ru
Feedback
APTEACHERS APEMPLOYEES

APTEACHERS APEMPLOYEES

Открыть в Telegram

APTEACHERS Website Official Telegram Channel లేటెస్ట్ విద్యా ఉద్యోగ సమాచార చానెల్ Latest Educational AP Employees, AP Teachers Information Official Website http://www.apteachers.in

Больше

📈 Аналитический обзор Telegram-канала APTEACHERS APEMPLOYEES

Канал APTEACHERS APEMPLOYEES (@apteachers) языкового сегмента Телугу является активным участником. Сейчас сообщество объединяет 15 113 подписчиков, занимая 13 181 место в категории Образование и 26 449 место в регионе Индия.

📊 Показатели аудитории и динамика

С момента создания невідомо проект демонстрирует стремительный рост, собрав аудиторию из 15 113 подписчиков.

Согласно последним данным от 18 сентября, 2026, канал показывает стабильную активность. За последние 30 дней изменение числа участников составило -120, а за последние 24 часа — -9, при этом общий охват остаётся высоким.

  • Статус верификации: Не верифицирован
  • Уровень вовлечённости (ER): Средний показатель вовлечённости аудитории составляет 10.57%. В первые 24 часа после публикации контент обычно набирает 7.29% реакций от общего числа подписчиков.
  • Охват публикаций: В среднем каждый пост получает 1 598 просмотров. В течение первых суток публикация набирает 1 101 просмотров.
  • Реакции и взаимодействия: Аудитория активно поддерживает контент: среднее количество реакций на один пост — 2.

📝 Описание и контентная политика

Автор описывает ресурс как площадку для выражения субъективного мнения:
APTEACHERS Website Official Telegram Channel లేటెస్ట్ విద్యా ఉద్యోగ సమాచార చానెల్ Latest Educational AP Employees, AP Teachers Information Official Website http://www.apteachers.in

Благодаря высокой частоте обновлений (последние данные получены 19 сентября, 2026) канал поддерживает актуальность и высокий уровень охвата публикаций. Аналитика показывает, что аудитория активно взаимодействует с контентом, что делает его важной точкой влияния в категории Образование.

15 113
Подписчики
-924 часа
-197 дней
-12030 дней
Архив постов
*గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు / పాఠశాల నాయకులకు,* *మీ LEAP స్కూల్ లాగిన్‌లో ఇప్పుడు 'మినిస్టర్ డ్యాష్‌బోర్డ్' (Minister Dash
*గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు / పాఠశాల నాయకులకు,* *మీ LEAP స్కూల్ లాగిన్‌లో ఇప్పుడు 'మినిస్టర్ డ్యాష్‌బోర్డ్' (Minister Dashboard) అందుబాటులోకి వచ్చింది.* *సమగ్ర సమాచారం: ఈ డ్యాష్‌బోర్డ్ 36 సూచికల (indicators) ఆధారంగా మీ పాఠశాల పనితీరును సమగ్రంగా తెలియజేస్తుంది.* *పనితీరు పోలిక: మీ పాఠశాల ఫలితాలను మండల, జిల్లా మరియు రాష్ట్ర సగటులతో సరిపోల్చి చూసుకునే అవకాశం ఇందులో కల్పించబడింది.* *అత్యంత ముఖ్యమైన విషయం:* *ఉన్నతాధికారులు మీ పాఠశాలను సందర్శించినప్పుడు, ఈ డ్యాష్‌బోర్డ్‌లోని సమాచారం ఆధారంగానే మీ పాఠశాల పనితీరును సమీక్షించే అవకాశం ఉంది.* *కావున, పాఠశాల ప్రధానోపాధ్యాయులందరూ మీ స్కూల్ పనితీరును క్రమం తప్పకుండా పరిశీలించుకోవాలని, ఎక్కడైనా మెరుగుపడాల్సిన అవసరం ఉంటే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరడమైనది.* *ఆఫీస్ రికార్డుల కోసం మరియు భవిష్యత్ అవసరాల నిమిత్తం దీనిని PDF డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.*

📢 డిగ్రీ ఉన్న తెలుగు రాష్ట్రాల యువతకు అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్ - 21న చివరి తేదీ ! 💠 2297 బ్యాంకు ఉద్యోగాలకు (Officer Scale I, II, III & Office Assistant) సువర్ణావకాశం ✅ APGVB (ఆంధ్రప్రదేశ్): 1,300 ఖాళీలు ✅ TGB (తెలంగాణ): 997 ఖాళీలు 🌐 వివరాలకు లింక్ : https://apdsc.net/apgvb-tgb-2297-bank-officer-vacancies/ 🎓 *అర్హత* : ఏదైనా డిగ్రీ చాలు 🗣️ *తెలుగు* మాధ్యమంలో పరీక్ష రాసుకునే అవకాశం! 📅 *దరఖాస్తు* : *21.09.2026 వరకు*🚨 💰 ఫీజు: SC/ST/PwBD ₹175 | ఇతరులు ₹850 📝 ఎంపిక: ప్రిలిమినరీ + మెయిన్ (+ ఆఫీసర్లకు ఇంటర్వ్యూ) 🌐 *వివరాలకు లింక్* : https://apdsc.net/apgvb-tgb-2297-bank-officer-vacancies/ ⚠️ చివరి తేదీ దగ్గరపడుతోంది – ఆలస్యం చేయకండి! 🔄 మీ స్నేహితులు, గ్రూప్‌లకు షేర్ చేయండి, వారికి కూడా సాయం అవుతుంది!

🏫 టాలెంట్ హబ్‌గా రెసిడెన్షియల్ స్కూళ్లు 🔹 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లుగా 10 పాఠశాలలు 🔹 నిమ్మకూరులో నీట్, జేఈఈ అకాడమీ ఏర్పాటు 🔹 1978 నుంచి ఇంటర్ సర్టిఫికెట్లు డిజిటలైజేషన్: మంత్రి లోకేశ్ https://whatsapp.com/channel/0029Va4aie49WtC2FHlZ3Z0O రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రతిభావంతులను తయారుచేసే కేంద్రాలుగా మారాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ 59వ గవర్నింగ్ బాడీ సమావేశం శుక్రవారం ఉండవల్లిలో జరిగింది. రాష్ట్రంలో 10 రెసిడెన్షియల్ పాఠశాలలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లుగా అభివృద్ధి చేసేందుకు గవర్నింగ్ బాడీ ఆమోదం తెలిపింది. కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు ఏపీఆర్‌జేసీ కాలేజీల్లో ఐఐటీ-జేఈఈ, నీట్ అకాడమీతోపాటు, ఆరు రెసిడెన్షియల్ పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు కూడా ఆమోదం లభించింది. జగ్గంపేట నియోజకవర్గంలోని భూపతిపాలెం రెసిడెన్షియల్ స్కూల్‌ను విద్య, క్రీడా హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవకాశాలను పరిశీలించాలని మంత్రి అధికారులకు సూచించారు. విద్యా సంస్థల సిబ్బంది పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు, పీఈటీలను పీడీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ఆమోదం లభించింది. సమావేశంలో ఉన్నతాధికారులు జె.శ్యామల రావు, రంజిత్ బాషా, భరత్ గుప్తా పాల్గొన్నారు. కాగా, ఈ ఏడాది నుంచి ఇంటర్ సమాధాన పత్రాల బుక్‌లెట్‌ను 32 పేజీలకు పెంచాలనే నిర్ణయం తీసుకున్నారు. 1978 నుంచి జారీచేసిన అన్ని సర్టిఫికెట్లనూ డిజిటలైజ్ చేసి, బ్లాక్‌చైన్ టెక్నాలజీతో అనుసంధానించాలని నిర్ణయించారు. ఇంటర్ బోర్డు సిబ్బంది పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచేందుకు ఆమోదించారు.

📢 Today's APTEACHERS News Headlines 19.9.2026 ⭐️ TODAY'S Special ▪️International Snakebite Awareness Day 2026 🌎 APTEACHERS International News Headlines: ▪️Aging symptoms were successfully reversed in mice by restoring the 'Menin' protein in the brain. ▪️The United Nations Environment Programme called on global nations to accelerate 'Net Zero Portal' targets to curb carbon emissions. ▪️A Global Partnership Roundtable meeting on strengthening the semiconductor supply chain is ongoing with representatives from 52 nations, including Japan, South Korea, the Netherlands, and Singapore. ▪️The 69th Commonwealth Parliamentary Conference is being held successfully from September 13 to 19. ▪️263 million women have experienced sexual violence by non-intimate partners: World Health Organization. ▪️The United Nations General Assembly High-Level Week is scheduled to commence on September 22. 🇮🇳 APTEACHERS National News Headlines ▪️A global summit on world environmental protection policies with international judges and experts from 17 nations began in New Delhi. ▪️Indian Army Chief General Dhiraj Seth held a bilateral meeting with defense ministry representatives in Moscow on expanding strategic military ties with Russia. ▪️The Union Ministry of Consumer Affairs relaxed the sugar stock limit for bulk consumers across the nation from 15 days to 30 days. ▪️The Centre informed the Supreme Court that it is working out modalities to implement the CBSE three-language policy for Class 9 students. ▪️To bolster indigenous defense capabilities, HAL handed over the Tejas twin-seater aircraft and the HTT-40 trainer aircraft to the Indian Air Force. ▪️JPC members questioned the Centre on provisions regarding foreign funds and asset seizures under the FCRA amendments. ▪️The government informed the Supreme Court that the switch to a computer-based NEET-UG in 2027 remains under 'active consideration'. ▪️'Tulu' language was declared the second official administrative language in the Udupi and Dakshina Kannada districts of Karnataka. ▪️Wangchuk announced a 20-kilometer padayatra on September 23 for Ladakh's rights. 🌅 APTEACHERS State News Headlines ▪️Two-wheeler movement on both ghat roads has been temporarily prohibited in Tirumala for devotee safety ahead of the major Garuda Seva during the annual Salakatla Brahmotsavams. ▪️The SIPB, chaired by CM Chandrababu Naidu, approved ₹22,178 crore investments across 28 projects; 19,739 jobs to be created. ▪️IMD warned that a low-pressure area is likely to form in the Bay of Bengal, bringing heavy to very heavy rainfall across Andhra Pradesh from September 19–23. ▪️Mazagon Dock Shipbuilders entered into an MoU with NShip-AP to establish a modern greenfield shipyard in Dugarajapatnam. ▪️The government is preparing to implement a specialized Temple Tourism Circuit Master Plan linking 21 major temples to promote state tourism. ▪️13.40 lakh applications have been received so far for social security pensions under the NTR Bharosa Pension scheme. 🏏Sports News ▪️Manu Bhaker and Tejinderpal Singh Toor will carry the Indian flag at today's opening ceremony of the 2026 Asian Games held in Aichi-Nagoya, Japan. ▪️Young Indian opener Abhishek Sharma created history by smashing a century in just 30 balls against Afghanistan in the third T20I match.

📢 నేటి APTEACHERS వార్తా ముఖ్యాంశాలు 19.9.2026 ⭐️ TODAY'S Special ▪️అంతర్జాతీయ స్నేక్‌బైట్ అవేర్‌నెస్ డే 2026 🌎 APTEACHERS అంతర్జాతీయ వార్తా ముఖ్యాంశాలు: ▪️మెదడులోని 'Menin' అనే ప్రోటీన్‌ను పునరుద్ధరించడం ద్వారా ఎలుకల్లో వృద్ధాప్య లక్షణాలను విజయవంతంగా రివర్స్ చేశారు. ▪️ప్రపంచ దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు 'నెట్ జీరో పోర్టల్' లక్ష్యాలను వేగవంతం చేయాలని ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం పిలుపునిచ్చింది ▪️సెమీకండక్టర్ సరఫరా గొలుసు పటిష్టతపై జపాన్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, సింగపూర్ సహా 52 దేశాల ప్రతినిధులతో గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్ రౌండ్‌టేబుల్ సమావేశం కొనసాగుతోంది ▪️69వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ సెప్టెంబర్ 13 నుండి 19 వరకు విజయవంతంగా కొనసాగుతోంది ▪️సన్నిహిత భాగస్వాములు కాని పురుషుల చేత 263 మిలియన్ల మంది మహిళలు లైంగిక హింసకు గురయ్యారు: ప్రపంచ ఆరోగ్య సంస్థ ▪️ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ హై-లెవల్ వీక్ సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. 🇮🇳 APTEACHERS జాతీయ వార్తా ముఖ్యాంశాలు ▪️17 దేశాల అంతర్జాతీయ న్యాయమూర్తులు మరియు నిపుణులతో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ విధానాలపై న్యూఢిల్లీలో గ్లోబల్ సదస్సు ప్రారంభమైంది ▪️రష్యాతో వ్యూహాత్మక సైనిక సంబంధాల విస్తరణపై భారత సైనిక దళాల అధిపతి జనరల్ ధీరజ్ సేథ్ మాస్కోలో రక్షణ శాఖ ప్రతినిధులతో ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు ▪️దేశవ్యాప్తంగా బల్క్ వినియోగదారుల వద్ద చక్కెర నిల్వ పరిమితిని 15 రోజుల నుంచి 30 రోజులకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ సడలించింది ▪️9వ తరగతి విద్యార్థుల కోసం సీబీఎస్ఈ త్రిభాషా విధానాన్ని అమలు చేసే విధివిధానాలపై తాము కసరత్తు చేస్తున్నామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ▪️స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంపొందించేందుకు, హెచ్‌ఏఎల్ తేజస్ రెండు సీట్ల విమానం మరియు హెచ్‌టిటి-40 శిక్షణా విమానాలను భారత వైమానిక దళానికి అప్పగించింది. ▪️FCRA సవరణలలోని విదేశీ నిధులు, ఆస్తుల స్వాధీన నిబంధనలపై కేంద్రాన్ని ప్రశ్నించిన JPC సభ్యులు ▪️కంప్యూటర్ ఆధారిత నీట్-యూజీ 2027కు మారే అంశం ఇంకా ‘చురుకైన పరిశీలనలో’ ఉందని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ▪️కర్ణాటకలోని ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాల్లో 'తుళు' భాషను రెండో అధికారిక పరిపాలనా భాషగా ప్రకటించారు. ▪️లడఖ్ హక్కుల కోసం సెప్టెంబర్ 23న వాంగ్‌చుక్ 20 కిలోమీటర్ల పాదయాత్రను ప్రకటించారు.ింది. 🌅 APTEACHERS రాష్ట్ర వార్తా ముఖ్యాంశాలు ▪️తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ప్రధానమైన గరుడ సేవను పురస్కరించుకుని భక్తుల భద్రత దృష్ట్యా రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిషేధించారు ▪️సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన SIPB 28 ప్రాజెక్టులకు ₹22,178 కోట్ల పెట్టుబడులు ఆమోదం; 19,739 ఉద్యోగాలు సృష్టి ▪️బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, 19–23 సెప్టెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది ▪️దుగరాజపట్నంలో ఆధునిక గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌ను ఏర్పాటు చేసేందుకు మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్, ఎన్‌షిప్-ఏపీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ▪️రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి 21 ప్రధాన ఆలయాలను కలుపుతూ ప్రత్యేక టెంపుల్ టూరిజం సర్క్యూట్ మాస్టర్ ప్లాన్ అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ▪️ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద సామాజిక పెన్షన్ ల కోసం ఇప్పటి వరకు 13.40 లక్షల ధరఖాస్తులు వచ్చాయి 🏏Sports News ▪️ఐచి-నగోయా (జపాన్) వేదికగా జరిగే 2026 ఆసియన్ గేమ్స్ 2026 నాగోయాలో ఈ రోజు ప్రారంభోత్సవంలో భారత్ జెండా మను భాకర్, తేజిందర్‌పాల్ తూర్ మోస్తారు ▪️భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో కేవలం 30 బంతుల్లోనే శతకం బాది సరికొత్త చరిత్ర సృష్టించాడు

📢 **టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్** 🔹 **మార్చి 29తో ముగియనున్న గోపిమూర్తి, కల్పలత పదవీకాలం** రాష్ట్ర శాసన మండలిలోని ఉమ్మడి తూర్పు-పశ్చిమ గోదావరి, కృష్ణా- గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే ఏడాది ఖాళీ అవుతాయి. ఈ నేపథ్యంలో ఆ స్థానాల్లో నూతన ఓటర్ల జాబితాల తయారీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఉమ్మడి తూర్పు-పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల నుంచి ఎన్నికైన బొర్రా గోపిమూర్తి, టీ కల్పలత పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనుంది. దీంతో 2026 నవంబరు 1ని అర్హత తేదీగా పరిగణించి తాజా ఓటర్ల జాబితాను రూపొందించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి సెప్టెంబరు 28న షెడ్యూల్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులను నవంబరు 6 వరకు స్వీకరిస్తారు. 25న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. దానిపై డిసెంబరు 10 వరకు క్లెయిములు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని డిసెంబరు 25 నాటికి పరిష్కరిస్తారు. డిసెంబరు 30న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. కొత్త ఓటర్ల జాబితా తయారీకి సంబంధిత జిల్లాల ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని సీఈవో ఆదేశించారు.

📢 **Intermediate: పరీక్షా బుక్‌లెట్లు, ప్రశ్నాపత్రాల మార్పులు** 🔹 **32 పేజీల బుక్‌లెట్:** వచ్చే సంవత్సరం నుంచి అన్ని సబ్జెక్టులకూ ఒకే విధంగా 32 పేజీల సమాధానాల బుక్‌లెట్ ఇస్తారు (ప్రస్తుతం భాషా సబ్జెక్టులకు 24, గ్రూప్ సబ్జెక్టులకు 32 పేజీలు ఇస్తున్నారు). 🔹 **జీవశాస్త్రానికి (Biology) 40 పేజీలు:** గతంలో వృక్షశాస్త్రం (Botany), జంతుశాస్త్రం (Zoology)లకు విడివిడిగా 24 పేజీల బుక్‌లెట్లు ఇచ్చేవారు. ఈసారి రెండూ కలిపి 40 పేజీల బుక్‌లెట్ (పార్ట్-A, పార్ట్-Bగా) అందిస్తారు. 🔹 **ఎలక్టివ్ సబ్జెక్టులకు ప్రత్యేక ప్రశ్నాపత్రం:** ద్విభాష స్థానంలో ఐచ్ఛిక (Elective) సబ్జెక్టులు తీసుకున్న విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రశ్నాపత్రం ఇస్తారు. ఉదాహరణకు, సెకండ్ లాంగ్వేజ్ స్థానంలో గణితం ఎంచుకున్న వారికి MPC విద్యార్థుల ప్రశ్నపత్రం కాకుండా వేరే ప్రశ్నాపత్రం రూపుదిద్దుతారు. 🔹 **పరీక్షల సమయం తగ్గింపు:** ఎలక్టివ్ విధానం వల్ల పరీక్షల నిర్వహణకు ఇప్పటివరకు 24 రోజులు పట్టేది. వేర్వేరు ప్రశ్నాపత్రాల ఏర్పాటుతో పరీక్షలను 16 రోజుల్లోనే పూర్తి చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. 🔹 **పారితోషికం పెంపు:** ఇంటర్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం (Evaluation)లో పాల్గొనే సిబ్బంది పారితోషికాన్ని 25% పెంచాలని నిర్ణయించారు. 🔹 **కఠిన చర్యలు:** మూల్యాంకనంలో తీవ్ర తప్పిదాలు చేసే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటారు. 🔹 **పదవీ విరమణ వయస్సు:** బోర్డులో పనిచేసే సిబ్బంది రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచారు. 🔹 **సర్టిఫికెట్ల డిజిటలైజేషన్:** 1978 నుంచి ఇప్పటివరకు జారీ చేసిన సర్టిఫికెట్లన్నింటినీ డిజిటలైజ్ చేసి, బ్లాక్‌ఛైన్ (Blockchain) టెక్నాలజీతో అనుసంధానించనున్నారు.

📢 *Cluster Complex లో LEAP APP లో హాజరు నమోదు విధానం* *క్లస్టర్ సమావేశ తేదీ* : 19th సెప్టెంబర్ క్లస్టర్ సమావేశానికి హాజరయ్యే ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా LEAP APP లో హాజరు నమోదు చేయాలి. *❇️హాజరు నమోదు విధానం* ✳️ *ముందుగా ఈ కింది లింకు లో మీ క్లస్టర్ కాంప్లెక్స్ స్కూల్ UDISE Code కాపీ చేసుకోండి* ✳️ *Cluster High Schools Venue Code Link* : https://net.apteachers.in/clusters/ ▪️ LEAP APP ను ఓపెన్ చేయండి. లాగిన్ చేయండి ▪️Teacher Section లో - > Teacher Services లోకి వెళ్ళండి ▪️Leave Management లోకి వెళ్ళండి ▪️Apply Special Duty మీద క్లిక్ చేయండి ▪️Special Duty Type లో చివర లో ఉన్న Cluster Complex Meeting మీద క్లిక్ చేయండి ▪️ Dates ఎంటర్ చేసిన తరువాత VENUE Code దగ్గర ముందుగా పై లింకు లో కాపీ చేసిన Cluster High School ను పేస్ట్ చేయండి ▪️Verify మీద క్లిక్ చేయండి, Cluster High School పేరు వస్తుంది ▪️Apply పై క్లిక్ చేయండి. ▪️సమావేశానికి సంబంధించిన Attendanceను నమోదు చేయండి. ✳️ *Cluster High Schools Venue Code Link* : http://net.apteachers.in/clusters 👉Share it in Your Mandal Groups

🏛 UPSC Engineering Services Examination (ESE) 2027 నోటిఫికేషన్ విడుదల 🚨 UPSC ESE 2027 – ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గొప్ప అవకాశం! 🎯 🌐Link for Complete Details : https://apdsc.net/upsc-ese-2027/ 📌 మొత్తం ఖాళీలు: సుమారు 480 పోస్టులు 🎓 అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/యూనివర్సిటీ నుంచి Engineering Degree ⚙️ డిసిప్లిన్లు: Civil, Mechanical, Electrical, Electronics & Telecommunication 📅 ఆన్‌లైన్ దరఖాస్తులు:చివరి తేదీ: 06-10-2026 📝 Preliminary Exam: 31-01-2027 📚 Main Exam: 18-06-2027 💳 Application Fee: సాధారణంగా ₹200; మహిళలు, SC, ST, అర్హత కలిగిన PwBD అభ్యర్థులకు మినహాయింపు. 🔥 ఇంజినీరింగ్ చదివిన ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని సీరియస్‌గా పరిశీలించండి! 📖 సిలబస్‌ను ఇప్పుడే ప్లాన్ చేసుకుని Preparation ప్రారంభించండి. ⏳ చివరి తేదీ వరకు వేచి ఉండకుండా Application Process పూర్తి చేయండి. 💪 మీ Engineering Degreeని ఒక గొప్ప Government Careerగా మార్చుకునే అవకాశం కోసం సిద్ధం అవ్వండి! ✳️ *Jobs News Whatsapp Channel:* https://whatsapp.com/channel/0029Vb4ZHHaLCoWxMElMVQ1x

*❇️కేంద్ర విద్యాశాఖ తాజా నిర్ణయం:* *సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ (TET) సమీక్ష ప్రస్తుతం సర్వీసులో కొనసాగుతున్న ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిబంధనల ముసాయిదాపై సమగ్ర సమీక్ష చేపట్టాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది.* *జాతీయ స్థాయి తాజా పరిణామాలు* *విద్యాశాఖ సమీక్ష:* *సుప్రీంకోర్టు విధించిన నిబంధనలు, గడువుల నేపథ్యంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఆచరణాత్మక ఇబ్బందులను పరిష్కరించేందుకు విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఎన్‌సీటీఈ (NCTE)తో సంప్రదింపులు జరుపుతోంది.* *ఎన్‌సీటీఈ ఉప-సంఘం (Sub-Committee):* *ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని సిలబస్, పరీక్షా విధానం మరియు క్వాలిఫైయింగ్ మార్కుల నిబంధనలను పునఃసమీక్షించేందుకు ఒక ఉప-సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఎన్‌సీటీఈ యోచిస్తోంది.* *సుప్రీంకోర్టు గడువు:* *విద్యా హక్కు చట్టం (RTE Act, 2009) అమల్లోకి రాకముందు నియమితులైన ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత సాధించడానికి సుప్రీంకోర్టు ఆగస్టు 31, 2028ని తుది గడువుగా నిర్ణయించింది.* *రాష్ట్రాల స్థాయి తాజా సమాచారం* *పరీక్షల నిర్వహణ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సర్వీసు ఉపాధ్యాయులకు తగినన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రతి ఆరు నెలలకోసారి (ఏడాదికి రెండుసార్లు) టెట్ నిర్వహించేందుకు రాష్ట్రాలు కసరత్తు చేస్తున్నాయి.* *తెలుగు రాష్ట్రాల పరిస్థితి (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ):* *RTE చట్టానికి ముందు నియమితులై, పదవీ విరమణకు ఐదేళ్లకు పైగా సర్వీసు ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని లేదా సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా సులభతరమైన సిలబస్‌తో పరీక్ష నిర్వహించాలని ఇరు రాష్ట్రాల ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాలకు విజ్ఞప్తులు సమర్పించాయి.*

📢ఎస్ఎస్సీ 2027 కోసం మిషన్ మార్చ్ రెండోదశ 🔹 *100 రోజుల యాక్షన్ ప్లాన్ కు రూపకల్పన* 🔹 *ఉపాధ్యాయులకు ఐదు రోజులపాటు వర్క్ షాప్* రాష్ట్రంలో మార్చి 2027లో జరిగే పదో తరగతి (ఎస్ ఎస్ సి) పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు మిషన్ మార్చ్ ఎస్ ఎస్ సి 2027 - ఫేజ్-టూ కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ చేపట్టింది. ఇందులో భాగంగా 100 రోజుల యాక్షన్ ప్లాన్ను రూపొందించ నున్నారు. విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా రెండు రకాల యాక్షన్ ప్లాన్లు, సబ్జెక్టు వారీగా, అధ్యాయం వారీగా కంటెంట్, ప్రశ్నల బ్యాంకులు, స్లిప్ టెస్టులు, అకడమిక్ టైమ్ టేబుల్ సిద్ధం చేయనున్నారు. బ్లూప్రింట్కు అనుగుణంగా ప్రశ్నలను రూపొం దించి, విద్యార్థులకు పరీక్ష విధానం, ప్రశ్నల సరళిపై అవగాహన కల్పించనున్నారు.ఈ కార్యక్రమం కోసం ఎంపికైన సబ్జెక్టు నిపుణులతో సెప్టెంబర్ 21 నుంచి 25 వరకు ఐదు రోజుల వర్క్షాప్ నిర్వహించనున్నారు. విజయవాడలోని ఆంధ్ర లయోలా క్యాంపస్లోని ఎస్- జె సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లోఈ కార్యక్రమం జరగనుంది. ఎంపికైన ఉపాధ్యాయులు సెప్టెంబర్ 21న ఉదయం 9 గంటలకు హాజరుకావాలని ఆదేశించారు. తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లిష్, గణితం, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ తదితర సబ్జెక్టులకు ఉపాధ్యాయులను నిపుణులుగా ఎంపిక చేశారు. వర్క్ షాప్ కు వెళ్లే ఉపాధ్యాయుల స్థానంలో అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అలాగే మిషన్ మార్చ్-2027 ఫేజ్-2 యాక్షన్ ప్లాన్ను త్వరగా విడుదల చేయాలని సూచించారు.

📢విద్యార్థుల గొడవను ఆపే క్రమంలో బెత్తం వాడి జైలుపాలైన ఒక ఉపాధ్యాయుడి మనోవేదన....🥺😢 ​విద్యార్థుల మధ్య జరిగిన గొడవను ఆపేందుకు బెత్తం ఉపయోగించినందుకు రెండు రోజులు పోలీస్ స్టేషన్ వరండాలో గడపాల్సి రావడం, ఆ తర్వాత ₹15,000 పరిహారం కూడా చెల్లించాల్సి వచ్చిన వాయనాడ్ విజయ హయ్యర్ సెకండరీ పాఠశాల ఉపాధ్యాయుడి ఆవేదనతో కూడిన రాత. ​రెండు రోజుల అనుభవం.. ఇన్నేళ్లు ఉపాధ్యాయుడిగా పనిచేసినా రాని అవగాహన, ఈ రెండు రోజుల్లో నాకు వచ్చింది. అందుకు విద్యార్థులకు, తల్లిదండ్రులకు, రాజకీయ నాయకులకు నా కృతజ్ఞతలు. ​నేటి కాలంలో ఉపాధ్యాయుడికి అధికారమూ లేదు, హక్కులూ లేవు; కేవలం బాధ్యత మాత్రమే ఉంది అనే విషయం నాకు అర్థమైంది. ​ఇకపై విద్యార్థులు ఒకరినొకరు కొట్టుకున్నా, తప్పుడు దారిలో నడిచినా, చదివినా చదవకపోయినా, పరీక్షల్లో కాపీ కొట్టినా, పాఠశాల ఆస్తిని ధ్వంసం చేసినా, మత్తుపదార్థాలు తీసుకున్నా.. ఏం చేసినా కళ్ళు, చెవులు మూసుకుని కేవలం జీతం తీసుకుని ఇంటికి వెళ్తే చాలు అనే పాఠాన్ని ఈ సమాజమే నాకు నేర్పింది. ​నేను చేసిన చిన్న శిక్షను ప్రతి ఒక్కరూ గంటకోసారి భూతద్దంలో పెట్టి చూపిస్తూ, అదో భయంకరమైన నేరం అన్నట్లు చిత్రీకరించడాన్ని కూడా చూశాను. ​ఇకముందు ఎలాంటి బాధ్యతల ఒత్తిడి లేకుండా, పాఠం చెప్పడం ముగించుకుని ఇంటికి వెళ్లిపోయే ఉపాధ్యాయుడిగా ఉండటమే మంచిదని భావిస్తున్నాను. ​అందుకే, ఇకపై నేను ఎవరినీ సరిదిద్దడానికి ప్రయత్నించబోనని ఈ సమాజానికి, నా ప్రియమైన విద్యార్థులకు తెలియజేస్తున్నాను. దీనివల్ల నాకు ఒక రకమైన మనశ్శాంతి దొరికింది. శుభం. ​ *తదుపరి భాగం:* పాఠశాల పిల్లలను తమ సొంత బిడ్డల్లా భావించి, వారిని మంచి మార్గంలో నడిపించాలని చూసిన ఒక నిజాయితీపరుడైన ప్రధానోపాధ్యాయుడిని బలిపశువును చేసిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు మేము (ఉపాధ్యాయులం) క్షమాపణలు చెబుతున్నాము. మిమ్మల్ని మా సొంత పిల్లల్లా చూడటం మేము చేసిన తప్పు, మిమ్మల్ని సరిదిద్దాలని చూడటం ఇంకా పెద్ద తప్పు. క్లాస్‌రూమ్‌లలో అబ్బాయిలు-అమ్మాయిలు కలిసి మద్యం సేవించడం, చెడు సావాసాల వైపు వెళ్లడం సరైనది కాదని చెప్పి, వారిని మార్చడానికి ప్రయత్నించడం పిల్లల హక్కుల ఉల్లంఘన, మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని మేము గ్రహించలేకపోయాము. అందుకు మమ్మల్ని క్షమించండి పిల్లలూ... క్షమించండి. ​ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి; మీ ఏడు తరాల మంచి కోసం ఆ దేవుడిని ప్రార్థించండి, ఆ దేవుడే మిమ్మల్ని క్షమించాలి. *​చివరి సందేశం* : ఈ సందేశాన్ని మంచి తల్లిదండ్రులకు చేరేలా చూడండి. కనీసం వారిలోనైనా ధర్మబుద్ధి మిగలాలి. వివేకం లేని ఇలాంటి చట్టాలనే మొదట మార్చాల్సి ఉంది. ఈ పోస్ట్‌ను ఏదో మామూలు సందేశంలా భావించి నిర్లక్ష్యం చేయకండి. కాస్త సమయం తీసుకుని చదవండి, *ఆలోచించండి* . ఇది ఒక ఉపాధ్యాయుడి మనసులోని తీవ్రమైన వేదన నుండి వచ్చిన ఆవేదన పూరిత మాటలు...

📢*Dr NTR హెల్త్ యూనివర్సిటీలో BHMS కోర్సులలో ఆల్ ఇండియా కోటా మరియు మేనేజ్మెంట్ కోటాలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల*
📢*Dr NTR హెల్త్ యూనివర్సిటీలో BHMS కోర్సులలో ఆల్ ఇండియా కోటా మరియు మేనేజ్మెంట్ కోటాలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల*

📢 *అక్టోబర్ 1 నుంచి జనన-మరణ నమోదు కొత్త నిబంధనలు* ▪️జనన, మరణ రికార్డులను కచ్చితంగా, పారదర్శకంగా.. సకాలంలో నమోదు లక్ష్యంగా కొత్త నిబంధనలు ▪️2 ఏళ్లకు పైగా ఆలస్యమైతే మేజిస్ట్రేట్ ఆదేశం తప్పనిసరి ఆలస్య నమోదుకు ధృవీకరణ, రుసుము తప్పనిసరి ▪️అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు

📢*అమరావతి : APPSC భర్తీచేసే 'వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్' పోస్టులకు రాతపరీక్ష తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు..!* *ఇప్పటివరకు ఉన్న 'మెరిట్ పద్ధతిలో నియామకాలు' రద్దు చేసిన ప్రభుత్వం. *ఈ నెల 13న జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం.

📢 పాఠశాలల్లో బి.ఎడ్ (B.Ed) అర్హతతో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా (SGT) పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోసం కేంద్ర విద్యాశాఖ ప్రత్యేకం 6 నెలల సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించింది. https://whatsapp.com/channel/0029Va4aie49WtC2FHlZ3Z0O ప్రాథమిక పాఠశాలల్లో ఎస్‌జీటీలుగా పనిచేస్తున్న బి.ఎడ్ అభ్యర్థులు బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఈ సర్టిఫికేట్ కోర్సును ప్రవేశపెట్టారు. 🔹 అమలు చేసే సంస్థ: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) ద్వారా ఈ 6 నెలల కోర్సు అందుబాటులోకి వస్తుంది. 🔹 బోధనా విధానం: ఇందులో ఆన్‌లైన్ కాంటాక్ట్ తరగతులు, ప్రాక్టికల్స్, పాఠశాల ఆధారిత అనుభవ శిక్షణ ఉంటాయి. 🔹 భాషలు: తరగతులు ఆంగ్లం, హిందీ భాషల్లో జరుగుతాయి. అయితే పరీక్షలను మాత్రం తెలుగు సహా 22 అధికారిక భాషల్లో రాసేందుకు అవకాశం కల్పించారు. 🔹 చేరిన వారి వివరాలు: దేశవ్యాప్తంగా మొత్తం 76,731 మంది ఈ కోర్సులో ప్రవేశాలు పొందారు. 🔹 రాష్ట్రాల వారీగా: తెలంగాణ నుంచి 283 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 242 మంది నమోదు చేసుకోగా, అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ (UP) నుంచి 35,440 మంది ఉన్నారు.

📢 **Today's APTEACHERS News Headlines 18.9.2026** 🌎 **APTEACHERS International News Headlines:** ▪️Astronomers have discovered 'Elias 2-24 b', the youngest (less than a million years old) Jupiter-sized planet in the universe. ▪️US Congress passed the Russia, Iran Disinvestment Act, empowering the US President to impose 100 percent tariffs on countries purchasing Russian oil. ▪️TikTok founder Zhang Yiming overtook Gautam Adani to become Asia's richest person. ▪️European Union proposed ‘Associate Member’ status to Canada. ▪️Canada was invited as the first associate member of the European Union. ▪️US denied visa to Palestinian President Mahmoud Abbas in view of the United Nations meetings. ▪️New green card rules came into effect in the US from September 18. ▪️Russia and China vetoed the US proposal for UN experts to monitor sanctions on Iran. 🇮🇳 **APTEACHERS National News Headlines** ▪️Centre stated that revenue and recycling can be increased through scientific management of e-waste in government offices. ▪️Union Health Ministry directed states to take strict action against stem cell therapy treatments lacking government approval. ▪️Prime Minister Narendra Modi inaugurated Semicon India 2026, revealing the goal to make India a trusted semiconductor hub. ▪️Centre agreed in the Supreme Court to reduce the NEET-SS super-specialty qualifying percentile from 50 to 30. ▪️A decision was taken to extend N. Chandrasekaran's tenure as Chairman of the Tata Sons Board for another five years. ▪️NTA released the entrance examination calendar for the 2027 academic year; JEE Main 2027 – Session 1 (January) will be held on 22–24, 28–30. ▪️Election Commission barred both factions of Trinamool from using the party name and symbol for the by-elections. ▪️Supreme Court asked the government to make the three-language formula mandatory for Class 6 only from January 1, 2027. ▪️FCRA cancellation only blocks foreign funds: Delhi High Court rejected the petition filed by the Centre on the withdrawal of NGO funds. 🌅 **APTEACHERS State News Headlines** ▪️September 18 is the government's deadline for applying fresh for NTR Bharosa social pensions. ▪️Police are implementing a geo-tagging system for the safety of devotees during the Tirumala Srivari Brahmotsavams. ▪️Government issued orders to recognize Aadhaar and Ration Cards as proof of residence. ▪️Regularization of house sites for 25,880 families in Visakhapatnam; Chandrababu to distribute pattas tomorrow. ▪️Employees' associations demanded an increase in the medical reimbursement limit to ₹5 lakh during yesterday's Employees Health Scheme discussions. 🏏**Sports News** ▪️Sports Ministry approved a contingent of 503 athletes from India for the Asian Games 2026 to be held in Japan. ▪️Young Indian opener Abhishek Sharma created a brand new record by smashing a century in just 30 balls in the third T20 match against Afghanistan.

📢 నేటి APTEACHERS వార్తా ముఖ్యాంశాలు 18.9.2026 🌎 APTEACHERS అంతర్జాతీయ వార్తా ముఖ్యాంశాలు: ▪️విశ్వంలో అత్యంత పిన్న వయస్కుడైన (మిలియన్ సంవత్సరాల కంటే తక్కువ వయస్సు) జూపిటర్ పరిమాణ గ్రహం 'Elias 2-24 b' ను ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ▪️అమెరికా కాంగ్రెస్ రష్యా, ఇరాన్ ఉపసంహరణ చట్టాన్ని ఆమోదించి, రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం టారిఫ్‌లు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి కల్పించింది ▪️టిక్‌టాక్ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ గౌతమ్ అదానీని అధిగమించి ఆసియా అత్యంత ధనవంతుడిగా నిలిచాడు ▪️యూరోపియన్ యూనియన్ కెనడాకు ‘అసోసియేట్ మెంబర్’ స్థాయి ప్రతిపాదించింది. ▪️కెనడాను యూరోపియన్ యూనియన్‌లో మొదటి అసోసియేట్ సభ్యునిగా ఆహ్వానించారు. ▪️ఐక్యరాజ్యసమితి సమావేశాల నేపథ్యంలో ఫిలిస్తీన అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌కు అమెరికా వీసా నిరాకరించింది. ▪️అమెరికాలో సెప్టెంబర్ 18 నుంచి కొత్త గ్రీన్ కార్డ్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ▪️ఇరాన్‌పై ఆంక్షలను ఐక్యరాజ్యసమితి నిపుణులు పర్యవేక్షించాలన్న అమెరికా ప్రతిపాదనను రష్యా, చైనా వీటో చేశాయి. 🇮🇳 APTEACHERS జాతీయ వార్తా ముఖ్యాంశాలు ▪️ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-వ్యర్థాల (E-waste) శాస్త్రీయ నిర్వహణ ద్వారా ఆదాయం మరియు పునర్వినియోగం పెంచవచ్చని కేంద్రం తెలిపింది. ▪️ప్రభుత్వ అనుమతి లేని స్టెమ్ సెల్ థెరపీ చికిత్సలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు ఇచ్చింది. ▪️ప్రధాని నరేంద్ర మోదీ సెమికాన్ ఇండియా 2026ని ప్రారంభించి భారత్‌ను విశ్వసనీయ సెమికండక్టర్ హబ్‌గా మార్చే లక్ష్యం వెల్లడించారు. ▪️కేంద్రం సుప్రీంకోర్టులో నీట్-ఎస్‌ఎస్ సూపర్ స్పెషాలిటీ అర్హత పర్సెంటైల్‌ను 50 నుంచి 30కి తగ్గించడానికి అంగీకరించింది. ▪️టాటా సన్స్ బోర్డు చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ పదవీకాలాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు ▪️NTA 2027 విద్యాసంవత్సర ప్రవేశ పరీక్షల క్యాలెండర్‌ విడుదల, JEE మెయిన్ 2027 – సెషన్ 1 (జనవరి): 22–24, 28–30 లో జరుగుతాయి ▪️ఉప ఎన్నికలకు పార్టీ పేరు, గుర్తును ఉపయోగించకుండా తృణమూల్ రెండు వర్గాలను ఎన్నికల సంఘం నిషేధించింది. ▪️2027 జనవరి 1 నుంచి మాత్రమే 6వ తరగతికి త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేయాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. ▪️ఎఫ్‌సీఆర్‌ఏ రద్దు కేవలం విదేశీ నిధులను మాత్రమే నిరోధిస్తుంది: ఎన్‌జీవో నిధుల ఉపసంహరణపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. 🌅 APTEACHERS రాష్ట్ర వార్తా ముఖ్యాంశాలు ▪️ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే గడువుకు ప్రభుత్వం సెప్టెంబర్ 18 చివరి తేదీ ▪️తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భక్తుల భద్రతకు జియో-ట్యాగింగ్ విధానాన్ని పోలీసులు అమలు చేస్తున్నారు ▪️ఆధార్, రేషన్ కార్డ్ లను నివాస రుజువులుగా గుర్తించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ ▪️విశాఖ లో 25,880 కుటుంబాలకు ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ, రేపు పట్టాలు ఇవ్వనున్న చంద్రబాబు ▪️మెడికల్ రీయంబర్స్మెంట్ పరిమితిని రూ 5 లక్షలకు పెంచాలని ఉద్యోగ సంఘాలు నిన్న ఉద్యోగ ఆరోగ్య పధకం చర్చలో డిమాండ్ చేశాయి 🏏Sports News ▪️జపాన్‌లో జరగనున్న ఆసియా క్రీడలు 2026 కోసం భారత్ నుండి 503 మంది అథ్లెట్ల బృందానికి క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది ▪️భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో కేవలం 30 బంతుల్లోనే శతకం బాది సరికొత్త చరిత్ర సృష్టించాడు

📢 W.P. No. 20968 of 2026 మరియు సంబంధిత పిటిషన్లు తీర్పు *కేవలం సర్వీస్ కాలాన్ని మాత్రమే ఏకైక ప్రాతిపదికగా తీసుకునే విధానాన్ని వెంటనే పునఃసమీక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు మధ్యంతర ఆదేశాల ద్వారా ఆదేశించింది* https://whatsapp.com/channel/0029Va4aie49WtC2FHlZ3Z0O ✳️ నేపథ్యం: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్, 2025 (రాష్ట్రపతి ఉత్తర్వులు, 2025) మరియు G.O.Ms.No.129 (తేదీ 17.07.2026) ప్రకారం విజయనగరం మరియు నూతనంగా ఏర్పాటైన పార్వతీపురం మన్యం జిల్లాల మధ్య హెడ్ కానిస్టేబుల్స్ (సివిల్) కేడర్ కేటాయింపు ప్రక్రియను సవాలు చేస్తూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. 🌐 ప్రభుత్వ విధానంలో లోపం: రాష్ట్రపతి ఉత్తర్వులు, 2025 లోని పేరా 4(2) ప్రకారం ఉద్యోగుల వయస్సు, సీనియారిటీ సమతుల్యత (balanced cadres with reference to age and seniority) వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉండగా, ప్రభుత్వం కేవలం సర్వీస్ కాలాన్ని (length of service/seniority) మాత్రమే ఏకైక ప్రాతిపదికగా తీసుకుంది. ✳️ కోర్టు పరిశీలన: 🔹 సీనియారిటీని మాత్రమే కొలమానంగా తీసుకుంటే, సీనియర్లందరూ పాత/అభివృద్ధి చెందిన జిల్లాలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల జూనియర్లు మిగిలిన జిల్లాలకు కేటాయించబడతారు. 🔹 సీనియర్లు ఎక్కువగా ఉన్న జిల్లాల్లోని జూనియర్లకు త్వరగా పదోన్నతులు (promotions) వచ్చి జోనల్/మల్టీ-జోనల్ స్థాయిలకు చేరుకుంటారు; మిగిలిన జిల్లాలలోని జూనియర్లు పదోన్నతుల కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. ఇది రాజ్యాంగంలోని అధికరణలు 14, 16 కింద కల్పించిన సమాన అవకాశాల ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని కోర్టు స్పష్టం చేసింది. 🔹 పాలనా సమర్థత దృష్ట్యా, అన్ని జిల్లాల్లో సీనియర్లు మరియు జూనియర్ల నిష్పత్తి సమతుల్యంగా ఉండటం అత్యవసరమని కోర్టు పేర్కొంది. ✳️ కోర్టు ఆదేశాలు (Directions of the Court) 🔹 మధ్యంతర ఆదేశం (Interim Direction): ఉద్యోగులను కొత్త జిల్లాలకు కేటాయించే ప్రక్రియలో G.O.Ms.No.129 (తేదీ 17.07.2026) ప్రకారం "సర్వీస్ కాలాన్ని" (length of service) మాత్రమే ఏకైక ప్రాతిపదికగా తీసుకోవడంపై ప్రభుత్వం వీలైనంత త్వరగా పునఃసమీక్ష జరపాలని హైకోర్టు ఆదేశించింది. 🔹* తుది కేటాయింపులపై స్పష్టత: ఉద్యోగుల తుది కేటాయింపుల (final allocation) ప్రక్రియను పూర్తి చేయడానికి ముందే ఈ విధానాన్ని ఉన్నత స్థాయిలో పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 🔹* తదుపరి విచారణ: తదుపరి విచారణను 29.10.2026 తేదీకి వాయిదా వేసింది.

📢 **సెప్టెంబర్ 2026 క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల షెడ్యూల్ విడుదల!** రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణకు SCERT డైరెక్టర్ ఉత్తర్వులు (Rc.No.ESE02/208/2025-SCERT) జారీ చేశారు: 🌐 **Detailed Agenda,PDF Material, Google Drive Links** : https://www.apteachers.in/2026/09/sep-2026-cluster-complex-meetings-on.html 🗓 **సమావేశాల తేదీలు:** • **19.09.2026 (3వ శనివారం):** ప్రైమరీ (SGTs) మరియు సెకండరీ నాన్-లాంగ్వేజ్ ఉపాధ్యాయులు (గణితం, సైన్స్, సోషల్) • **26.09.2026 (4వ శనివారం):** ప్రైమరీ (SGTs), లాంగ్వేజ్ ఉపాధ్యాయులు (తెలుగు, హిందీ, ఇంగ్లీష్) మరియు పీఈటీలు (PD/PET) ⏰ **సమయం:** ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు. 📌 **ప్రధాన ఎజెండా అంశాలు:** • ఉపాధ్యాయ, విద్యార్థుల హాజరు సమీక్ష & FA-1 ఫలితాల విశ్లేషణ. • AI సమర్థ్ (AI Samarth) ఆధారిత లెసన్ ప్లానింగ్. • నిపుణ్ భారత్ (FLN) కార్యాచరణ మరియు దీక్ష (DIKSHA) జ్ఞాన ప్రకాశ్ కోర్సులు. • ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం PRASHAST స్క్రీనింగ్ టూల్. • 10వ తరగతి మోడల్ పేపర్ల సమీక్ష & అక్టోబర్ సిలబస్ ప్లానింగ్. • ఉపాధ్యాయుల ట్రైనింగ్ నీడ్స్ అనాలిసిస్ (TNA) సర్వే మరియు PM e-VIDYA యాప్ వినియోగం.