cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

🕉వేదాంత సంగ్రహం🕉

ఆధ్యాత్మిక నిలయం

نمایش بیشتر
پست‌های تبلیغاتی
1 520
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
+47 روز
+2030 روز
توزیع زمان ارسال

در حال بارگیری داده...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
تجزیه و تحلیل انتشار
پست هابازدید ها
به اشتراک گذاشته شده
ديناميک بازديد ها
01
మృగశిర కార్తి : 8-6-2024 నుండి 21-6-2024 వరకు పాదజల నక్కవాహనం వాతావరణం మేఘావృతమగును. 9-10-11 తేదీలలో అక్కడక్కడ తొలకరి వర్షములు పడును. ఈదురుగాలులు వీచును. ఎండలు తగ్గుముఖం పట్టును. కొన్నిచోట్ల విత్తనములు మొలకెత్తును
810Loading...
02
Media files
900Loading...
03
🌸 *శ్రీమద్భాగవతము* 🌸 🌹  *సమన్వయము*🌹 🌺 కృష్ణుని సమకాలికులలో కొందరు గొప్పకులమున పుట్టితిమని గర్వపడువారుండిరి. విద్యావంతులమని కొందరు, ధనవంతులమని కొందరు గర్వపడుచుండిరి.  వారికి మదముచే కన్నులు పొరలు గ్రమ్మి కృష్ణుడు కనిపింపలేదు. వారు కృష్ణుని సామాన్యునిగా కూడ లెక్కపెట్టలేదు. శిశుపాలుడు మొదలగు రాజులు అట్టివారు. వారు కృష్ణుని గూర్చి చేసిన నిందలను, దుర్భాషలను తలచుకొనినపుడెల్ల నా మనస్సు తపించిపోవును. తనివితీరక తనను దర్శించువారికి, బుద్ధియోగమున తనను తెలుసికొనగోరిన వారికి, తపసులను గూర్చి చేయుచున్నవారికి, సమస్త సృష్టిలో తనను దర్శించుట అభ్యసించు భాగవతులకు మాత్రము తన అఖండ జ్యోతిస్స్వరూపమును చూపి, వారి దుఃఖములను హరించి, శాంతస్వరూపుడై, దర్శనమిచ్చి శ్రీకృష్ణుడు వచ్చినపని ముగించుకొని, దేహము చాలించి, మాయమయ్యెను........✍ *మాస్టర్ ఇ.కె.*  (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము.
1350Loading...
04
Media files
1400Loading...
05
🌸 *శ్రీమద్భాగవతము* 🌸 🌹  *సమన్వయము*🌹 🌺 శ్రీకృష్ణుడు మానవుల వికాసమునకు ‌కొలబద్ధ‌ వంటివాడు. ఎవడు తనయందు ఎంత వికాసము చూపునో, వానికి అంతగా కనిపించువాడు. తనకే ఆశ్చర్యము గొల్పు తన యోగ మాయాశక్తిని తనచేత నిలిపి ఎల్లరకును ప్రదర్శనము చేసెను‌. అంతటి సౌభాగ్యవంతమైన రూపము ఇంకొకటి లేదు‌ అతడు భూషణములను ధరించినచో అతని వలన వానికి అందము కలిగినది. ఆయా సందర్భములలో అతడు చూపిన వివేకము మిగిలినవారికి ఆదర్శము. అతడున్న చోట సకల శుభములు ఉండెడివి. అతనితో సహవాసము చేయువారికి సత్యప్రవర్తనము తప్పనిసరియై ఉండెడిది. పరిపూర్ణమైన తన రూపముతో ధర్మజుని రాజసూయమున అతడు అటు ఇటు తిరుగుచు ఆయా సందర్భములకు తగినట్లు ప్రవర్తించుచుండగా చూచి ఎల్లరను నిశ్చేష్టులై వర్ణించుకొనిరి.........✍ *మాస్టర్ ఇ.కె.*  (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము.
1430Loading...
06
Media files
1620Loading...
07
Media files
1590Loading...
08
శుక మహర్షి జయంతి शुक महर्षि जयंती
1590Loading...
09
శని జయంతి Shani Jayanthi
1550Loading...
10
Media files
1540Loading...
11
🌸 *శ్రీమద్భాగవతము* 🌸 🌹 *సమన్వయము*🌹 🌺 శ్రీకృష్ణుడు మానవుల వికాసమునకు ‌కొలబద్ధ‌ వంటివాడు. ఎవడు తనయందు ఎంత వికాసము చూపునో, వానికి అంతగా కనిపించువాడు. తనకే ఆశ్చర్యము గొల్పు తన యోగ మాయాశక్తిని తనచేత నిలిపి ఎల్లరకును ప్రదర్శనము చేసెను‌. అంతటి సౌభాగ్యవంతమైన రూపము ఇంకొకటి లేదు‌ అతడు భూషణములను ధరించినచో అతని వలన వానికి అందము కలిగినది. ఆయా సందర్భములలో అతడు చూపిన వివేకము మిగిలినవారికి ఆదర్శము. అతడున్న చోట సకల శుభములు ఉండెడివి. అతనితో సహవాసము చేయువారికి సత్యప్రవర్తనము తప్పనిసరియై ఉండెడిది. పరిపూర్ణమైన తన రూపముతో ధర్మజుని రాజసూయమున అతడు అటు ఇటు తిరుగుచు ఆయా సందర్భములకు తగినట్లు ప్రవర్తించుచుండగా చూచి ఎల్లరను నిశ్చేష్టులై వర్ణించుకొనిరి.........✍ *మాస్టర్ ఇ.కె.* (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము.
1750Loading...
12
Media files
1930Loading...
13
*పెళ్ళాం, పిల్లలు-వాళ్ళయెడల చేయవలసిన కరవ్యం వఱకే తనదిగాని,అనగా తాను సంపాదించుకొని రావడం; వాళ్ళకు కావలసినవి ఏర్పాట్లు చేయడం, ఇల్లూ, వాకిలీ మున్నగునవి: సమయానుసారంగా వాళ్ళకు చదువు చెప్పించటం;వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయడం,వాళ్ళకు ఉద్యోగాలు మొదలైనవి చూడటం,అంతకుమించి వాళ్ళు బాగుండటానికి సంబంధించి,తాను అనే విషయం ఒక పొగరు ఉంటే తప్ప అన్పించదు.వాళ్ళు బాగుంటే చాలు,నాకింకేం కావాలి అనుకోవడం,వాళ్ళు బాగుండటానికి కారణం తాను అని అనుకోవడం చాలా పొగరు.మన పెళ్ళాం పిల్లల్ని మనమే పోషిస్తున్నాం అనే నిరంకుశమైన పశు ప్రవృత్తి దగ్గఱ ఉండి, వీళ్ళ పెళ్ళిళ్ళు మనవల్ల అవుతున్నాయి, వీళ్ళకు ఇల్లూ, వాకిలీ, అన్నం, పానీయం మనం చూస్తున్నాం అనే అభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి.ఇలాంటి భావాలు, ప్రవృత్తిగలవాడికి జీవితంలో పరమావధి మనస్సులో ఏమిటని రూపొందుతుంది?"వీళ్ళు మనకు"అని. ముందు వీళ్ళను చూసూసుకోవాలిగదా, వీళ్ళను జాగ్రత్తచేస్తుండాలిగదా మనం. వీళ్ళ సంగతి చూడాలిగదా ! అన్పించి, "వీళ్ళు మనకు" చేయాలిగదా అన్పిస్తుంది. ఏమిటి వాళ్ళను మనం చూసేది? సమయానికి ఉద్యోగం చేయడం, జీతం తీసికొని వచ్చి పడేయటం ఇవేగదా.ఆఫీసులో సేవకుడు ఎలాంటివాడో, ఈ తండ్రి కూడా అలాటివాడే. ఎవరి స్థితి అయినా అంతే. సంప్రదాయసిద్ధమైన కుటుం బమునందు గృహిణి-యజమానురాలు ఏలాంటిది? భర్తకు, పిల్లలకు తాను చేసే సేవకు మాత్రమే. అంటే కర్తవ్యానికి దాసురాలు. అలాగే యజమాని ఎలాంటివాడు ? భార్యకు, పిల్లలకు తాను చేసే సేవకు సేవకుడు.ప్రతివాడు గూడ మొత్తానికి సేవకుడు.ఈ స్థితిలో వ్యక్తిగత స్థాయిలో ప్రభువుగా ఉండగలుగుతాడు. అలాగాకుండా, కొన్ని హక్కులు మనం భావించినపుడు - వీళ్ళను మనం రక్షించాలి, పోషించాలి- అందుకోసమే మనమున్నాం, అందుచేత వీళ్ళు మనకొఱకే ఉద్దేశింపబడియున్నారు- మనకోసం వీళ్ళు జీవించాలి అనే పశుప్రవృత్తి ప్రాప్తిస్తుంది. ఈ పశుత్వం తొలగిపోతే తప్ప, యోగాభ్యాసానికి, భక్తిసాధనకు ఈ జన్మలో ఇంక అర్హత లేదని తెలుసుకోవాలి.*                             🪶 *మాస్టర్ ఇ.కె.*
2032Loading...
14
Media files
1860Loading...
15
*జిజ్ఞాసువుల ప్రశ్నలకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి సమాధానాలు :* *ప్ర :* *ఖడ్గమాలాస్తోత్రానికి ఆ పేరు ఎందుకు వచ్చింది* ? *మరి 'అస్య శ్రీ శుద్ధ శక్తిమాలా మంత్రస్య' అని ఎందుకన్నారు* ? *ఖడ్గమాలలోని ఆ పేర్లన్నీ ఎవరివి* ? *జ:* ఖడ్గమాల శ్రీవిద్యకు చెందినది. తొలుత లలితా త్రిపురసుందరి నామం చెప్పబడి, అటు పై న్యాసాంగ దేవతలు, తిథినిత్యా దేవతలు, దివ్యౌఘ సిద్ధాఘ మానవౌఘ గురు మండల నామాలు; ఆ తరువాత క్రమంగా శ్రీచక్ర నవావరణ దేవతల నామాలు, నవచక్రేశ్వరీ నామాలు, చివరగా దేవీ విశేషణాలు చెప్పబడ్డాయి. ఒకే అక్షరం గల మంత్రాలు 'పిండ' మంత్రాలనీ, రెండక్షరాలు కలవి 'కర్తరి' అనీ, మూడు నుండి తొమ్మిది అక్షరాలు కలవి 'విధి బీజముల'నీ, 10 నుండి 20 అక్షరాల వరకు కలవి మంత్రములనీ, 21 నుండి ఎన్ని అక్షరాలున్నా మాలామంత్రములనీ వ్యవహరింపబడుతాయి. ఆ కారణం చేతనే ఇది మాలా మంత్రం! 15 అక్షరాల పంచదశీ (శ్రీ)విద్యను ఆధారం చేసుకుని 15 విధాల మాలా మంత్రాలు ఏర్పడ్డాయి. అవి: శుద్ధ శక్తిమాల, నమోంత శక్తిమాల, స్వాహాంత శక్తిమాల. తర్పణాంత శక్తిమాల, జయాంత శక్తిమాల, శుద్ధ శివ సంబుద్ధ్యంతమాల, నమోంత శివమాల, స్వాహాంత శివమాల, తర్పణాంత శివమాల, జయాంత శివమాల, శుద్ధమిధున మాల, నమోంత మిధునమాల, స్వాహాంత మిధునమాల, తర్పణాంత మిధునమాల, జయాంత మిధునమాల. ఇందులో ప్రసిద్ధంగా లభిస్తున్నది 'శుద్ధశక్తిమాల'. దీనిని 'ప్రకృతిమాల' అని కూడా అంటారు. ఈ మాలా మంత్రాలను వివిధ ప్రక్రియలతో ఉపాసించి కొన్ని సిద్ధులను పొందవచ్చు. పై చెప్పిన 15 విధాల మాలామంత్రాలకు 15 సిద్ధులున్నాయి. అందులో మొదటిది 'ఖడ్గసిద్ధి'. తరువాత చెప్పబడిన పదునాలుగు : పాదుకాయుగ్మ సిద్ధి, అంజన సిద్ధి, బిల సిద్ధి, వాక్సిద్ధి, దేహ సిద్ధి, లోహ సిద్ధి, అణిమాద్యష్ట సిద్ధి, వశీ కరణ సిద్ధి, ఆకర్షణ సిద్ధి, సమ్మోహన సిద్ధి, స్తంభన సిద్ధి, చతుర్వర్గ సిద్ధి, ఐహికాముష్మిక సిద్ధి, భోగ మోక్ష సిద్ధి. ఒక్కొక్క సిద్ధి కోసం ఈ మాలా మంత్రాలను వివిధ (15) విధాల వినియోగిస్తారు. 'ఖడ్గాది' 15 సిద్ధుల నిచ్చే మాలా మంత్రము కనుక ఇది 'ఖడ్గమాల' అని లోకంలో ప్రసిద్ధి పొందింది. *'తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్త స్థితేనవై* । *అష్టాదశ మహాద్వీప సమ్రాద్భక్తా* ( *సమ్రాడ్భోక్తా* ) *భవిష్యతి* ll ' - అని ప్రస్తుత లభ్య గ్రంథాలలో ఉంది. కానీ ఈ శుద్ధశక్తిమాలను 14వ దైన ఐహికాముష్మిక సిద్ధి కోసం వినియోగించడమే మంచిదని విజ్ఞుల అభిప్రాయం. దానికి సంబంధించిన శ్లోకం : *అలౌకికం లౌకికం చేత్యానంద ద్వితయం సదా* | *సులభం పరమేశాని త్వత్పాదౌ భజతాం నృణామ్* | శుద్ధశక్తిమాలను నిష్కామంతో జపించితే సర్వ (15) సిద్ధులూ లభిస్తాయని శాస్త్ర వచనం. సర్వసిద్ధులలో మొదటిది 'ఖడ్గసిద్ధి' కనుక - దానిని మొదలుకొని మిగిలిన సిద్దులను ఇచ్చే శుద్ధశక్తి మాలామంత్రాన్ని 'ఖడ్గమాల'గా వ్యవహరిస్తున్నాం. *('ఋషిపీఠం' ప్రచురణ 'సమాధానమ్' పుస్తకం నుండి సేకరణ)*
2484Loading...
16
Media files
2240Loading...
17
Media files
2840Loading...
18
Media files
3070Loading...
19
🌸 *శ్రీమద్భాగవతము* 🌸 🌹 *సమన్వయము*🌹 🌺 సంసార జీవుల బంధములను తొలగించునను కీర్తి దిక్కులలో వ్యాపించుచుండగా, భూమిపై సంచరించుచున్న శ్రీకృష్ణుడు యథాప్రకారము విహరించుచున్నాడా? అని విదురుడు ఉద్ధవుని ప్రశ్నించెను. విదురుడు ఇట్లు ప్రశ్నింపగా, శ్రీకృష్ణుని పాదపద్మములతో తనకు కలిగిన ఎడబాటు వలన, ఉద్ధవునకు పట్టరాని దుఃఖము వచ్చెను. నోట మాటరాలేదు. హృదయమున మంట పుట్టెను. ఆరిపోయిన పెదవులను తడుపుచు దుఃఖమున నిండిపోయెను. (శ్రీకృష్ణుని నిర్యాణము ఎరిగిన వాడు ఉద్ధవుడు. విదురుడు ఇంకనూ ఎరుగడు. కనుక కృష్ణుని గూర్చి విదురుడు కుశల ప్రశ్నము చేయగా ఉద్ధవునకు దుఃఖము కలిగెను.) ఈ వృత్తాంతము చెప్పి శుకయోగి పరీక్షిత్తు వంక చూచి ఇట్లనెను........✍ *మాస్టర్ ఇ.కె.* (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము.
2670Loading...
20
*జిజ్ఞాసువుల ప్రశ్నలకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి సమాధానాలు :* *ప్ర :* *'విశ్వామిత్ర' అనే మాటను 'విశ్వానికి అమిత్రుడు'(విశ్వ+ అమిత్రుడు) అనే అర్థం వస్తుందేమో ?* *ఈ నామానికి అసలైన అర్థం ఏమిటి ?* *జ :* ఈ సవర్ణదీర్ఘ సంధి ఇక్కడ వర్తించదు. *"మిత్రే చర్షౌ ఇతి విశ్వశబ్దస్య దీర్ఘః. తస్యాం విశ్వం మిత్రమాసీద్యదిదం కించ తస్మాద్విశ్వామిత్ర ఇత్యాచక్షతే”* అని శాస్త్ర నిర్వచనం. ఎవనికి విశ్వం మిత్రమో(స్నేహభావంతో కూడినది), ఎవరు విశ్వానికి మిత్రుడో అతడు - విశ్వామిత్రుడు. *విశ్వే దేవాశ్చ మే మిత్రం మిత్రమస్మి గవాం తథా|* *విశ్వామిత్ర ఇతి ఖ్యాతం యాతుధాన నిబోధమాన్ ll* -"విశ్వేదేవతలు / సమస్తదేవతలు నాకు మిత్రులు. గోవు (వేదమంత్రములు, ఆవులు, ఇంద్రియములు)లకు నేను మిత్రుడను. అందువలన నన్ను 'విశ్వామిత్రుడు' అంటారు". - అని విశ్వామిత్రుడే స్వయంగా చెప్పిన నిర్వచనం (మహాభారతం). *('ఋషిపీఠం' సంచిక నుండి సేకరణ)*
2391Loading...
21
హనుమాన్ జయంతి हनुमान जयंती
2430Loading...
22
Media files
2720Loading...
23
గౌహతిలో తిరుపతి పరమాచార్య స్వామివారి అనుగ్రహ విశేషం వల్ల గౌహతిలో ఒక బాలాజీ మందిరం, కంటి ఆసుపత్రి ఏర్పాటు అయ్యాయి. ఈ పనికోసం భూమి సేకరించే కార్యక్రమం 1991లో మొదలయ్యింది. 1992లో అప్పటి అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హితేశ్వర్ సైకియా కాంచీపురంలో పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడు, స్వామివారి చేతుల మీదుగా తీసుకున్న రుద్రాక్ష మాల, పూల కిరీటం అతడిని ULFA టెర్రరిజం నుండి రక్షించింది. దాంతోపాటు ప్రత్యేకంగా ఒక తట్ట నిండుగా కలకండను ఇచ్చి అతనితో పాటుగా వచ్చిన బ్లాక్ క్యాట్ భద్రతా దళాలకు పంచమని చెప్పారు. సైకియా అస్సాం తిరిగివెళ్ళిన తరువాత పద్దెనిమిది ఎకరాల విస్తారమైన సమతల భూమిని ప్రభుత్వం తరుపున పరమాచార్య స్వామికి సమర్పించారు. దాంతోపాటు, దేవాలయ నిర్మాణం కోసం పడి లక్షల రూపాయల చెక్కును కూడా ఇచ్చారు. ఈ ధర్మం మూలంగా గౌహతిలో దక్షిణ భారత శిల్ప శాస్త్ర అనుగుణంగా ‘పూర్వ తిరుపతి శ్రీ బాలాజీ మందిరం’ ఏర్పాటు అయ్యింది. ఈ మందిరం ఇక్కడి ప్రజలకు ఎంతోదూరం ప్రయాణించి వెళ్ళవలసిన ఆంధ్రదేశంలోని తిరుపతి బాలాజీ దర్శనాన్ని కలిగిస్తోంది. శ్రీ శంకరదేవ నేత్రాలయ ఆసుపత్రి పరమాచార్య స్వామివారు సిద్ధి పొందడానికి అయిదు రోజుల ముందు అంటే జనవరి 3, 1994న చెన్నై శంకర నేత్రాలయ స్థాపకులు, అధ్యక్షులు అయిన డా. యస్.యస్ బద్రినాథ్ గారి ప్రోద్బలంతో ఈశాన్య, ఉత్తర భారతీయ టీ ఎస్టేట్ సంస్థల ఆర్థిక సహాయంతో మరియు కొందరు ధనికుల విరాళాలతో, కలకత్తాలో ‘శ్రీ కంచి శంకర హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్’ స్థాపించబడింది. ఈ ట్రస్టు ప్రారంభించిన రోజునే మొత్తం ముప్పై లక్షల రూపాయల ధనం విరాళంగా వచ్చింది. తరువాత శతాబ్ది వార్షికోత్సవం (11-11-1994) నాడు గౌహతిలోని బెల్టోల(బిల్వస్థల) అన్న ప్రాంతంలో మూడు అంతస్థుల భవనాన్ని లీజుకు తీసుకోవాలని చర్చించుకుంటుండగా, ఆ భావన యజమాని దాన్ని ఆసుపత్రి కోసం విరాళంగా ప్రకటించాడు. నాకు తెలిసి ఇది పరమాచార్య స్వామివారు చూపిన, ఇప్పటికీ చూపుతున్న అద్భుతాలలో ఒకటి. కేవలం పరమాచార్య స్వామి వారి అనుగ్రహ విశేషం వల్లే ఆ ఆసుపత్రి దినదినాభివృద్ధి చెందినది అన్న విషయం అతిశయోక్తి కాదు. ఆది శంకర పరంపరలో వచ్చిన కంచి శంకరాచార్యులు స్థాపించిన కంటి ఆసుపత్రిని ‘శంకర మెడికల్ సెంటర్’ అన్న పేరు మీద కాకుండా, పదిహేనవ శతాబ్దంలో అస్సాంలో నివసించిన కృష్ణ భక్తుడు శ్రీ శంకరదేవ పేరు మీద నడపడానికి కారణం పరమచార్యులే. ఈ విషయం ఇప్పటికి చాలామందికి తెలియదు. --- ఆర్. చిదంబరేసన్, చెన్నై - 40. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
2920Loading...
24
Media files
2300Loading...
25
Punyashlok Ahilyabai Holkar Jayanthi
2370Loading...
26
🌼 *మాస్టర్ ఇ.కె. గారి సందేశము*🌼 🥀 *మే కాల్ డే*🥀 🌻 తమలోనికి అవతరించిన ప్రణాళికను అనుసరించి మాస్టరు సి.వి.వి. గారు ఒక పుణ్యదినమున సోదర మానవుల వ్యక్తిగత కుండలినీ శక్తిని ఉద్బోధించి, సమాహార శక్తిగా (Group Kundalini) రగుల్కొలిపి, భూగ్రహము యొక్క కుండలినీ శక్తితో సమన్వయపరచుటకు పూనుకొనిరి. ఆ దినము నుండి తన అనుయాయులు మరికొందరి శరీరములను ప్రసార సాధనములు (Mediums)గా అంగీకరించ తలచిరి. ఈ ప్రసారమును అనుసంధానము చేయుటకు వారికి సి.వి.వి. అను యోగ నామమును ఉపదేశమిచ్చిరి. భూమి అయస్కాంత శక్తి పనిచేయుచున్న మేరకు ఆకాశ భాగములోని శబ్దమయ తరంగములను హెచ్చరించి ఉద్బోధ చేసి కార్యక్రమమును ఏర్పరచుటకు తాళము చెవుల వంటి సంకేత శబ్దములుగా ఈ అక్షరములుగా వారు నిర్ణయించిరి‌.ఆ పుణ్యదినము 1910 వ సంవత్సరము మే 29వ తేదీగా నిర్ణయించి ఉపదేశించిరి. నాటి నుండి నేటి వరకు వారి అనుయయులు ఆ పర్వదినమును *'మే కాల్ డే'* (May Call Day) అందురు. అప్పటి నుండి 'మీడియమ్స్' (Mediums) అని పిలువబడు ప్రత్యక్ష శిష్యులందరు మాస్టరుగారి సాన్నిధ్యమున సాధన చేయుచు సోదర జీవులను అనుసంధానము చేయుచున్నారు. ఇందరి సహకారమున తమ సంకల్పమయ సూక్ష్మ శరీరమును క్రమముగా వ్యాపింపజేసి, మాస్టరుగారు ఈ భూమిపై దానిని అపరిమిత కాలము వరకు స్థిరపరచి ఉన్నారు.........✍ *మాస్టర్ ఇ.కె* 🌻
3170Loading...
27
*నా ప్రజ్ఞ వలన,నేను పురాణేతిహాసాలు చెప్పుచున్నానని ఎవరయినా అంటే, పిచ్చివాడని అర్థం. స్విచ్ వేసినపుడు లైటు వెలిగితే ఆ స్విచ్ తన చేతిలో ఉన్నపుడు స్విచ్ మాత్రమే తన చేతిలో ఉందనీ, ఎలక్ట్రిక్ కరెంటు తన చేతిలో లేదని గుర్తుంచుకోవాలి. ఉంటే షాక్ కొట్టి చచ్చిపోతాము. ఒక మంచి పని మన ద్వారా జరుగుచున్నపుడు, మన వలన జరుగుతుందని అహంకారపడినవారికి, కొమ్ములు, గిట్టలు మాత్రమే మిగులుతాయి.భారతం గాని, రామాయణం గాని, భాగవతం గాని ఆ గ్రంథము తెరచి, దానిపై ఆదరంతో ఒక చోట పదిమంది చేరి శ్రద్ధగా కూర్చుని వినటం చేస్తే, అది స్విచ్ వేయటం లాంటిది. అప్పుడు చెప్పటం చెప్పేవాడిది గాదు, వినటం వినేవాడిదీ కాదు. వీరిద్దరిలో అంతర్యామిగా ఉన్న ఒకే ఒక పరమాత్మ పనిచేయటం మొదలుపెడతాడు. అప్పుడు, దానిమీద, అనగా ఈ సత్యం మీద, ఎవరికైనా విశ్వానం ఉంటే, ఈ గ్రంథంలోని విషయం బయటపడుతుంది. లేకపోతే, టీకా తాత్పర్యాలు, వ్యాఖ్యానం, పాండిత్యం మున్నగు అక్కరలేని వ్యర్థములైన, బంధములైన చిల్లర విషయాలు మాత్రమే మిగులుతాయి. ఈయనకు చాలా పాండిత్యం ఉందండీ, చాలా విషయాలు తెలుసునండీ!, శబ్దార్థాలు బాగా తెలుసు, ఈయన బాగా ధారాళంగా వాగ్ధాటితో చెప్తార్లెండి, ఇలాంటి పనికిమాలిన విషయాలు మిగులుతాయి. మీ ఇంటికి కరెంటు తీసివేసి, మీ యింటికి కరెంటు ఈయము అన్న తర్వాత అందులో ఉన్న స్విచ్లు, హెూల్డర్లు, బల్బులు, వైర్లు, ఫాన్లు ఎంతవరకు పనికివస్తాయో పాండిత్యం అంతే పనికివస్తుంది. ఎలక్ట్రిక్ కరెంటు మీ ఇంటికి కట్ ఆఫ్ చేశామన్నారట. అపుడు మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ సామాన్లు ఎంత పనికివస్తాయో, పాండిత్యమనేది అంతే పనికొస్తుంది. ఈ ఋషుల వాక్కులలోని మహా తేజస్సు మనవైపు ప్రసరిస్తుంటే, ఆ చెప్పిన విషయాన్ని చూచి, తెలియనివాళ్ళు, పిచ్చివాళ్ళు, దాన్ని పాండిత్యం అనుకోవచ్చు. ఇదీ గ్రంథాల విషయం. ఇది చెప్పానని నొచ్చుకోవచ్చు. కానీ ఇంతే సత్యం. ఎవరు చెప్పుకొన్నా ఇంతే,ఎవరు విన్నా ఇంతే, కాని చెప్పేవారిలోను, వినేవారిలోను గల అంతర్యామి వ్యక్తమవడం కోసం, ఉద్బుద్ధమవడం కోసం ఆ అంతర్యామికి సంబంధించి ఒకానొక అర్చనా విశేషము, ఆరాధనా విశేషమే గాని, ఒకరు చెప్పటం, ఒకరు వినటం అనేది ఏనాడూ లేదు.                                           🪶 మాస్టర్ ఇ.కె.*
4420Loading...
28
Media files
3990Loading...
29
రోహిణి కార్తి : 25-5-2024 నుండి 7-6-2024 వరకు పాదజల ఎలుకవాహనం 28వ తేదీనుండి 2వ తేదీవరకు రుతుపవనాలు కేరళకు తాకును. వాయుసహిత వర్షములుండును. వాతావరణము మారును. ప్రజలకు వ్యాధులు సోకును.
4390Loading...
30
Sri Sri Sri Maha Periyava Jayanthi Mahotsavam
4910Loading...
31
Media files
5171Loading...
32
నారద జయంతి नारद जयंती
4310Loading...
33
Media files
4240Loading...
34
Annamacharya Jayanti
4340Loading...
35
Media files
4460Loading...
36
అద్భుతరామాయణము లోని సీతారాముల జనన కథ: అంబరీషునకు శ్రీమతి అనే అద్భుత సౌందర్యవతియైన కుమార్తె ఉంది. ఒక రోజు పర్వత, నారద మహర్షులు అంబరీషుని ఇంటికి వచ్చారు. అపుడిద్దరు ఆమెను చూచి మోహపరవశులయ్యారు. అంబరీషుని ఆమెను తమలో నొకరికిచ్చి వివాహం చేయమని కోరారు. అంబరీషుడు మరునాడు వారినిద్దరిని తమ యింటికి రమ్మని-అపుడామె ఎవరిని వరిస్తే వారికిచ్చి పెండ్లిచేస్తానన్నాడు. పర్వత-నారదులకిద్దరికి ఒకరిపై ఒకరికి అనుమానం వచ్చింది. శ్రీమతి పర్వతునే వరిస్తుందని నారదుడు-నారదునే వరిస్తుందని పర్వతుడు అనుకోసాగారు. ఇదంతా కాదనుకొని నారదుడు వైకుంఠానికి పోయి విష్ణువుతో జరిగిన సంగతి చెప్పి రేపటి స్వయంవరంలో పర్వతుని ముఖం కోతి ముఖంగా కనిపించేటట్లు చేయమని కోరాడు. నారాయణుడు సరేనని అన్నాడు. ఇది తెలిసి పర్వతుడు కూడా వైకుంఠానికి పోయి నారదుని ముఖం భల్లూకముఖం వలె కనిపించాలని కోరుకొని విష్ణువు చేత అవుననిపించుకున్నాడు. మరునాడు మునులిద్దరు అంబరీషుని ఇంటికి వెళ్లారు. శ్రీమతి పూలమాలతీసుకొని రాగా వారిద్దరు ఒకరు కోతిముఖం తోను, మరియొకరు ఎలుగు ముఖంతోను కనిపించగా ఆమె భయపడింది. ఇంతలో వారిద్దరి మధ్యలో ఒక సుందరపురుషుడామెకు కనిపించాడు. కాని మునులిద్దరికి ఆపురుషుడెవరో కనిపించ లేదు. అతడు పదునారేండ్ల ప్రాయంవాడని- సర్వాభరణాలను ధరించియున్నాడని-దీర్ఘబాహుడని-విశాలమైన వక్షస్థలం కలవాడని-పద్మముఖుడు, పద్మలోచనుడని- రెండు చేతులు కలవాడని చెప్పి అతనినే వరిస్తున్నానని అంది. (''అనయో: మధ్యే తస్త్వేకం వరం షోడశవార్షికమ్/ సర్వాభరణ సంయుక్తమతసీ పుష్య సన్నిభమ్/ దీర్ఘబాహుం విశాలాక్షం తుంగోర: స్థలముత్తమమ్/ చామీకరాభం కరణపటయుగ్మక శోభితమ్/ విభక్త త్రివళీ యుక్తనాభిం వ్యక్త కృశోదరమ్/ హిరణ్యభరణోపేతం సురంగక నఖం శుభమ్/పద్మాకార కరం త్వేనం పద్మాస్యం పద్మలోచనమ్/ శ్యామాంఘ్రిం శ్యామ హృదయం శ్యామనాభం శ్రియావృతమ్/దంత పంక్తిభిరత్యర్థం కుందకుట్మల సన్నిభమ్/ హసంతం మాం సమాలోక్య దక్షిణంచ ప్రసార్య వై/ప్రాణిం స్థిత మిమం ఛత్రం పశ్యామి శుభ మూర్థజమ్ '' (4. వసర్గ 10-14 శ్లో.) వారామె మాటలు విని ఇదేదో విష్ణుమాయగా ఉందన్నారు. అంబరీషునకు చికాకు వచ్చి మునులతో మీరు ఋజు మార్గంలో నడవటం లేదని అంటూ- కూతుతో నీకిష్టమైన వానిని వరింపుమని ఆనతిచ్చాడు. అపుడామె మునుల మధ్యనున్న ఆ పురుషుని మెడలో దండ వేసింది. వేసిన వెంటనే అదృశ్యమైపోయింది. విష్ణువునే పెండ్లాలనే ఆమె చిరకాల వాంఛ నెరవేరింది. ఇదేదో తేల్చుకోవటానికి పర్వత నారదులిద్దరు వైకుంఠానికి వెళ్లారు. వారి రాకను గమనించిన విష్ణువు శ్రీమతి చాటునకు వెళ్లమన్నాడు. అపుడు నారదుడు నారాయణునితో -''ఇట్లాంటి మోసం నీకు తగింది కాదని. మేము వరించిన కన్యను నీవపహరించి తెచ్చా''వని అన్నాడు. అపుడు విష్ణువు నారదునితో ''నీవు కామాంధుని వలె మాట్లాడుతున్నావు గాని భక్తుని వలె మాట్లాడటం లేదని –నాకు రెండు చేతులున్నాయా? నాల్గు చేతులున్నాయా? నీవు గమనించటం లేదని చెప్పి ఆమెను నేను తీసుకొని రాలే''దని చెప్పి వారిని పంపించాడు. వారిద్దరు అంబరీషుని వద్దకు వెళ్లి 'నీవు నీకూతును మాకివ్వటానికి ఇష్టంలేకపోతే ఇవ్వనని చెప్పవచ్చుగా! నీవు మమ్ములను ఆశ పెట్టి మోసం చేసావు. గాడాంధకారం నిన్నావహిస్తుం'దని శపించారు. వెంటనే ఆకాశం నుండి అంబరీషుని చిమ్మచీకటి క్రమ్ముకొన్నది. ఇందుకు ప్రతిగా విష్ణువు తన చక్రాన్ని పంపించాడు. విష్ణుచక్రం మునులను తరమటం మొదలు పెట్టింది. వారు లోకాలోకాలకు పరుగెత్తసాగారు. ఎక్కడా వారికి రక్షణ దొరక లేదు. చివరకు వారిద్దరు వచ్చి నారాయణుని కాళ్లపై పడ్డారు. అపుడు విష్ణువు వారితో 'అంబరీషుడు నాభక్తుడు. ఆతనిని బాధిస్తే నేను చూడగలనా' యంటూ వారిని రక్షించాడు. అపుడు వారిద్దరు ''దేవా! ఈ మాయంతా నీదే. మేము మోహించిన కన్యను నీవు మోహించి మమ్ములనిట్లా బాధపెట్టావు. నిష్కారణంగా మాచేత అంబరీషుని శపింపజేయించావు. నీవా అంబరీషుని వంశం లోనే దశరథునకు పుత్రునిగా జన్మించు. నీవు శ్రీమతికేరూపంతో మతి విభ్రమాన్ని కలిగించావో ఆ రూపాన్నే ధరించు. ఈ కన్యక భూసుతయై జనకమహారాజుచే పెంచబడుతుంది. మేము కోరిన కన్యను మాయచే నీవు రాక్షసుని వలె హరించావు కాబట్టి నీ భార్యను కూడా రాక్షసుడు హరిస్తాడు. మాకు వియోగతాపం కలిగించావు కాబట్టి నీవు కూడా వియోగ తాపంతో అడవుల్లో రోదిస్తావు'' అంటూ శపించారు. భగవానుడు వారిని కరుణించి చక్రాన్ని వారించాడు. పర్వత నారదులిద్దరు తాము కామపారవస్యంతో తప్పు చేసామని బాధపడి హిమాలయాలకు తపస్సుకై వెళ్లారు. తదుపరి శ్రీమతి సీతగాను-విష్ణువు శ్రీరాముని గాను జనించారు. (అద్భుతరామాయణం-వాల్మీకి-3, 4-సర్గలు)
4131Loading...
37
🌸 *శ్రీమద్భాగవతము* 🌸 🌹 *సమన్వయము*🌹 🌺 అభిప్రాయమునకును, ఉచ్చారణమునకును నడుమ పుట్టిన చుట్టములే శబ్దార్థములు, టీకా తాత్పర్యములు, వాచ్యర్థము, గౌణార్థము, వ్యంగ్యార్థము మొదలగు దేవతలు. వీరందరికిని గమ్యము వేదార్థము‌. అనగా తనను తాను తెలుసుకొనుట, తనకు కావలసినది పరిపూర్తి అగుట. దీని కొరకై భగవంతుడు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనువానిని పుట్టించుచున్నాడు. వానిని అతడు స్వయముగా పుట్టించుటకు తీరికలేదు కనుక వానిని పుట్టించునట్టి అధిదైవతలను తన ప్రతిరూపములుగా సృష్టిలో కల్పించి నియమించెను. వారు ఈ విధముగా ఉన్నారు. 1.చిత్తమునకు వాసుదేవుడు అధి దేవత. 2.అహంకారమునకు సంకర్షణుడు అధి దేవత 3.బుద్ధికి ప్రద్యుమ్నుడు అధి దేవత. 4.మనస్సునకు అనిరుద్ధుడు అధి దేవత. భగవంతుడు భూమిపైన ఒక మానవుడుగా దేహము ధరించి, దిగివచ్చునపుడు వీరందరును వాని పరివారముగా వివిధ దేహములు ధరించి దిగివత్తురు. అట్లు వచ్చినవారిలో అనిరుద్ధుడే యాదవులలోన అనిరుద్ధుడు........✍ *మాస్టర్ ఇ.కె.* (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-57
3070Loading...
38
Media files
3481Loading...
39
ఛిన్నమస్తా జయంతి छिन्नमस्ता जयंती
3881Loading...
40
నృసింహ జయంతి नरसिंह जयंती
3781Loading...
మృగశిర కార్తి : 8-6-2024 నుండి 21-6-2024 వరకు పాదజల నక్కవాహనం వాతావరణం మేఘావృతమగును. 9-10-11 తేదీలలో అక్కడక్కడ తొలకరి వర్షములు పడును. ఈదురుగాలులు వీచును. ఎండలు తగ్గుముఖం పట్టును. కొన్నిచోట్ల విత్తనములు మొలకెత్తును
نمایش همه...
🌸 *శ్రీమద్భాగవతము* 🌸 🌹  *సమన్వయము*🌹 🌺 కృష్ణుని సమకాలికులలో కొందరు గొప్పకులమున పుట్టితిమని గర్వపడువారుండిరి. విద్యావంతులమని కొందరు, ధనవంతులమని కొందరు గర్వపడుచుండిరి.  వారికి మదముచే కన్నులు పొరలు గ్రమ్మి కృష్ణుడు కనిపింపలేదు. వారు కృష్ణుని సామాన్యునిగా కూడ లెక్కపెట్టలేదు. శిశుపాలుడు మొదలగు రాజులు అట్టివారు. వారు కృష్ణుని గూర్చి చేసిన నిందలను, దుర్భాషలను తలచుకొనినపుడెల్ల నా మనస్సు తపించిపోవును. తనివితీరక తనను దర్శించువారికి, బుద్ధియోగమున తనను తెలుసికొనగోరిన వారికి, తపసులను గూర్చి చేయుచున్నవారికి, సమస్త సృష్టిలో తనను దర్శించుట అభ్యసించు భాగవతులకు మాత్రము తన అఖండ జ్యోతిస్స్వరూపమును చూపి, వారి దుఃఖములను హరించి, శాంతస్వరూపుడై, దర్శనమిచ్చి శ్రీకృష్ణుడు వచ్చినపని ముగించుకొని, దేహము చాలించి, మాయమయ్యెను........✍ *మాస్టర్ ఇ.కె.*  (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము.
نمایش همه...
🌸 *శ్రీమద్భాగవతము* 🌸 🌹  *సమన్వయము*🌹 🌺 శ్రీకృష్ణుడు మానవుల వికాసమునకు ‌కొలబద్ధ‌ వంటివాడు. ఎవడు తనయందు ఎంత వికాసము చూపునో, వానికి అంతగా కనిపించువాడు. తనకే ఆశ్చర్యము గొల్పు తన యోగ మాయాశక్తిని తనచేత నిలిపి ఎల్లరకును ప్రదర్శనము చేసెను‌. అంతటి సౌభాగ్యవంతమైన రూపము ఇంకొకటి లేదు‌ అతడు భూషణములను ధరించినచో అతని వలన వానికి అందము కలిగినది. ఆయా సందర్భములలో అతడు చూపిన వివేకము మిగిలినవారికి ఆదర్శము. అతడున్న చోట సకల శుభములు ఉండెడివి. అతనితో సహవాసము చేయువారికి సత్యప్రవర్తనము తప్పనిసరియై ఉండెడిది. పరిపూర్ణమైన తన రూపముతో ధర్మజుని రాజసూయమున అతడు అటు ఇటు తిరుగుచు ఆయా సందర్భములకు తగినట్లు ప్రవర్తించుచుండగా చూచి ఎల్లరను నిశ్చేష్టులై వర్ణించుకొనిరి.........✍ *మాస్టర్ ఇ.కె.*  (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము.
نمایش همه...
శుక మహర్షి జయంతి शुक महर्षि जयंती
نمایش همه...
శని జయంతి Shani Jayanthi
نمایش همه...