💥*ఙ్ఞానమార్గo*💥🪴Gnyanamaargam🪴
🔥ఆత్మఙ్ఞానమే ధ్యానమార్గo🔥 🙏ధ్యానమార్గమే ఙ్ఞానమార్గo🙏
Ko'proq ko'rsatish1 258
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
-17 kunlar
-930 kunlar
- Kanalning o'sishi
- Post qamrovi
- ER - jalb qilish nisbati
Ma'lumot yuklanmoqda...
Obunachilar o'sish tezligi
Ma'lumot yuklanmoqda...
🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒
💙💙💙💙💙💙💙💙💙
ఈ వారము మూడవ ప్రశ్న
(28 4 2024)
ఈ గడ్డి పేరేమిటి?
💙💙💙💙💙💙💙💙💙
🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒
15510
నర్మదానది పుష్కరాలు 2024
పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానం. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి.
పుష్కర సమయములో ఆయానదులలో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు.
బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే.
పుష్కర కాలము సాధారణంగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరం అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరం అని వ్యవహరిస్తారు.
ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.
పుష్కర సమయంలో పిండ ప్రదానం
సాధారణంగా నదీ స్నానాలలో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు చేసి పితరులను తృప్తి పరచి వారి ఆశీశ్శులు అందుకోవడం శుభప్రథమని విశ్వసిస్తారు.మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం, తొమ్మిదవ రోజున అన్న శ్రాద్ధం, పన్నెండవ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని ఋషులు చెప్పారని పురాణాలు చెప్తున్నాయి.
(శ్రాద్ధకర్మలు ఉపనయనం, వివాహం అయిన పురుషులు తండ్రి మరణాంతరం మాత్రమే చేయాలి)
పుష్కరకాల స్నానం
నీటిలో రెండు శక్తులున్నాయని వేదం చెప్తుంది. దాహార్తిని తీర్చడం, శుభ్రపరచడం అనే రెండు బాహ్య శక్తులైతే అంతరంగికంగా మేధ్యం, మార్జనం అనే శక్తులున్నాయని వేదం వివరిస్తుంది.
మేధ్యం అంటే నదిలో స్నానంచేసి మూడుసార్లు మునక వేస్తే తెలిసి తెలియక చేసే పాపాలు పోతాయని అలాగే మార్జన అంటే నీటిని చల్లుకోవడం అంటే సంప్రోక్షణ చేయడం దీని వలన ద్రవ్య శుద్ధి జరుగుతుందని పురాణాల వర్ణన.
నీరు నారాయణ స్వరూపం కనుక ఆయన స్పర్శచే పాపాలు స్నానంద్వారా పటాపంచలు అవుతాయని విశ్వసిస్తారు.
తీర్ధ స్నానం ఉత్తమం దానికంటే నదీ స్థానం ఉత్తమం దానికంటే పుష్కర సమయ నదీస్నానం ఉత్తమోత్తమం.
ఆ సమయంలో దేవతలలంతా పుష్కరునితో నదిలో ప్రవేశీస్తారని హిందువుల విశ్వాసం.
త్రికరణాలతో చేసే పాపాలు పోతాయని, పుష్కర స్నానం ఒకసారి చేస్తే పన్నెండు సంవత్సరాల కాలం పన్నెండు పుణ్య నదులలో స్నానంచేసిన పుణ్యం లభిస్తుందని, అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని ఋషి వాక్కు. మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది.
నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని నదీ జలాలలో స్నానమాచరిస్తే మాంద్యం, అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది.
ఇసుకతో కాని, మట్టితో కాని పార్థీవ శివలింగాన్ని చేసి పూజించాలంటారు.
నదీ తీరంలోని ఇసుకను నదిలోకి వేయాలంటారు. పురోహితులు భక్తుల తలపై మూడు దోసిళ్ల నీళ్లతో ఆశీస్సులు అందజేస్తారు.
పుష్కరం అనేది నదులను పూజించడానికి అంకితం చేయబడిన భారతీయ పండుగ.
ఇది భారతదేశంలోని 12 ప్రధాన పవిత్ర నదుల ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రాలలో, పూర్వీకుల ఆరాధన , ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీతం మరియు సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో జరుపుకుంటారు.
ఈ వేడుక ప్రతి నదిలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ప్రతి నది ఒక రాశితో ముడిపడి ఉంటుంది మరియు ప్రతి సంవత్సరం పండుగకు సంబంధించిన నది ఆ సమయంలో బృహస్పతి ఏ రాశిలో ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది.
నర్మదా పుష్కరం సాధారణంగా 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే నర్మదా నది పండుగ. ఈ పుష్కరాన్ని బృహస్పతి వృషభ రాశి (వృషభ రాశి)లోకి ప్రవేశించినప్పటి నుండి 12 రోజుల పాటు జరుపుకుంటారు.
ఈ సంవత్సరం నర్మదా పుష్కరలు 2024 మే 1 నుండి ప్రారంభం అయ్యి మే 12న ముగుస్తాయి.
అమర్కంటక్ ఆలయం, ఓంకారేశ్వర్ ఆలయం, చౌసత్ యోగిని ఆలయం, చౌబీస్ అవతార్ ఆలయం, మహేశ్వర్ మహేశ్వర్ ఆలయం, నెమవార్ సిద్ధేశ్వర్ మందిరం మరియు భోజ్పూర్ శివాలయం చాలా పురాతనమైనవి మరియు ప్రసిద్ధమైనవి.
పన్నెండు జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర్ ఒకటి మరియు నరమదా నదిలో పవిత్ర స్నానం చేయడానికి అమ్రార్కంటక్ ఉత్తమమైన ప్రదేశాలు.
ఓంకారేశ్వర్లో నర్మదా నది ఒడ్డున అనేక అందమైన ఘాట్లు నిర్మించబడ్డాయి.
ఈ నది ప్రవాహం నిరంతరం మరియు స్థిరంగా ఉంటుంది మరియు నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది.
ఘాట్లపై నది లోతు ఎక్కువగా ఉండదు. మరియు భక్తులు సులభంగా స్నానాలు చేయవచ్చు.
భక్తులు లోతు నీటిలోకి వెళ్లకుండా కాపాడేందుకు ఇనుప వలలు, పట్టుకునే చైన్లను ఏర్పాటు చేశారు.
వారి భద్రత కోసం సేఫ్టీ బోటు కూడా ఏర్పాటు చేశారు.
ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న కోటి తీర్థ ఘాట్ అన్ని ఘాట్లలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
ఇక్కడ స్నానం చేయడం వల్ల కోట్లాది తీర్థయాత్రల పుణ్యం లభిస్తుంది.
ఓంకారేశ్వర్లోని ఇతర ముఖ్యమైన ఘాట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
చకర్ తీర్థ ఘాట్,
గౌముఖ్ ఘాట్,
భైరోన్ ఘాట్,
కేవల్రామ్ ఘాట్,
నగర్ ఘాట్,
బ్రహ్మపురి ఘాట్,
సంగం ఘాట్,
అభయ్ ఘాట్
10000
💚💚💚💚💚💚💚💚
ఈ వారము రెండవ ప్రశ్న
(28 4 2024)
ఈమె ఎవరు?
💚💚💚💚💚💚💚💚
8500
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*సత్సాంగత్యం:*
*సజ్జన సాంగత్యం, సత్సంభాషణం, సత్కర్మాచరణం ఇవే మనలోని ధార్మిక ప్రవృత్తిని దృఢంగా తయారు చేస్తాయి.*
*మంచి స్నేహితులు ఉంటే ఎంతటి దూరమైన ప్రయాణం కూడా దగ్గరే అనిపిస్తుంది. అలాగే సజ్జన సాంగత్యం వల్ల జీవన ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది.*
*సజ్జన సాంగత్యం అనేది సుగంధ పరిమళ ద్రవ్యాల వంటిది. వీటి వద్దకు వెళితే చాలు, ముట్టుకున్నా, ముట్టుకోక పోయినా సువాసన మనకు అంటుకుంటుంది.*
*అందుకే మానవ జన్మ పొందిన మనం నిరంతరం సజ్జన సాంగత్యం కలిగి ఉండాలి.*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
8800
🙏🙏🙏🙏
*మౌడ్యమి (మూఢమి)*
*సమగ్ర పరిశీలన*
******
*శుక్ర మూఢమి :*
26-04-2024 న శుక్ర మూఢమి ప్రారంభమై
01-07-2024 న శుక్ర మూఢమి త్యాగం జరుగును.
*గురు మూఢమి :*
05-05-2024 న గురు మూఢమి ప్రారంభమై
03-06-2024 న గురు మూఢమి త్యాగం జరుగును.
ప్రతి గ్రహాం రవికి 12 డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు గ్రహాలు అస్తంగత్వం చెందుతాయి. ఆ గ్రహాం తన కారకత్వాలను కోల్పోవుతుంది. ఆ గ్రహాం కోల్పోయిన బలాన్ని రవి స్వీకరిస్తాడు.
ఆ గ్రహాం యొక్క కారకత్వాలను రవి తన మహాదశలలో ఇస్తాడు.
ఏగ్రహాం అయితే అస్తంగత్వం చెందుతుందో ఆగ్రహాం ఏకారకత్వాలను తెలియజేస్తాయో ఆ కార్యక్రమాలను చేయకూడదు.
*కుజుడు:-*
కుజుడు అస్తంగత్వం చెందినప్పుడు ఆపరేషన్స్, యుద్ధాలు, రక్షణ సంభంధ నిర్ణయాల, పోలీస్ ఉద్యోగంలో చేరుట ఇంకాకుజ గ్రహానికి సంబందించిన మొదలగు పనులు చేయకూడదు.
*బుధ,శుక్ర మూడమిలలో*
అన్నప్రాశన తరువాత కార్యక్రమాలు చేయరాదు. అన్నప్రాశన ముందు కార్యక్రమాలు చేసుకోవచ్చును.
*గురువు:-*
గురువు మూడమిలలో సుఖానికి, దనానికి,సంబందం లేని పనులు చేసుకోవచ్చు, గురువు అస్తంగత్వం చెందినప్పుడు ఉపనయనం చేయటం మంచిది కాదు.
*శని:-*
శని అస్తంగత్వం చెందినప్పుడు ఉపాసన, దీక్ష, తపస్సు, మెడిటేషన్ వంటి పనులు చేయరాదు.
మూడమి అన్ని గ్రహాలకు ఉన్న *గురు, శుక్ర మౌడ్యమి మాత్రమే* మానవులపై ప్రభావం చూపుతుంది.
ఈ మూడమిలో జప, హోమాది శాంతులు గ్రహా శాంతికి అభిషేకాలు గండనక్షత్ర శాంతులు అన్ని వ్రతాలు చేయవచ్చును.
*శుక్ర మూఢమి*
బుధుడు, శుక్రుడు భూకక్ష్యకు లోపల ఉండి సూర్యుని చుట్టూ తిరుగుతూ బుధ శుక్రులు భూమి కంటే వేగంగా తిరుగుతూ సూర్యుని యొక్క అవతలి వైపుకి వెళ్ళినప్పుడు భూమి పైన ఉన్న మనకు బుధ, శుక్రులు కనిపించరు. అట్టి సమయాన్నే బుధ అస్తంగత్వం, శుక్ర అస్తంగత్వం అంటారు. శుక్రుడు అస్తంగత్వం అయినప్పుడు శుక్ర మౌడ్యమి అంటారు.
శుక్రుడు సూర్యునికి అవతలి వైపునకు వెళ్ళినప్పుడు *“ప్రాక్ అస్తంగత్వం”* అని,
శుక్రుడు సూర్యునికి భూమికి మద్య అస్తంగత్వం అయినప్పుడు *"పశ్చాద అస్తంగత్వం"* అంటారు.
మౌడ్య కాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు. అందువల్ల మౌడ్య కాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి.
గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి.
*శుభ గ్రహమైన శుక్రునకు మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిథ్థము.*
మౌఢ్యమిని మూఢమిగా వాడుక భాషలో పిలుస్తారు.
ఈ మూఢమి సమయంలో నూతన కార్యక్రమములు చేయకూడదు.
మూఢమి అంటే చీకటి.
శుక్రుడు సూర్య గ్రహమునకు ముందూ, వెనుక 10 డిగ్రీల దూరము లోపు శుక్రుడున్నట్లయితే అస్తంగత్వమునకు గురి అవును. అనగా శుక్రుడు తన తేజస్సును, ప్రభావాన్ని, శుభత్వాన్ని కోల్పోవును. అందువల్ల ఆ కాలములో చేసే శుభకార్యాలకు శుభ గ్రహమైన శుక్ర బలం ఉండదు కాబట్టి శుభ కార్యాలు చేయరాదు. కాబట్టి నిషేథ కాలముగా పరిగణించారు.
అలాగే ముఖ్యముగా పెళ్ళిచూపులు, వివాహ, చేయరాదు, వాహన కొనుగోలు చేయరాదు.
*శుక్ర మౌఢ్యమి* ఏర్పడినప్పుడు సమస్త జీవకోటి శృంగార సంబంథమైన విషయాల్లో బలహీనత ఏర్పడుతుంది. వీర్యకణాలలో జీవత్వం, పటుత్వం ఉండదు.
శుక్రమౌఢ్యమి కాలంలో ప్రసవం జరిగినప్పుడు శుక్ర గ్రహ, రవిగ్రహ శాంతి చేయాలి.
శుక్రదశ మహా దశ మరియు శుక్రుని అంతర్దశ నడుస్తున్న వాళ్ళు చాలా జాగరూకులై ఉండాలి.
శుక్ర మౌఢ్యమి కాలములో ప్రకృతి సంపద క్షీణిస్తుంది. సముద్రం ఆటు, పోటులలో మార్పులు వస్తాయి.
శుక్ర గ్రహ పాలిత ద్వీపాలకు, ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి.
స్త్రీల మీద అత్యథికంగా అత్యాచారాలు జరిగే అవకాశాలుంటాయి. శుక్రుడు సంసార జీవితానికి –శృంగార జీవితానికి కారకుడు.
జాతకములో శుక్రుడు బలహీనముగా ఉంటే సంసార జీవితం సజావుగా సాగదు..
ఇలాంటి వారు ఇంద్రాణీ దేవి స్తోత్రం పారాయణం చేయండి.
🙏🙏🙏🙏
9400
*🌹🌹 గురువెంత గొప్పవాడో తెలుసా 🌹🌹*
*బ్రహ్మ స్థానే కృతం పాపం*
*విష్ణు స్థానే విన శృతి*
*విష్ణు స్థానే కృతం పాపం*
*శివ స్థానే విన శృతి*
*శివ స్థానే కృతం పాపం*
*గురు స్థానే విన శృతి*
*గురుస్థానే కృతం పాపం*
*నాస్తి స్థానే విన శృతి*
*బ్రహ్మ వద్ద చేసిన తప్పులు విష్ణువు వద్ద చెప్పిదిద్దు కొనవచ్చు*
*విష్ణువు వద్ద చేసుకున్న తప్పులు శివుని వద్దచెప్పి దిద్దు కొనవచ్చు*
*శివుని వద్ద చేసిన తప్పులు గురువు వద్ద చెప్పిదిద్దు కొనవచ్చు*
*గురువు వద్ద చేసిన తప్పులు వేరే ఎవరి వద్ద చెప్పిదిద్దు కొనలేము*
*అంతటి గొప్ప వ్యక్తి గురువు అని మన వేదాలలో చెప్పబడింది కనుక గురువును గౌరవిద్దాం*
*గురువు గారు చెప్పిన మాటను పాటిద్దాం*
*🌹🌹🌹🌹🌹🌹
8200