FactCheck.AP.Gov.in
رفتن به کانال در Telegram
Official Account of Fact Check Wing of Government of Andhra Pradesh
نمایش بیشتر1 952
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
اطلاعاتی وجود ندارد7 روز
اطلاعاتی وجود ندارد30 روز
آرشیو پست ها
1 952
‘తాకట్టులో సచివాలయం’ శీర్షికతో 03–03–2024న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించిన వార్త పూర్తిగా అవాస్తవం. ఈ కథనాన్ని స్వయంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖండించింది.
‘‘సచివాలయ భవనాలను తాకట్టు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి రూ.370 కోట్లు రుణం తీసుకుంది’ అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో మార్చి 3న వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవం. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంది. దీన్ని మేం ఖండిస్తున్నాం’ అని హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికార ప్రతినిధి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
దీనికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా చూడవచ్చు.
1 952
‘తాకట్టులో సచివాలయం’ శీర్షికతో 03–03–2024న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించిన వార్త పూర్తిగా అవాస్తవం. ఇలాంటి నిరాధారమైన కథనాన్ని ప్రచురించినందుకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయటం జరుగుతుంది.
– రాష్ట్ర సచివాలయంలోని అయిదు భవనాలు హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు తాకట్టు పెట్టినట్లు వచ్చిన వార్త పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఐసీఐసీఐ, హెడ్ డీఎఫ్సీ బ్యాంకుల నుండి ఏపీ సీఆర్డీఏ ఎలాంటి రుణమూ పొందలేదు. రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ నుంచి ఈ విషయమై ఏపీ సీఆర్డీఏకు ఎలాంటి ప్రతిపాదనా రాలేదు. కనార్టియం బ్యాంకులు, హడ్కోల నుంచి ఏపీ సీఆర్డీఏ పొందిన రుణాన్ని ముఖ్యమైన మౌలిక సదుపాయాల కోసం వినియోగించడం జరిగింది.
– రాయపూడిలోని అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్స్ జీవోఎంఎస్ నెంబరు: 332, తేదీ: 15.10.2018 ప్రకారం రూ.2,060 కోట్ల రుణాన్ని కన్టార్టియం బ్యాంకులైన యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకు మంజూరు చేశాయి. ఇందులో రూ.1,955 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు సీఆర్డీఏకు రిలీజ్ చేయటం జరిగింది.
– 2017లో హడ్కో రూ.1275 కోట్ల రుణాన్ని మౌలిక సదుపాయాల కోసం మంజూరు చేసింది. అందులో రూ.1,151 కోట్లు మాత్రమే సీఆర్డీఏకు రిలీజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కంఫర్ట్ లెటర్ జారీ చేయటం జరిగింది. ఏపీ సీఆర్డీఏ సచివాలయ భవనాలను తాకట్టు పెట్టి ఎలాంటి రుణమూ పొందలేదు. ఈ వార్త పూర్తిగా అవాస్తవం.
1 952
దీనితో పాటుగా తయారుచేసే రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్, రిజిస్టర్ ఆఫ్ చార్జెస్ అండ్ కోవినంట్స్ వల్ల భూములపై ఉన్న అన్ని రకాల చార్జీలు, వివాదాలు ఒక దగ్గరికి వస్తాయి. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఏవైనా వాటిని నిర్దేశించిన పద్ధతిలోనే రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్లో నమోదు చేస్తారు. దీంతోపాటు తయారుచేసే మిగతా రెండు రిజిస్టర్ల వల్ల సదరు భూమిపై ఉన్న అన్ని చార్జీలు, రుణాలు, ఒకే దగ్గర తెలియడం వల్ల ఆ భూమికి సంబంధించి సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్గా ఈ రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్ను పరిగణించవచ్చు. ఈ రికార్డులు ఎవరో ఒక అధికారి చేతిలో ఉండవు. ఆన్లైన్లో ఇంటర్నెట్ ఉన్న ప్రతివారూ చూడొచ్చు. భూమిపై ఏ విధమైన మార్పు జరిగినా ఎవరైనా ఎప్పుడైనా వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది.
1 952
వాస్తవం: కంక్లూజివ్ టైటిల్స్ రాత్రికే రాత్రే ఇవ్వరు. రీసర్వే ప్రక్రియ పూర్తయ్యాకే ఈ టైటిల్స్ ఇస్తారు. దీనికి రెండేళ్లపైనే పడుతుంది. వివాదాలు లేని భూములనే టైటిల్ ఆఫ్ రిజిస్టర్లో నమోదుచేస్తారు. దీని తర్వాత కూడా కంక్లూజివ్ టైటిల్స్ సమయంలో ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు? దేన్ని వివాదంగా చూడాలి? అన్న విషయాలను అథారిటీ తన రూల్స్లో స్పష్టంగా పేర్కొంటుంది. ఈ రూల్స్ ప్రస్తుతం తయారవుతున్నాయి.
ఆరోపణ: రికార్డుల్లో ఒకసారి పేరు చేర్చాక ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే రెండేళ్ల తర్వాత ఆ పేరు గల వ్యక్తి యజమాని అవుతాడు.రిజిస్టర్లో పేర్లను చేర్చే క్రమంలో కొందరు అధికారులు, రాజకీయ నేతలు చెప్పినట్లుగా తయారు చేసే అవకాశం ఉంది. రిజిస్టర్లో ఎవరి పేరు నమోదు చేశారో నిరక్షరాస్యులు, రైతులు సులువుగా తెలుసుకోలేరు. పైగా టైటిల్ రిజిస్టర్ను ఆన్లైన్లో ఉంచుతామని చట్టంలో పేర్కొనలేదు. సర్టిఫికెట్లు, పహానిల ప్రస్తావనే లేదు. అందుకే అధికారులు రిజిస్టర్లను గోప్యంగా ఉంచి అవినీతికి పాల్పడతారని ఆందోళన నెలకొంది.
వాస్తవం: భూ హక్కు చట్టం సెక్షన్ 57 ప్రకారం ఈ చట్టం కింద చేసే ప్రతి పనిని పారదర్శకతకోసం, మానవ తప్పిదాలు, పొరపాట్లు, ఉద్దేశపూర్వక చర్యలు లేకుండా ఉండేందుకు ఆన్లైన్లో చేయాలని చెబుతుంది. అంటే ఒక పేరు చేర్చాలన్నా, తీయాలన్నా ఏది జరగాలన్నా ఆన్లైన్లో అందరికీ అందుబాటులో, అందరూ చూసేలా ఉంచుతారు. ఈ చట్టంలో సెక్షన్ 57, 58, 59 లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కింద ఎవరూ మార్పులు చేయడానికి వీల్లేకుండా అన్నిరకాల సెక్యూరిటీ ఫీచర్లతో ఉన్న కంప్యూటర్ సిస్టం తయారు చేయాల్సిందిగా నిర్దేశించడం జరిగింది. ఈ చట్టం కింద జరిపే ప్రతి వ్యవహారాన్ని, ప్రతి నిమిషం ఎవరైనా, ఎక్కడైనా చూసుకునే అవకాశం ఉన్నందున అధికారులు, రాజకీయ నేతలు ప్రమేయానికి ఆస్కారమే లేదు. వివాదాలకు ఆస్కారం లేకుండా భూ యజమానికి కంక్లూజివ్ టైటిల్ ఇస్తారు. దీనికి ప్రభుత్వం గ్యారంటీ కూడా ఇస్తుంది.
ఆరోపణ: ఆస్తులకు సంబంధించిన దస్తావేదులు ప్రస్తుతం యజమానుల దగ్గరే ఉంటాయి. క్రయవిక్రయాల సమయంలో వాటిని అధికారంగా వాడుకోవచ్చు. తాజా చట్టం ప్రకారము ఈ దస్తావేజులకు విలువే ఉండదు. మీరే యజమాని అంటూ టీఆర్వోలో ఇచ్చే ధ్రువపత్రమే చెల్లుబాటు అవుతుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో చట్ట ప్రకారం లక్ష రూపాయలను స్టాంప్ డ్యూటీగా చెల్లించి అధికారంగా పొందిన దస్తావేజులకు విలువ లేకుండా టీఆర్వో ఇచ్చే ధ్రువపత్రానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం అభ్యంతరకరం.
వాస్తవం: ఇదీ పూర్తిగా అవాస్తవం. సెక్షన్ 12 ప్రకారం ప్రచురించిన టైటిల్ ఆఫ్ రిజిస్టర్లో వివరాలపై అభ్యంతరాలుంటే రెండేళ్లలోపు పూర్తి వివరాలతో ఎల్టీఏవో వద్ద కానీ, సివిల్ కోర్టులో కానీ దావా వేయవచ్చు. ఎల్టీఏవో ఉత్తర్వుల ప్రకారం లేదా కోర్టు ఆదేశాలను అనుసరించి టైటిల్ ఆఫ్ రిజిస్టర్లో వివరాలు నమోదు చేస్తారు. హక్కులు నిర్ధారణ అయి, టైటిల్ ఆఫ్ రిజిస్టర్లో వివరాలు నమోదయ్యే వరకు మన దగ్గర ఉన్న పత్రాలు పదిలంగా ఉంచుకోవచ్చు. ఇవి హక్కుల నిర్ధారణకు ఆధారాలుగా పరిగణిస్తారు. టైటిల్ ఆఫ్ రిజిస్టర్లో నమోదైన రెండేళ్ల తరవాత ఆ భూమిపై సంపూర్ణ హక్కు లభిస్తుంది. అనేక రికార్డుల స్థానే ఒకే ఒక్క హక్కు పత్రం వస్తుంది. ఇప్పటివరకూ యజమానులకు సంబంధించిన భూములపై 1బీ, పాసుపుస్తకం, అడంగల్, రిజిస్ట్రేషన్ డీడ్ రూపంలో అనేక పత్రాలున్నాయి. వీటిస్థానే ఒకే శాశ్వత హక్కుపత్రం వస్తుంది. రికార్డులన్నీ అప్ డేట్గా ఉంటాయి. ఎవ్వరూ టాంపర్ చేయలేని రీతిలో పటిష్ట కంప్యూటర్ వ్యవస్థ ద్వారా నిక్షిప్తం అవుతాయి. ఇంతటి పారదర్శక, పటిష్ట ప్రక్రియపై ఈనాడు అవాస్తవాలు రాస్తోంది.
ఆరోపణ: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తమ స్థిరాస్తి వివరాలను టైటిల్ రిజిస్టర్లు నమోదు చేయించుకోవాల్సిందే. అధికారులను దారిలోకి తెచ్చుకొని ఎవరైనా ప్రభుత్వ, దేవాదాయ భూములకు యజమానిగా టైటిల్ రిజిస్టర్లో వారి పేరు చేర్పించుకుంటే దాని గురించి పట్టించుకునే వాళ్ళు ఉండరు. రిజిస్టర్లు అధికారులు అధీనంలో ఉంటాయి కాబట్టి బయటకు తెలిసే అవకాశం ఉండదు. పేరు మార్పును రెండేళ్ల వరకు ఎవరూ పట్టించుకోకుంటే ఆ తర్వాత భూములపై యాజమాన్య హక్కులు వారికే దఖలు పడతాయి. అదే జరిగితే అధికారం, ధనబలం, కండబలం ఉన్న వ్యక్తుల చేతుల్లోకి దేవాదాయ, ప్రభుత్వ భూములు వెళ్ళిపోతాయి. ప్రైవేట్ వ్యక్తుల మాదిరిగా ప్రభుత్వ అధికారులు ముందుకు వచ్చి ఆ భూముల కోసం పోరాటం చేసే పరిస్థితి ఉండదు.
వాస్తవం: అవలక్షణాలను వ్యవస్థ నుంచి ఏరిపారేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంటే ఈనాడు దినపత్రిక అది వద్దన్నట్టు అవాస్తవాలు రాస్తోంది. భూ పరిపాలనా వ్యవస్థలో అధికార బలం, ధనబలం లాంటి అంశాలకు చోటు ఉండకూడదనే వివాదాల్లేని రీతిలో కంక్లూజివ్ టైటిల్స్ అందించే ప్రక్రియ ఈ చట్టం ద్వారా జరుగుతోంది. రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్ అనేది భావితరాలకు భూహక్కులకు సంబంధించి ఒక ముఖ్యమైన రిజిస్టర్. దీని తయారీలో తీసుకునే జాగ్రత్తల వల్ల ఇది అత్యంత పకడ్బందీగా ఉంటుంది.
1 952
అలాగే శిక్షల విషయంలోనూ ఈనాడు దినపత్రిక తప్పుడు ప్రచారం చేస్తోంది.ఎవరైనా భూములకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చినా, దురుద్దేశంతో సమాచారం ఇచ్చినా దాన్ని నేరంగా పరిగణిస్తారు. అధికారులు శిక్ష విధిస్తారనే మాట చట్టంలో ఎక్కడా లేదు. దీనికి లేనిపోనివి ఆపాదించి వక్రీకరణలతో ఈనాడు దినపత్రిక రాసింది.
ఆరోపణ: మీ భూమికి సంబంధించి హైకోర్టులోను సుప్రీంకోర్టులోను నడిచిన కేసు పూర్తయింది. తీర్పు వచ్చిన 15 రోజుల్లోగా ఆ వివరాలను ప్రభుత్వానికి అందించాలి. లేదంటే ఆ తీర్పునకు విలువ లేదని ప్రభుత్వం అంటే అది నియంతృత్వం కాక ప్రజాస్వామ్యం అంటారా? హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను సైతం అమలు చేయడం సాధ్యం కాదంట!
వాస్తవం: ఇదీ పూర్తిగా అవాస్తవం. భూ యాజమాన్య హక్కులు పూర్తి పారదర్శకంగా నిర్వహించడం ఎల్టీ యాక్ట్ ఉద్దేశం. కోర్టు ఇచ్చిన ఆదేశాలు వెంటనే తెలియజేస్తేనే కదా, ఆ ఆదేశాలకు విలువ, గౌరవం ఇచ్చినట్టు అవుతుంది? అంతేకాకుండా వాటిని అమలు చేయడానికికూడా ఆస్కారం ఉంటుంది. కోర్టు ఉత్తర్వుల వివరాలు తెలిస్తేనే కదా రికార్డులు పారదర్శకంగా, అప్ టు డేట్గా ఉండేది? అలాకాకపోతే రికార్డుల్లో పాత వివరాలతోనే లావాదేవీ జరిగితే.. కోర్టు తీర్పు ద్వారా న్యాయం జరిగిన వ్యక్తికి, ఆ న్యాయాన్ని నిరాకరించినట్టే కదా? న్యాయబద్ధంగా రికార్డులు ఉండడం, కోర్టు ఆదేశాలను సత్వరమే పాటించడం, ఆమేరకు భూ యజమానులకు మేలు చేయడం తప్పు అని ఈనాడు రాస్తోంది. ఇందులో నియంతృత్వానికి తావేలేదు.
ఆరోపణ: న్యాయ వ్యవస్థలకే ముకుతాడు వేసేలా, న్యాయాధికారుల హక్కులను లాక్కునేలా, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను బేఖాతరు చేసేలా, సివిల్ ప్రొసీజర్ కోడ్ను తోసిరాజనేలా రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య హక్కు చట్టం తీసుకొచ్చింది.
వాస్తవం: కేసు వేసే వ్యక్తి హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి స్వేచ్ఛ ఉంది. తుది రికార్డు తయారయ్యేంత వరకూ కూడా ఏ స్థాయి కోర్టుల్లో ఎలాంటి వివాదం ఉన్నా, ఎలాంటి వ్యాజ్యాలు ఉన్నా వాటిని కోర్టు పరిధిలో ఉన్న భూమి అంటూ స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది. కోర్టు ఆదేశాలు వచ్చేవరకూ వాటి కంక్లూజివ్ టైటిల్స్ ఇవ్వరు. కోర్టుల అధికారాన్ని లాక్కున్నారని ఈనాడు రాసింది పూర్తిగా అవాస్తవం.
ఆరోపణ: న్యాయశాస్త్ర పరిజ్ఞానం లేని అధికారులకు భూ యాజమాన్య హక్కులను నిర్ణయించే అధికారాన్ని కట్టబెడుతూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది?
వాస్తవం: బ్రిటిష్ కాలం నుంచీ భూపరిపాలనా వ్యవస్థ అధికారుల కిందే ఉంది. భూ పరిపాలనా వ్యవస్థల ఆధారంగానే ప్రభుత్వాల పునాదులు ఏర్పడ్డాయి. ల్యాండ్ సీలింగ్ యాక్ట్, ఎస్టేట్ ఇనాం యాక్ట్, అసైన్మెంట్ యాక్ట్, సర్వే, ఆర్వోఆర్ యాక్ట్ం వంటి చట్టాలకింద హక్కుల నిర్వహణను ప్రభుత్వంలోని అధికారులే చేసుకుంటూ వస్తున్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా అధికారులకే ఈ భూపాలనా అధికారాలను నిర్వహిస్తూ వచ్చారు. హక్కుల నిర్ధారణ, రికార్డుల నిర్వహణ, క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ విభాగాలకు శతాబ్దానికిపైగా అనుభవం ఉంది. వారికి నైపుణ్యంలేదని, అవగాహన లేదని చెప్పడం ఈనాడు దినపత్రిక అవాస్తవాలు రాసింది. ఈ ప్రభుత్వం వచ్చాక సర్వేయర్లు, గ్రామ సచివాలయాలు, సమగ్ర సర్వే రూపంలో భూ పరిపాలనా వ్యవస్థ మరింత బలపడింది.
ఆరోపణ: ఈ చట్టంలో సెక్షన్ –5 టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నియామకం గురించి తెలియజేస్తుంది. ఏ వ్యక్తినైనా టీఆర్వోగా నియమించవచ్చని చెప్తోంది. రాజకీయ నేతల చెప్పుచేతల్లో ఉన్నవారిని నియమిస్తే టైటిల్ రిజిస్టర్లో అసలు యజమానులకు బదులు, ఇతరుల పేర్లు చేర్చి భూ కబ్జాలకు ఊతం ఇస్తారనే భయం ఉంది?
వాస్తవం: ప్రజలను ఆందోళనకు గురిచేయడానికి ఈనాడు ఇలాంటి విష ప్రచారం చేస్తోంది. భూ యాజమాన్యంపై ప్రభుత్వం ప్రతిష్టాత్మక చట్టాన్ని తీసుకువచ్చింది. ఎలాంటి లోపాలు లేకుండా, రికార్డులు తారుమారు చేయకుండా, నకిలీలు సృష్టించకుండా, కబ్జాలకు తావులేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఏ అధికారి అయినా తప్పనిసరిగా నిర్ధారిత ప్రక్రియను పాటించాలే తప్ప, తనకు ఇష్టం వచ్చినట్టు చేయలేరు. ఎవరిని ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా నియమించాలన్నది అథారిటీ నిర్ణయిస్తుంది. దీనికి సంబంధించిన రూల్స్ను అథారిటీ తయారు చేస్తోంటే ఈనాడు తప్పుడు వార్తలు రాస్తోంది.
ఆరోపణ: అధికార పార్టీ నేతలు ఒత్తిడితో నిరక్షరాస్యులు, రైతుల భూములను ఇతర పేర్లపై మార్చేయవచ్చు. ఏదైనా ఆస్తి తమదే అని అంటూ ఎవరైనా తప్పుడు క్లైయిమ్ దాఖలు చేస్తే సంబంధిత ఆస్తి వివాదంలో ఉన్నట్లు డిస్ప్యూట్ రిజిస్టర్లో టీఆర్ఓ నమోదు చేస్తారు. వెంటనే సమస్య ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ హోదాకు తగిన అధికారి వద్దకు చేరుతుంది. అక్కడ తేలే వరకు ఆ ఆస్తిపై ఎలాంటి లావాదేవీలకు క్రయ విక్రయాలకు అవకాశం ఉండదు. అంటే గిట్టని వ్యక్తులు తప్పుడు ఒప్పందాన్ని తయారుచేసి డిస్ప్యూట్ రిజిస్టర్లో ఆ విషయాన్ని నమోదు చేయిస్తే అసలైన యజమాని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
1 952
తద్వారా కొనుగోలు చేసే వ్యక్తికి నష్టం జరక్కుండా, వివాదాలు రాకుండా పారదర్శకంగా వివరాలు అందుబాటులో ఉంటాయి. ఇవే జాగ్రత్తలను ఇప్పుడున్న చట్టంలో తీసుకుంటున్నారు.
ఆరోపణ: వైకాపా ప్రభుత్వ బాధ్యతారాహిత్య చర్య
వాస్తవం: ఇది పూర్తిగా అవాస్తం. పశ్చిమ దేశాల్లో అమల్లో ఉన్న టైటిల్ గ్యారంటీ చట్టాన్ని తీసుకురావటంలో భాగంగా భారత ప్రభుత్వం 1989లో డి.సి.వాద్వా కమిటీని నియమించింది. ఇటీవల కాలంలో నీతి ఆయోగ్, ఇతర ఉన్నత స్థాయి కమిటీల సలహాల ప్రకారం, నమూనా టైటిలింగ్ యాక్ట్ను నీతిఆయోగ్ ప్రవేశపెట్టింది. ఈ చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగా, రాష్ట్ర అవసరాలను పరిగణనలోనికి తీసుకొని ఈ చట్టాన్ని రూపొందించారు. రెండేళ్లకుపైగా సుదీర్ఘ కసరత్తు తర్వాత కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత శాఖలు, విభాగాల సలహాల మేరకు చట్టంలో మార్పులు చేర్పులు చేసి గౌరవ రాష్ట్రపతి గారి ఆమోదముద్ర పొందటం జరిగింది. ఈ చట్టం రూపకల్పనంలో ఇన్ని వ్యవస్థలు భాగస్వామ్యం ఉంటే బాధ్యతారాహిత్యంగా పేర్కొనడం దురుద్దేశపూర్వకం.
ఆరోపణ: సొంతవారి కోసం రికార్డులు సృష్టించే ఎత్తుగడ
వాస్తవం: ఇదీ పూర్తిగా అవాస్తవం. జగనన్న భూ హక్కు భూ రక్ష పథకం కింద ప్రజలందరి సమక్షంలో రీసర్వే చేసి, హక్కులు నిర్ధారించి ప్రచురిస్తున్నారు. దీనిపై అభ్యంతరాలుంటే వాటినీ స్వీకరించి, విచారించి, పరిష్కరిస్తున్నారు. ఆ తర్వాత తుది జాబితా ప్రచురిస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో భూ యజమానులకు ప్రతి దశలోనూ పూర్తి సమాచారం ఉంటుంది. ఇలా రికార్డ్స్ తయారీ పూర్తయ్యాకే సెక్షన్ 12(ఎ) ఆఫ్ ఎల్టీ యాక్ట్ కింద యజమాన్య హక్కులను ప్రచురిస్తారు. ఇలా ప్రచురించిన వివరాలపై ఏవైనా అభ్యంతరాలు వస్తే వాటిని విచారించి, పరిష్కరించి కంక్లూజివ్ రైట్స్తో తుది జాబితాను ప్రకటిస్తారు. భూ యజమానుల భాగస్వామ్యంతోనే ఈ రికార్డులను రూపొందించడం జరుగుతుంది. ఎవరికోసం ఏ రికార్డు రూపొందించాలన్నా ఒకే విధానం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండదు. అందువల్ల సొంతవారి కోసం ఎత్తుగడ అనడం అవాస్తవం.
ఆరోపణ: అభ్యంతరాలొచ్చాక సలహాలు స్వీకరిస్తామంటూ కల్లబొల్లి మాటలు.
వాస్తవం: అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న భూ యాజమాన్య చట్టాలను పరిశీలించి, వివిధ ఉన్నత స్థాయి కమిటీల సలహాలతో ఈ చట్టం తయారు చేశారు. దీన్ని అమల్లోకి తీసుకురావడంలో భాగంగా ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా, అందుబాటులో ఉండేలా రూల్స్ తయారీకి ల్యాండ్ అథారిటీ సలహాలు, సంప్రదింపులు చేపట్టింది. నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచడం, దీన్ని వాడుకోవడంలో ఎదురయ్యే సాధకబాధకాలను పరిశీలించి, వాటిని నివారించే ప్రక్రియలో భాగంగానే ఈ సలహాలు సంప్రదింపులు చేపట్టింది. దీన్నీ తప్పుబడుతూ ఈనాడు అవాస్తవాలు రాసింది.
ఆరోపణ: మీకు భూమి ఉంది, కొత్తగా ఏర్పాటుచేసిన రిజిష్టర్లో పేరు లేదనే సాకుతో ఇప్పుడున్న పత్రాలను చెల్లని కాగితాల కింద లెక్కగడితే...
వాస్తవం: ఇదీ పూర్తిగా అవాస్తవం. భూ యజమానులకు కంక్లూజివ్ రైట్స్ ఇవ్వడానికి రీ సర్వే, ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం అనే రెండు ప్రక్రియలను ప్రభుత్వం పాటిస్తోంది. వీటి అమల్లో భాగంగా తయారుచేసే కొత్త రికార్డులన్నీ భూ యజమాని వద్ద ఇప్పుడున్న పత్రాలు, రికార్డుల్లోని వివరాలే ఆధారాలుగా, మార్గదర్శకంగా ఉంటాయి. కొత్త రిజిస్టర్లో కొత్త వివరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిర్ధారించిన హద్దులు పొందుపరుస్తారు. రెండేళ్ల తర్వాతే వివాదాల్లేని భూములకు కంక్లూజివ్ టైటిల్ లభిస్తుంది. కొత్త రికార్డు తయారై భూమికి సంబంధించి ఇప్పుడున్న అనేక రికార్డుల స్థానంలో ఒకే ఒక్క పత్రం వస్తుంది. అంతవరకూ ఇప్పుడున్న రికార్డులన్నీ చెల్లుబాటవుతాయి. ఒకవేళ అన్నిపత్రాలు ఉండికూడా రికార్డుల్లో నమోదు కాకపోతే అప్పిలేట్ అథారిటీ వద్ద దరఖాస్తు చేసుకుని, ఆ సమస్యకు పరిష్కారం పొందవచ్చు.
ఆరోపణ: భూ వివాదాల విచారణ అధికారాన్ని సివిల్ కోర్టుల నుంచి తీసేసి ప్రభుత్వం నియమించే అధికారులకు అప్పగిస్తే? వారికే శిక్షలు విధించే అధికారం కూడా కట్టబెడితే ఇంతకంటే అరాచకం మరొకటి ఉంటుందా?
వాస్తవం: భూమితో ఎలాంటి సంబంధం లేని ఒక వ్యక్తి కేవలం వివాదాన్ని సృష్టించే ఉద్దేశంతో సివిల్ కోర్టులో కేసు వేస్తే దానివల్ల నిజమైన భూహక్కుదారుడు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించే దిశగా చేసిన తాజా చట్టం ప్రకారం సివిల్ ప్రొసీజర్ కోడ్ కింద కాకుండా సహజ న్యాయ సూత్రాలకు లోబడి వివాదాల్లో ఉన్న భూములపై విచారణ కొనసాగుతుంది. దీనివల్ల సమ్మరీ ఎంక్వయిరీ అనగా, భూమికి చుట్టుపక్కల ఉన్న రైతులు, ఊరి పెద్దలు, గ్రామసభ, సంబంధిత హక్కుదారులు మొదలైనవారితో విచారణ జరిపి హక్కు నిర్ధారణ చేస్తారు. దీనివల్ల వివాదం పరిష్కారం త్వరగా జరుగుతుంది. అప్పటికీ సంతృప్తి చెందకపోతే హైకోర్టును ఆశ్రయించవచ్చు.
1 952
‘కోర్టులకూ కత్తెర.. భూ హక్కులకు పాతర’ అంటూ 24–02–2024న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ఈనాడు దినపత్రిక అవాస్తవాలతో తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ప్రజల స్థిరాస్తులకు ఎంతో మేలు చేసే ఈ చట్టంపై అపోహలు సృష్టించి వారిలో భయాందోళనలు రేకెత్తించాలన్న ఉద్దేశంతో ఈ కథనం రాసినట్టు స్పష్టం అవుతోంది. ఈనాడు ఆరోపణలు, వాటిపై వాస్తవాలను ఫ్యాక్ట్ చెక్ ద్వారా పొందుపరుస్తున్నాం.
ఆరోపణ: టైటిలింగ్ యాక్ట్ ద్వారా కోర్టులకూ కత్తెర వేశారు? కోర్టుల పరిధి లాగేసి అధికారులకే హక్కుల నిర్ణయాధికారం ఇచ్చారు.
వాస్తవం: ఇది పూర్తిగా అవాస్తవం. కోర్టుల పరిధి యథాతథంగా ఉంటుంది. కోర్టుల అధికారాలపై ఎలాంటి నియంత్రణగాని, ఆ అధికారాలను కుదించడంగాని జరగలేదు. రికార్డ్ ఆఫ్ టైటిల్స్లో నమోదైన వివరాలపై, ఏదైనా కోర్టులో అప్పీలు, లేదా రివిజిన్ పిటిషన్ ఫైల్ చేసినట్లయితే, ఆవ్యక్తి కచ్చితంగా టీఆర్వోకు తెలియజేయాలని మాత్రమే చట్టం చెప్తోంది. ఏదైనా కోర్టులో ఆ భూమికి సంబంధించి ప్రస్తుతం వివాదం ఉంటే ఆ వివరాలను టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారికి తెలియజేస్తే ఆ భూమి, సంబంధిత వివాదాల వివరాలను రిజిష్టర్లో నమోదు చేస్తారు. ఇవి పూర్తిగా సంబంధిత కోర్టుల్లో పరిష్కారం అయ్యాకే కోర్టు ఆదేశాల మేరకు తుది వివరాలను రిజిస్టర్లో పొందుపరుస్తారు.
ఆరోపణ: భూ హక్కులకు పాతర వేశారు.
వాస్తవం: భూ యజమాలకు కంక్లూజివ్ టైటిట్స్ ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంటే భూ హక్కులకు పాతర అంటూ ఈనాడు తప్పుడు కథనం రాసింది. ఇప్పుడు అమల్లో ఉన్న ఆర్.ఓ.ఆర్. చట్టాన్ని ఆధునీకరించి, వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా రీసర్వే ద్వారా తుది యాజమాన్య హక్కుల వివరాలు (ఆర్.ఎల్.ఆర్.) ప్రచురిస్తారు. రీ సర్వే తుది ప్రకటన (13 నోటిఫికేషన్) ద్వారా ఆయా ప్రాంతాల్లోని భూముల యాజమాన్య వివరాలు ప్రచురిస్తారు. వాటిని మీ భూమి పోర్టల్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. కాబట్టి భూ హక్కులకు ఎలాంటి ప్రమాదం లేదు. సెక్షన్ 12 ఆఫ్ ఎల్టీ యాక్ట్ ప్రకారం రికార్డులు పూర్తయ్యాకే భూ యాజమాన్య హక్కుల వివరాలు నోటిఫై చేస్తారు.
ఆరోపణ: ప్రజల స్థిరాస్తికి ఎసరు
వాస్తవం: ఇదీ పూర్తిగా అవాస్తవం. ఈ చట్టం ద్వారా ప్రజల స్థిరాస్తికి పూర్తి భద్రత లభిస్తుంది. ఇప్పుడున్న ప్రిజెమ్టివ్ టైటిల్ వ్యవస్థలో భూమిపై స్వాధీనానుభవం ఉన్నప్పటికీ, రెవిన్యూ రికార్డుల్లో పేరు నమోదు కాకపోతే, ఆ వ్యక్తి ఆస్తి హక్కులకు ఇబ్బంది కలగొచ్చు. రీసర్వే ద్వారా స్వాధీనానుభవంలో ఉండి, హక్కు భుక్తం కలిగిన వ్యక్తుల వివరాలు రీసర్వే ద్వారా రెవిన్యూ రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో సెక్షన్–12 ప్రకారం భూ యాజమాన్య హక్కులను నోటిఫై చేస్తారు. 2 ఏళ్ల తర్వాత ఆ వివరాలపై ఎలాంటి వివాదాలూ లేకపోతే ఆ భూమిపై వారికి కంక్లూజివ్ టైటిల్ వస్తుంది. తద్వారా ప్రభుత్వ గ్యారెంటీ వారికి లభిస్తుంది.
ఆరోపణ: కుంపటి రాజేసిన టైటిలింగ్ యాక్ట్
వాస్తవం: ఇదీ పూర్తిగా అవాస్తవం. గత ప్రభుత్వం హయాంలో వెబ్ల్యాండ్ అనే విధానాన్ని పెట్టి తప్పులతడకగా రికార్డులు నమోదుచేసి, కక్షపూరితంగానో లేక దురుద్దేశంతోనో ఆంక్షల జాబితాలో చేర్చి భూ యజమానులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అప్పుడు చెలరేగిన కుంపట్లు చల్లార్చేలా, వాటన్నింటినీ సరిచేసేలా ఈ ప్రభుత్వం రీసర్వే సహా కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది.
ఆరోపణ: భూ కబ్జాదారులకు వరంగా కొత్త చట్టం
వాస్తవం: ఇదీ పూర్తిగా అవాస్తవం. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాల ద్వారా ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎవరికీ క్లియర్ టైటిల్స్ లేవు. దశాబ్దాల తరబడి వీటికి పరిష్కారాలు దొరక్క యాజమానులు అష్టకష్టాలు పడుతున్నారు. వీటిని ఆసరాగా తీసుకుని బలహీనులనూ, అమాయకులనూ మోసం చేయడమో, మరో రకంగానో బలమున్నవారు రకరకాల పత్రాలు సృష్టించి, ఉన్న రికార్డులను ఫోర్జరీ చేసి, దొంగ రిజిస్ట్రేషన్లు చేసి వారి పొట్టకొడుతున్నారు. కొత్త చట్టం ప్రకారం (రీ–సర్వేలో భాగంగా) ప్రతి భూభాగం అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా హక్కుదారులను నిర్ధారిస్తారు. ఈ రికార్డులను తారుమారు చేయడం, ఫోర్జరీ చేయడం అసాధ్యం.
ఆరోపణ: తనఖాపెట్టి అప్పు తీసుకునే దస్తావేజుని సైతం టైటిలింగ్ చట్టం ప్రకారం టీఆర్వోకు తెలియజేయాలి, అనుమతి తీసుకోవాలి. అప్పుడే ఈ తాకట్టు చెల్లుతుంది. దీంతో ప్రజలు అప్పులు తీసుకున్న విషయం కూడా రిజిస్టర్లోకి ఎక్కుతుంది. ఈ విధానం పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే.
వాస్తవం: ఇది ముమ్మాటికీ అసత్యం. ఈ చట్టంలో భాగంగా తాకట్టు వివరాలు, జీపీఏ, విల్లు వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలన్న నిబంధన కొనుగోలు చేస్తున్న వ్యక్తికి, క్లెయిమెంట్కు (లబ్ధిదారునకు) నష్టం జరగకూడదనే ఉద్దేశంతో పెట్టారు. ఇదేమీ కొత్తగా పెట్టింది కాదు. ఉదాహరణకు ఇప్పటికే ఒకరు తమ స్థిరాస్తిని బ్యాంకులో తనఖా పెడితే, బ్యాంకుల వారు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు అధికారికంగా తెలియజేస్తున్నారు.
1 952
'మంగంపేట ముగ్గురాయి గనుల్లో భారీ దోపిడీకి తొలగిన తెర' అంటూ 26-01-2024న ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన కథనం పూర్తిగా అవాస్తవం. ఈ తప్పుడు కథనాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది.
- అన్నమయ్య జిల్లా మంగంపేటలోని బెరైటీస్ గనుల ద్వారా ఏటా 30 లక్షల టన్నుల బెరైటీస్ను ఏపీఎండీసీ ఉత్పత్తి చేస్తోంది. దీనిలో సగటున 10 లక్షల టన్నులు ‘ఎ’ గ్రేడ్, 3 లక్షల టన్నులు ‘బి’ గ్రేడ్, మిగిలిన 17 లక్షల టన్నులు సి, డి & డబ్ల్యు (వేస్ట్) గ్రేడ్ లు. ఇందులో సి, డి గ్రేడ్ ఖనిజానికి డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఈ ఖనిజం నిల్వలు పేరుకుపోయాయి. ఇప్పటి వరకు దాదాపు 80 లక్షల టన్నుల వరకు C, D, W లకు చెందిన ఖనిజ నిల్వలు అమ్మకం కాకుండా ఉన్నాయి. వాటిని నిల్వ చేయడం, నిర్వహించడం కూడా భారంగా మారింది. వాటి విక్రయం, బెనిఫికేషన్ కోసం గతంలో పలుసార్లు టెండర్లు నిర్వహించినప్పటికీ సరైన స్పందన లభించలేదు. ఈ టెండర్ల ద్వారా వాటిని విక్రయిస్తే ఈ నిర్వహణా ఖర్చు తగ్గడంతో పాటు సంస్థకు ఆదాయం వస్తుంది.
- అంతర్జాతీయంగా సి, డి గ్రేడ్ బెరైటీస్కు మార్కెట్ కల్పించాలనే లక్ష్యంతో ఏపీఎండీసీ కోటి టన్నులకు తాజాగా ఎంఎస్టీసీ ద్వారా టెండర్లు పిలిచింది. సాధారణంగా ఏటా 20 లక్షల టన్నుల C, D, W గ్రేడ్ ఖనిజానికి ఏపీఎండీసీ టెండర్లు పిలుస్తుంది. అయితే కొనుగోలుదారుల నుంచి మాత్రం ఈ మేరకు స్పందన రావడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఏడాదికి 20 లక్షల టన్నుల చొప్పున అయిదేళ్ళకు గానూ ఒకేసారి కోటి టన్నుల ఖనిజానికి టెండర్లు పిలవడం జరిగింది. దీనిని అర్థం చేసుకోలేక ఒకేసారి కోటి టన్నులకు టెండర్లు అంటూ ఈనాడు పత్రిక అవగాహన లేని రాతలు రాసింది.
- సి, డి గ్రేడ్ ఖనిజానికి రిజర్వు ధరను కూడా తగ్గించారంటూ ఈనాడు దినపత్రిక మరో తప్పుడు ఆరోపణ చేసింది. జీఓ 262 నిబంధనలకు అనుగుణంగానే రిజర్వు ధరను నిర్ణయించడం జరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లోని ధరలకు అనుగుణంగానే ఈ రేటును నిర్ణయించడం జరిగింది. ఇందులో ఎవరికో మేలు చేయాలనే ఆలోచనే లేదు. ఆసక్తి ఉంటే ఇదే ధరకు ఈనాడు యాజమాన్యం కూడా టెండర్లలో పాల్గొని బిడ్ ను దక్కించుకోవచ్చు.
- టెండర్ల ప్రక్రియను మినీరత్నగా కేంద్రం గుర్తించిన ఎంఎస్టీసీ పర్యవేక్షిస్తోంది. కేంద్ర జీఎఫ్ఆర్ నిబంధనలకు లోబడే ధరావత్తును ఖరారు చేయడం జరిగింది. అలాగే 17 రోజుల్లోనే టెండర్లను పూర్తి చేస్తారనేది కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతుందే తప్ప దీనిలో ఏపీఎండీసీ సొంతగా నిర్ణయించేది ఏమీ ఉండదు.
- టెండర్ డాక్యుమెంట్ ధరను ఖరారు చేసే క్రమంలో.. టెండర్ ప్రక్రియకు సంబంధించిన డాక్యుమెంటేషన్, కన్సల్టెన్సీ చార్జీలు, ప్రిపరేషన్, కమ్యూనికేషన్ చార్జీలు, ఎంఎస్టీసీకి చెల్లింపులకు అయ్యే మొత్తం వ్యయంను దృష్టిలో పెట్టుకునే దానిని నిర్ణయించడం జరిగింది. ఇది సాధారణంగా ఏ సంస్థ అయినా అనుసరించే విధానం. దీనిని కూడా ఈనాడు పత్రిక వక్రీకరించి రాసింది.
- న్యాయ సమీక్షకు ఎందుకు పెట్టలేదంటూ ఈనాడు పత్రిక చేస్తున్న వాదన అర్థరహితం. రూ.100 కోట్లకు పైగా వ్యయం అయ్యే ప్రాజెక్ట్ లకు నిర్వహించే టెండర్లకే న్యాయసమీక్షను కోరుతారు. ఇక్కడ బెరైటీస్ నిల్వలను విక్రయించేందుకు పిలిచిన టెండర్లలో వ్యయం ఎక్కడ ఉంది? ఇది న్యాయ సమీక్ష పరిధిలోకి రాదనే కనీస జ్ఞానం కూడా లేకుండా ఈనాడు పత్రిక అసత్య కథనం రాసింది.
- నాణ్యమైన బెరైటీస్తో పాటు C, D, W గ్రేడ్ ఖనిజాన్ని కూడా ఎప్పటికప్పుడు విక్రయించేందుకు ఏపీఎండీసీ ప్రయత్నం చేస్తోంది. కాబట్టి కేవలం ప్రభుత్వంపై బురద చల్లడంలో భాగంగానే ఈనాడు పత్రిక ఈ అసత్య కథనాన్ని ప్రచురించింది.
1 952
'బకాయిల రోగం.. సేవలు ఘోరం..!' శీర్షికన 26-01-2024న ఈనాడు దినపత్రిక ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవం. రాష్ట్రంలోనే పేదలందరికీ సక్రమంగా ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నా ఈనాడు పనికట్టుకుని ఆరోగ్యశ్రీపై అసత్య కథనాలు రాయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది.
- రాష్ట్రంలో ఏ నెట్వర్క్ ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ రోగులను చేర్చుకోని ఘటనలు చోటుచేసుకోలేదు. ప్రతిచోటా ఆరోగ్యశ్రీ సేవలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 'ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపులకు ఆపసోపాలు, ఆరోగ్యశ్రీ సర్వీసులు నిలిచిపోయాయి.. ఆసుపత్రులకు బెదిరింపులు..' అంటూ ఈనాడు పత్రిక అభూత కల్పనలు, అవాస్తవాలతో తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది.
- గత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ టస్టు నుంచి రూ.2,146.90 కోట్లు నెట్వర్క్ ఆసుపత్రుల ఖాతాల్లో జమ చేయటం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి ఇప్పటి వరకు రూ.2,790.61 కోట్లు నెట్వర్క్ ఆసుపత్రుల ఖాతాల్లో జమ చేయటం జరిగింది. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం గడిచిన మూడు నెలల్లో రూ.1,042.83 కోట్లను నెట్వర్క్ ఆసుపత్రుల ఖాతాల్లో జమ చేయటం జరిగింది. పరిశీలన తర్వాత పెండింగ్లో ఉన్న మొత్తం రూ.369 కోట్లు మాత్రమే.
- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డా. వై.యస్.ఆర్. ఆరోగ్యశ్రీలో భాగంగా ప్రతి కుటుంబానికి వార్షిక చికిత్స పరిమితిని రూ.25 లక్షల వరకు అందిస్తున్నాం. దురదృష్టం కొద్దీ, ప్రమాదవశాత్తూ అనారోగ్యంపాలైన వారిని ఆదుకునేందుకు, వారిపై పైసా భారం లేకుండా చూసేందుకు దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డి గారి ఆధ్వర్యంలో మొదలు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ ప్రభుత్వం అనేక విప్లవాత్మక నిర్ణయాలతో పూర్తిగా పటిష్టం చేసింది.
- గత ప్రభుత్వంలో 1000 చికిత్సలకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిమితం అయితే ఈ ప్రభుత్వం చికిత్సల సంఖ్యను 3,257కి పెంచింది. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే చాలు.. దాన్ని ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువచ్చింది. చికిత్సల సంఖ్య, లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరగడంతో చికిత్స ముందస్తు అనుమతి, క్లెయిమ్లు రోజుకు 1,547 నుంచి 5,608కి పెరిగాయి. ఇంతకుముందుతో పోలిస్తే పని మూడు రెట్లు పెరిగింది. అందుకు తగిన విధంగా అవసరమైన డాక్టర్లను 30 నుంచి 60 మందికి పెంచడం జరిగింది. ఇంకా దీన్ని పూర్తిగా పటిష్టం చేయడానికి వారి సంఖ్య పెంచడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
- క్లెయిమ్స్ మరింత త్వరితగతిన పారదర్శకంగా SLA టైమ్లైన్ల ప్రకారం ఆమోదించడానికి హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జారీ చేసిన జీ.ఓ.ఎం.ఎస్. నెo: 18, తేదీ 24.01.2024 ద్వారా ప్రభుత్వ స్పెషలిస్టు వైద్యులందరినీ తప్పనిసరిగా డాక్టర్ YSR ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగా ప్రభుత్వ స్పెషలిస్టు వైద్యులను ప్యానెల్ వైద్యులుగా తీసుకునే ప్రక్రియ ప్రారంభించాం. క్యాన్సర్ చికిత్స ముందస్తు అనుమతి, క్లెయిమ్స్ను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థలైన AIIMS, SVICCAR, HOMIBABA, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైన DME, SVIMS, VIMS ద్వారా వైద్యులను క్యాన్సర్ వైద్యులుగా తీసుకోవడం జరిగింది.
డబ్బులు వసూలుకు ఆస్కారమే లేదు:
- ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందే సమయం నుంచి ఇంటి వెళ్లిన తర్వాతి వరకు ఎంతోమంది క్రాస్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఏ దశలోనూ డబ్బులు వసూలుకు ఆస్కారమే ఉండదు. ఒకవేళ ఈ దశల్లో ఏదశలో అయినా డబ్బులు వసూలు జరిగింది నిజమని తేలితే ఆ ఆసుపత్రి యజమాన్యంపై చర్యలు ఉంటాయి. అంతటితో ఆగకుండా.. వసూలు చేసిన నగదు రోగి కుటుంబానికి ఇచ్చి, నివేదిక రూపంలో డా. వై.యస్.ఆర్. ఆరోగ్యశ్రీ ట్రస్టు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు తెలియచేసిన దాఖలాలు ఉన్నాయి.
- రోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం, సరిగ్గా సేవలు అందించకపోవడం తదితర నిబంధనలను పాటించని ఆసుపత్రులపై జరిమానాలు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి.
- ఇంత పకడ్బందీగా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టును నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్దిష్టమైన ప్రణాళికలతో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటోంది. వాస్తవాలు ఇలా ఉంటే ఈనాడు మాత్రం పదే పదే తప్పుడు కథనాలు రాస్తూ, అసత్య ఆరోపణలు చేస్తోంది.
1 952
రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ పై 'ఇసుకలో కొత్త తోడు దొంగలు' అనే శీర్షికన 17.01.2024న ఈనాడు దినపత్రికలో ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవం. సీఎం గారి సోదరుడి ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు, పర్యావరణ అనుమతులు లేకుండా తవ్వేస్తున్నారంటూ ఈనాడు అసత్యాలు, అభూత కల్పనలతో కథనం రాసింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది.
- ఉచిత ఇసుక విధానం పేరుతో గతంలో జరిగిన దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ సీఎం వైయస్ జగన్ గారు అత్యంత పారదర్శక విధానం అమలులోకి తీసుకువచ్చారు. దాని ప్రకారం టెండర్లు నిర్వహించి ఇసుక ఆపరేషన్స్ కు ఏజెన్సీలను ఖరారు చేసి, ఆపరేషన్స్ ప్రారంభించిన నేపథ్యంలో.. ఈనాడు పత్రిక అభూత కల్పనలను, అవాస్తవాలను పోగుచేసి పదేపదే ఇసుకపై తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది.
- రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ కోసం పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థగా గుర్తింపు పొందిన మినీరత్న MSTC ద్వారా టెండర్లు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దానిలో ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్యాకేజీ -1, ప్యాకేజీ-3 లోని 18 జిల్లాలకు, జిసికెసి ప్రాజెక్ట్ & వర్కర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్యాకేజీ-2 లోని 8 జిల్లాల్లో ఇసుక ఆపరేషన్స్ కు సక్సెస్ ఫుల్ బిడ్డర్లుగా ఎంపికయ్యాయి.
- ఈ టెండర్లలో సక్సెస్ ఫుల్ బిడ్డర్లుగా ఎంపికయిన ఏజెన్సీలు ఇసుక ఆపరేషన్స్ ప్రారంభించాయి. పర్యావరణ అనుమతులు ఉన్న రీచ్ ల్లోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన లేదు. అలాగే సంబంధిత శాఖల అనుమతులతోనే రిజర్వాయర్ లలో డీసిల్టింగ్ జరుగుతోంది.
- ఇసుక ఆపరేషన్స్ అనేది గనులశాఖకు సంబంధించిన వ్యవహారం. రీచ్ లకు లీజు అనుమతులు మంజూరు గనులశాఖ ద్వారా జరుగుతుందే తప్ప సీఎంఓ నుంచి కాదు. సీఎం గారి సోదరుడి ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అంటూ... అదేమని ప్రశ్నించిన వారికి తమకు సీఎంఓ నుంచి అనుమతులు ఉన్నాయంటూ చెబుతున్నారంటూ ఈనాడు పత్రిక పూర్తిగా నిరాధారమైన కథనం రాసింది. రాష్ట్రంలో టెండర్ల ద్వారా ఇసుక ఆపరేషన్లకు ఎంపికైన సంస్థలు ఒకవైపు పని చేస్తుంటే, మరోవైపు బయటి వ్యక్తులు ఇసుక తవ్వకాలు చేస్తున్నారంటూ ఈనాడు తన కథనంలో ఆరోపించడం పూర్తిగా అవాస్తవం. సీఎం గారి సోదరుడికి, మరో వ్యక్తికి ఇసుక ఆపరేషన్లతో ఎటువంటి సంబంధమూ లేదు. నిరాధారమైన ఆరోపణలతో ఈనాడు దినపత్రిక పదేపదే ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది.
- ఇసుక అక్రమాలపై నిఘా కోసం ఎస్ఇబిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లా స్థాయిలో రెవెన్యూ, పోలీస్, గనులశాఖ అధికారులు కూడా తమకు ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి జిల్లాకు ఒక విజిలెన్స్ స్వ్కాడ్ కూడా గనులశాఖలో పనిచేస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర సరిహద్దులతో పాటు కీలకమైన ప్రాంతాల్లో చెక్ పోస్ట్ లు నిర్వహిస్తున్నాం. ఈ విభాగాల పనితీరును కూడా ఈనాడు ఆక్షేపించడం దారుణం. అక్రమాలకు ప్రోత్సహిస్తున్నారని, దాడులకు సంబంధించిన సమాచారం ముందే లీక్ చేస్తున్నారంటూ ఈనాడు నిరాధార ఆరోపణలు చేస్తోంది.
- ఇంత పకడ్బందీగా ఇసుకపై పర్యవేక్షణ జరుగుతుంటే, ఈనాడు పత్రిక మాత్రం నిత్యం ఏదో ఒక రకంగా ప్రభుత్వంపై దుష్ర్పచారం చేయాలనే లక్ష్యంతో ఇసుకపై పదేపదే తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఇలాంటి తప్పుడు వార్తాకథనాలు రాస్తున్న ఈనాడుపై ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది.
1 952
#FactCheck A video of some children from Patna, Bihar is wrongly being circulated as a video from Andhra Pradesh.
The original video from Patna Junction is added in the below video.
Be aware of fake news peddlers. Check the video's authenticity before sharing in your circles.
1 952
– పైగా అమ్మఒడి లాంటి పథకం పొందాలంటే విద్యార్థులకు 75 శాతం హాజరును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. బయో మెట్రిక్ విధానం ద్వారానే హాజరును కూడా నమోదుచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
– అందువల్ల ఈనాడు రాసింది నూటికి నూరు శాతం తప్పుడు కథనమని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.
– లేని పిల్లలకు కూడా పాఠ్యపుస్తకాల పేరిట, విద్యాకానుక పేరిట, మధ్యాహ్న భోజనం పేరిట ఖర్చు చేసేస్తున్నారని, గొప్పలకోసం యత్నిస్తున్నారంటూ ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించింది. అర్హులకు కాదనకుండా, అనర్హులకు ఇవ్వకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతి దేశంలో పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన విషయాన్ని ఇక్కడ మరోసారి గుర్తుచేస్తున్నాం.
అత్యంత మెరుగ్గా పుస్తకాల సరఫరా:
– బడి తెరిచిన మొదటి రోజే బడిలో నమోదయిన విద్యార్థులందరికీ పుస్తకాలు ఇచ్చే క్రమంలో ప్రభుత్వం అత్యంత మెరుగైన విధానాన్ని అనుసరిస్తోంది. విద్యార్థి బడి హాజరు శాతానికి, పుస్తకాల పంపిణీకి సంబంధం లేదు.
– 2023–24 విద్యా సంవత్సరం కోసం 4,61,80,773 పుస్తకాలను పాఠశాలలకు సరఫరా చేయడం జరిగింది. కేవలం విద్యార్థులకు పంపిణీ కోసమే కాకుండా కొన్ని బఫర్ నిల్వలను కూడా జిల్లా పాఠ్యపుస్తక కార్యాలయంలో నిల్వ చేయడం జరిగింది.
– ఎవరైనా విద్యార్థులు మధ్యలో వచ్చినా, లేక వారు పుస్తకాలు పోగొట్టుకున్నా.. తదితర కారణాల వల్ల పిల్లలకు పుస్తకాలు లేవు అనే మాట రానీయకుండా, వారికి వెంటనే పుస్తకాలు సరఫరా చేయడం జరుగుతోంది.
– అలాగే అడ్మిషన్ల తర్వాత వచ్చే పిల్లలకు కూడా పుస్తకాలు ఇస్తున్నాం. మిగిలిన పుస్తకాలను తదుపరి సంవత్సరం పంపిణీ చేస్తున్నాం.
రెండోసారి పుస్తకాల పంపిణీ:
– గత ప్రభుత్వంలో పిల్లలకు అరకొరగా, పాఠశాలలు ప్రారంభమైన తరువాత ఆరు నెలల వరకు పుస్తకాలు ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే పిల్లలందరికీ పుస్తకాలు ఇవ్వడంతో పాటు పుస్తకాలు పోగొట్టుకున్న విద్యార్థులకు రెండోసారి కూడా ఇవ్వడం జరిగింది.
– ఇటీవల సంభవించిన తుపాను వల్ల కొంతమంది విద్యార్థుల పుస్తకాలు తడిసి పాడైపోయిన సందర్భంలో వారికి కూడా మళ్లీ పుస్తకాలు ఇచ్చింది. పిల్లలకు ఇవ్వగా మిగిలిన పుస్తకాలను జిల్లా పాఠ్యపుస్తక కార్యాలయంలో భద్రపరిచారు.
అవకతవకలకు ఆస్కారమే లేదు:
– పుస్తకాలు సకాలంలో ఇవ్వడం మాత్రమే కాకుండా వాటి నాణ్యతలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది ఈ ప్రభుత్వం. అంతేకాకుండా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బైలింగువల్ పుస్తకాలు ఇస్తోంది. అదే విధంగా కన్నడ, ఒడియా, ఉర్దూ, తమిళం వంటి మైనారిటీ లాంగ్వేజ్ పుస్తకాలు కూడా సకాలంలో విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. హాజరును బట్టి, నమోదైన పిల్లలు ప్రత్యక్షంగా బడికి వచ్చి తీసుకోవడం వల్ల ఎలాంటి అవకతవకలు జరగడానికి ఆస్కారమే లేదు.
పారదర్శకంగా జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ:
– 2023–24 విద్యా సంవత్సరంలో 39,95,992 జగనన్న విద్యాకానుక కిట్ల సప్లయ్ ఆర్డర్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. పాఠశాలలు ప్రారంభం అయిన వెంటనే జూన్ మాసంలోనే పాఠశాలలకు హాజరైన 38,27,697 విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేయడం జరిగింది.
– మిగిలిన కిట్లను స్టాక్ పాయింట్లలో భద్రపరిచాం. అలా జిల్లా డీఈఓ / ఏపీసీ, ఎమ్ఈవో, హెడ్ మాస్టర్లకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కిట్స్ పాడైపోయిన లేదా పోగొట్టుకున్న విద్యార్థులకు కూడా మళ్లీ కిట్స్ అందిస్తున్నాం.
– బయోమెట్రిక్ హాజరుతో పాటు రెగ్యులర్ హాజరు కూడా తీసుకొని కిట్స్ ఇస్తున్నాం. అందువల్ల ఇందులో కూడా ఎలాంటి అవకతవకలూ జరగడానికి ఆస్కారమే లేదు.
– జగనన్న విద్యాకానుక (జేవీకే) –3లో మిగిలిన కిట్లు తదుపరి విద్యా సంవత్సరంలో స్పెసిఫికేషన్ల మార్పు వల్ల వాటిని వృథా కాకుండా ఆ సంవత్సరంలోనే కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, ఏపీఆర్ఎస్లోని ఇంటర్మీడియట్తో పాటు అవసరమైన విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. బెల్టులు, నోట్ పుస్తకాలను జేవీకే –4లో వినియోగించుకున్నాం. కాబట్టి కిట్లు ఎక్కడా దుర్వినియోగం జరగలేదు.
– జేవీకే –4లో మిగిలిన కిట్లను మండల జేవీకే పాయింట్లలో భద్రపరిచాం. ఈ మిగులు కిట్స్ను కూడా వచ్చే విద్యా సంవత్సరంలో వినియోగించుకోవడం జరుగుతుంది.
గోరుముద్దలోనూ అవకతవకల్లేవు:
– మధ్యాహ్న భోజనంలో భాగంగా ఎన్రోల్ అయిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగానే మధ్యాహ్న భోజనం సరుకులు ఇవ్వడం జరుగుతుంది. హాజరు ఆధారంగా విద్యార్థులకు సరిపడా భోజనాన్ని తయారు చేయడం జరుగుతుంది.
– ప్రతిరోజూ విభిన్నమైన ఆహారమే కాకుండా చిక్కి, రాగిజావ కూడా విద్యార్థులకు ఇవ్వడం జరుగుతోంది. సగటున 86 శాతం మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని స్వీకరిస్తున్నారు. హాజరును అనుసరించి భోజనాన్ని తయారుచేస్తున్నందున ఇక్కడ కూడా ఎలాంటి అవకతవకలకూ ఆస్కారమే లేదు.
అందువల్ల ఈనాడు దినపత్రిక రాసిన కథనం పూర్తిగా అవాస్తవం, దురుద్దేశపూరితం. ప్రభుత్వ విద్యారంగంపై ఈనాడు పత్రిక చేస్తున్న దాడిలో భాగమే ఈ కథనమని భావిస్తూ ప్రభుత్వం ఈ కథనాన్ని తీవ్రంగా ఖండిస్తోంది.
1 952
‘లక్షన్నర మంది అదృశ్య విద్యార్థులు’ అంటూ 07–01–2024న ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన కథనం పూర్తిగా అవాస్తవం. ఈ తప్పుడు కథనాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది.
ఈ కథనాన్ని చూస్తోంటే రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థ కుప్పకూలిపోవాలన్నదే ఈనాడు దినపత్రిక లక్ష్యంగా కనిపిస్తోంది.
అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక, గోరుముద్ద... ఇలా ఏ పథకమైనా బయోమెట్రిక్, హాజరు ఆధారంగానే అత్యంత పారదర్శకంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తోంది. అందువల్ల ఎక్కడా అవకతవకలకు ఆస్కారమే లేదు.
అలాగే బడి ఈడు పిల్లలంతా బడికి వచ్చేలా ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల వల్ల గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 1,49,515 మంది విద్యార్థులు పెరిగారు. దీంతో ప్రాథమిక – హైస్కూల్ స్థాయిలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) 100 శాతం కాగా, 11, 12 తరగతుల స్థాయిలో 74.87 శాతంగా ఉంది.
అత్యంత పారదర్శకంగా పథకాల అమలు:
– బడి ఈడు పిల్లలందరూ బడులకే వెళ్లాలన్న అత్యుత్తమ లక్ష్యంతో వైయస్ జగన్ గారి ప్రభుత్వం జగనన్న అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తోంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదు.
– తమ పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ ఏడాదికి 15,000 రూపాయలను నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తోంది ఈ ప్రభుత్వం. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఇప్పటివరకు 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో రూ.26,067.3 కోట్లను అమ్మ ఒడి కింద జమచేసింది.
– దీంతోపాటు నాడు – నేడు కింద సౌకర్యాల కల్పన, డిజిటల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఐఎఫ్ఎపీ ప్యానెళ్లు, స్మార్ట్ టీవీలు, ట్యాబులు, బైజూస్ కంటెంట్, సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ బోధన తదితర ఎన్నో విప్లవాత్మక సంస్కరణలను విద్యా రంగంలో చేపట్టింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి.
బడి ఈడు పిల్లలంతా బడికి:
– నూటికి నూరుపాళ్లు బడి ఈడు పిల్లలను బడికి పంపేలా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. వాలంటీర్లను, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో సమన్వయం చేసుకుని ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.
– అంతేకాకుండా బడిలో చదువుకుంటున్న విద్యార్థులకు సంబంధించి వారి వివరాలను యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యుడైస్) ఫ్లాట్ఫాంతో పూర్తిగా అనుసంధానం అవడంతోపాటు ఏకకాలంలో వివరాలు నమోదయ్యేలా స్టూడెంట్ పోర్టల్ను అప్డేట్ చేసింది.
– ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థుల వివరాలను ఇందులో పొందుపరిచింది. మధ్యలో పిల్లలు బడి మానేయకుండా చూడ్డం, పై చదువులకు వెళ్తున్న కొద్దీ ప్రభుత్వం నుంచి వారికి ఇవ్వాల్సిన విద్యాదీవెన, వసతిదీవెన లాంటి పథకాలను వర్తింపు చేయడంకోసం ప్రభుత్వం ఈ డేటాను సమర్థవంతంగా వినియోగించుకుంటోంది.
– తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి 12 వ తరగతి వరకూ 85.02 లక్షల మంది విద్యార్థులు దీంట్లో రిజిస్టర్ అయ్యారు. ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సహా ఈ కారణాల వల్ల గత ఏడాదితో పోలిస్తే 1,49,515 మంది విద్యార్థులు పెరిగారు. దీంతో ప్రాథమిక – హైస్కూల్ స్థాయిలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) 100 శాతం కాగా, 11, 12 తరగతుల స్థాయిలో 74.87 శాతంగా ఉంది.
– ఈ ప్రక్రియలో ఎక్కడా బోగస్ పేర్ల నమోదుకు కాని, మరే ఇతర పొరపాట్లకూ ఎక్కడా ఆస్కారం లేదు.
– కలెక్టర్ల స్థాయిలో విస్తృత సమీక్షలు నిర్వహించి స్కూలుకు రాని, లేక నమోదు కాని విద్యార్థుల విషయంలో పూర్తి చర్యలు తీసుకోవడం జరిగింది.
– పాఠశాల విద్య, గ్రామ–వార్డు సచివాలయాలు–వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటినీ పరిశీలించి ఇలాంటి పిల్లలను అందర్నీ కూడా బడిలో చేర్పించారు.
– అందువల్ల లేని విద్యార్థులను చూపిస్తున్నారంటూ ఈనాడు రాసిన కథనం పూర్తిగా అవాస్తవం.
బడికి రాకపోతే ఎస్సెమ్మెస్:
– మూడు రోజులకు పైబడి ఎవరైనా బడికి రాకపోతే సంబంధిత తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ కూడా పంపించే పద్ధతిని విద్యాశాఖ పాటిస్తోంది. నాలుగో రోజు సంబంధిత వాలంటీర్తో ఆ విద్యార్థి యోగక్షేమాలపై వాకబుచేసి మళ్లీ బడికి వచ్చే వరకూ మానిటరింగ్ వ్యవస్థ రాష్ట్రంలో నడుస్తోంది.
– అలాగే కమాండ్ కంట్రోల్– నుంచి విద్యా సమీక్ష కేంద్రాల ద్వారా విద్యార్థుల హాజరుపై పూర్తిగా పర్యవేక్షణ ఉంటుంది. విద్యార్థుల గైర్హాజరుపై హెడ్ మాస్టర్ల ద్వారా నిరంతరం వివరాలను సేకరిస్తోంది.
బయోమెట్రిక్ హాజరు తీసుకున్నాకే పథకాలు:
– అమ్మ ఒడి , విద్యాకానుక సహా పిల్లలకు ఏది ఇవ్వాలన్నా వారి నుంచి బయోమెట్రిక్ హాజరు తీసుకున్నాకే ప్రభుత్వం అందిస్తోంది. హాజరు దగ్గరనుంచి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం వినియోగిస్తోంది. ఇంత పకడ్బందీ విధానాలను అమలు చేస్తోంది కాబట్టి బోగస్ వివరాలకు ఆస్కారమే లేదు.
