామరణమోక్షాయ = వార్ధక్యమును, మరణమును పోగొట్టుకొనుటకొఱకు, మామ్‌ = నన్ను, ఆశ్రిత్య = ఆశ్రయించి, యతన్తి = ప్రయత్నముచేయుచున్నారో, తే = వారు, కృత్స్నం = సమస్తమైన, అధ్యాత్మమ్‌ = ప్రత్యగాత్మస్వరూపమును, అఖిలం కర్మ చ = సకలకర్మమున్ను, తత్‌ బ్రహ్మ = ఆ బ్రహ్మమేయని, విదుః = తెలిసికొందురు. తా:- ఎవరు వార్ధక్యమును, మరణమును (సంసారదుఃఖమును) పోగొట్టుకొనుటకొఱకు నన్నాశ్రయించి ప్రయత్నముచేయుచున్నారో, వారు సమస్తప్రత్యగాత్మస్వరూపమున్ను, సకల కర్మమున్ను ఆ బ్రహ్మమేయని తెలిసికొందురు. వ్యాఖ్య:- జీవుడు సంసారదుఃఖవిముక్తికొఱకు, పరమానందప్రాప్తికొఱకు, భగవంతుని ఆశ్రయించి తల్లక్ష్యసాధనకై యత్నించుచున్నాడు. జననమరణములు, జరావ్యాధులు మున్నగువానితోగూడిన ఈ సంసారదుఃఖము అతిభయంకరమైనది. దానినుండి విడుదలపొందుటకే సర్వేశ్వరుని జనులాశ్రయించి ప్రయత్నశీలురగుచున్నారు. సమస్త ఆధ్యాత్మికసాధనలు ఇందుకొఱకే ఏర్పడినవి - అనగా జరామరణరూప సంసారదుఃఖవినాశముకొఱకు, నిరతిశయాత్మానందప్రాప్తికొఱకు. అట్లు సర్వేశ్వరుని ఆశ్రయించి ధ్యానాదియత్నములను సలుపువారు క్రమక్రమముగ వారియత్నములు పరిపక్వములుకాగా, సాధనయందారితేరినపిమ్మట, అనగా ఆరూఢస్థితిని బడసినపుడు, సమస్తకర్మలు, సమస్తజీవులు, సమస్తప్రత్యగాత్మస్వరూపములు అద్వైతపరబ్రహ్మముగనే వారు తెలిసికొందురని ఇట వచింపబడినది. అనగా, వారిదృష్టిలో బ్రహ్మేతరమగు వస్తువేదియు కానరాదు. అంతయు ఆత్మమయముగ, బ్రహ్మమయముగ గాంచుదురు. అయితే ఇట్టి బ్రహ్మానుభూతి అందఱికిని కలుగదు. ఎవరు మోక్షముకొఱకు తీవ్రప్రయత్నము సలుపుదురో, ఎవరు బంధవిముక్తికై సర్వేశ్వరుని ఆశ్రయించి ధ్యానాదులను జరుపుదురో అట్టివారికే కలుగును. అపుడు తానే పరబ్రహ్మముగను, తనయందే సమస్తకర్మసమూహము, సమస్తజగత్తులు, సమస్తజీవరాసులు (కల్పితములై) యున్నట్లును, సర్వజీవులయొక్క ఆత్మ తానే అయియున్నట్లును కనుగొనగల్గును. ఇదియే ‘అహంబ్రహ్మాస్మి’ అను మహావాక్యముయొక్క అనుభవము అయియున్నది. ఈ శ్లోకమున ‘యతన్తి’ - (ప్రయత్నించుచున్నారు) అని చెప్పినందువలన బ్రహ్మానుభూతి మాటలవలన సిద్ధించునదికాదనియు, తీవ్రతరయత్నము చేయవలసియుండుననియు స్పష్టమగుచున్నది. మఱియు ‘ఆశ్రిత్య’, ‘యతన్తి’ అని రెండుపదములను చేర్చుటవలన, కేవలము భగవంతుని ఆశ్రయించుటమాత్రము చాలదనియు, భగవత్ సాక్షాత్కారమునకై ప్రయత్నముకూడ సలుపవలయుననియు తేలుచున్నది. భగవదాశ్రయముచే భగవంతుడు అనుగ్రహించి త్రోవచూపును. ఆ త్రోవనుబట్టి తానే నడవవలెను. యత్నశీలుడై తనమనస్సును తానే శుద్ధమొనర్చుకొని బ్రహ్మానుభూతిని బొందవలెను. ప్ర:- భగవానుని ఎందుల కాశ్రయింపవలెను? ఉ:- జన్మజరామరణరూప సంసారబంధవిచ్ఛిత్తికొఱకై. ప్ర:- భగవత్ప్రాప్తి యెట్లు కలుగగలదు ? ఉ:- స్వప్రయత్నముచే, తాను స్వయముగ ఆధ్యాత్మికసాధనల నభ్యసించుటచే. ప్ర:- ఫలితముగ ఆతని కేమి లభించును? ఉ:- భగవదాశ్రయముచేతను, భగవత్సాక్షాత్కారమునకువలసిన యత్నములచేతను ఆతడు బ్రహ్మప్రాప్తినొంద, సమస్త జీవుల సమస్త కర్మము అంతయు ఆ పరబ్రహ్మమే యని తెలిసికొనగల్గును.
85
12
ఈ శ్లోకమువలన ఈ క్రిందివిషయములు స్పష్టపడుచున్నవి - (1)మోక్షము పొందవలెననిన సాధకుడు దృఢవ్రతములను శీలింపవలెను. (2)దృఢవ్రతము గలుగవలెననిన చిత్తమునందలి పాపము నశించవలెను. (3)పాపము నశించవలెననిన పుణ్యకార్యములను, సత్కర్మలను లెస్సగ నాచరింపవలెను. ప్ర:- భగవంతుని దృఢవ్రతులై ఎవరు సేవింపగలరు? ఉ:- పాపము నశించినవారు. ప్ర:- పాప మెట్లు నశింపగలదు ? ఉ:- పుణ్యకార్యములచే. ప్ర:- పాపము నశించిన కలుగు ఫలితము లెవ్వి? ఉ:- (1) ద్వంద్వమోహవినాశము (2) ధ్యానదృఢత్వము. -------------------- * యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్, యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం || (18-5), @ న హి కల్యాణకృత్కశ్చిద్దుర్గతిం తాత గచ్ఛతి | (6-40) ------------------------
86
13
07-28-గీతా మకరందము. విజ్ఞానయోగము -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు, శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి అ|| (పైనదెల్పిన) అజ్ఞానమునుండి యెవరు విముక్తులగుదురో తెలుపుచున్నారు- యేషాం త్వన్తగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ | తే ద్వన్ద్వమోహనిర్ముక్తా భజన్తే మాం దృఢవ్రతాః || టీక:- పుణ్యకర్మణామ్‌ = పుణ్యకర్మలుచేయు, యేషాం జనానామ్‌ = ఏ జనులయొక్క, పాపంతు = పాపమైతే, అన్తగతమ్‌ = నాశమును బొందినదో, తే = అట్టివారు, ద్వంద్వమోహనిర్ముక్తాః = (సుఖదుఃఖాది) ద్వంద్వరూపమగు అజ్ఞానమునుండి విడువబడినవారై, దృఢవ్రతాః = చలింపని నియమనినిష్ఠలు గలవారై, మామ్‌ = = నన్ను, భజన్తే = సేవించుచున్నారు. తా:- పుణ్యకార్యతత్పరులగు ఏ జనుల యొక్క పాపము నశించిపోయినదో, అట్టివారు (సుఖదుఃఖాది) ద్వంద్వరూపమగు అజ్ఞానమునుండి విడువబడినవారై దృఢవ్రతులై నన్ను సేవించుచున్నారు. వ్యాఖ్య:- పరమాత్మను దృఢవ్రతులై సేవించినవారికే బంధవిముక్తి లభించును. కాబట్టియే అనేకులు దైవసాక్షాత్కారమునకై పెక్కువ్రతములు, నియమములు శీలించుచుందురు. మౌనవ్రతము, ఉపవాసవ్రతము, బ్రహ్మచర్యవ్రతము, స్వాధ్యాయవ్రతము మున్నగువానిని ఆచరించుదురు. కాని వానియందు పెక్కురికి దృఢత్వము (స్థిరత్వము) ఏర్పడుటలేదు. దానికి కారణమేమియో భగవాను డిచట స్పష్టముగ తెలిపిరి. అనేక జన్మార్జితపాపమే దానికి కారణము. ఆ పాపము హృదయమున నున్నంతవఱకు పరమార్థసాధనలందు అడ్డు కలుగుచునేయుండును. మురికిగుడ్డకు రంగు అంటనట్లు, చవిటినేలలో విత్తనము మొలవనట్లు, పాపకల్మషయుక్తమగు హృదయమున పరమార్థబీజము లంకురింపజాలవు. అట్టివారొకవేళ వ్రతములను ప్రారంభించినను చక్కగ కొనసాగించలేరు. వానియందు దృఢత్వముకలుగదు. విరేచనమునకు మందుతీసికొనినవాడు ఇంటియందు మెదలక ఉండదలచినచో నెట్లుసాధ్యపడదో, ఆ మందు కడుపులోత్రిప్పి వానిని బయట కెట్లు సాగనంపునో, అట్లే పాపము, రజోగుణము చిత్తమునగలవాడు ధ్యాననిష్ఠయందు కూర్చొనినను, అవి వానిని లేపి బహిర్ముఖునిగ నొనర్చును. కాబట్టి భగవానుని దృఢవ్రతములతో సేవింపవలెననిన లోనగల పాపము నశింపవలెను. అది యెట్లు నశించునో ఆ పద్ధతిని గూడ శ్రీకృష్ణపరమాత్మ ఈ శ్లోకమందు విశదీకరించిరి. పుణ్యకర్మలచేతను, అనేక సత్కార్యము లాచరించుటవలనను, నిష్కామకర్మయోగానుష్ఠానము చేతను జీవునిపాపమంతయు నశించిపోవును. కావున సాధకుడు మొట్టమొదట అనేక సత్కార్యములను, దానధర్మములు పరోపకారము, దివ్యమంత్రజపము - మున్నగు వానిని విరివిగా ఆచరించవలెను. కొందఱు శుష్కవేదాంతులు “పుణ్యకార్యములు కూడ బంధనమును కలుగజేయును, కావున వాని నాచరించరాద”ని చెప్పుదురు. అది వారియొక్క ఉన్మత్తప్రలాపమేకాని, అన్యముకాదు. ఏలయనిన భగవానుడు గీతయందు పుణ్యకార్యములను, సత్క్రియలను తప్పక చేయవలెననియే పెక్కుచోట్ల ఆదేశించిరి. ఇంతియేకాదు వానిని వదలవద్దనికూడ హెచ్చరించిరి*. భగవద్వాక్యమునందు విశ్వాసముగలవారు ఆ యాదేశమును తప్పక పాలించవలెను. పుణ్యకార్యములను జేయువానికి, శుభాచరణశీలునకు దుర్గతి యెన్నడును కలుగదనికూడ నిదివఱలో భగవానుడు చెప్పియుండుట గమనింపదగినది@. కేవలము అతీతస్థితి యందుండువానికి, ఇంద్రియమనంబులను దాటియున్నవానికి, నిశ్చలసమాధినిష్ఠునకు పుణ్యము, పాపము లేవని చెప్పిన వాక్యమును సామాన్యములగు సాధకులకు అన్వయించరాదు. ఏలయనిన, దానిచే ఆ సాధకుని చెడగొట్టినట్లే యగును. వారికి ఉభయభ్రష్టత్వము కలుగజేసినట్లేయగును. తురీయస్థితియందున్న అట్టి జీవన్ముక్తులుకూడ వ్యుత్థానదశయందు లోకాదర్శముకొఱకు పుణ్యకార్యములను, సత్క్రియలను చేయుచునేయుందురు. ఈ ప్రకారముగ పుణ్యకార్యములచే పాపము నశించినవారు సుఖదుఃఖాదిద్వంద్వమోహరహితులై పరమాత్మను దృఢవ్రతములతో సేవించుదురు. దానిచే వారికి ఆత్మసాక్షాత్కారము లభించి బంధవిముక్తి సిద్ధించుచున్నది. ఈ శ్లోకముద్వారా శ్రీకృష్ణపరమాత్మ జనుల కీప్రకారముగ హెచ్చరికచేయుచున్నారు - ‘ఓ జీవులారా! మున్ముందు మీ చిత్తమునందుగల పాపపంకిలమును, జన్మజన్మాంతరమునందు గావింపబడిన దుష్కార్యములకు సంబంధించిన కల్మషబీజములను, సత్క్రియలద్వారా పుణ్యకార్యాచరణముద్వారా క్షాళనము చేయుడు. అపుడే మీకు సుఖదుఃఖాదిద్వంద్వవ్యామోహము అంతరించి దైవవ్రతమందు దృఢత్వమేర్పడును. దానిచే మోక్షము సన్నిహితమగును’. కాబట్టి సాధకులు భగవద్వాక్యమునందు విశ్వాసముగలిగి పుణ్యాచరణతత్పరులై మెలగవలెను. ఈ శ్లోకముద్వారా మఱియొక విషయము స్పష్టమగుచున్నది. అది యేది యనిన - పరమార్థరంగమున సాధకుడు కొన్ని దృఢనియమములను, వ్రతములను ఏర్పఱచుకొనవలెను. లేనిచో మాయ దారి ఇవ్వదు. దుర్బలనియమములచే మాయ లొంగదు, మనస్సు స్వాధీనపడదు. రేకుగొడ్డలిచే బలమైనవృక్షము తెగదుగదా! ‘ఈ రోజున ఇన్ని వేల జపము చేయనిదే భుజింపను, ఇన్ని అధ్యాయములు పారాయణము చేయనిదే మఱియొకపనిని తాకను’ - ఈ ప్రకారముగ దృఢనిశ్చయములను గావించుకొనవలెను.
80
14
07-27-గీతా మకరందము. విజ్ఞానయోగము -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు, శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి అ|| అట్టి తనను జనులేల తెలిసికొనజాలకున్నారో వచించుచున్నారు- ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వన్ద్వమోహేన భారత | సర్వభూతాని సమ్మోహం సర్గే యాన్తి పరంతప || టీక:- పరంతప = శత్రువులను తపింపజేయువాడవైన, భారత = ఓ అర్జునా!, సర్గే = పుట్టుకతోడనే (లేక, ఈ ప్రపంచమున), ఇచ్ఛాద్వేషసముత్థేన = రాగద్వేషములవలన (లేక, కామక్రోధములవలన) పుట్టిన, ద్వంద్వమోహేన = సుఖదుఃఖాది ద్వంద్వరూపమగు వ్యామోహముచే (అవివేకముచే), సర్వభూతాని = సమస్తప్రాణులును, సమ్మోహమ్‌ = మిక్కిలి అజ్ఞానమును, యాన్తి = పొందుచున్నవి. తా:- శత్రువులను తపింపజేయు ఓ అర్జునా! సమస్తప్రాణులును పుట్టుకతోనే రాగద్వేషజనితమగు సుఖదుఃఖాదిద్వంద్వరూపమైన వ్యామోహమువలన మిక్కిలి అజ్ఞానమును బొందుచున్నవి. వ్యాఖ్య:- సమస్త జీవులును పుట్టుకతోనే ప్రబల అజ్ఞానమును పొందుచున్నారు. మాహామాయ (‘వైష్ణవీ’మాయ) వారిని ఆవరించివేయుచున్నది. అందువలననే వారు పరమాత్మను దర్శింపలేక సంసారకుహరమున చిక్కుకొనిపోవుచున్నారు. మోక్షమును బడయజాలకున్నారు. అది సామాన్యమైన అజ్ఞానము కాదు. మిక్కిలి దట్టమైనది. కనుకనే ‘మోహం’ అని చెప్పక ‘సమ్మోహం’ అని చెప్పిరి. ఈ అజ్ఞానమునకు హేతువేమి? సుఖదుఃఖాదిద్వంద్వరూపమగు వ్యామోహము. అదియో ఇచ్ఛాద్వేషముల వలన - అనగా కామక్రోధములవలన పుట్టుచున్నది. కాబట్టి మోక్షమునకు ప్రతిబంధమైనట్టి అజ్ఞానమును తొలగింపవలెననిన ఇచ్ఛాద్వేషముల రెండును నశింపవలెను. (ఒకదానిని అనుభవింపవలెనను, లేక పొందవలెనను కోరికనే ఇచ్ఛయందురు. దాని ననుభవించుటలో అడ్డుపడువారిపై కినుక వహించుటను ద్వేషమందురు.) ఇచ్ఛ - ఏదియో యొక దృశ్యవస్తువు నందు కోరిక, అభిలాష యెపుడు జనించునో అపుడు చిత్తము నిరంతరము దానిని పొందవలెననెడి సంకల్పములతో నిండి, దానిని గూర్చియే చింతించుచు మహాచపలముగనుండును. ఏకాగ్రత లేక యుండును. చంచలచిత్తమున ఆత్మ చక్కగ ప్రతిబింబించదు. కావున అశాంతి, దుఃఖము కలుగుటకు కారణమగుచున్నది. ఒకవేళ ఆ విషయము లభించినను, దానివలన తృప్తి కలుగకపోగా, దానిపై ఆశ అనేకరెట్లు పెరిగిపోవును. కోరికలు అనుభవించిన కొలది పెరుగునేకాని తరగవు. కాబట్టి ఇచ్ఛ యను ప్రబలశత్రువును వివేకవైరాగ్యాదులద్వారా హృదయమునుండి పెకలించివేయవలెను. ‘ద్వేషము’ - తనకు అయిష్టమైన వస్తువునందుగాని, తనకు ఇష్టమైన వస్తువునకు అడ్డుపెట్టువారియందు గాని మనుజునకు సామాన్యముగ ద్వేషము కలుగుచుండును. ఆ ద్వేషమే క్రోధముగ పరిణమించును. క్రోధముచే సమ్మోహము, సమ్మోహముచే స్మృతివిభ్రమము, దానిచే బుద్ధినాశము, దానిచే సర్వవినాశము జీవునకు సంభవించుచుండును. కాబట్టి జీవుని యధఃపతనమునకు హేతువులైన ఈ ఇచ్ఛాద్వేషములనే ప్రబలశత్రువులను సర్వము ‘భగవత్స్వరూపమే’ యను వివేకము చేతను, ఇంకను పెక్కు ఆధ్యాత్మిక యుక్తులచేతను పారద్రోలి, ఆ దుష్టద్వయమునకు శాశ్వతముగ తర్పణమొసంగి పరమశాంతిని అనుభవించవలయును. ‘సర్గే’ - అని చెప్పుటవలన తల్లిగర్భమునుండి జన్మించు కాలమందే అజ్ఞానము వచ్చి ఆవరించివేయుచున్నదనియు, యౌవనమునగాని, వార్ధక్యమునగాని కాదనియు స్పష్టమగుచున్నది. కాబట్టి బాల్యకాలమందే పరమార్థయత్నములను గావించి అజ్ఞానమును పాఱద్రోలువారు ధన్యులు. దొంగను ఇంటినుండి ఎంతత్వరగా బయటకు గెంటివేసిన అంతమంచిది కదా! కావున ఏ క్షణమున జీవున కిట్టి వివేకముదయించునో ఆ క్షణమందే ఉత్తమసాధనలద్వారా ఆ హృదయచోరులను తరిమివేసి ఆత్మానందమును బడయవలెను. ఇచట ‘పరంతప’ - అను సంబోధనయందొక విశేషము కలదు. ‘ఓ అర్జునా! నీవు శత్రువులను తపింపజేయువాడవు. కావున యంతఃశత్రువులగు ఇచ్ఛాద్వేషములను గూడ తపింపజేయుము. నిర్మూలింపుము’ అని బోధించుటయగును. ‘సర్వభూతాని’ - అను పదమునకు శ్రద్ధాభక్తులుగలిగి భగవంతుని అర్చించువారు, జ్ఞానవంతులుతప్ప తక్కిన యందఱును, అని అర్థము (చూడుడు శ్లో|| 28). ప్ర:- సుఖదుఃఖాది ద్వంద్వములు వేనినుండి ప్రాదుర్భవించును? ఉ:- ఇచ్ఛాద్వేషములనుండి. ప్ర:- సమస్త ప్రాణులు అజ్ఞానము నెపుడు పొందుచున్నవి? ఉ:- పుట్టుకతోనే.
84
15
07-26-గీతా మకరందము. విజ్ఞానయోగము -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు, శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి అ ఆ యోగమాయ భగవానుని స్వాధీనమందే యుండునదియగుటచే వారి సర్వజ్ఞత్వమున కదియేమియు అడ్డుకలుగజేయజాలదు. కనుకనే ప్రతిబంధకముకాదు. కావున తాను భూతభవిష్యద్వర్తమాన స్థితిగతులనన్నిటిని ఎఱుంగుదునని భగవానుడు తెలుపుచున్నారు - వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున | భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన || టీక:- అర్జున = ఓ అర్జునా!, అహమ్‌ = నేను, సమతీతాని = గడచిపోయినట్టియు, వర్తమానాని చ = ఉన్నట్టియు, భవిష్యాణి చ ‌= రాబోవునట్టియు, భూతాని = ప్రాణులను, వేద = ఎఱుగుదును, మాం తు = నన్నో, కశ్చన = ఎవడును, న వేద = ఎఱుంగడు. తా:- ఓ అర్జునా! నేను భూతభవిష్యద్వర్తమానకాలములందలి ప్రాణులందఱిని ఎఱుంగుదును. నన్నుమాత్ర మెవడును ఎఱుంగడు. వ్యాఖ్య:- భగవంతునియొక్క సర్వశక్తిమత్వ మిచట తెలుపబడుచున్నది. ప్రాణులందఱును కాలగర్భముననున్నారు. ఆ కాలమో, భగవానుని కుక్షియందు (కల్పితముగ) ఉన్నది. కావున సమస్తచరాచరములు సర్వేశ్వరునియందే వర్తించుచుండుటబట్టి వారికి తెలియని ప్రాణిగాని, తెలియని విషయముగాని భూతభవిష్యద్వర్తమానములందు ఏదియు ఉండనేరదు. ఎల్లప్రాణులను, ఎల్లకాలములందు వారు జాగరూకతతో వీక్షించుచునేయుందురు. ఈ సత్య మెఱింగినవాడిక పాపముచేయుట కెట్లుత్సహింపగలడు? అతడు పాపభీతి గలిగి ధర్మమార్గమందే ప్రవృత్తుడగును. మఱియు ఈ శ్లోకమువలన జీవునియొక్క అల్పత్వమును పట్టిచూపినట్లయినది. జీవుడు కాలాధీనుడు. మృత్యుగ్రస్తుడు. క్షణికజీవితము కలవాడు. భూతభవిష్యత్తులు తెలియనివాడు. పరమేశ్వరుడో కాలాతీతుడు, అమరుడు, సర్వజ్ఞుడు. అట్టివానిముందు జీవుడేపాటివాడు? అయినను ఆ అల్పజీవుడు తన ధనమునుజూచియు, బలమునుజూచియు, విద్యనుజూచియు, అధికారమునుజూచియు, సౌందర్యమునుజూచియు గర్వించుచున్నాడు. ధనమదముచే, అధికారమదముచే భగవంతుని లెక్కకు తీసికొనుటలేదు. ఇది కేవలము అజ్ఞానముయొక్క ప్రభావమేయగును. సత్యమెఱిగినవాడు తనయొక్క అల్పత్వమును గుర్తెఱిగి భగవంతునియొక్క అనంతశక్తిని వేనోళ్ళ కొనియాడును. భక్తిపూర్వకముగ ఆతనికి ప్రణమిల్లును. ప్రపంచములో ఏకొంచెము శక్తిసామర్థ్యములు ఉన్నవానినే ప్రజలు ఎంతయో ఆదరించి, గౌరవించి బ్రహ్మరథము పట్టుచున్నారు. అట్టిచో అనంతశక్తిసంపన్నుడగు సర్వేశ్వరుని ఎంత అధికముగ గౌరవించి పూజించవలెను?! కావున ఈ శ్లోకముద్వారా జీవుడు పరాత్పరుని త్రికాలజ్ఞానమును, అనంతశక్తిసామర్థ్యములను, అమరత్వమును తెలిసికొని అకుంఠితభక్తితో నాతనిని సేవించి కృతార్థుడుకావలెను. గర్వాహంకారములను వదలివేయవలెను. ఈ శ్లోకమున ‘నన్నెవడును తెలిసికొనుటలేదు’ (మాం తు వేద న కశ్చన) అను వాక్యము యొక్క అర్థము ‘శ్రద్ధాభక్తులు లేనివాడు, ఆత్మజ్ఞానములేనివాడు తెలిసికొనుటలేదనియే’ యగును. భగవంతుని తెలిసికొనిన వారు చాల అరుదుగను, తెలియనివారు అధికముగ నున్నందున ఈ లాగున చెప్పడమైనది. అంతఃపురమున పైఅంతస్తులోని కిటికీ గుండా చూచు రాణివాసస్త్రీ క్రింది వీధిలో పోవుచున్న జనమునంతను వీక్షింపగల్గును. కాని బాటలోనివా రామెను చూడజాలరు. అట్లే పరమాత్మ సర్వజీవులను గాంచగల్గినను ఆతనిని గాంచగల్గువారు చాల అరుదుగ నున్నారు. కావున జీవుడు తాను కృతార్థుడుకావలెననిన, సంసారసాగరమును తరించవలెననిన, తన అల్పత్వమును, భగవానుని సర్వశక్తిమత్వమును గుర్తెఱింగి ఆతనియెడల భక్తి ప్రపత్తులుగలవాడై వర్షబిందువు సముద్రములో కలియున్నట్లు తనచిత్తమును పరమాత్మయందు లయింపజేయవలెను. భగవంతుడు జీవుని తెలిసికొనునట్లు, జీవుడున్ను భగవంతుని తెలిసికొనినచో ఆక్షణముననే అతనికి ముక్తిగల్గును. అంతవఱకును బంధమున తిరుగాడుచునేయుండును. ప్ర:- భగవానుని శక్తి సామర్థ్యములను వర్ణింపుము? ఉ:- అతడు త్రికాలజ్ఞుడు, భూతభవిష్యద్వర్తమానములందలి సమస్త ప్రాణులను, పదార్థములను ఎఱింగినవాడు.
97
16
07-25-గీతా మకరందము. విజ్ఞానయోగము -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు, శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి అ|| ఏ కారణముచేత జనులు పరమాత్మను తెలిసికొనలేకున్నారో, ఒకవేళ తెలిసికొనినను సామాన్యమానవునిగ నమ్ముచున్నారో ఇచట విశదపఱుచుచున్నారు- నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః | మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్ || టీక:- యోగమాయా సమావృతః = యోగమాయచే బాగుగ గప్పబడియున్న, అహమ్‌ = నేను, సర్వస్య = అందరికిని, (ప్రకాశః న = కనుపించువాడనుగాను, మూఢః = వివేకములేని, అయం లోకః = ఈ జనులు, మామ్‌ = నన్ను, అజమ్‌ = పుట్టుకలేనివానినిగను, అవ్యయమ్‌ = నాశరహితునిగను, నాభిజానాతి = ఎరుగరు. తా:- యోగమాయచే బాగుగ కప్పబడియుండుటచే నేను అందఱికిని కనుపించువాడను గాను. అవివేకులగు ఈ జనులు నన్ను పుట్టుకలేనివానినిగను, నాశరహితునిగను ఎఱుగరు! వ్యాఖ్య:- భగవంతుడు సర్వవ్యాపి అయియున్నచో అందఱికిని ఎందులకు కానరారు? సర్వజనులు ఏల వారిని తెలిసికొనజాలకున్నారు? అను ప్రశ్నల కిచట సమాధానము చెప్పబడుచున్నది - పరమాత్మ యోగమాయచే గప్పబడి అందు దాగుకొనియున్నారు. కాబట్టి జనులకు ప్రత్యక్షముగాకయున్నారు. ఎవరా మాయను వివేకాదులచే ఛేదించివైచుదురో వారు భగవంతుని ప్రత్యక్షముగా గాంచగలరు. భగవంతునకు, జనులకును మధ్య ఒకతెర (Curtain) కలదు. అది త్రిగుణాత్మకమైనది. అనగా సత్త్వరజస్తమోగుణములను మూడు పొరలు కలిగియున్నది. తమోగుణము నల్లటిమొద్దుపొర. రజోగుణము ఎఱ్ఱటి సామాన్యపొర. సత్త్వగుణము తెల్లటి పల్చనిపొర. ఈమూడుపొరలతో గూడియున్నది మాయావరణ. జీవుడు నిష్కామకర్మ, భక్తి, వైరాగ్య విచారణాదులచేతను, సాధనాతిశయముచేతను ఒక్కొక్కపొరను ఛేదించుకొనుచుపోయి ఆ మాయాప్రతిబంధకమును పూర్తిగ తొలగించుకొనినచో అపుడు ఆవలనున్న పరమాత్మ నిరావరణముగ ప్రత్యక్షముగ కానుపించగలడు. అధ్యాత్మరంగమున తెలుపబడిన సమస్తసాధనలను జీవునకు, దేవునకు మధ్యగల ఆ మాయయను అడ్డుగోడను నిర్మూలించుటకే యగును. అంతియేకాని దేవుని క్రొత్తగ పొందుటకుగాదు. అద్దాని నిర్మూలనముచే తనయందు వెలుగుచున్న దేవుడు పొందబడియే తీరును. అయితే మూఢునకు మాయా యవనిక(తెర) ఛేదింపబడనందున దైవదర్శనము కాకయున్నది. భగవంతుడున్నాడు - కాని అజ్ఞానులకు కానరాకయున్నాడు. సూర్యుడున్నాడు - కాని గ్రుడ్డివారికి కనిపించుటలేదు. దీపమున్నది, కాని కుండ బోర్లింపబడియున్నది. అందుచే ఆ దీపమెవరికిని గోచరము కాకయున్నది. ఆకుండను తీసివేసినవారికి లేక పగలగొట్టినవారికి మాత్రమే లోనగల దీపము కనిపించును. ఇదియే మాయాభంగము. భగవంతుడు వాస్తవముగ జన్మరహితుడు, నాశములేనివాడు. ఆ విషయమును మాయనుదాటిన వివేకవంతులు మాత్రమే తెలిసికొనగల్గుచున్నారు. కాని మాయకు లోబడిన మూఢులుకాదు- అని గీతాచార్యు లిచట బోధించుచున్నారు. అవివేకులు మాయను పోషించుచున్నారేకాని శుష్కింపజేయుటలేదు. అనేక విషయవాసనలు, దుర్వ్యసనములు, భోగలంపటత్వము, కామక్రోధాదులు - మున్నగువానిచే వారా మాయ నింకను బలపఱచుచున్నారు. దానికి పుష్టిగల ఆహారము నొసంగుచున్నారు. అందుచే అది ఇంకను బలపడి, దృఢపడి, బాగుగ నిలద్రొక్కుకొని భగవద్దర్శనమునకు ఘనమైన అడ్డుగోడవలె నుండి జీవునకు మోక్షమార్గమున మహాప్రతిబంధకముగ వర్తించుచున్నది. కాబట్టి విజ్ఞుడగువాడు ఆ మాయారూపావరణను భక్తిజ్ఞానవైరాగ్యాదులచే విచ్ఛిన్నమొనర్చి భగవంతుని సాక్షాత్కరించుకొనవలెను. ఈ శ్లోకమున ‘సర్వస్య’ (ఎవరికిని కనబడుటలేదు) అని చెప్పినదాని అర్థము అజ్ఞానులెవరికిని కనుపించుటలేదనియే యగును. మఱియు భగవంతుడు యోగమాయచే కప్పబడియున్నాడను విషయము ద్వైతదృష్టియందు చెప్పినదే యగును. ఏలయనిన, వాస్తవముగ పరమాత్మకు ఏ ఆవరణమున్ను లేదు. అతడు నిరావరణ శుద్ధ చిన్మయమూర్తి. అజ్ఞానులగు జీవుల దృష్టిననుసరించియే అట్లు చెప్పబడినది. సూర్యునకు , మేఘమునకు వాస్తవముగ ఏ సంబంధమున్ను లేదు. కాని మేఘమునకు క్రింది నున్నవారి దృష్టిననుసరించి సూర్యుడు మేఘముచే కప్పబడియున్నాడని చెప్పుదురు. అట్లే భగవద్విషయమున్ను. కొందఱు ‘యోగమాయా సమావృతః’ అను పదమును మూఢునకు విశేషణముగ తగిలించి యోగమాయావృతుడగు మూఢుడు (అజ్ఞాని) దేవుని తెలిసికొనజాలకున్నాడని అర్థముచెప్పిరి. ప్ర:- భగవంతు డేల అందఱికిని కనిపించుటలేదు? ఉ:- యోగమాయచే కప్పబడియుండుటవలన. ప్ర:- భగవంతుని స్వరూపమెట్టిది? ఉ:- (1) జన్మరహితమైనది (2) నాశవర్జితమైనది. ప్ర:- భగవత్స్వరూపము నెవరు తెలిసికొనజాలకున్నారు? ఉ:- అజ్ఞానులు. ప్ర:- ఎందుచేత? ఉ:- భగవంతుని చుట్టునున్న మాయారూపమగు ఆవరణను వారు భేదింపలేదు కావున. ప్ర:- కాబట్టి విజ్ఞుడగువా డేమి చేయవలెను? ఉ:- తనకు భగవంతునకు మధ్య అడ్డుగోడగా నిలిచియున్న మాయారూప ఆవరణమును శీఘ్రముగ (ఈ జన్మయందే) ప్రయత్నపూర్వకముగ అధ్యాత్మసాధనలచే తొలగించివేసి భగవత్సాక్షాత్కారము నొందవలెను.
93
17
07-24-గీతా మకరందము. విజ్ఞానయోగము -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు, శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి అ అయినను జనులలో కొందఱు తననెందుకాశ్రయించుటలేదో తెలుపుచున్నారు - అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యన్తే మామబుద్ధయః | పరం భావమజానన్తో మమావ్యయమనుత్తమమ్ || టీక:- అవ్యయమ్‌ = నాశరహితమైనట్టియు, అనుత్తమమ్‌ = సర్వోత్తమమైనట్టియు, పరమ్‌ = ప్రకృతిపరమై (విలక్షణమై)నట్టియు, మమ = నా యొక్క, భావమ్‌ = స్వరూపమును, అజానన్తః = తెలియని, అబుద్ధయః = అవివేకులు, అవ్యక్తమ్‌ = నేత్రాదీంద్రియములకు గోచరము కాని (ప్రపంచాతీతుడనగు), మామ్‌ = నన్ను, వ్యక్తిం ఆపన్నమ్ = పాంచభౌతికదేహమును పొందినవానినిగా, మన్యన్తే = తలంచుచున్నారు. తా:- నాశరహితమైనట్టి, సర్వోత్తమమైనట్టి, ప్రకృతికే పరమై విలసిల్లునట్టియు అగు నా స్వరూపమును తెలియని అవివేకులు అవ్యక్తరూపుడగు (ప్రపంచాతీతుడగు) నన్ను పాంచభౌతికదేహమును పొందినవానినిగా తలంచుచున్నారు. వ్యాఖ్య:- భగవంతుడు వాస్తవముగ నిరాకారుడు, సర్వవ్యాపి, ప్రపంచాతీతుడు, ప్రకృతికి విలక్షణమైనవాడు, అనంతుడు, నాశరహితుడు. లోకకళ్యాణార్థమై వారు అపుడపుడు దేహమునుధరించి దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మసముద్ధరణాది కార్యములనొనర్చుటకై లోకమున అవతరించుచుందురు. మాయను స్వాధీనపఱచుకొనినవారు కనుక వారు తన యిష్టప్రకారము దేహమును గ్రహించుటకు, త్యజించుటకు శక్తిగలిగియుందురు. ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా -(4-6)- అని వారే ఒక సమయమున వచించియుండిరి. కావున ఆప్రకార మవతరించినపుడు అనగా వ్యష్టిత్వమును (దేహమును) స్వీకరించినపుడు వారి సమిష్టిత్వమున కేమాత్రము భంగములేదు. వ్యష్టిరూపము వారు తాత్కాలికముగా కల్పించుకొనినదే యగును. నామరూపాత్మకమైన యా దేహము వారి పరిపూర్ణరూపముకాదు. భక్తుల ననుగ్రహించుటకొఱకు తాత్కాలికముగ గ్రహించినదే యగును. అయినను వివేకములేనివారు, మందబుద్ధులు ఆ చిన్నదేహమే భగవంతుని యథార్థరూపమనియు, భగంతుడు మనుష్యమాత్రుడే యనియు తలంచుచున్నారు. దేవకీవసుదేవులకు బుట్టిన ఈ కానుపించు మానవశరీరమే భగవంతుడనియు, అంతకు మించి మఱియొకరూపము వారికిలేదనియు వారి యభిప్రాయము. ప్రారంభములో భక్తిశ్రద్ధలు కలుగుటకు భగవానుని సాకారరూపమును గ్రహించినను, అంతమాత్రముతో తృప్తినొందక ఆతని నిరాకారరూపమునుగూడ క్రమముగ తెలిసికొనవలసియుండును. పరమాత్మకు పరాపరా రూపములు రెండునుకలవు. భక్తుల ననుగ్రహించుటకొఱకై గైకొను రామకృష్ణాద్యవతారములు అపరారూపము. అవ్యక్త, అనంత, సద్ఘన, చిద్ఘన స్వరూపము పరారూపము. కనుకనే ‘పరంభావమ్’ అని దానినిగూర్చి చెప్పిరి. అదియే భగవానుని వాస్తవస్వరూపము. దానిని విశ్వసింపక, పాంచభౌతిక దేహము మాత్రమే భగవంతుడని తలంచువారు అవివేకులు, అల్పబుద్ధులు (అబుద్ధయః) అని పేర్కొనబడినది. ఏలయనగా వారు దృశ్యమునకు పరమై, అవ్యయమై అపరిచ్ఛిన్నస్వరూపమును ఎఱుగక, పరిచ్ఛిన్నమైన స్వరూపముమాత్రమే భగవంతుడని చెప్పుచున్నారు. అది చాల పొరబాటు, కనుకనే వారు మందబుద్ధులని తెలుపబడిరి. భగవంతుని కిచట నాలుగు విశేషణములు చెప్పబడినవి. (1) అవ్యక్తత్వము (2) ప్రపంచాతీతత్వము (3) అవ్యయత్వము (4) సర్వోత్తమత్వము. పరమాత్మ వాస్తవముగ అవ్యక్తుడు. అనగా స్థూలనేత్రమునకు కానరాడు. ఏలయనిన, వ్యక్తమగు ప్రతివస్తువు ఏదియో యొక సమయమున నశించిపోవును. పరమాత్మయు వ్యక్తరూపముమాత్రము కలిగియున్నాడని తలంచుచో వారును నశించిపోవువారనియే భావించవలసివచ్చును. అట్లు కాదు; వారు అవినాశి. కావున భౌతికనేత్రమునకు కానుపించు స్థూలవిగ్రహముమాత్రమే, లేక ఉపాధిమాత్రమే దేవుడని తలంచితే అది కేవలము భ్రమమాత్రమేయగునని ఇచట స్పష్టీకరించబడినది. మఱియు భగవంతుడు అతిసూక్ష్మమైనవాడు. స్థూలమగు ఆకాశమే కంటికి కనబడకయుండ ఇక మనస్సుకంటెను అతిసూక్ష్మమైన చిదాకాశరూపపరమాత్మ కంటికి ఎట్లు కానవచ్చును? కనుకనే అవ్యక్తరూపుడని చెప్పబడినది. (అయినను జనులకు శుద్ధబుద్ధిచే వారివారి హృదయమున ఆత్మరూపమున సాక్షాత్కరింపబడుచునే యున్నాడు). మఱియు దృశ్యమునకు పరుడై దృక్స్వరూపుడై యుండుటవలన ప్రపంచాతీతుడని చెప్పబడెను. నాశము లేనందువలన అవ్యయుడని పేర్కొనబడెను. దేశకాలములకు అతీతుడై, దృశ్యదోషరహితుడై, నాశరహితుడై యుండుటవలన సర్వోత్తముడని తెలుపబడెను. ఈశ్లోకముద్వారా - సగుణారాధకులు, సాకారోపాసకులు, విగ్రహారాధనపరులు, భగవంతుని ఒక వ్యక్తి మాత్రముగ దలంచి సేవించువారు, క్రమముగ ఏకాగ్రత, భక్తి బాగుగ కుదిరినపిదప క్రమముగ తమ భక్తిని, దృష్టిని విశాలపఱచి, పైమెట్టు ఎక్కి భగవంతుడు విగ్రహమునందు మాత్రమేకాక సమస్త చరాచరములందును, భూతభవిష్యద్వర్తమానములందును వ్యాపించి ప్రపంచాతీతుడై వర్తించుచున్నాడనియు, అదియే ఆతని యథార్థరూపమనియు గ్రహించవలెనని సూచితమగుచున్నది. ప్ర:- భగవంతుని వాస్తవరూపమెట్టిది? ఉ:- (1) అవ్యక్తమైనది (2) ప్రపంచాతీతమైనది (3) నాశరహితమైనది (4) సర్వోత్తమమైనది. ప్ర:- భగవంతు డొక చిన్న దేహమేయని తలంచువారెట్టివారు? ఉ:- అవివేకులు.
93
18
07-24-Gita makaranda VIJNANA YOGA -H.H. SWAMY VIDYA PRAKASHANANDA MAHARAJ, SRI SUKA BRAHMA ASHRAM, SRIKALAHASTI. _avyaktam vyaktim apannam manyante mam abuddhayah_ _param bhavam ajananto mamavyayam anuttamam_ *Substance* : Those devoid of knowledge think of Me, the unmanifested, as having name and form, not knowing My imperishable supreme and transcendental nature. *Commentary*: The Lord is really formless and universal. He is transcendental, beyond maya, infinite and eternal. For the purpose of protecting the righteous and punishing the wicked, and establishing Dharma, He takes birth in this world. As Maya is under His control the power of adopting or discarding His form is in His own power. When the Lord thus incarnates Himself as a separate individual, His immortality is not at all affected. The separate form as Krishna or Rama is His own creation, and when the purpose of His Avatara is fulfilled, the form is dissolved and He remains the Eternal. The devotees are blessed by such Avataras. But unfortunately, the ignorant men of little intelligence consider the name and form of the Lord as His real nature, and so, they do not find Him different from other mortals. No doubt the devotees are endowed with faith and devotion when they see the manifestation of the Lord as Rama or, Krishna. But they should know the high nature (parabhramam) of the Lord; and should not get confused. Four attributes are mentioned about the higher nature of the Lord. (1) He is unknowable (Avyakta). (2) He is transcenciental (Param). (3) He is imperishable (Avyayam). (4.) He is supreme (Anuttaman). He is unknowable by the senses and the mind. The phenomenal world is visible to the senses and comprehensible by the mind. If the Lord also is a composition of the elements, he would dissolve like any other mortal form. But he is imperishable. He is subtler than any other. The material sky (Akasa) is itself invisible and so how can the Lord whose nature is more subtle (Chidakasa) be an object of perception? He is the whole universe, but he is at the same time not bound by physical laws, because He is transcendental. Since He is beyond time and place, and is uncontaminated by material elements, since He is not subject to dissolution like other things, He is described as Supreme, most excellent (Anuttama). It should be clearly understood that this verse is not a disparagement of the worship of the different manifestations of the Lord in temples and images. The common devotee must go through this process of fixing some form of the Lord in the mind and worshipping Him in that manner. But he should not stop there‘. As his vision enlarges and his devotion deepens he will naturally evolve towards the transcendental perfection of the Lord. Devotion of this type is commendable. What is condemned here is to attribute mortality to the Lord and regard Him to be no more than a man. Sisupala could see Lori Krishna as a cowherd—boy and nothing more. It was Bhishma who could understand the transcendental nature of the Lord, while he appeared in the beautiful form of Krishna. Bhishma could worship the Lord as Krishna, and at the same time know that He is the imperishable Paramatma. Ravana could think of Sri rama only as a mortal, subject to death like any other. But sages like Vasishta and others could understand that Sri Rama is the Lord Himself appearing as the Prince of Ayodhya. It is this understanding which is suggested in the verse for the guidance of all seekers. (Vide 4-6). *Question*: What is the real nature of the Lord ? *Answer* : It is un-manifest, transcendental, imperishable and supreme. *Question* : Who thinks of the Lord as a mortal ? *Answer* : The ignorant, with deluded understanding. _The Lord explains why He is not comprehanded by the common man._
1
19
07-23-గీతా మకరందము. విజ్ఞానయోగము -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు, శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి ॥అ|| ఇతరదేవతల నారాధించుటవలన లభించునవి నశ్వరఫలితములే యనియు, తన్నారాధించుటచే శాశ్వతమోక్షము లభించుననియు భగవానుడు వచించున్నారు- అన్తవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్ | దేవాన్ దేవయజో యాన్తి మద్భక్తా యాన్తి మామపి || టీక:- అల్పమేధసామ్‌ = అల్పబుద్ధికలిగిన, తేషామ్‌ = వారియొక్క, తత్‌ ఫలమ్‌ తు = ఆ ఫలమన్ననో, అన్తవత్‌ = అంతముగలదిగా (అశాశ్వతముగా), భవతి = అగుచున్నది, దేవయజః = దేవతలను పూజించువారు, దేవాన్‌ = దేవతలను, యాన్తి= పొందుచున్నారు, మద్భక్తాః= నా భక్తులు, మామ్‌ అపి యాన్తి = నన్నే పొందుచున్నారు. తా:- అల్పబుద్ధి కలిగిన వారియొక్క ఆ ఫలము నాశవంతమైయున్నది. (ఏలననగా) దేవతలను పూజించువారు దేవతలచే పొందుచున్నారు. నా భక్తులు (నన్ను పూజించువారు) నన్నే పొందుచున్నారు. వ్యాఖ్య :- పరమాత్మను వదలి ఇతరదేవతల నారాధించువారెట్టివారో వారెట్టి ఫలితమును బొందగలరో, భగవద్భక్తులెట్టి ఫలితములను బొందగలరో ఈ శ్లోకమున వివరింపబడినది. సాక్షాత్ దేవదేవుడగు పరమాత్మను వదలి ఇతర దేవతల నాశ్రయించువారు, భజించువారు అల్పఫలములనే పొందుదురు. కావున అట్టి నశ్వరఫలితములకై అఱ్ఱులు చాచువారు అల్పబుద్ధి (Small Brain) కలవారని ఇట పేర్కొనబడినది. ఏలయనిన, పూర్ణబుద్ధి కలవారైనచో శాశ్వతఫలమొసంగునట్టి, జన్మరాహిత్యమును కలుగజేయునట్టి పరమాత్మనే ఆశ్రయించెడివారుగదా! అల్పాధికారములు, అల్పజీవితములు గలిగిన దేవతలను నమ్ముకొని శాశ్వతపరమాత్మను విస్మరించువారు అల్పబుద్ధులే కదా! వారు పొందెడు ఫలమున్ను అల్పముగనేయుండును (అన్తవత్). గంగానదిని వదలి ప్రక్కనేఉన్న చిన్నబావిని ఆశ్రయించువాడెట్టివాడో, కల్పవృక్షమును వదలి ప్రక్కనే గల చిన్నచెట్టును జేరువాడెట్టివాడో, పరమాత్మనువదలి అల్పఫలప్రదాతలగు దేవతల నాశ్రయించువారు అట్టివారేయగుదురు. కనుకనే వారిచ్చు స్వల్పఫలములను, భోగ్యపదార్థములను బడసి ఆనందించుచున్నారు. ప్రపంచమున ఏ వస్తువుకాని, ఏ వ్యక్తిగాని, ఆతడింద్రుడైనను సరియే, చంద్రుడైనను సరియే దృశ్యవర్గములోనే చేరియుండును. గావున కాలక్రమమున నశించిపోవును. దృగ్వస్తువగు ఆత్మయొకటియే ఈ ప్రపంచమున ఏకైక అవినాశివస్తువు. కనుక విజ్ఞులద్దానికొఱకే అన్వేషించుదురు. అద్దానినే ఆశ్రయించుదురు. అల్పబుద్ధికలవారే ప్రాపంచికసుఖముల నొసంగు నశ్వర దేవతాసమూహమును ఆశ్రయించుదురు. ‘దేవతల నారాధించువారు దేవతలను, నన్నారాధించువారు నన్ను పొందుదురు’ అని భగవాను డిచట తెలియజేసిరి. కాబట్టి నిరతిశయ సుఖప్రదాతయగు పరమాత్మయొక్క భక్తుడగుట ఉత్తమమో, అల్పసుఖమొసంగగల ఆ యా దేవతలయొక్క భక్తులగుట ఉత్తమమో వివేకముకలవారు యోచించవలెను. అట్లు యోచించి తమ యావచ్ఛక్తిని, అమూల్యమగు మానవజీవితమును పునరావృత్తిరహిత శాశ్వత మోక్షసుఖము నొసంగు పరమాత్మయొక్క సాక్షాత్కారమందే వినియోగించి ధన్యులు కావలెను. ఎవరు దేనిని ఆరాధించిన, వారు దానినే పొందుదురు. రాక్షసులను ఆరాధించిన రాక్షసులనే పొందుదురు. దేవతల నారాధించిన దేవతలనే పొందుదురు. పరమాత్మ నారాధించిన పరమాత్మనే పొందుదురు. బంధముగాని, స్వర్గముగాని మోక్షముగాని వారివారి చేతులలోనున్నది. కావున, కొంత తెలివి నుపయోగించి, దూరముగ ఆలోచించి తాను యత్నించునది ఎట్టి ఫలితమైయున్నది? అది సంసారబంధమును రహితమొనర్పగలదా? లేక దానిని ఇంకను దృఢపఱచునా? అని బాగుగ యోచించియే సాధకుడు కార్యమునకు దిగవలెను. కావున మహాత్ములగు సద్గురువుల వలనను, ఇట్టి గీతాది సద్గ్రంథములవలనను ప్రపంచములోని సర్వోత్తమ లక్ష్యమేదియో చక్కగా నెఱిగి అట్టి సర్వేశ్వరునియొక్క (పరమాత్మయొక్క) పాదారవిందములనే అనన్యముగ ఆశ్రయించి తరించవలెను. ప్ర:- దేవతల నారాధించువారు పొందు ఫలమెట్టిది? ఉ:- నాశవంతమైనది (అంతము కలది). ప్ర:- అట్టి నాశవంతమగు ఫలమునకై ప్రయత్నించు వారెట్టివారు? ఉ:- అల్పబుద్ధికలవారు (అల్పమేధసామ్). ప్ర:- దేవతారాధకులు దేనిని పొందుదురు? పరమాత్మను అర్చించువారు దేనిని పొందుదురు? ఉ:- దేవతారాధకులు ఆయాదేవతలను, భగవదారాధకులు భగవంతుని (ఆత్మసాక్షాత్కారరూప మోక్షమును) పొందుదురు. ప్ర:- కాబట్టి విజ్ఞుడగువాడేమి చేయవలెను? ఉ:- శాశ్వతమోక్షపదవి నొసంగు పరమాత్మనే ఆశ్రయించవలెను.
115
20
07-22-గీతా మకరందము. విజ్ఞానయోగము -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు, శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి అ|| ఆ యితర దేవతల ద్వారా భగవానుడే వారికి తగిన ఫలితములు నొసంగుదురని తెలుపబడుచున్నది. స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధన మీహతే | లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హి తాన్ || టీక:- సః = అతడు (పైన తెలుపబడిన కామ్యభక్తుడు) తయా శ్రద్ధయా = అట్టి శ్రద్ధతో, యుక్తః = కూడుకొనినవాడై, తస్య = ఆ దేవతయొక్క, ఆరాధనమ్‌ = పూజను, ఈహతే = చేయుచున్నాడు, మయా ఏవ = = నా చేతనే, విహితాన్‌ = విధింపబడిన, తాన్‌ కామాన్‌ హి = ఆయాకోరికలనే (కోరినవస్తువులనే), తతః = ఆ దేవతలవలన, లభతే = పొందుచున్నాడు. తా:- అతడు (పైన తెలుపబడిన కామ్యభక్తుడు) అట్టి శ్రద్ధతో గూడుకొనినవాడై ఆ యా దేవతలయొక్క ఆరాధనను గావించుచున్నాడు. మఱియు నాచే విధింపబడిన ఆ యా యిష్టఫలములను ఆ యా దేవతలద్వారా పొందుచున్నాడు. వ్యాఖ్య:- ఆ ప్రకారముగ భగవంతునిచే స్థిరపఱచబడినట్టి శ్రద్ధతో గూడుకొనిన వాడై ఆ భక్తుడు ఆ యా దేవతల నారాధించుచు తత్ఫలితముగ వారినుండి తన యిష్టఫలములను బొందుచున్నాడు. అట్లా దేవతలనుండి యాతడు తన యభీష్టఫలములను బడసినప్పటికిని, అయ్యవి భగవంతునిచే నిర్దేశింపబడినవే యగును. కాబట్టి వాస్తవముగ భగవంతునినుండియే యాతనికి లభించినవగును. ఈ చరాచర ప్రపంచమంతయు ఒక ప్రభుత్వ యంత్రాగము (Universal Government). పరమాత్మ దాని యధిపతి. ఇంద్రాది దేవతలందఱు భిన్నభిన్నశాఖలను నిర్వహించు ఉద్యోగులు. జగత్పరిపాలనానియమములన్నింటిని, శాసనములన్నింటిని జగత్ప్రభువగు పరాత్పరుడే తొలుదొల్త నిర్ణయించివైచెను. వానిననుసరించియే ఆ యా క్రింది శాఖాధిపతులు కార్యముల నమలుజరుపవలసి యుండును. కాబట్టి భక్తులు వారివారి వాంఛితములను ఆ యా దేవతలద్వారా పొందినను దేవదేవుడగు సర్వేశ్వరుడే దాని నిచ్చినట్లగును (ప్రభుత్వమున క్రింది ఉద్యోగిద్వారా జరుపబడినది వాస్తవముగ ప్రభుత్వాధినేతయొక్క శాసనమే కావున అతడే జరిపినట్లు). భగవంతుడు కల్పవృక్షము వంటివారు. వారి నాశ్రయించి శ్రద్ధతో ఎవరేది కోరిన దానిని వారి కొసంగుదురు. కాబట్టి అల్పములగు ప్రాపంచిక దృశ్యపదార్థములను వారిని కోరుటకంటె శాశ్వతమగు మోక్షమునే కోరుట శ్రేయస్కరము. ఈ శ్లోకము చివరగల ‘హి, తాన్’ అను రెండు పదములను కలిపి కొందఱు ‘హితాన్’ అని అన్వయించి ‘హితాన్,కామన్’ - ఇష్టములైన భోగ్యవస్తువులు అని అర్థము చెప్పిరి. కాని అయిష్టములైన భోగ్యవస్తువులను ఎవరును కోరరు గనుక ఆ విశేషణము దానికి తగిలించుట అనవసరమని తోచుచున్నది. ప్ర:- ఆ యా దేవతలపై శ్రద్ధ ఇనుమడించినపుడు భక్తుడేమిచేయును? ఉ:- వారిని ఇతోధికశ్రద్ధతో నారాధించును. ప్ర:- తత్ఫలితముగ నాతడేమిపొందును? ఉ:- తన యభీష్టఫలములను వారివలన పొందును. ప్ర:- ఆ ఫలములను ఎవరు నిర్ణయించిరి? ఉ:- దేవదేవుడగు పరమాత్మయే. కావున ఆతడే ఆ యా దేవతలద్వారా వారివారి వాంఛితముల నొసంగినట్లగును.
113