fa
Feedback
కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

رفتن به کانال در Telegram

విరాళాలు పంపాల్సిన వివరాలు. A/C Name : Kanchi Paramacharya Dharmika Seva Trust ® A/C. No : 50200059599164 IFSC Code : HDFC0001753 Branch : HDFC Bank UPI ID : 7259859202@hdfcbank Gpay/Phone pay/BHIM/freecharge 7259859202

نمایش بیشتر

📈 تحلیل کانال تلگرام కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

کانال కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి) (@kpdstrust) در بخش زبانی تلوگو بازیگری فعال است. در حال حاضر جامعه شامل 16 583 مشترک است و جایگاه 5 089 را در دسته دین و مذهبی و رتبه 25 500 را در منطقه الهند دارد.

📊 شاخص‌های مخاطب و پویایی

از زمان ایجاد در невідомо، پروژه رشد سریعی داشته و 16 583 مشترک جذب کرده است.

بر اساس آخرین داده‌ها در تاریخ 29 ژوئن, 2026، کانال فعالیت پایداری دارد. در ۳۰ روز گذشته تغییر اعضا برابر -161 و در ۲۴ ساعت گذشته برابر -10 بوده و همچنان دسترسی گسترده‌ای حفظ شده است.

  • وضعیت تأیید: تأیید نشده
  • نرخ تعامل (ER): میانگین تعامل مخاطب 12.29% است و در ۲۴ ساعت نخست پس از انتشار، محتوا معمولاً 4.91% واکنش نسبت به کل مشترکان کسب می‌کند.
  • دسترسی پست‌ها: هر پست به طور میانگین 2 038 بازدید دریافت می‌کند. در اولین روز معمولاً 815 بازدید جمع‌آوری می‌شود.
  • واکنش‌ها و تعامل: مخاطبان به‌طور فعال حمایت می‌کنند؛ میانگین واکنش به هر پست 0 است.

📝 توضیح و سیاست محتوایی

نویسنده این فضا را محل بیان دیدگاه‌های شخصی توصیف می‌کند:
విరాళాలు పంపాల్సిన వివరాలు. A/C Name : Kanchi Paramacharya Dharmika Seva Trust ® A/C. No : 50200059599164 IFSC Code : HDFC0001753 Branch : HDFC Bank UPI ID : 7259859202@hdfcbank Gpay/Phone pay/BHIM/freecharge 7259859202

به لطف به‌روزرسانی‌های پرتکرار (آخرین داده در تاریخ 01 ژوئیه, 2026)، کانال همواره به‌روز و دارای دسترسی بالاست. تحلیل‌ها نشان می‌دهد مخاطبان به‌طور فعال با محتوا تعامل دارند و آن را به نقطه اثرگذاری مهم در دسته دین و مذهبی تبدیل کرده‌اند.

16 583
مشترکین
-1024 ساعت
-377 روز
-16130 روز
آرشیو پست ها
తలనెప్పి ఎక్కడికి వెళ్ళింది? పరమాచార్య స్వామివారు 1968లో ఆంధ్రదేశ యాత్రలో ఉన్న సమయంలో, తిరు సుందరరాజన్ అనే భక్తుడు ఎలాగైనా స్వామివారిని దర్శించాలనే తపనతో ఉన్నాడు. 1969 జనవరి 24 నుంచి అతనికి ప్రతిరోజూ రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు తీవ్రమైన తలనొప్పి వచ్చేది. అది క్యాన్సర్ వల్ల వచ్చిందేమో అనే అనుమానం కలిగేంతగా తీవ్రమైంది. అందువల్ల అతను నెలరోజుల సెలవు తీసుకొని ఫిబ్రవరి 15న ఢిల్లీ నుండి హైదరాబాద్ కు వచ్చాడు. విజయవాడకు సుమారు 20 కి.మీ. దూరంలో ఉన్న తేలప్రోలు గ్రామంలో అతనికి మహాస్వామి వారి దర్శనం దొరికింది. ఆ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో స్వామివారు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా, సుందరరాజన్ స్వామివారి ఎదుట నిల్చున్నాడు. “బ్రహచరణం అంటే నీకు తెలుసా?” అని అడిగారు స్వామివారు. ఇది స్వామివారు అసందర్భంగా వేసిన ప్రశ్న కాదు అని అతనికి తెలుసు. ఎందుకంటే అతను వడమ బ్రాహ్మణ శాఖకు చెందినవాడు అయినా, అతని భార్య బ్రహచరణం శాఖకు చెందింది. అందుకే స్వామివారు అడిగారని అతనికి అర్థమైంది. అతను ఆ విధంగానే పెళ్లి చేసుకున్నాడని స్వామివారికి చెప్పాడు. తర్వాత తన తలనొప్పి సమస్య గురించి, తన సమస్యకు ఏదైనా పరిష్కారం చూపుతారన్న నమ్మకంతో స్వామివారి దర్శనార్థమై సెలవు తీసుకొని రావడం, అన్నీ స్వామివారికి తెలిపాడు. “నీకు సంస్కృతం తెలుసా?” అని అడిగారు స్వామివారు. సిగ్గుతో తనకు ఆ భాష రాదని చెప్పాడు సుందరరాజన్. “ప్రతిరోజూ నారాయణీయం నుండి 10 శ్లోకాలు చదువుకో” అని చెప్పి, ఆశీర్వదించి పంపించారు. ఆ తరువాత అతను కారులో కూర్చుని బయలుదేరుతుండగా, ఒక మహిళ పరుగెత్తుకుంటూ వచ్చి, “స్వామివారు విజయవాడ వరకు మీ కారులో నన్ను వెళ్ళమన్నారు” అని చెప్పింది. సుందరరాజన్ ఆమెతోపాటు బయలుదేరాడు. విజయవాడకు చేరుకున్నాక ఆమె తమ ఇంట్లో భోజనం చేసి బయలుదేరాలని కోరింది. కానీ సుందరరాజన్ భయపడ్డాడు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు హైదరాబాదుకు బయలుదేరినా, చేరేటప్పటికి 10 గంటలు అవుతుంది, ఇక అప్పటికే తలనొప్పి ప్రారంభమై బాధపెడుతుందని అతనికి భయం. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందని, ఆమె వెంటనే అగ్రహారంలోకి వెళ్లి వేరే ఇళ్ల నుండి పదార్థాలను తెచ్చి సుందరరాజన్ కు భోజనం పెట్టింది. పదిహేను నిమిషాల్లో భోజనం చేసి హైదరాబాదుకు బయలుదేరి, చేరుకునేటప్పటికి సరిగ్గా 10 గంటలు. ఇక తలనెప్పి మొదలవుతుందని భయపడుతున్నాడు. కానీ తలనొప్పి ఎక్కడికి పోయింది? ప్రతిరోజూ భయంతో ఎదురుచూసే తలనొప్పి ఆ రోజు రాలేదు! ఇది వైదీశ్వరుడైన పరమాచార్య స్వామి అనుగ్రహ ఫలమా అనే ఆశ్చర్యంతో సుందరరాజన్ స్వామివారికి నమస్కరించాడు. అయినా కూడా, "రేపు మళ్లీ వస్తుందేమో?" అనే భయం మాత్రం వదలలేదు. కానీ రోజూ పది గంటలకు మొదలయ్యే తన తలనొప్పి శాశ్వతంగా పోవడం అన్నది ఆదివైద్యుడైన స్వామివారి అనుగ్రహ చర్య! స్వామివారి ఆదేశం ప్రకారం, సుందరరాజన్ అదే సంవత్సరం మార్చి 7న గురువాయురప్పన్ సన్నిధిలో నారాయణీయం పారాయణ ప్రారంభించాడు. పారాయణ మొదలుపెట్టిన వంద రోజులలోపే నాలుగు వివాహాలు విజయవంతంగా జరిపించగలిగాడు. ఆ వివాహాలు అన్నీ ఇప్పుడు షష్ట్యబ్దపూర్తి ఉత్సవాలు జరుపుకున్నాయి, ఇదంతా స్వామివారి ఆశీస్సుల వల్లే అంటున్నాడు ఆ భక్తుడు. --- “వాయిస్ ఆఫ్ పెరియవా” నుండి. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు. t.me/KPDSTrust #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

జయ జయ శంకర !! హర హర శంకర !! పరమాచార్య స్వామివారి అనుగ్రహంతో మీ అందరి సహాయ సహకారాలతో పురుషోత్తమ మాసమైన ఈ అధిక జ్యేష్ట మాసంలో రెండు గోదానాలు, తొమ్మిది సాలగ్రామాలను మన అందరి తరుపున అందరి గోత్రనామాల సంకల్పంతో, దేశ ధర్మాల రక్షణ కోసం, మనందరి ఆయురారోగ్య అభివృద్ధి కోసం, సకలములైన అన్ని కోరికలు నెరవేరగా ట్రస్ట్ తరుపున నిర్విఘ్నన్గా నిర్వహించడమైనది.

అంతా అయిపోయాక, మాట్లాడడానికేముంది? పరమాచార్య స్వామివారు ఒక చిన్న గ్రామంలో మకాం చేస్తున్నప్పుడు ఒక మీరాశీదారు (భూస్వామి) తన సహాయకునితో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు. భక్తులతో, ప్రేమతో మాట్లాడుతూ వారికి ఆశీస్సులు అందజేస్తూ ఉన్న స్వామివారు, మీరాశీదారు సహాయకుడితో అసాధారణంగా ఎంతోసేపు మాట్లాడారు. కానీ మీరాశీదారుతో మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చాలా బాధతో, స్వామివారు తనతో ఇలా ప్రవర్తించడానికి తను ఏమీ తప్పుగా ప్రవర్తించలేదు కదా అని పరిపరి విధాలా ఆలోచించాడు. కానీ కారణం ఎవరు అడగగలరు? ఎంతగానో బాధపడుతూ, స్వామివారి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. రైల్వే స్టేషన్ చాలా దూరం కావడంతో మఠం వాహనంలో వారిని దింపి రమ్మని పరిచారకుణ్ణి పంపించారు స్వామివారు. తరువాత వారితోపాటు వెళ్ళిన పరిచారకుణ్ణి పిలిచి, " మీరాశీదార్ ఏమన్నాడు? నా గురించి ఏమన్నాడు?" అని అడిగారు. “చాలా బాధ పడ్డాడు స్వామి. స్వామివారు తనతో మాట్లాడలేదని ఎంతో నొచ్చుకున్నాడు. దారి పొడవునా మీ గురించే మాట్లాడాడు. ఇంతకుముందు ఎప్పుడు దర్శనానికి వచ్చినా ఎంతో ప్రేమతో, అప్యాయతతో చాలాసేపు మాట్లాడే స్వామివారు ఈరోజు ఎందుకు ఇలా చేసారో అని మిమ్మల్ని పదే పదే తలుచుకున్నాడు స్వామి” అని చెప్పాడు. వెంటనే స్వామివారు ప్రశాంతంగా, “అంతా అయిపోయాక మాట్లాడడానికేముంది?" అని మౌనంగా లోపలకు వెళ్లిపోయారు. మరుసటి రోజున మఠానికి ఒక టెలిగ్రామ్ వచ్చింది. అందులో మీరాశీదార్ పరమపదించారు అనే వార్త ఉంది. పక్కన ఉన్నవారు ఆశ్చర్యంతో నిశ్శబ్దంగా ఉండిపోయారు. స్వామివారు అప్పుడు ఇలా అన్నారు, "నిన్న నేను ఎందుకు మాట్లాడలేదు అంటే, ఆ మీరాశీదార్ నన్ను పూర్తిగా మనసులో ఉంచుకోవాలన్నదే కారణం. నేను మాట్లాడకపోవడంతో, అతను నన్నే తలుస్తూ, నన్నే ఆలోచిస్తూ ఉన్నాడు". ఈ మాట విని అందరూ నిశ్చేష్టులయ్యారు. "అంతా అయిపోయాక మాట్లాడడానికేముంది?" అన్న స్వామివారి మాటలకు అర్థం ఇప్పుడు బోధపడింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన “అంత్యకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం - అంత్యకాలంలో నన్ను ధ్యానించినవాడు, నన్నే పొందుతాడు” అన్న విధంగా, ఆ మీరాశీదారు కూడా మరణ సమయానికి పూర్తిగా స్వామివారి స్మరణలో ఉండాలన్న ఉద్దేశంతోనే ఆ విధంగా వ్యవహరించారు. అలా స్వామివారినే తలుస్తూ ఈ జనన మరణ చక్రాన్ని దాటి భగవత్పదం చేరుకున్నాడు. అవును జన్మలోనూ, మరణానంతరంలోనూ భక్తుల పట్ల అపారమైన కరుణ కలిగిన మహాస్వామి మనల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు. t.me/KPDSTrust #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

స్వామివారి ఆదేశాలు పరమాచార్య స్వామివారిని 1934-39లో కుంభకోణంలో నేను పాఠశాలలో ఉన్నప్పుడు మూడు మార్లు దర్శనం చేసుకున్నాను. 1939-1944 మధ్యలో వైద్యకళాశాల విద్యార్థి దశలో మరో రెండు సార్లు దర్శనం చేసుకున్నాను మావూరు పిల్లూర్ నుండి వెళ్తున్నప్పుడు పెరళంలో. స్వామివారు ఒకసారి మా మామగారిని అడిగారు అంట ఎందుకు నీ పిల్లూర్ అల్లుడు దర్శనానికి రావడంలేదని. బహుశా అప్పుడే అంటే 1950ల నుండి అనుకుంటా దాదాపు ప్రతిరోజూ స్వామివారిని దర్శించుకుంటున్నాను. గత ముప్పైఅయిదు సంవత్సరాలుగా స్వామివారు ఎక్కడున్నా వారి దర్శనం కోసం వస్తుంటానని పలుమార్లు వేరేవారితో చెప్పేవారు స్వామివారు. మఠానికి వెళ్ళి వచ్చావా అని ఒక్కోసారి అడిగేవారు స్వామివారు. దాంతో, ఎప్పుడు బయట ఊరు వెళ్ళినా ముందు మఠానికి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. స్వామివారి దర్శనం కోసం రెండుసార్లు పండరీపురం, ఒకసారి కర్నూలుకు వెళ్ళాను. కీళంబి పునర్నిర్మాణ సంఘం (శివాలయం, విష్ణు ఆలయం, అధిష్టానం) అధ్యక్షుడుగా దాదాపు ప్రతీరోజూ స్వామివారిని దర్శించుకునేవాణ్ణి. అంబాపతీశ్వర దేవాలయం పొలాల మధ్యలో ఉంది. వెంగల పిళ్ళయార్ గురించి స్వామివారు అడిగినప్పుడు, దాదాపు వంద సంవత్సరాల క్రితమే ఆ మూర్తిని తీసివేయడంతో ఆ పరిసరాలు ఖాళీగా ఉన్నాయి. ఆ స్థలం మఠం ఖరీదు చేయడానికి అవకాశం ఉందేమో కనుక్కోమన్నారు కానీ ఆ యజమాని అందుకు ఒప్పుకోలేదు. తేనాంబాక్కం వెళ్ళే దారిలో పొలాలలో ఎక్కడైనా శివలింగాలు చూశానేమో అని ఒకసారి స్వామివారు అడిగారు. తరువాత తెలిసిన విషయం ఏమిటంటే కాంచీపురం చుట్టుపక్కల ప్రాంతాలలో నిరాదరణకు గురైన శివలింగాలను తరలించడానికి స్వామివారు ప్రణాళికలు సిద్ధం చేశారు అని. ఒకసారి మా అమ్మాయి తంగిలోని కామకోటీశ్వర మందిరం బలాలయానికి 1500 రూపాయలు విరాళం ఇచ్చింది. దాంతో స్వామివారు తనని తంగి ఆలయం కట్టించినది అని పిలిచేవారు. చెయ్యర్ లో ఉన్న వేదపురీశ్వర దేవాలయంలో అక్కడి వేదపాఠశాల విద్యార్థుల సహాయంతో, ప్రదోషం నాడు అభిషేకం నిర్వహించాలని స్వామివారు సూచించారు. అలాగే దేవాలయంలో ఉన్న అన్నీ విగ్రహాలకు అభిషేకాలు, అర్చనలు జరిపి ప్రాకారోత్సవం జరిపించాలని ఆదేశించారు. మరుసటిరోజు ఉదయం స్వామివారు నన్ను, “ఏ వేదపాఠశాల నుండి విద్యార్థులు వచ్చారు? గ్రామస్తులు ఎవరెవరు వచ్చారు? ఇంటికి తెరిగివెళ్ళేటప్పటికి ఎంత సమయం అయ్యింది?” వంటి వివరాలన్నీ అడిగేవారు. ఇలా కొన్ని సార్లు జరిగిన తరువాత ఒకరోజు ఉదయం నన్ను ఇక అక్కడకు వెళ్లనవసరం లేదని చెప్పారు స్వామివారు. మరలా నాకు తెలిసింది ఆ దేవాలయం పునర్నిర్మాణం పనులు మొదలయ్యాయి అని. శివరాత్రిరోజు ఆంజనేయ స్వామి దేవాలయంలో ‘రామ జపం’, శివాలయంలో ‘శివ నామ జపం’ యువత చేత అహోరాత్రం ఏర్పాటు చేయించమని ఆదేశించారు స్వామివారు. ఆంగ్లంలో స్వామివారికి వచ్చే ఉత్తరాలని స్వామివారికి చదివి వినిపించేవాణ్ణి. మూడు దేవాలయాల్లో వారానికి మూడు సార్లు జరిగే పిడికెడు బియ్యం కార్యక్రమంలో ఉండేవాణ్ణి. --- డా. వి. రాజగోపాలన్. “మూమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం” నుండి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు. t.me/KPDSTrust #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

ధనవంతులైన అంధులు పరమాచార్యు స్వామివారు తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని పాపనాశంలో మకాం చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి చాలామంది వచ్చారు. చెన్నైకి చెందిన ఒక ధనవంతుడు స్వామివారు ఎక్కడ మకాం చేస్తే ,అక్కడికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవడం అలవాటుగా చేసుకున్నాడు. ఇప్పుడు పాపనాశానికి కూడా స్వామివారి ఆశీస్సులు పొందేందుకు వచ్చాడు. స్వామివారు మకాంచేసిన ప్రాంతం బయట అంధ దంపతులు ఒకరు, కళ్ళు లేని బిడ్డతో కలిసి భిక్షాటన చేస్తూ కూర్చున్నారు. ఆ ధనవంతుడు, వారు భిక్ష అడిగినందుకు కోపంతో వారిని దుర్భాషలాడాడు. అంతేకాక స్వామివారి ఆశీస్సులకోశం లోపలకు వెడుతూ వారిని తన్నాడు కూడా. స్వామివారి దర్శనం కోసం చాలా మంది ఉన్నారు. స్వామివారు ఆ ధనవంతుణ్ణి పట్టించుకోకుండా అందరికీ ప్రసాదం ఇచ్చేదాకా ఎదురుచూసేలాగా చేశారు. ఆ ధనవంతుడు స్వామివారి ముందు పళ్ళు, ఇతర వస్తువులుంచి నమస్కరించాగనే, స్వామివారు చాలా కోపంతో బయట ఉన్న భిక్షకులతో ప్రవర్తించిన తీరును ప్రశ్నించారు. “నేను ఏమీ ఇవ్వను అని ఒక్క మాట చెబితే సరిపోయేది. కానీ నీవు వారిని దుర్బాషలాడడమే కాకుండా ఆ గుడ్డివారిని తన్నావు. నీవు చేసిన ఈ పాపానికి నిష్కృతి లేదు" చెప్పారు స్వామివారు. ఆ ధనవంతుడు కన్నీళ్లతో స్వామివారికి సాష్టాంగం చేసి, క్షమాపణలు కోరుతూ, “నేను చాలా పెద్ద అపచారం చేశాను, నన్ను మన్నించి రక్షించండి” అని వేడుకున్నాడు. వెంటనే స్వామివారు కరుణతో, మృదుస్వరంతో “ఇక్కడే ఉన్న పాపవినేశ్వర స్వామిని సేవించి పూజించు. నీ పాపానికి పరిహారం పొందు" అని చెప్పారు. ఆ రోజు రాత్రి కలలో అతనికి స్వామివారు పాపవినేశ్వరునిగా దర్శనమిచ్చి, "ఆ అంధ కుటుంబానికి నీ వంతుగా సాధ్యమైనంత సహాయం చెయ్ – అదే నీకు మోక్షాన్ని ఇస్తుంది" అని చెప్పారు. తర్వాత ఉదయం ఆ ధనవంతుడు వెళ్లి, ఆ అంధ కుటుంబం చేతులు పట్టుకుని రోదించాడు. "నేను మహా పాపం చేశాను. మీరు ముగ్గురికీ చూపు వచ్చేందుకు శస్త్రచికిత్స చేయిస్తాను. నన్ను ఈ పని చేయమని సాక్షాత్తు ఆ పాపవినేశ్వరుడే ఆదేశించాడు” అంటూ అప్పటికప్పుడు వారికి 20 లక్షల రూపాయల చెక్కును ఇచ్చి తిరస్కరించకండి అని బ్రతిమలాడాడు. తర్వాత వారిని చెన్నైకి తీసుకెళ్లి తన ఇంట్లోనే ఉంచుకుని, శస్త్రచికిత్స చేయించాడు. స్వామివారి అనుగ్రహం వల్ల వారికి చూపు లభించింది. ఇప్పుడు వారు ఈజిప్టులో ఉన్నారు. స్వామివారి అపార కరుణ వల్ల ఒక అంధ, పేద కుటుంబం, చూపును పొంది ధనవంతులుగా మారిపోయారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు. t.me/KPDSTrust #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

1986 ఫిబ్రవరి 26న కాసులమాల సమర్పణ ఎంతో వైభవంగా జరిగింది. నాన్నగారు కూడా కొంతసేపు పాల్గొన్నారు. మా అమ్మ కార్యదర్శి హోదాలో ఆ రోజు ఉదయం నుండి కార్యక్రమాన్ని నిర్వహించి, సాయంత్రం సమావేశంలో నివేదికను సమర్పించారు. ‘కర్పగం సువాసిని సంఘం’ తరపున అమ్మవారి కాసులమాల, దానికి సంబందించిన పత్రాలు భద్రపరచడం, ఒక కోసం గోద్రేజ్ అల్మరాని సమర్పణ చేశారు. ఇప్పటికీ ప్రతీ శుక్రవారం నాడు, పౌర్ణమి రోజున, మరియు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 26న, అమ్మవారు ఈ కాసులమాల ధరించి దర్శనమిస్తారు. 1986 మార్చి 13న, మా నాన్నగారు ఎటువంటి ఇబ్బంది పడకుండా అమ్మవారి సన్నిధికి వెళ్లిపోయారు. పరమాచార్య స్వామివారి కృపను, దయను మాటలలో వివరించలేం. డాక్టర్లు కూడా ఆశ వదిలేసిన సమయంలో స్వామివారే మరలా మా న్నానగారికి జీవితం ఇచ్చారు. మా అమ్మగారు తన సేవను, బాధ్యతను పూర్తిచేయగలిగేలా, మరికొన్ని రోజులు అందరమూ ఆనందంగా గడిపేలా చేశారు. ఇప్పటికీ మా కుటుంబం, బంధువులు, మిత్రులు ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ, స్వామివారి కృపను స్మరిస్తూ ఉంటాము. --- గౌరి సుకుమార్ అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు. t.me/KPDSTrust #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కర్పగాంబాళ్ బంగారు కాసులమాల చెన్నై మైలాపూర్ లో వెలసిన ప్రసిద్ధ కర్పగాంబాళ్ కపాలీశ్వర ఆలయం గురించి అందరికీ తెలిసిందే. 1950 సంవత్సరం నుండే అమ్మ అమ్మగారు శ్రీమతి ఆనందవల్లి మరియు ఇతర స్నేహితులతో కలిసి ప్రతిరోజూ ఈ ఆలయంలో లలితా సహస్రనామ పారాయణం చేసేవారు. ఆ సమూహానికి శ్రీమతి ముత్తులక్ష్మీ అమ్మాళ్ నాయకురాలు. ఈ బృందాన్ని "కర్పగాంబాళ్ సహస్రనామ గోష్ఠి" అని పిలిచేవారు. ముత్తులక్ష్మీ అమ్మాళ్ గారిని అందరూ “గురు పాటి” అని పిలిచేవారు. మా అమ్మగారు ఆ బృందానికి కార్యదర్శిగా వ్యవహరించేవారు. వారు రోజూ సహస్రనామం పారాయణం చేయడమే కాకుండా పండుగ సమయాల్లో ఆలయ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవారు. 1970లో ఒక రాత్రి గురుపాటి గారికి కలలో కర్పగాంబాళ్ అమ్మవారు దర్శనం ఇచ్చి, "మీరు ప్రతిరోజూ నా కోసం సహస్రనామం పారాయణ ఛేస్తున్నారు కదా, నాకు బంగారు సహస్రనామ కాసులమాల కావాలి. విశాలాక్షి, కామాక్షిలా నన్ను కూడా అలంకరించండి. మీరు చేయగలరా?" అని అడిగింది. గురుపాటి గారు కల గురించి గోష్ఠిలో చెప్పగా, అందరూ ఎంతో ఆనందంతో ఆ బంగారు కాసులమాల తయారీకి సమ్మతించారు. అనేకమంది భక్తుల నుంచి విరాళాలు సేకరించి తయారు చేయాలని నిర్ణయించారు. సంవత్సరాలు గడుస్తున్నా కానీ, ఆ మధ్యతరగతి మహిళల సమూహం తయారీకి కావలసిన మొత్తాన్ని సేకరించలేకపోయారు. కొంతమంది సూచించడంతో, 1978లో గురుపాటి గారు, మా అమ్మగారు తదితరులు పరమాచార్య స్వామివారి మార్గదర్శనం కోసం కాంచీపురం మఠానికి వెళ్ళారు. వారు దర్శనం కోసం ఎదురు చూస్తుండగా, మఠంలో పని చేస్తున్న వ్యక్తి వచ్చి “స్వామివారు పిలుస్తున్నారు. వెంటనే లోపలికి వెళ్లండి” అన్నారు. లోపలికి వెళ్లగానే స్వామివారిని చూసి ఆనందపరవశులయ్యారు. వీరు ఏమీ మాట్లాడక ముందే, “కాసులమాలకి బంగారం, డబ్బు తక్కువ పడిందా?” అని స్వామివారు ఆడగగానే వీరు ఆశ్చర్యపోయారు. “దిగులుపడకండి. అమ్మే అడిగింది కాబట్టి, అమ్మే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. విశాలాక్షి అమ్మవారికి, కామాక్షి అమ్మవారికి, కాసులమాలలు ధనవంతుల సహాయంతో తయారు అయ్యాయి. కానీ కర్పగాంబాళ్ అమ్మవారి కాసులమాల భక్తితో తయారవుతుంది.” అని స్వామివారు అభయమిచ్చారు. “మీ బృందానికి 'కర్పగం సువాసిని సంఘం' అని పేరు పెట్టి ఎక్కువగా సువాసిని పూజలు, బాల పూజలు నిర్వహిస్తూ ఉండండి.” అని ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చారు. స్వామివారి ఆదేశాన్ని ఖచ్చితంగా పాటించడంతో, బంగారం, డబ్బు విరివిగా సమకూరాయి. 1982లో బంగారు సహస్రనామ కాసులమాల తయారీ ప్రారంభమైంది. ఈ బాధ్యతను ‘వుమ్మిడి బంగారు కణ్ణన్’ గారికి అప్పగించారు. ప్రతి బంగారు నాణెం, ఒకవైపు అమ్మవారి నామంతో, మరొకవైపు ఆలయ చిహ్నం – వెనుకవైపు అమ్మవారు, ముందువైపు శివలింగాన్ని ఆరాధిస్తున్న నెమలితో రూపొందించారు. కాసులమాల తయారీ పురోగతిని ఎప్పటికప్పుడు కంచి మఠం ద్వారా మహాస్వామి వారికి తెలియజేస్తున్నారు. స్వామివారు మఠం వేద పాఠశాల నుండి కొంతమంది పండితులను పంపి కాసులమాలలో లిఖిస్తున్న అమ్మవారి నామాలు, వాటి వరుస క్రమాన్ని పరిశీలించారు. ఈ గొప్ప కార్యక్రమానికి, హిందూ ధార్మిక బోర్డు, కొంతమంది ఆలయ కమిటీ సభ్యులు, పనీపాటా లేని కొన్ని సామాజిక సంఘాలు మరియు సంఘ వ్యతిరేక శక్తుల రూపంలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి. కానీ స్వామివారి ఆశీస్సుల వల్ల మరియు మేనేజింగ్ డైరెక్టర్ సుగవనేశ్వరర్, తక్కర్ కుప్పుస్వామి, ప్రధాన అర్చకులు విశ్వనాథ శివాచార్యులు, న్యాయవాది కృష్ణస్వామి వారల సహాయంతో కాసులమాల తయారీ పూర్తయ్యింది. 1986 ఫిబ్రవరి 26న ఈ లలితా సహస్రనామ బంగారు కాసులహారాన్ని కర్పగాంబాళ్ అమ్మవారికి సమర్పించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి వివేక్ & కో నిర్వాహకులుగా వ్యవహరించాలని ఆదేశించారు. అయితే 1986 జనవరి 20న, మా నాన్నగారికి ఆరోగ్య సమస్యలు వచ్చి, ఆసుపత్రిలో చేర్చారు. ఆయన స్పృహ కోల్పోయి, చేతులు, కాళ్లు కదలకుండా పోయాయి. డాక్టర్లు కూడా నమ్మకం లేక, "ఇక 48 గంటల కంటే ఎక్కువ జీవించలేరు" అని తేల్చేశారు. అమ్మ మానసికంగా పూర్తిగా విచలితమై, పూజ గదిలో ప్రార్థనలో నిమగ్నమయ్యారు. గురుపాటి గారు ఇతర సభ్యులు, వుమ్మిడి కణ్ణన్, వివేక్ గారు అందరూ కలిసి పూర్తయిన కాసులమాల తీసుకుని స్వామివారికి చూపించడానికి కంచి మఠానికి వెళ్లారు. వారిని చూసి, "మీ కార్యదర్శి ఎందుకు రాలేదు?" అని అడిగారు స్వామివారు. బాధతో మా నాన్నగారి పరిస్థితిని వివరించగా, స్వామివారు మాలను చూసి, "ఈ మాల బాగా తయారయ్యింది. అమ్మవారికి ఈ మాల సమర్పించటప్పుడు మీ కార్యదర్శి కూడా ఉంటారు. భయపడకండి!" అని ప్రసాదం ఇచ్చారు. వారందరూ నేరుగా మా ఇంటికి వచ్చి ఈ శుభవార్త చెప్పారు. ఎంతటి అద్భుతం! అదే సమయంలో ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది – మా నాన్నగారు స్పృహలోకి వచ్చి బాగానే ఉన్నారు! వైద్యులు ఆశ్చర్యపోయి “ఏదో అద్భుతం జరిగింది” అన్నారు. నాన్నగారు మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యి, స్వయంగా నడుచుకుంటూ ఇంటికి వచ్చారు.

మా నాన్న కూడా ఇదే చెప్పారు ఒకసారి పరమాచార్య స్వామివారి దర్శనానికి ఒక ధనికుడు వచ్చాడు. స్వామివారు ఆజ్ఞాపిస్తే ఎడియానా ధార్మిక కార్యక్రమానికి తను ధనం ఇవ్వడానికి సిద్ధం అని తెలిపాడు. అందుకు స్వామివారు, “ఇంట్లోని పెద్దలతో మంచిగా ప్రవర్తించు, నీ భార్యను ప్రేమించు, సాధ్యమైనంత వరకు చెడ్డ పనులు చెయ్యొద్దు. అది చాలు” అన్నారు. శ్రీమఠానికి ధనం ఇవ్వమని చెబుతారేమో స్వామివారు అనుకుంటున్న ఆ ధనికుడు, స్వామివారు మాటలు విని ఆశ్చర్యపోయాడు. మఠానికి ఏమీ కోరకుండా పూర్తిగా వేరే విషయాన్ని చెప్పారు. ‘నేను స్వామివారితోనే ఉండి నా నుండి స్వామివారు ఏదైనా అడిగేలా చెయ్యాలి’ అని మనసులో అనుకున్నాడు. “నేను స్వామివారు చెప్పినట్లే చేస్తున్నాను; ఇకముందు కూడా అలాగే చేస్తాను. మీరు ఇంకా ఏదైనా చెయ్యమని చెప్పినా, దాన్ని కూడా చెయ్యడానికి సిద్ధం” కొద్దిసేపు మౌనం తరువాత, “మీకందరకూ ‘అయ్యనార్’ కులదైవం. దేవాలయం ముందర ఉన్న సిమెంటు గుర్రపుబొమ్మ పాతదైపోయింది. దాన్ని బాగుచేయించి, రంగులు వేయించి తరువాత దేవాలయానికి కుంభాభిషేకం చేయించు”. ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు. “అవును స్వామి, చనిపోయే ముందు మా నాన్న సరిగ్గా ఇదే పని చెయ్యమని చెప్పారు. దాని గురించి నేను పూర్తిగా మర్చిపోయాను. మా నాన్న ఏం చెప్పారో స్వామివారి కూడా సరిగ్గా అదే చెప్పారు, ఇది ఎలా సాధ్యం?” అవును, అది నిజం. మరి ఎలా? బహుశా అతని తండ్రి స్వర్గానికి వెళ్లిపోయే ముందు స్వామివారికి చెప్పాడేమో! ఎంతో ఆనందంతో ఆ ధనవంతుడు స్వామివారి ఆజ్ఞని పాటించాడానికి వెళ్లిపోయాడు. --- శ్రీమఠం బాలు మామ. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

అప్పుడు వర్షం పడింది కొన్ని దశాబ్ధాల క్రితం కంచి పరమాచార్య స్వామివారు శిష్యులతో కలిసి బళ్ళారిలోని హగరి నదీతీరంలో చాతుర్మాస్యం చేస్తున్నారు. ఆ సమయంలో బళ్ళారి జిల్లా రైతులు వర్షాభావ పరిస్థితులవల్ల తీవ్రమైన నీటి ఎద్దడిని అనుభవిస్తున్నారు. విత్తనాలు వేయడానికి, చివరికి తాగడానికి కూడా నీరులేని పరిస్థితి. కర్ణాటక రాష్ట్రంలోని బళారి జిల్లాలో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. రైతులందరూ కలిసి పరమాచార్య స్వామి వద్దకు వెళ్ళి తమని ఎలాగైనా ఈ నీటి ఎద్దడి నుండి కాపాడాలని వేడుకున్నారు. వారి దీనస్థితిని చూసి స్వామివారు చలించిపోయారు. మంచి వర్షం కురవడం కోసం ‘వరుణ జపం’ చెయ్యించమన్నారు. ఇరవైనాగు గంటలపాటు ఏకధాటిగా వరుణజపం చేయించామని కాని ఏమి లాభం లేదని వాపోయారు. ఇంకా వారు స్వామితో “మీరు ఆశీర్వదిస్తే మరలా మేము వరుణ జపం చేయిస్తామని కోరగా, ప్రపంచ మానవాళీ క్షేమం కోసం చేసే ఇలాంటి వైదిక శాస్త్ర క్రతువులకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని స్వామివారు చెప్పారు. వెంటనే ఇరవైనాలుగు గంటలపాటు ‘వరుణ జపం’ చెయ్యమని అలాగే దాంతోపాటు ‘పంచాక్షరి జపం’ కూడా చెయ్యండని ఆజ్ఞాపించారు. స్వామివారు చెప్పినట్టుగా చేయించారు. అద్భుతాలకే అద్భుతం. కన్ను మిన్ను కానని వర్షం పడింది. అకాశం భూమి ఏకమైందా అన్నట్టుగా వర్షం కురిసింది. రైతులందరూ చాలా సంతోషపడ్డారు. పరమాచార్య స్వామివారి మహిమలని కొనియాడుతూ ఆనందంతో నృత్యం చెయ్యడం ఆరంభించారు. వారి ఆనందం ఉప్పొంగగా “బోలో స్వామిజికి జై హర హర మహదేవ” అంటూ గట్టిగా అంటున్నారు. విన్నవెంటనే అక్కడున్న వారందరికి రోమాంఛితమై మొత్తం అందరూ భక్తి వానలో తడిసిపోయారు. ఇలా వర్షాలు పడడం, స్వామివారి మహిమ దావానంలా మొత్తం బళ్ళారి జిల్లా అంతా వ్యాపించింది. పరమాచార్య స్వామిని దర్శించి ఆశీస్సులు పొందడానికి మొత్తం కర్ణాటక రాష్ట్రం నలుమూలల నుండి తండోపతండాలుగా భక్తులు రావడం ప్రారంభించారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

ఇడ్లీలు - బ్రహ్మానుభూతి తిరుచిరాపల్లి భిక్షందర్ దేవాలయలో ఉండే మా మావయ్య కీర్తిశేషులు శ్రీ సుందరేశ్వర అయ్యర్ ఒకసారి తిరువణ్ణామలై వెళ్లారు. దేవాలయంలో దర్శనం చేసుకుని రమణ మహర్షుల దర్శనం కోసం రమణాశ్రమానికి వెళ్లారు. బహుశా 1940 లేదా 1945 సమయం అప్పుడు అనుకుంటా. భగవాన్ రమణుల గురించి ఎంతో విన్నారు కానీ వారిని మొదటిసారిగా దర్శించుకోబోతున్నారు. భగవానులు అందరితో కలసి ఫలహారము, భోజనం చెయ్యడం చూసి ఆశ్చర్యపోయారు. రమణులు ఇడ్లీలు తినడం చూసి అమితాశ్చర్యానికి లోనయ్యారు. భగవాన్ రమణులు భక్తులకు దర్శనం ఇవ్వడానికి హాలులోకి రాగానే, మా మావయ్య కూడా అందరితోపాటు కూర్చున్నారు. అప్పుడు మా మావయ్యకి ఒక ఒళ్ళు జలదరించే అద్భుతం జరిగింది. రమణుల కళ్ళు మా మావయ్య కళ్ళతో కలిశాయి. వెంటనే మా మావయ్య శరీరం తేలిక అయ్యింది. చాలా ఆనందం కలిగింది. వెంటనే బాహ్యస్మృతిని కోల్పోయారు. కొద్దిసేపటి తరువాత భగవాన్ రమణులు చూపు తిప్పుకోవడంతో మరలా స్మృతి కలిగింది. చుట్టూ ఏం జరుగుతోందో తెలియక, బాహ్యస్మృతి కోల్పోయి అలా ఎంతసేపు ఉన్నారో కూడా వారికి అర్థం కాలేదు. ఇదంతా వారికి చాలా గందరగోళంగా ఉంది. ఎవర్నైనా అడిగి తెలుసుకోవాలనుంది - కానీ ఎవరిని అడగాలి? చివరకు పరమాచార్య స్వామివారిని అడిగి నివృత్తి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. వెంటనే వెళ్ళి మహాస్వామి వారిని దర్శనం చేసుకున్నారు. స్వామివారు విశ్రాంతిగా ఉన్నప్పుడు వారి వద్దకు వెళ్ళి, స్వామివారి పాదాలపై పడి తమ తాతగారి పేరు (శ్రీ నారాయణ అయ్యర్), తండ్రిగారి పేరు (శ్రీ గణపతి అయ్యర్), అమ్మగారి పేరు (శ్రీమతి ఈశ్వరి) చెప్పి, వారి మేనమామ గారైన శ్రీ పైంగానాడు పంచపకేశ అయ్యర్ (పరమాచార్య స్వామివారు మహేంద్రమంగళంలో చదువుకుంటున్నప్పుడు, స్వామివారికి ఋగ్వేదం బోధించినవారు) గారి పేరు చెప్పి, చివరగా తమ పేరు చెప్పి నమస్కరించారు. తరువాత వారికి కలిగిన అనుభవాన్ని చెప్పారు. “ఇటీవలే తిరువణ్ణామలై వెళ్ళాను” స్వామివారు చురునవ్వుతో, “స్వామీ దర్శనం చేసుకున్నావా?” అని అడిగారు. మేమందరమూ “స్వామీ” అని కొలుచుకునే దేవుడు, భగవాన్ రమణులను “స్వామీ” అని సంబోధిస్తూ “స్వామీ” దర్శనం చేసుకున్నవా అని మా మావయ్యని అడిగారు!!! “హా చేసుకున్నాను” “ఏమి? ‘హా చేసుకున్నాను’ అని అంటున్నావు? ఏం జరిగింది?” మా మావయ్య ఏదో చెప్పాలనుకుంటున్నారని, కానీ చెప్పడం సరియా? కాదా? అని శంసయిస్తున్నారని స్వామివారికి తెలుసు. అందుకనే చెప్పమని స్వామివారు ప్రోత్సహిస్తున్నారు. మావయ్య : “లేదు... భగవానుల దర్శనం చేసుకున్నాను. దర్శనం బాగా జరిగింది. వారు అందరితో కూర్చుని భోజనం కూడా చేశారు. . .” స్వామివారు : “అందరితోపాటు తిన్నారు . . .” ఎందుకు దీర్ఘం తీస్తున్నావు? ఎందుకంటే రమణులు ఇడ్లీలు కూడా తిన్నారని కదూ? అందుకేనా? స్వామివారికి తెలియని విషయం ఏదైనా ఉందా? వారి సందేహాన్ని స్వామివారు గ్రహించారు. మావయ్య : “అవును. అవును... తిన్నారు... ఇడ్లీలు తిన్నారు...!” స్వామివారు : “కనుక నీకు అనిపించింది. ‘ఏమిటిది? కంచి మఠంలో స్వామివారు ఇడ్లీలు తినరు, కానీ ఇక్కడ రమణులు ఇడ్లీలను తింటున్నారు’ అవునా?” మావయ్య : “అవును... స్వామీ” స్వామివారు చిరునవ్వుతో చెప్పడం మొదలుపెట్టారు. “రమణులు అన్నీ ఆశ్రమ పరిధులను దాటిపోయారు. వారికి మఠము, నియమము, పరిధి లేవు. కానీ ఇక్కడ అలా కాదు. ఈ మఠానికి సాంప్రదాయాలున్నాయి. నియమాలున్నాయి, హద్దులున్నాయి. మరియు నాకు వాటినాన్నిటిని పాటించి పాలించాలసిన బాధ్యత ఉంది. అందుకే ఇక్కడ ఇడ్లీలు తినరు (తమని చూపుతూ చిరునవ్వుతూ). అర్థమైందా?” మావయ్య : “హా...” తలూపారు మా మావయ్య. స్వామివారు : “సరే. అక్కడ ఇంకేం జరిగింది?” మావయ్య : “మేము సాయంత్రం మహర్షుల దర్శనానికి వెళ్లాము. అప్పుడు నేను రమణుల వైపే తీక్షణంగా చూస్తున్నాను. హఠాత్తుగా వారు నావైపు చూశారు. వారి చూపు నా కళ్ళల్లోకి పడగానే, నాకు ఏదో జరిగింది. నా స్మృతిని కోల్పోయాను. నా శరీరం తేలికైపోయింది. చాలా అద్భుతమైన అనుభవం. అలా ఎంతసేపు ఉండిపోయానో నాకు తెలియలేదు. హఠాత్తుగా నాకు బాహ్యస్మృతి పొందగానే రమణులు వేరేవైపు చూస్తున్నారు...” స్వామివారు : “అంటే, ఏం జరిగిందో నీకు తెలియదు అంటావు?” మావయ్య : “అవును” స్వామివారు : “అంతేకాక, ఎవరికైనా ఆ స్థితి శాశ్వతంగా ఉండిపోవాలని అనుకుంటున్నావు, కదూ?” మావయ్య : “అవును” స్వామివారు చిన్నగా నవ్వారు. కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. తరువాత నిదానంగా చెప్పనారంభించారు. “రమణులు కొద్దిసేపు నీ మనస్సును లేకుండా చేశారు. మనస్సు లేకపోతే, మనస్సు లుప్తమయిపోతే, ఇక ఉండేది ఆనందం మాత్రమే. అటువంటి శాశ్వత ఆనందాన్ని నీకు కాస్త రుచి చూపించారు. నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి వారి దర్శనం చేసుకో” మా మావయ్య స్వామివారికి సాష్టాంగం చేసి నమస్కరించి ఊరికి వెళ్ళిపోయారు. తరువాత, ఎన్నోసార్లు భగవాన్ రమణుల దర్శనం చేసుకున్నారు. ఈ సంఘటనను మా మావయ్య ఎన్నోమార్లు చెబుతూ, ప్రతిసారీ ఆ బ్రహ్మానంద అనుభవాన్ని పొందేవారు. --- విశి నాథన్

మహాస్వామివారు పద్యాన్ని చదివి కన్నదాసన్ తో “నువ్వు చెప్పినది కేవలం శేషాద్రి స్వామివారికి మాత్రమే సరిపోతుంది. ఆయనే తురువణ్ణామలై అర్ధనారీశ్వరుడు. ఆయనే సత్పురుషుడు, మహామనీషి” అని అన్నారు. ”సనాత ధర్మ వైభవాన్ని గురించి మనస్పూర్తిగా రాయి” అని ఆశీర్వదించి పంపారు. అప్పుడే కన్నదాసన్ మనసులో బీజం పడింది. అది చిగురించి, చిన్న మొక్కై, మహావృక్షమై మహత్తరమైన “అర్థముల్లా హిందు మతం; అర్థవంతమైన హిందూ మతం” అనే పుస్తకమై వర్ధిల్లింది. [పూర్వీకులు చేసిన పుణ్యం మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. మరి వింతపోకడలతో స్వధర్మాన్ని ఆచార వ్యవహారాలని మంటగలిపి పాశ్చాత్య సంస్కృతికి బానిసలవుతున్న వారి వంశాలని, ముందు తరాలని కాపాడేది ఎవరు? ఏ పుణ్యం చూపించి భగవంతుడు నిన్ను కాపాడుతాడు. అందుకే ‘కురు పుణ్య మహోరాత్రం’ అన్నారు శంకరులు.] అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు. t.me/KPDSTrust #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

నాస్తికుడు ఆస్తికుడైన వేళ చిత్రనిర్మాత సాండొ చిన్నప్ప దేవార్ మరియు ప్రఖ్యాత తమిళ కవి కన్నదాసన్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఒక సినిమా షూటింగ్ నిమిత్తం కార్లో వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. దేవార్ చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నాడు కాని కన్నదాసన్ మాత్రం తీవ్రమైన గాయాలతో స్పృహ కోల్పోవడంతో మాద్రాసులోని ఆసుపత్రిలో చేర్పించారు. దేవార్ కు పరమాచార్య స్వామి అంటే అమితమైన భక్తి. వెంటనే తేనంబాక్కం శివస్థానంలోని బ్రహ్మపురీశ్వర దేవస్థానంలో మకాం చేస్తున్న మహాస్వామి వారిని దర్సించుకోవడానికి వెళ్ళాడు. “ఒక ప్రమాదం జరిగింది” అని స్వామితో చెప్పాడు దేవార్. వెంటనే స్వామివారు “కన్నదాసన్ ఎలా ఉన్నాడు?” అని అడిగారు. తను ఏమి చెప్పకనే మహాస్వామివారు కన్నదాసన్ ఎలా ఉన్నాడు అని అడగటంతో దేవార్ ఆశ్చర్యపోయారు. ప్రమాదం నుండి తను ఎలా బయటపడ్డాడు, కన్నదాసన్ ఎలా తీవ్రంగా దెబ్బతిని అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరాడు అన్న విషయమంతా స్వామివారికి విన్నవించాడు. దేవార్ ఆత్రుతని గమనించి మహాస్వామి వారు “దిగులు పడకు ఏమి పరవాలేదు” అని అతణ్ణి సముదాయించారు. ఆస్పత్రిలో ఉన్న కన్నదాసన్ నుదుటిపైన విభూతి పెట్టి, కొద్దిగా నోట్లో వేసి మిగిలిన దాన్ని దిండు కింద ఉంచమని స్వామివారే స్వయంగా విభూతిని పొట్లం కట్టి ఇచ్చారు. దేవార్ సంకోచిస్తూ విభూతిని అందుకున్నాడు. ఎందుకంటే కన్నదాసన్ పరమ నాస్తికుడు. దైవాన్ని నమ్మేవాడు కాదు. అప్పటికే కన్నదాసన్ ద్రావిడ పార్టీల నాస్థిక కార్యకలాపాల్లో, వాటి వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. బ్రాహ్మణుల గురించి, సనాతన ధర్మం గురించి చాలా చెడుగా మాట్లాడేవాడు. నిజానికి ప్రమాదం జరగడాని వారం రోజులముందు కూడా కంచిలోని శంకర మఠం ఎదురుగుండా జరిగిన ఒక సభలో శంకరాచార్యుల (కంచి పీఠాధిపతుల) చిత్తరువును అవమానపరిచాడు. మరి ఇప్పుడు అటువంటి వ్యక్తికి ఈ విభూతి ఎలా ఇచ్చేది అని ఆలోచిస్తున్నాడు దేవార్. ఆ త్రికాలజ్ఞాని దేవార్ పరిస్థితిని అర్థం చేసుకుని దేవార్ తో ఇలా అన్నారు. ”ఏమి అనుమానపడకుండా వెళ్ళి కన్నదాసన్ నుదుటన ఈ విభూతి పెట్టు. చిన్న మేఘం కాసేపు సూర్యుణ్ణి అడ్డుకున్నట్టు, ఈ నాస్తికత్వం అతణ్ణి అడ్డుకుంది. ఇప్పటి నుండి అతను సూర్యునివలె ప్రకాశిస్తాడు. వారి పూర్వీకులు ఎంతటి మహాత్ములో నీకు తెలుసా? వారి ముత్తాత కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని పునరుద్ధరించారు. వారి తాత కంచి ఏకాంమ్రేశ్వర దేవస్థానాన్ని పునరుద్ధరించారు. వారి తండ్రి కంచి కామాక్షి అమ్మవారి దేవస్తానాన్ని పునరుద్ధరించారు. అతను దేవాలయలాను సంరక్షించే మాహానుభావుల వంశంలో జన్మించాడు. ఇప్పుడు నీకు అర్థమైందా?” దేవార్ ఆస్పత్రికి వెళ్ళి స్వామివారు చెప్పినట్టు చేసాడు. స్వామివారు ఇచ్చిన విభూతిని కన్నదాసన్ నుదుటన పెట్టి కొంచం నోట్లో వేసి, మిగిలినదాన్ని దిండు కింద పెట్టాడు. అప్పుడు సాయం సంధ్యా సమయం. తమిళ సాహిత్యానికి రాజైన కవి అరసు(కవి రాజు) కన్నదాసన్ ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. దేవార్ విశ్రాంతి కొరకై రాత్రికి ఇంటికి వెళ్ళి తన స్నేహితుణ్ణి చూడాలని ఉదయాన్నే మరలా వచ్చాడు. స్పృహలోకొచ్చిన కన్నదాసన్ కు ఏమి చెప్పాలా అని అలోచిస్తూ రాత్రి అంతా గడిపాడు. మరుసటి రోజు ఆసుపత్రికి రాగానే కన్నదాసన్ స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి అలాగే మంచంపై పడుకుని ఉండడం చూసి ఆనందపడ్డాడు. “నేను ఎన్ని రోజులనుండి ఈ ఆసుపత్రిలో ఉన్నాను? నా మొహం చూసుకోవాలి అద్దాన్ని తీసుకుని రా” అని చెప్పాడు. దేవార్ ఆద్దం తెచ్చిచ్చాడు. అద్దంలో తన మొహాన్ని, నుదుటిపై ఉన్న విభూతిని చూసి అతను కోప్పడలేదు. బదులుగా ఎవరు పెట్టారు అని అడిగాడు. దేవార్ కొంచం ధైర్యం తెచ్చుకుని తను పరమాచార్య స్వామిని కలవడమూ, వారి అతణ్ణి అనిగ్రహించడమూ మొదలగు అన్ని విషయాలు కన్నదాసన్ కు చెప్పాడు. అంతా వినగానే కన్నదాసన్ కన్నీళ్ళపర్యంతం అయ్యాడు. “నన్ను కరుణించారా? నా పైన ఇంతటి దయ చూపించారా? కేవలం వారం రోజుల ముందు నా చేష్టలతో, మాటలతో వారిని అవమానపరిచాను. ఎంతటి పాపిని నేను?” అని భోరున విలపించాడు. “పూర్తి స్వస్థత పొందిన తరువాత నేను మొదట నా ఇంటికి వెళ్ళను. ఇంతటి పాపిని అనుగ్రహించిన ఆ మహాత్ముని వద్దకు ముందు నన్ను తీసుకుని వెళ్ళు” అని దేవార్ ను అర్థించాడు. అతని కోరిక ప్రకారం మహాస్వామివారిని దర్శించుకుని తనని క్షమించవలసిందిగా పలువిధాల ప్రార్థించాడు. అప్పటి నుండి నాస్తికత్వం నుండి ఆధ్యాత్మికత వైపు మళ్ళాడు. మనసులో భక్తిభావం పొంగగా మహాస్వామి వారిపై కవిత రాసాడు. మరలా స్వామిని దర్శించినప్పుడు దాన్ని వారికి సమర్పించాడు. ”ఎవరి కనుచూపుచేతనే అన్ని పాపాలు నశించిపోతాయో ఎవరు తిరువాచకానికి సాకార స్వరూపమై నిలచినారో ఎవరు తన మేధస్సు చేత సత్యా జ్ఞానానికి అర్థం చెప్పగలరో ఎవరు ఈ విశ్వాన్ని రక్షించాడానికి వచ్చిన విశ్వనాథుడో ఎవరు అన్ని మతాల చేత తమ దేవుడని ఒప్పబడినాడో అటువంటివారి చరణారవిందములకు మనల్ని సమర్పించుకుందాము రండి! అందరూ తరలిరండి!!”

నువ్వు పుట్టడానికి ముందే 1989లో చైత్ర పౌర్ణమి. పరమాచార్య స్వామివారిని దర్శించుకోవాలని కాంచీపురం వెళ్ళాను. అది సాయం సంధ్యా సమాయం. అప్పుడే చిన్నగా చీకటి పడుతోంది. నేను వెళ్ళేటప్పటికి పరమాచార్య స్వామివారు కచ్ఛపేశ్వర దేవస్థానానికి వెళ్ళి ప్రాకారంలో కూర్చున్నారు. వారి చుట్టూ కొంతమంది భక్తులు ఉన్నారు. నేను వారిముందు నేలపై పడి సాష్టాంగం చెయ్యగానే, నా గురించి అడిగారు. ఆచార్యులవారి ఆంతరంగిక శిష్యుడు ఒకరు వారి మాటల్ని నాకు వినిపించాడు. నేను వారికి సమాధానం ఇవ్వగానే, నేను జన్మించిన ప్రాంతం గురించి అడిగారు. మా నాన్నగారు త్రిశూర్ కు చెందినవారు, మా అమ్మగారు కొడుంగల్లూర్ కు చెందినవారు. రెండూ కేరళలోని ప్రాంతములే. స్వామివారు ఈ ప్రాంతములు పేరు వినగానే, తలపైకెత్తి “ఓహో భగవతి క్షేత్రం” అని అన్నారు. అప్పుడు నేను ఆ సహాయకునితో స్వామివారు ఈ ప్రాంతాలను దర్శించారా అని అడిగాను. నేను ఏమి అడుగుతున్నానో అతడి ద్వారా అడిగి తెలుసుకొని కొద్దిసేపటి తరువాత “అవును చాలా ఏళ్ళ క్రితం... నువ్వు పుట్టడానికి ముందే” అని అన్నారు. అవును అది నిజం. నేను పుట్టడానికి మూడేళ్ళ ముందే మహాస్వామివారు ఆ క్షేత్రాలకు విజయం చేశారు. స్వామివారి సమక్షమంలో అంతటి అసందర్భమైన ప్రశ్న వేసి తప్పుచేశానేమో అని హఠాత్తుగా నా మనసుకు అనిపించింది. కొద్దిగా భయంవేసి అపరాధనా భావంతో వెంటనే నేలపై పడి స్వామివారికి సాష్టాంగం చేశాను. పైకి లేచేటప్పటికి ఆ కరుణామూర్తి నా తప్పుని మన్నించి అనంతమైన ఆశీస్సులని అందిస్తున్నట్టుగా చెయ్యి పైకెత్తి ఆశీర్వదిస్తున్నారు. శ్రీమఠానికి ఏవిధమైన సంబంధంలేని అశేషమైన భక్తకోటిలో మేము కూడా కేవలం ఒకరము మాత్రమే. కాని స్వామివారికి నేను పుట్టిన సంవత్సరం ఎలా తెలుసు? సర్వజ్ఞాని !! సర్వవ్యాపి !! సర్వ స్వతంత్ర !! --- డా. యమ్. పద్మనాభన్, చెన్నై అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

పూజ - ప్రసాదం 1945లో పరమాచార్య స్వామివారు మయూరంలో మకాం చేస్తున్నప్పుడు దగ్గర్లోని అణైతాండవపురంలో చంద్రమౌళీశ్వర పూజ చేస్తున్నారు. పూజ పూర్తైన తరువాత ప్రసాదం పెట్టడానికి మఠం ఏనుగుని పూజాస్థలికి తీసుకురమ్మని ఆదేశించారు. పూజ జరుగుతున్న ప్రదేశం చిన్నదిగా ఉండడం, ప్రవేశద్వారం మొక్కజొన్న పొత్తులతో అలంకరింపబడి ఉండడం వల్ల అంతపెద్ద ఏనుగుని లోపలికి ఎలా తీసుకురావాలో అర్థం కాక అక్కడున్నవారు కలవరపడుతున్నారు. ఏనుగుని తీసుకునిరాకపోవడానికి గల కారణాలను పరమాచార్య స్వామివారికి విన్నవించగా, స్వామివారు మావటిని పిలిచి పూజకు ఏనుగును పంపవలసిందిగా ఆజ్ఞాపించారు. మావటి వెంటనే ఏనుగు దగ్గరికి వెళ్ళి దాంతో సంభాషించి పూజకు రావల్సిందిగా మహాస్వామివారు పిలిచారు అని చెప్పి దాని బంధనాలను తొలగించాడు. వెంటనే అది వస్తున్నాను పద అన్నట్టుగా తలాడించి పూజామందిరం ద్వారం వద్దకు వచ్చి అంతపెద్ద తన దేహాన్ని చిన్నదిగా చేసుకుని, వంచుతూ, మెలికలు తిప్పుతూ ఆ ద్వాఅరం గుండా లోపలికి ప్రవేశించింది. పూజ పూర్తి అయ్యేదాకా అక్కడ నిశ్శబ్ధంగా నిలబడి తరువాత ఎలా లోపలికి వచ్చిందో అలాగే బయటకు తిరిగి వచ్చింది. ఏనుగు స్వామివారి మాటల్ని విని అలా ప్రవర్తించడం చూసి అక్కడున్న వారందరూ పారవశ్యంతో అలా చూస్తూ నిలబడిపోయారు. --- యమ్. ఆర్. బాలసుబ్రమణియన్, తిరుచ్చి. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 6 #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

బాలలకు శ్రీచరణుల సందేశం పండుగలను, ఉత్సవాలను విందులు మున్నగు వాటితో గడపడం కన్నా ఏదైనా మంచి పనిని ప్రారంభించడానికి ఉపయోగించి, నియమంగా ఆ పని చేస్తే ఎంతైనా బాగుంటుంది. ఉదాహరణకు శ్రీరామనవమి నాడు శ్రీరామ నామం వ్రాయడం ప్రారంభించి, శ్రీరాముని చిత్రపటాన్ని ముందుంచుకుని రాముని గుణగణాలను తలచుకుంటూ రామనామాన్ని ఉఛ్ఛరించండి. "శ్రీరామ" అని అలా వ్రాసుకుంటూ పోవడం వలన మనసు బుద్ధి మున్నగు వన్నీ మంచి గుణాల మీద, భావాల మీద కేంద్రీకృత మవుతాయి. ఈ ప్రకారం ప్రతిరోజూ చేస్తే చక్కటి అనుశాసనం అలవడుతుంది. మనమంతా ఉత్తమమైన మానవులుగా రూపొందడానికి బాల్యం నుండి తగిన అభ్యాసం ఎంతైనా అవసరం. చిన్ననాటి నుండి వినమ్రత, దైవభక్తి, చక్కటి సత్కార్యక్రమములు చేయవలెనన్న చింతన, క్రమశిక్షణ, మనసు ఒక విషయము నందు లగ్నము చేయడం వంటివి అలవాటు కావలసి వుంది. ఈ నియమములను బాలలు భక్తి శ్రద్ధలతో అభ్యాసము చేయుటయే గాక తల్లితండ్రులు తమ పిల్లలు వీటిని పాటించులాగ శ్రద్ధ వహించవలసింది. బాలురు తమ టైము టేబులు కార్డుపై తమకు ఇష్టం వచ్చిన దేవతల చిత్రం అతికించి ఆ దేవతకు సంబంధించిన శ్లోకాన్నో, పద్యాన్నో వ్రాసుకొని ప్రతినిత్యం ధ్యానం చేయాలి. బాలురు విద్యార్థులు గాన తమ టైము టేబులు కార్డు మీద "సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణిణీ నిత్యం పద్మాలయా దేవి సామాం పాతు సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా" అనే శ్లోకాన్ని వ్రాసుకోవచ్చు. ఇలాంటి శ్లోకాన్ని కొందరు విద్యార్థులో లేక కొన్ని తరగతుల విద్యార్థులో కలిసి ముద్రించవచ్చు కూడా. వీలుంటే తోటి విద్యార్థులకు పంచిపెట్టవచ్చును కూడా. ఇలాంటి వాటికి తల్లితండ్రులు తప్పక సహకరిస్తారు. తప్పక ఒక రూపాయి చొప్పున ఇవ్వకుండా ఉండరు. పాఠశాలలో మోరల్ సూచనల పీరియడ్ లందు ధర్మభోదకములగు కథలను ప్రారంభింపవలసిందిగా బాలలు ఉపాధ్యాయులను కోరవచ్చును. అంతటితో చాలదు. ప్రతి బాల బాలికలు ఇలాంటి పద్యాలను శ్లోకాలను కనీసం యేబదికి తక్కువ కాకుండా కంఠస్థం చెయ్యాలని నా కోరిక. వచ్చేవి వేసవి శెలవులు గదా! ఈ కాలాన్ని ఇలా చక్కగా వినియోగించుకోవచ్చు కూడా. ఇలాంటి శ్లోకాలకు అర్థం తెలుసుకుని వాటిని మంచి ఉచ్చారణతో పఠించగల బాలబాలికలకు మా మఠం మంచి పుస్తకాలను కానుకగా ఇస్తుంది. మంచి బాలసంఘాలను ఏర్పాటుచేసుకోవాలి. పురాణ కథశ్రవణాది కాలక్షేపాలను ఏకాదశి నాడు లేదా శనివారం నాడు సామూహిక భజనలు, ప్రార్థనలు ఇత్యాదులు కూడా నిర్వహించుకోవచ్చును. --- ‘చంద్రశేఖర వచోవిభూతి’ నుండి #KanchiParamacharyaVaibhavam - #కంచిపరమాచార్యవైభవం