🏆 DAILY JOB UPDATE TELUGU 🏆
🎯Daily Job Update Telugu🎯 ▒☞📃 డైలీ జాబ్ నోటిఫికేషన్స్. ▒☞📔 జికే & కరెంట్ అఫైర్స్. ▒☞📚 మేగజైన్స్ & బుక్స్. ▒☞✒ విద్యా & ఉద్యోగా సమాచారం.
Mostrar más3 500
Suscriptores
Sin datos24 horas
Sin datos7 días
Sin datos30 días
- Suscriptores
- Cobertura postal
- ER - ratio de compromiso
Carga de datos en curso...
Tasa de crecimiento de suscriptores
Carga de datos en curso...
🌳🌲®️🅰️〽️💲🌲🌳
*🌼2వ తేదీ లోగా డైట్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలి*
❇️2019-21 బ్యాచ్ కు
చెందిన డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్
మూడో సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన
పరీక్ష ఫీజులను జూన్ 2వ తేదీలోగా చెల్లించాలి
✳️ఎలాంటి అపరాధ రుసుం లేకుండా జూన్ 2లోగా, రూ.50 ఆలస్య అపరాధ రుసుంతో జూన్ 4వ తేదీ వరకు చెల్లించేందుకు వెసులుబాటు ఉంది
✳️పరీక్ష ఫీజులను కళాశాలల ప్రిన్సిపాల్స్, పేమెంట్ గేట్ వే ద్వారా మాత్రమే చెల్లింపు చేయాల్సి ఉంటుంది
.
*🎯వెబ్ లింక్ మే 19 నుంచి అందుబాటులోకి వస్తుంది*
*🥀జూలై 12 నుంచి పరీక్షలు..*
❇️ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 2019-21 బ్యాచ్ కు చెందిన డైట్ మూడో సెమిస్టర్ పరీక్షలు జూలై 12వ తేదీన మొదలు కానున్నాయి. 17వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.
🎯ప్రతి రోజు ఉదయం 9 నుంచి 11.30 వరకు జరుగుతాయి.
🍀🥀🍀🥀🍀🥀
*🌼సీఎస్ఐఆర్ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం*
*ఏలూరు*
*✳️ఇంటర్మీడియట్ వరకు చదివే బాల బాలికలకు భార త ప్రభుత్వ సీఎస్ఐఆర్ ఇన్నోవేషన్ అవార్డు ఫర్ స్కూల్ చిల్డ్రన్ పురస్కారాలను అందజేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు డీఈవో సీవీ రేణుక తెలిపారు.*
*❇️బయోటెక్నాలజీ/ బయాలజి, కెమికల్, ఎలకా్ట్రనిక్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ పురస్కారాలు ఉంటాయని వివరించారు. అవార్డు గ్రహీతలకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తారన్నారు.*
*✳️పూర్తి వివరాలు www.csir.res.in వెబ్సైట్ నుంచి పొందవచ్చునన్నారు.*
*✳️దరఖాస్తులను అందజేసేందుకు ఈ నెల 31వ తేదీ తుది గడువు అని వివరించారు.*
🍀🥀🍀🥀🍀🥀
*🌼పాఠశాలల పునఃప్రారంభంపై పరిశీలన*
» *అనుకూల వాతావరణం వస్తే 10వ తరగతి పరీక్షలు*
» *స్కూల్ కాంప్లెక్స్ కు జగనన్న విద్యా కానుక కిట్లు*
» *పాఠశాలల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు*
🅰🅿️
*📚✍పాఠశాలల*
*పునఃప్రారంభంపై పరిశీలన✍📚*
*♦అనుకూల వాతావరణం వస్తే 10వ తరగతి పరీక్షలు*
*♦స్కూల్ కాంప్లెక్స్లుకు జగనన్న విద్యా కానుక కిట్లు*
*♦పాఠశాలల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు*
*🌻మచిలీపట్నం టౌన్, మే 11:* కరోనా సెకండ్ వేవ్ తగ్గు ముఖం పట్టిన తరువాత జూలై 1 నుంచి పాఠశాలల పునఃప్రారం బానికి యోచిస్తున్నామని పాఠశా లల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు అన్నారు. మంగళ వారం ఆర్జేడీ నరసింహారావుతో కలసి మచిలీపట్నం పాతరామన్నపేట మునిసిపల్ స్కూల్, రాంజీ ప్రభుత్వం హైస్కూల్ను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలల్లో నాడు- నేడు కింద జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యేనాటికి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు పుస్తకాలు, బూట్లు, టైలు, యూనిఫాం ఇచ్చే కార్యక్రమం ముమ్మరంగా కొన సాగుతోందన్నారు. స్కూల్ కాంప్లెక్స్లకు జగనన్న విద్యాకానుక కిట్లు ఇప్పటికే చేరాయన్నారు. విద్యాసంవత్సరంలో విద్యా కార్యక్రమాలు సంతృప్తికరంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. నాడు నేడు కార్యక్ర మాల అమలువల్ల పాఠశాలలకు భౌతిక వనరులు ఏర్పడ్డాయన్నారు. 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అయితే కొవిడ్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు జరుపుతామన్నారు. ఇప్పటికే పశ్చిమగోదావరి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పర్యటించామన్నారు. కృష్ణాజిల్లాలో నిర్వహిస్తున్న నాడు- నేడు కార్య క్రమాల అమలును జిల్లా విద్యాశాఖాధికారి తహెరా సుల్తానా, ఇతర అధికా రులతో చర్చించామన్నారు. కొవిడ్ వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ విద్యాశాఖాధికారులు పరిపాలనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం డీఈవో కార్యాలయంలో చినవీరభద్రుడుకు డీఈవో తాహెరా సుల్తానా, సూపరింటెండెంట్లు పూలదండలతో స్వాగతం పలికారు. డీఈవో కార్యాలయంలో ఫైళ్ల పెండింగ్పై అధికారులు, సూపరింటెండెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
#AP_NEWS
#CSE_AP