APTEACHERS APEMPLOYEES
APTEACHERS Website Official Telegram Channel లేటెస్ట్ విద్యా ఉద్యోగ సమాచార చానెల్ Latest Educational AP Employees, AP Teachers Information Official Website http://www.apteachers.in
Mostrar más📈 Análisis del canal de Telegram APTEACHERS APEMPLOYEES
El canal APTEACHERS APEMPLOYEES (@apteachers) en el segmento lingüístico de Télugu es un actor destacado. Actualmente la comunidad reúne a 15 368 suscriptores, ocupando la posición 13 077 en la categoría Educación y el puesto 27 135 en la región India.
📊 Métricas de audiencia y dinámica
Desde su creación el невідомо, el proyecto ha mostrado un crecimiento acelerado, reuniendo a 15 368 suscriptores.
Según los últimos datos del 12 julio, 2026, el canal mantiene una actividad estable. En los últimos 30 días la variación de miembros fue de -85, y en las últimas 24 horas de -17, conservando un alto alcance.
- Estado de verificación: No verificado
- Tasa de interacción (ER): El promedio de interacción de la audiencia es 9.83%. Durante las primeras 24 horas tras publicar, el contenido suele obtener 6.14% de reacciones respecto al total de suscriptores.
- Alcance de las publicaciones: Cada publicación recibe en promedio 1 511 visualizaciones. En el primer día suele acumular 944 visualizaciones.
- Reacciones e interacción: La audiencia responde de forma activa: el promedio de reacciones por publicación es 2.
📝 Descripción y política de contenido
El autor describe el recurso como un espacio para expresar opiniones subjetivas:
“APTEACHERS Website Official Telegram Channel
లేటెస్ట్ విద్యా ఉద్యోగ సమాచార చానెల్
Latest Educational AP Employees, AP Teachers Information
Official Website
http://www.apteachers.in”
Gracias a la alta frecuencia de actualizaciones (últimos datos recibidos el 13 julio, 2026), el canal mantiene la vigencia y un amplio alcance. La analítica demuestra que la audiencia interactúa activamente con el contenido, lo que lo convierte en un punto de referencia dentro de la categoría Educación.
Carga de datos en curso...
| Fecha | Crecimiento de Suscriptores | Menciones | Canales | |
| 12 julio | 0 | |||
| 11 julio | 0 | |||
| 10 julio | 0 | |||
| 09 julio | +2 | |||
| 08 julio | 0 | |||
| 07 julio | +36 | |||
| 06 julio | +2 | |||
| 05 julio | 0 | |||
| 04 julio | +2 | |||
| 03 julio | +3 | |||
| 02 julio | +6 | |||
| 01 julio | +3 |
| 2 | 📢**Mission March SSC 2027 All Subjects Study Material, Action Plan, Schedule, Slip Tests all in One Place**
▪️ *Download Link:*
https://www.apteachers.in/2026/07/mission-march-ssc-2027-phase-i-all.html | 186 |
| 3 | *📢 Mission March SSC-2027: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమం*
▪️రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి, 100% ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో "Mission March SSC-2027" కార్యక్రమం ప్రారంభించబడింది.
🌐 *Download Proceedings and Day Wise Schedule in One Click*
https://www.apteachers.in/2026/07/mission-march-ssc-2027-complete.html
*✅ ముఖ్య వివరాలు:*
*▪️సమయం* : ప్రతిరోజూ సాయంత్రం 4:00 PM నుండి 5:00 PM వరకు.
*▪️ షెడ్యూల్* : 4:00 - 4:30 PM (రివిజన్), 4:30 - 5:00 PM (స్లిప్ టెస్ట్).
*▪️ కాలవ్యవధి* : 13-07-2026 నుండి 30-11-2026 వరకు (ఆదివారాలు, సెలవులు మరియు పరీక్షా రోజులు మినహా).
*▪️ మెటీరియల్* : LEAP యాప్ ద్వారా Level-1 (Raising Stars) మరియు Level-2 (Shining Stars) విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్ మరియు క్వశ్చన్ బ్యాంక్స్ అందుబాటులో ఉంటాయి.
HMs మరియు ఉపాధ్యాయులు ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది
https://www.apteachers.in/2026/07/mission-march-ssc-2027-complete.html | 321 |
| 4 | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ
పత్రికా ప్రకటన (12.7.26)
పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధనకు పాఠశాల విద్యాశాఖ ప్రతిష్టాత్మక అడుగు: "మిషన్ మార్చ్ SSC-2027" కార్యాచరణ ప్రారంభం
అమరావతి:
ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడానికి మరియు ఎస్ఎస్సీ (SSC) పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ *"మిషన్ మార్చ్ SSC–2027: నూటికి నూరు శాతం విజయమే లక్ష్యం – యాక్షన్ ప్లాన్ ఫేజ్-I" (Mission March SSC–2027: A Leap Towards 100% Success – Action Plan Phase-I)** ను ప్రారంభించింది.
ఈ ప్రత్యేక కార్యక్రమం జాతీయ విద్యా విధానం (NEP-2020), జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం (NCF-2023) మార్గదర్శకాలకు అనుగుణంగా, ఎన్సీఈఆర్టీ (NCERT) కి చెందిన 'పరాఖ్' (PARAKH) సంస్థ సిఫార్సు చేసిన సామర్థ్య ఆధారిత విశ్లేషణ విధానానికి (Competency-based assessment framework) అనుగుణంగా రూపొందించబడింది.
కార్యక్రమ ముఖ్య విశేషాలు:
* ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో *13 జూలై 2026 నుండి 30 నవంబర్ 2026 వరకు అమల్లో ఉంటుంది.
* ప్రత్యేక సమయం: పాఠశాల పని దినాల్లో రోజు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ప్రత్యేక విద్యా మద్దతు సెషన్ (Academic support session) నిర్వహిస్తారు. ఇందులో సబ్జెక్టుల పునర్విమర్శ (Revision) మరియు సామర్థ్య ఆధారిత స్లిప్ టెస్ట్లు (Slip Tests) ఉంటాయి.
* డిజిటల్ మద్దతు (లీప్ యాప్): ప్రభుత్వ పరీక్షల బోర్డు (BSE) ఈ కార్యక్రమానికి సంబంధించి రోజువారీ షెడ్యూల్స్, క్వశ్చన్ బ్యాంకులు, స్టడీ మెటీరియల్ మరియు స్లిప్ టెస్ట్లను ప్రత్యేకంగా రూపొందించిన LEAP App, BSE వెబ్ సైట్లో పొందుపరచడం జరుగుతుంది.
* *వైవిధ్యభరిత బోధనా పద్ధతి*
(Differentiated Learning):** విద్యార్థుల స్థాయిని బట్టి రెండు విభాగాలుగా బోధన సాగుతుంది:
1. రైజింగ్ స్టార్స్ (లెవెల్–1): కనీస అభ్యసన నైపుణ్యాలు మరియు పునాదిని బలోపేతం చేయడం కోసం.
2. షైనింగ్ STARS (లెవెల్–2): ప్రతిభావంతులైన విద్యార్థుల్లో ఉన్నత స్థాయి సామర్థ్యాలను పెంపొందించడం కోసం.
* ఉపాధ్యాయుల పాత్ర: ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, వెనుకబడిన వారికి ప్రత్యేక బోధన (Remedial support) అందిస్తారు. అలాగే ప్రతిభావంతులకు తగిన మార్గదర్శకత్వం చేస్తూ ప్రగతి రికార్డులను క్రమబద్ధంగా నమోదు చేస్తారు.
* నిరంతర పర్యవేక్షణ: ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు కావడానికి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (Headmasters) మరియు విద్యాశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు.
> "విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి, వారిని రేపటి సవాళ్లకు సిద్ధం చేసేందుకే ఈ సామర్థ్య ఆధారిత అభ్యసన కార్యక్రమాన్ని తీసుకువచ్చాం" అని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా IAS., గారు పేర్కొన్నారు.
రాబోయే SSC పబ్లిక్ పరీక్షలు–2027 లో ప్రతి పదో తరగతి విద్యార్థి అత్యుత్తమ విజయం సాధించేలా... ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యా రంగానికి చెందిన భాగస్వాములందరూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని విజయవంతం చేయాలని విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది.
డైరెక్టర్ (ప్రభుత్వ పరీక్షల విభాగం) & కార్యదర్శి,
సెకండరీ విద్యా బోర్డు, ఆంధ్రప్రదేశ్. | 551 |
| 5 | 📢డీసెట్ వెబ్ ఆప్షన్లు ప్రారంభం
ప్రభుత్వ డైట్, ప్రైవేటు డీఈడీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు విద్యార్థులను ఎంపిక చేసేందుకు నిర్వహించిన డీసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైందని డీసెట్ కన్వీనర్, గుంటూరు ఆర్జేడీ బి. లింగేశ్వరరెడ్డి తెలిపారు.
డీసెట్లో అర్హత సాధించిన ర్యాంకు హోల్డర్లు ఈనెల 15 వరకు తాము ప్రవేశం కోరుకునే కళాశాలలకు ప్రాధాన్యత క్రమంలో వెట్అప్షన్లు పెట్టుకోవాలి. 16న అభ్యర్థులకు సీట్ల కేటాయింపు జరుగుతుంది. 19నుంచి 23 వరకు ప్రభుత్వ డైట్లలో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. ఈ పరిశీలనకు అభ్యర్థులు తమ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్తో పాటు తమ విద్యార్హత ఇతర ఒరిజనల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం అభ్యర్థులకు ఫైనల్ అడ్మిషన్ లెటర్ ఇస్తారు. ఆ లెటర్ ఆధారంగా అభ్యర్థులు తమకు సీటు వచ్చిన కళాశాలలో చేరాలి. ఈనెల 25 నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభ మవుతాయని లింగేశ్వరరెడ్డి తెలిపారు. | 804 |
| 6 | 📢NOC for Distance Courses
▪️ NOC అప్లికేషన్ సాఫ్ట్వేర్: https://net.apteachers.in/noc
▪️దూర విద్య ద్వారా డిగ్రీ, పీజీ, బీఈడీ చేసే ఉద్యోగ ఉపాధ్యాయులు తప్పని సరిగా తమ అపాయింట్మెంట్ అధికారి ఐన DEO ద్వారా NOC (No Objection Certificate) పొందవలసి ఉంటుంది.
▪️దాని కొరకు ఆన్లైన్ లో మీ మొబైల్ లోనే మీ వివరాలు నింపి ఒకే క్లిక్ లో NOC అప్లికేషన్ ను పిడిఎఫ్ గా డౌన్లోడ్ చేసుకొని సబ్మిట్ చేసుకోవచ్చు
▪️ NOC అప్లికేషన్ సాఫ్ట్వేర్: https://net.apteachers.in/noc | 1 752 |
| 7 | గమనిక: Dr BRAOU తెలంగాణ యూనివర్సిటీ విడుదల చేసిన దూరవిద్య B.Ed వల్ల , AP Inservice ఉపాధ్యాయులకు ప్రమోషన్ లలో ఎటువంటి ఉపయోగం లేదు.
ప్రస్తుతం ఆ యూనివర్సిటీ పరిధిలో మన రాష్ట్రం లేదు.
ఇక్కడ BRAOU Telangana University Study Centre లు కూడా లేవు.
కావున TG BROAU నుండి B.Ed చేయాలని అనుకొనే ఉపాధ్యాయులు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
AP BRAOU University ఏలూరు లో కార్యకలాపాలు ప్రారంభం అవుతున్నాయి. అప్పటి వరకు వేచి ఉండండి. | 931 |
| 8 | 📢ఉద్యోగుల సమస్యల పరిష్కానికి ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉంది
*ఈనెల 21న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం*
*సచివాలంయలో ఏపి జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశంలో రాష్ట్ర మంత్రులు కొలుసు పార్ధసారధి,అనగాని సత్యప్రసాద్ వెల్లడి*
అమరావతి : రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు,గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్ధసారధి,రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.ఎపి సచివాలయంలో ఎపి జెఎసి అమరావతి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శనివారం ఇరువురు మంత్రుల నేతృత్వంలో సమావేశమై ఉద్యోగులకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రాధమికంగా చర్చించారు.ఈసమావేశం అనంతరం మంత్రులు ఇరువురు మీడియాతో మాట్లాడగా ముందుగా మంత్రి పార్ధసారధి మాట్లాడుతూ ఈసమావేశంలో రాష్ట్ర ఆర్ధిమంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ హాజరు కావాల్సి ఉండగా ముందస్తు కార్యక్రమాలు మూలంగా ఆయన రాలేకపోయారని స్పష్టం చేశారు.గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా సమస్యలను ప్రక్కన పెట్టడంతో ఈసమస్య వచ్చిందని పేర్కొన్నారు.ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మొత్తం 23 డిమాండ్లను ఇవ్వడం జరిగిందని వాటన్నిటినీ మంత్రులు ఇరువురం క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని ఉద్యోగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి వర్యులు పూర్తి సానుకూలంగా ఉన్నారని అయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకుని అన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగిన ప్రయత్నం చేస్తుందని స్పష్టం చేశారు.
ఉద్యోగుల సమస్యలపై చర్చిచేందుకు ఈనెల 21వ తేదీన సచివాలయంలో అన్ని ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారి అధ్యక్షతన జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రులు ఇరువురూ ప్రకటించారు.ఈలోగా రాష్ట్ర ఆర్ధికమంత్రి వర్యులతో కూడా ఉద్యోగ సంఘాల సమస్యలపై మరొక సారి చర్చిస్తామని వారి పేర్కొన్నారు.కావున ఉద్యోగులు వారి ఆందోళన కార్యక్రమాల కార్యాచరణను వాయిదా వేసుకోవాలని మంత్రులిరువురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు సూచించారు.
రాష్ట్ర రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన సమావేశం పూర్తి సహృద్భావ వాతావరణంలో జరిగిందని ఉద్యోగుల సమస్యల పరిష్కరానికి ముఖ్యమంత్రి వర్యులు పూర్తి సానుకూలంగా ఉన్నారని పునరుద్ఘాటించారు.గత ప్రభుత్వం చేసిన నిర్వాకంతోనే నేడు ఉద్యోగులకు ఈపరిస్థితి వచ్చిందని ఉద్యోగ సంఘాలు ఇచ్చిన 23 డిమాండ్లను పరిశీలించామని వాటన్నిటినీ ఏవిధంగా పరిష్కరించాలనే దానిపై ఈనెల 21న సిఎస్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.దానికంటే ముందు రాష్ట్ర ఆర్ధిక శాఖమంత్రి పయ్యావుల కేశవ్ తో చర్చిస్తామని అన్నారు.అవసరమైతే 21వ తేదీ కంటే ముందుగానే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి స్పష్టం చేశారే.
అంతకు ముందు జరిగిన సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు,ఉద్యోగుల సంక్షేమం,సేవా సంబంధిత అంశాలు పెండింగ్లో ఉన్న డిమాండ్లపై అమరావతి జెఏసి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మంత్రుల బృందంతో విస్తృతంగా చర్చించారు.ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావించిన ప్రతి అంశాన్ని మంత్రివర్యులు శ్రద్ధగా ఆలకించి వాటిని సానుకూల దృక్పథంతో పరిశీలించి ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకువెళ్ళి సానుకూలంగా పరిష్కారం అయ్యేలా చూస్తామని చెప్పారు.ప్రభుత్వం ఉద్యోగుల మధ్య పరస్పర సహకారం, సమన్వయం మరింత బలోపేతం అయ్యేలా నిరంతరం చర్చలు కొనసాగిస్తామని,ఉద్యోగుల సంక్షేమం మరియు సమర్థవంతమైన పరిపాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని మంత్రివర్యులు స్పష్టం చేశారు. | 1 029 |
| 9 | బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం 5:05 గంటల సమయంలో 10 కి.మీ లోతులో 4.5 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఈ ప్రకంపనలు విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో స్వల్పంగా అనుభూతి చెందాయి. ‼️ | 866 |
| 10 | 1. OTHER STATE OPTION ENABLED
2. AADHAR PHOTO CAPTURE MANDATE REMOVED | 891 |
| 11 | ✊ *ఉపాధ్యాయుల హక్కుల కోసం... FAPTO పోరాటానికి సిద్ధం!* ✊
ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి.
🔹 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలి.
🔹 CPS రద్దు చేసి OPS అమలు చేయాలి.
🔹 పెండింగ్లో ఉన్న 5 డీఏలను వెంటనే విడుదల చేయాలి.
🔹 30% మధ్యంతర భృతి (IR) ప్రకటించాలి.
🔹 పెండింగ్ బకాయిలన్నీ చెల్లించాలి.
📢 జూలై 14న జిల్లా కలెక్టరేట్ల వద్ద జరిగే రాష్ట్రవ్యాప్త భారీ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
"ఉపాధ్యాయుల సంఘాల ఐక్యతే మా బలం – హక్కుల సాధనే మా లక్ష్యం!"
✊ FAPTO – పోరాటమే.. " పరిష్కారం...!! | 866 |
| 12 | *లీప్ యాప్లో Students & Parents Discrepancy వివరాలను నమోదు చేసే ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం కొత్త ఆప్షన్ అందుబాటులోకి తీసుకురాబడింది.*
*ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థులు, అలాగే ఇతర జిల్లాల నుండి వచ్చి ప్రస్తుతం మన జిల్లాలో చదువుతున్న విద్యార్థుల వివరాలను కూడా సచివాలయం మ్యాపింగ్ ఆధారంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నమోదు చేసుకునే విధంగా Student Native District ఆప్షన్ను ఎనేబుల్ చేయడం జరిగింది.*
*కాబట్టి ఇకపై విద్యార్థుల వివరాల అప్డేట్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అందువల్ల అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలో Students & Parents Discrepancy ఉన్న విద్యార్థుల వివరాలను వెంటనే లీప్ యాప్లో అప్డేట్ చేయవలసిందిగా సూచించబడుచున్నది.* | 1 018 |
| 13 | *📢ఉపాధ్యాయుడా ...డేటా ఎంట్రీ ఆపరేటరా!?...*
బోధనకు సమయం మిగులుతోoదా..! | 992 |
| 14 | *సిలబస్ మారిన దృష్ట్యా టీచర్లకు ఇవ్వనున్న ట్రైనింగ్ షెడ్యూల్ :*
*6-10 తరగతుల టీచర్లకు*
జూలై 13,14 - DRP లకు శిక్షణ
జూలై 15,16 - లాంగ్వేజస్
జూలై 17,18 - నాన్ లాంగ్వేజస్
*3-5 తరగతుల టీచర్లకు*
జూలై 13,14,15 - SRP ల ట్రైనింగ్
మిగిలిన షెడ్యూల్ తర్వాత ప్రకటిస్తారు
జూలై 22 - మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్
యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ | 1 486 |
| 15 | కమిషనర్ గారితో జరుగుతున్న రికగ్నైజ్డ్ యూనియన్ల మీటింగ్ నందు, TET విషయంలో in service teachers కి maths PS వాళ్ళ ను దృష్టిలో ఉంచుకొని Same Subject లోనే ఎగ్జామ్ నిర్వహించాలని కోరటం జరిగింది
గౌరవ SCERT డైరెక్టర్ కృష్ణ రెడ్డి గారు తొలి విడతగా దసరా సెలవులో, రెండవ సారి Summer Holidays లో in service TET నిర్వహించడానికి సుముఖత వ్యక్తం చేశారు.
2) అన్ని కేటగిరీ లకు SC ST BC ల వలే కాకుండా in service teachers కి ఒకే అర్హత మార్క్ ను అదీ కూడా అందరికీ 55 మార్కులు అర్హత మార్క్ ని కోరటం జరిగింది
సంవత్సరానికి రెండు లేదా మూడు సార్లు నిర్వహించడానికి అయినా కూడా సిద్ధంగా ఉన్నామని కృష్ణారెడ్డిగారు చెప్పటం జరిగింది | 1 449 |
| 16 | 🇮🇳 ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్గా సేవ చేసే అద్భుత అవకాశం! 💂♂️
📢 Indian Army SSC (Tech)-68 Men Recruitment 2027 అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.
*📲 పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, ఖాళీలు, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాల కోసం* https://apdsc.net/indian-army-ssc-tech-68-men-recruitment-2027/
🎓 *Qualification* : అవివాహిత పురుష ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు మరియు ఫైనల్ ఇయర్ విద్యార్థులు.
📌 మొత్తం 350 ఖాళీలు వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు.
🗓️ ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: 09 జూలై 2026
⏳ చివరి తేదీ: 07 ఆగస్టు 2026 (మధ్యాహ్నం 3:00 గంటల వరకు)
🏛️ ఎంపికైన అభ్యర్థులకు OTA గయా (బీహార్) లో 49 వారాల శిక్షణ అందించబడుతుంది.
💰 శిక్షణ సమయంలో నెలకు ₹56,100 స్టైపెండ్, అనంతరం లెఫ్టినెంట్గా ఆకర్షణీయమైన Rs 1,00,000+ వేతనం మరియు అలవెన్సులు.
🏃 ఎంపిక ప్రక్రియలో షార్ట్లిస్టింగ్ ➜ SSB ఇంటర్వ్యూ ➜ మెడికల్ పరీక్ష ➜ మెరిట్ లిస్ట్ ఉంటాయి.
🌟 దేశసేవతో పాటు గౌరవప్రదమైన కెరీర్ కోరుకునే యువ ఇంజినీర్లకు ఇది ఒక సువర్ణావకాశం.
📲 పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, ఖాళీలు, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాల కోసం https://apdsc.net/indian-army-ssc-tech-68-men-recruitment-2027/ సందర్శించండి.
🔄 ఈ సమాచారాన్ని మీ స్నేహితులు, ఇంజినీరింగ్ విద్యార్థులు మరియు ఉద్యోగార్థులతో తప్పకుండా షేర్ చేయండి. 🇮🇳 | 1 556 |
| 17 | 📢 **నేటి ఏపీటీచర్స్ న్యూస్ 10.07.2026**
🌎 **ఏపీటీచర్స్ అంతర్జాతీయ వార్తల ముఖ్యాంశాలు**
▪️న్యూట్రాన్ నక్షత్రాల విలీనం విశ్వంలోని అత్యంత బరువైన మూలకాలను ఎలా ఏర్పరుస్తుందో ఖచ్చితంగా అనుకరించే వేగవంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ను పరిశోధకులు అభివృద్ధి చేశారు.
▪️హిమాలయాలలో కొత్తగా కనుగొనబడిన ఒక 'హ్యాపీ-ఫేస్' సాలీడు జాతి, హవాయికి చెందిన ప్రసిద్ధ జాతిని పోలి ఉండే స్వతంత్ర జన్యు పరిణామాన్ని ప్రదర్శించింది.
▪️హార్ముజ్ జలసంధిపై జరుగుతున్న పోరాటంలో భాగంగా అమెరికా ఇరాన్పై కొత్తగా వైమానిక దాడులను ప్రారంభించగా, టెహ్రాన్ మూడు గల్ఫ్ అరబ్ దేశాలపై ఎదురుదాడులకు దిగింది.
▪️మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల కోసం ఇరాన్లోని మషాద్లో లక్షలాది మంది శోకసంద్రంలో మునిగిపోయిన ప్రజలు సమావేశమయ్యారు.
▪️శ్రీలంకలో డెంగ్యూ వ్యాప్తి తీవ్రమవడంతో అక్కడి విశ్వవిద్యాలయాలను మూసివేసి, ఆన్లైన్ తరగతులకు మార్చారు.
▪️కాంగోలో ఎబోలా మరణాల సంఖ్య 600కి చేరింది, అంతకుముందు ఈ వ్యాప్తి లేని రాష్ట్రాలలో కూడా కొత్త కేసులు నమోదైనట్లు అనుమానిస్తున్నారు.
▪️లెబనాన్ మరియు గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఒక పాఠశాల ప్రిన్సిపాల్తో సహా పలువురు పౌరులు మరణించారు.
▪️భారతదేశం, ఆస్ట్రేలియా దేశాలు యురేనియం ఎగుమతులపై ఒప్పందం కుదుర్చుకున్నాయి, దీని ద్వారా అణు మరియు సముద్ర రంగాలలో తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకున్నాయి.
▪️చైనా, తైవాన్ దేశాలు 'బావి' తుఫానును ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి; ఇది జూలై 11న తూర్పు ఫుజియాన్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది.
🇮🇳 **ఏపీటీచర్స్ జాతీయ వార్తల ముఖ్యాంశాలు**
▪️ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారతదేశం మరియు ఆస్ట్రేలియా దేశాలు యురేనియం ఎగుమతులపై ఒప్పందం కుదుర్చుకున్నాయి, అలాగే రక్షణ మరియు సాంకేతిక రంగాలలో సంబంధాలను బలోపేతం చేసుకున్నాయి.
▪️1,610 కిలోమీటర్ల పొడవైన భారత్-మయన్మార్ సరిహద్దుకు పూర్తిగా కంచె వేసేందుకు భారత ప్రభుత్వం ₹31,000 కోట్ల భారీ చొరవను ప్రకటించింది.
▪️భారతదేశపు 'పీఎం సూర్య ఘర్' నివాస గృహాల సోలార్ రూఫ్టాప్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి ప్రపంచ బ్యాంక్ 820 మిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ఆమోదించింది.
▪️సరిహద్దు సమస్యలపై చైనాకు క్లీన్ చిట్ ఇస్తున్నారని కేంద్ర ప్రభుత్వం మరియు ప్రధాని మోదీపై ఖర్గే ఆరోపణలు చేశారు.
▪️అరెస్టుల సమయంలో గల కారణాలను తెలియజేయాలనే నిబంధనకు సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది.
▪️శిక్షా అధిష్ఠాన్ బిల్లులోని కేంద్రీకరణ నిబంధనలపై ఎన్డీయే పాలిత రాష్ట్రాలు, విశ్వవిద్యాలయాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
▪️జూలై 20న పార్లమెంట్ మార్చ్ నిర్వహించనున్నట్లు సిజెపి ప్రకటించింది; విద్యార్థులు, తల్లిదండ్రులు ఇందులో పాల్గొనాలని కోరింది.
▪️వచ్చే వారం నీట్ (NEET) పరీక్ష నిర్వహణ, ఆరోగ్య నియంత్రణ సంస్థల పనితీరుపై పార్లమెంటరీ కమిటీ సమీక్ష జరపనుంది.
▪️తాము ప్రతిపాదించిన యూజర్నేమ్ ఫీచర్పై కేంద్రం ఇచ్చిన నోటీసుకు మెటా యాజమాన్యంలోని వాట్సాప్ తన సమాధానాన్ని సమర్పించింది, ప్రభుత్వం ఈ సమాధానాన్ని పరిశీలిస్తోంది.
▪️దూర ప్రాంతాలు మరియు అత్యవసర కనెక్టివిటీ కోసం బిఎస్ఎన్ఎల్ రూ. 1.34 లక్షల ధరతో శాటిలైట్ ఫోన్ను ప్రారంభించింది.
🌅 **ఏపీటీచర్స్ రాష్ట్ర వార్తల ముఖ్యాంశాలు**
▪️ఐఎన్ఎస్ మహేంద్రగిరి (INS Mahendragiri) యుద్ధనౌకను ప్రారంభించేందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం విశాఖపట్నం చేరుకున్నారు.
▪️జెఎన్టియు-గురజాడ విజయనగరం మొదటి కాన్వోకేషన్ (పట్టభద్రుల ఉత్సవం) వేడుకలో పాల్గొనేందుకు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ వైజాగ్ చేరుకున్నారు.
▪️ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధునీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మీ మార్ట్’ (Mee Mart) ను ప్రారంభించింది.
▪️కనిపించకుండా పోయిన మత్స్యకారుల కుటుంబాలకు రూ. 60 లక్షల ఎక్స్గ్రేషియా అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
▪️ప్యాసివ్ యుథనేషియా (కారుణ్య మరణం) అమలుకు సంబంధించిన కొత్త వైద్య మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది.
▪️ఎస్సీ విద్యార్థుల కోసం మూడు అత్యుత్తమ విద్యా కేంద్రాలను (Excellence Centers) ఏపీ ప్రభుత్వం ఆమోదించనుంది, ఇవి వారి ఇంటర్మీడియట్ విద్యతో పాటు ఐఐటి-జెఈఈ (IIT-JEE) మరియు నీట్ (NEET) కోచింగ్ను అందిస్తాయి.
▪️రైతుల నుండి దుకాణాల వరకు వరి కొనుగోలును గుర్తించడానికి ఏపీ ప్రభుత్వం అధునాతన సాంకేతికతతో కూడిన 'ట్రాక్ అండ్ ట్రేస్' క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
▪️సోలార్ రూఫ్టాప్లను ఏర్పాటు చేసుకునే వెనుకబడిన తరగతుల (BC) వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ₹20,000 అదనపు సబ్సిడీని అందించనుంది.
🏏 **క్రీడా వార్తలు**
▪️బోస్టన్లో జరిగిన ఫిఫా ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్ పోరులో ఫ్రాన్స్ 2-0 తేడాతో మొరాకోను ఓడించి, వరుసగా మూడోసారి ప్రపంచ కప్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది.
▪️ఇంగ్లాండ్ చేతిలో భారత్ టి20 సిరీస్ను కోల్పోయింది. | 1 311 |
| 18 | 📢 Todays APTEACHERS News 10.07.2026
🌎 APTEACHERS International News Headlines
▪️Researchers developed a fast AI model that accurately simulates how neutron star mergers forge the universe's heaviest elements.
▪️A newly discovered Happy-Face spider species in the Himalayas has shown independent genetic evolution resembling Hawaii's iconic species.
▪️The U.S. launches new airstrikes on Iran, while Tehran fires back at three Gulf Arab states in the fight over the Strait of Hormuz
▪️Millions of mourners gather in Mashhad, Iran, for the defiant burial of former Supreme Leader Ali Khamenei.
▪️Sri Lankan universities close, shift to online classes amid dengue surge
▪️Ebola death toll in Congo reaches 600, as new cases suspected in previously unaffected provinces
▪️Israel conducts strikes in Lebanon and Gaza killing civilians including school principal.
▪️India, Australia strike deal on uranium exports, deepen ties across nuclear and maritime sectors
▪️China, Taiwan brace for Typhoon Bavi; likely to make landfall in eastern Fujian on July 11
🇮🇳 APTEACHERS National News Headlines
▪️India and Australia strike deal on uranium exports and deepen defence and tech ties during Modi visit.
▪️The Indian government announces a massive ₹31,000 crore initiative to completely fence the 1,610-km India-Myanmar border.
▪️The World Bank approves an $820 million financing package to accelerate India’s PM Surya Ghar residential solar rooftop program.
▪️Kharge accuses Centre and PM Modi of giving clean chit to China on border issues.
▪️Supreme Court considers reference of provision to furnish reason during arrests
▪️NDA-ruled States, universities object to centralisation provisions in Shiksha Adhishthan Bill
▪️CJP announces Parliament march on July 20; asks students, parents to join in
▪️Parliamentary panel to review NEET conduct, health regulators’ functioning next week
▪️Meta-owned WhatsApp has submitted its response to the Centre's notice over its proposed username feature, and the government is examining the reply
▪️BSNL launches satellite phone priced at Rs 1.34 lakh for remote, emergency connectivity
🌅 APTEACHERS State News Headlines
▪️Union Defence Minister Rajnath Singh arrives in Visakhapatnam for a two-day official visit to commission the warship INS Mahendragiri.
▪️Governor S. Abdul Nazeer reaches Vizag ahead of attending the first convocation ceremony of JNTU-Gurajada Vizianagaram.
▪️Andhra Pradesh launches ‘Mee Mart’ to modernise public distribution system.
▪️The Andhra Pradesh government has announced a Rs 60 lakh ex-gratia to the families of the missing fishermen
▪️The state government has officially cleared new medical guidelines regarding the implementation of passive euthanasia
▪️AP to approve three excellence centers for SC students, which will provide IIT-JEE and NEET coaching alongside their Intermediate education.
▪️AP introduced an advanced tech-driven 'Track and Trace' QR code system to map paddy procurement from farmers to shops.
▪️The state government will provide an additional subsidy of ₹20,000 to individuals from backward classes for installing solar rooftops.
🏏Sports News
▪️France defeated Morocco 2-0 in the FIFA World Cup quarterfinal clash in Boston advancing to a third consecutive World Cup semifinal
▪️India lost T20 series to English | 1 065 |
| 19 | 💥 డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 779 క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
💥Bank of India (BOI) Credit Officer Recruitment 2026 – Notification Out For 779 Credit Officer Posts
▪️ Post : Credit Officer Officers - Various Branches
▪️Vacancies: 779
▪️ Qualification : Degree/CA, CMA-ICWA, CS, or CFA
▪️ Last Date : July 20
🔹Notification PDF, Apply Online, Eligibility, Salary & Complete Details :
https://www.jobslokam.com/2026/07/bank-of-india-boi-credit-officer.html | 1 310 |
| 20 | 📢 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీలకు కొత్త సిబ్బంది విధానం – G.O.Ms.No.87 (08-07-2026)
🔹 గ్రామ పంచాయతీల కోసం ప్రభుత్వం కొత్త సూచనాత్మక (Indicative) సిబ్బంది నమూనాను విడుదల చేసింది.
📄 పూర్తి వివరాలు, పోస్టుల వారీ సిబ్బంది నమూనా కింది లింక్ లో చూడవచ్చు
https://www.apteachers.in/2026/07/ap-gram-panchayat-staff-pattern-2026.html
🔹 రాష్ట్రంలోని 13,351 గ్రామ పంచాయతీలను రూర్బన్, గ్రేడ్-I, గ్రేడ్-II, గ్రేడ్-IIIగా వర్గీకరించింది.
🔹 ప్రతి గ్రామ పంచాయతీలో పరిపాలన, రెవెన్యూ వసూళ్లు, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, ఇంజినీరింగ్ వంటి విభాగాలకు సిబ్బంది నమూనాను సూచించింది.
🔹 కంప్యూటర్ ఆపరేటర్-కమ్-డిజిటల్ అసిస్టెంట్ పోస్టు అన్ని గ్రేడ్ల గ్రామ పంచాయతీలకు సూచించబడింది.
🔹 స్వచ్ఛ మిత్ర (Sweeper) – ప్రతి 250 ఇళ్లకు లేదా 1000 జనాభాకు ఒకరు.
🔹 స్వచ్ఛ మిత్ర (డ్రైనేజీ క్లీనర్) – ప్రతి 500 ఇళ్లకు ఒకరు.
🔹 బిల్ కలెక్టర్ – ప్రతి 1500 అసెస్మెంట్లకు ఒకరు నియమించుకోవచ్చు.
🔹 అవసరాన్ని బట్టి అవుట్సోర్సింగ్/తృతీయ పక్ష సంస్థల ద్వారా సిబ్బందిని నియమించుకునేందుకు అనుమతి ఇచ్చింది.
🔹 ఈ సిబ్బంది నియామకాలకు అయ్యే ఖర్చు సంబంధిత గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్స్ నుంచే భరించాలి.
🔹 ఇది కొత్త ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ కాదు. గ్రామ పంచాయతీలకు సూచనాత్మక సిబ్బంది నమూనా మాత్రమే.
🔹 గ్రామ స్థాయిలో సేవల నాణ్యతను పెంచడం, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డిజిటల్ సేవలు మరింత మెరుగుపరచడం ఈ ఉత్తర్వు ప్రధాన లక్ష్యం. | 2 601 |
