FactCheck.AP.Gov.in
前往频道在 Telegram
1 952
订阅者
无数据24 小时
无数据7 天
无数据30 天
帖子存档
1 952
రైతులనుంచి కందిపప్పు సేకరణ:
వ్యవసాయ శాఖ సమన్వయంతో రైతుల నుండి 2023–24లో 55,000 లక్షల టన్నుల కంది పప్పును ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం డిసెంబర్ 2023 నుండి సేకరించాలని ప్రతిపాదించారు. ఈ కందిపప్పు సేకరణకు సంబంధించి రైతుల్లో ప్రచారం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా కలెక్టర్లందరితో వారానికోసారి సమీక్ష నిర్వహిస్తున్నారు.
రేషన్ డోర్ డెలివరీ:
– రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా 1.48 కోట్ల కార్డుదారులకు 2,35,000 టన్నుల బియ్యం కేటాయించి ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పంపిణీ చేస్తోంది.
– నిత్యావసర సరుకులు పక్కదారి పట్టకుండా సక్రమంగా లబ్ధిదారులకు చేరేందుకు రాష్ట్రంలో 9,260 మొబైల్ వాహనముల ద్వారా లబ్ధిదారుల ఇంటివద్దే వారి వేలిముద్రల నిర్ధారణ ద్వారా పంపిణీ చేస్తోంది. ఇందువల్ల ఈ సరుకులు బయట మార్కెట్కు తరలిపోయే ఆస్కారమే లేదు. కచ్చితమైన తూకం, నాణ్యతను లబ్ధిదారులు నేరుగా పరిశీలించుకోవచ్చు.
–ౖ డోర్ డెలివరీ విధానాన్ని వివిధ స్థాయిల అధికారులు నిత్యం తనిఖీలు చేస్తున్నారు.
– ఒక వేళ మొబైల్ వాహనాలు నిత్యావసర సరుకుల పంపిణీ కోసం లబ్ధిదారుల ఇళ్లకు రాకపోతే పౌరసరఫరాల శాఖ ఏర్పాటుచేసిన 1967 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. లబ్ధిదారుల అవగాహన కోసం 1967 టోల్ ఫ్రీ నెంబరును అన్ని మొబైల్ వాహనములపై ముద్రించింది ప్రభుత్వం.
– ప్రతి నెలా పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్వయంగా మొబైల్ వాహన ఆపరేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. వారు లబ్ధిదారుల ఇంటి వద్దనే నిత్యావసర సరుకుల పంపిణీ చేసేలా సూచనలు చేస్తున్నారు.
– లబ్ధిదారుల సౌకర్యార్థం మొబైల్ వాహనాలు నిత్యావసర సరుకుల పంపిణీ నిమిత్తం లబ్ధిదారుల ఇంటికి వచ్చే వివరాలను వాలంటీర్ల ద్వారా మొబైల్ యాప్ ద్వారా పరిశీలన జరుగుతోంది.
– రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి మొబైల్ వాహనాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించడం జరుగుతోంది.
– డోర్ డెలివరీ విధానం వల్ల గతంలోలా లబ్ధిదారులు చౌకధరల దుకాణాల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేదు. తద్వారా వృద్ధులు, మహిళలు, వికలాంగులకు ఎంతో మేలు జరుగుతోంది. లబ్ధిదారులకు సమయం అదా అవుతోంది.
– కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు వంటి.. నిత్యావసర మొబైల వాహనాలు చేరలేని చోట్ల అదనపు ఖర్చును కేటాయించి ఇతర వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరుగుతోంది.
– గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో విజిలెన్సు కమిటీలను ఏర్పాటుచేసి వాటి ద్వారా డోర్ డెలివరీ విధానాన్ని వివిధ స్థాయిలలో పర్యవేక్షించడం జరుగుతోంది.
– గతంలో అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం సరుకులను సంబంధిత అధికారులు చౌకధరల దుకాణం వద్దకు వచ్చి తీసుకోవలసి ఉండేది. కానీ ఇప్పుడు వారికి ఆ అవసరం లేకుండా మొబైల్ వాహనాల ద్వారా సరుకులను పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లకు పంపిణీ చేస్తూ, మొబైల్ వాహన ఆపరేటర్లకు అదనపు ఆదాయం సమకూర్చడం జరుగుతోంది.
– మొబైల్ వాహన ఆపరేటర్లకు వాహన మిత్ర పథకం వర్తింప చేయడంతో పాటు వారికి వాహన ఇన్సూరెన్స్లో వివిధ ప్రయోజనాలు కల్గించడం జరిగింది.
– డోర్ డెలివరీ విధానం ద్వారా నెలవారీ సరుకుల పంపిణీ 87% నుండి 90% వరకు పెరిగింది.
– ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా డోర్ డెలివరీ విధానంపై సర్వే నిర్వహించగా లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
– ఈ పంట కాలంలో రైతుల వద్ద నుండి నేరుగా రాగి, జొన్నలు, కందులు సేకరించి వాటిని ప్రజా పంపిణీ ద్వారా ఇస్తారు.
1 952
‘పండుగ కానుకలకు కత్తెర’ అంటూ 05.01.2024న ఈనాడు దినపత్రికలో ప్రచురించిన కథనం నిండా అవాస్తవాలూ, వక్రీకరణలే. ఈ విషయానికి సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నాం.
– గత ప్రభుత్వం 2014–19 మధ్య మొత్తం 117.45 లక్షల టన్నుల బియ్యం, 0.93 లక్షల టన్నుల కందిపప్పు, 3.15 లక్షల చక్కెర పంపిణీ చేసింది. అందుకు చేసిన ఖర్చు రూ.14,631 కోట్లు. ఐసీడీఎస్, మధ్యాహ్న భోజనం కూడా కలుపుకొంటే గత ప్రభుత్వం చేసిన మొత్తం వ్యయం కేవలం రూ.15,356 కోట్లు.
– కానీ వైయస్ జగన్ గారి ప్రభుత్వం 2019 నుండి 2023 వరకు మొత్తం 153.56 లక్షల టన్నుల బియ్యం, 3.15 లక్షల టన్నుల కంది పప్పు, 2.85 లక్షల టన్నుల చక్కెర పంపిణీ చేశారు. ఇందుకు పీడీఎస్, పీఎంజీకేఏవై కింద రూ.26,451 కోట్లు ఖర్చు చేశారు. ఐసీడీఎస్, మధ్యాహ్న భోజనంతో కలిపి వెచ్చించిన మొత్తం రూ.27,090.
అంటే గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఖర్చు చేసిన దానికంటే ఈ ప్రభుత్వం 55 నెలల్లోనే చేసిన ఖర్చు దాదాపు రెండు రెట్లు ఎక్కువ.
గత ప్రభుత్వంలో అరకొరగా పంపిణీ:
– గత ప్రభుత్వంలో కేవలం కొన్ని నెలలపాటు ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన మండలాల్లో బియ్యానికి బదులుగా రాగులు, జొన్నలు ఇచ్చారు.
– గత ప్రభుత్వంలో అప్పుడప్పుడూ కందిపప్పు పంపిణీ చేశారు. అది కూడా గరిష్ఠంగా 120 రూపాయలకు పేదలకు అమ్మారు.
– 2014 నుండి 2019 వరకు పీడీఎస్ కింద కేవలం 0.93 లక్షల టన్నుల కంది పప్పును పంపిణీ చేసి రూ.1605 కోట్లు ఖర్చు చేశారు.
– చంద్రన్న సంక్రాంతి / క్రిస్మస్ కానుక కింద చాలా తక్కువ పరిమాణాల్లో వస్తువులిచ్చారు.
– చంద్రన్న సంక్రాంతి / క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా కింద పంపిణీ చేసిన సరకుల టెండర్లు, వాటి నాణ్యతపై ఎన్నో విమర్శలు వచ్చాయి. వాటిపై ఇంకా విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఇప్పటికీ కొందరు టెండరుదారులకు నాణ్యతా కారణాల వల్ల చెల్లింపులు జరగలేదు.
జగన్ గారి ప్రభుత్వంలో పెరిగిన రేషన్:
– అన్ని జిల్లాల్లో సార్టెక్స్ ఫోర్టిఫైడ్ రైస్, గోధుమ పిండి, చక్కర, రాగులు– జొన్నలను (రాయలసీమ జిల్లాలలో) ప్రతి నెలా పీడీఎస్ కింద పంపిణీ చేయడం జరుగుతోంది.
– నూకలు, ఇసుక, మట్టి, రాళ్లు చెడిపోయిన బియ్యం గింజలు, రంగు మారిన బియ్యం గింజలు... ఉన్నవి కాకుండా మేలైన ప్రమాణాలున్న సార్టెక్స్ చేసిన నాణ్యమైన బియ్యాన్ని ఈ ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.
– జీపీఎస్ ఆధారిత వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా స్టాక్ను చౌకధరల దుకాణాలకు సరఫరా చేస్తోంది ఈ ప్రభుత్వం. సార్టెక్స్ చేయడానికి ప్రతి కిలోకు రూ.1 చొప్పున సుమారు ప్రతి నెలా రూ.20 కోట్లు ఖర్చు చేస్తోంది.
– లబ్ధిదారులు ఎక్కడికీ వెళ్లే పనిలేకుండా రేషన్ సరుకులు లబ్ధిదారులకు డోర్ డెలివరీ చేస్తోంది.
– మొబైల్ వాహన ఆపరేటర్ నెల చెల్లింపు, నెలవారీ కిస్తి కింద ప్రభుత్వం ప్రతి నెలా సుమారు రూ.25కోట్లు ఖర్చు చేస్తోంది.
– కిలో కందిపప్పును కేవలం 67 రూపాయలకు పంపిణీ చేస్తోంది.
– ఈ ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో 3.15 లక్షల టన్నుల కంది పప్పును పీడీఎస్, పీఎంజీకేఏవై కింద పంపిణీ చేసి రూ.3084 కోట్లు ఖర్చు చేసింది. అంటే గత ప్రభుత్వం కంటే మూడురెట్లు ఎక్కువ కందిపప్పును ఈ ప్రభుత్వం పంపిణీ చేసింది.
అరకొరగా, అప్పుడప్పుడూ కందిపప్పు పంపిణీ:
– గత ప్రభుత్వంలో కందిపప్పును ఆగస్టు 2015 నుండి ఫిబ్రవరి 2017 వరకు కార్డుకు 1కిలో చొప్పున, వివిధ రేట్లుకు అనగా రూ.50 నుండి రూ.120 మధ్యన పంపిణీ చేశారు.
– నవంబర్ 2016 నుండి ఫిబ్రవరి 2018 వరకు గిరిజన ప్రాంతాల్లో ఉన్న కార్డుదారులకు కిలోకు రూ.40 చొప్పున కందిపప్పు పంపిణీ చేశారు.
– మార్చి 2018 నుండి జూన్ 2018 వరకు అందరు కార్డుదారులకు పొడిగించారు.
– జులై 2018 నుండి జూలై 2019 వరకు మాత్రమే కంది పప్పు కిలోకు రూ.40 చొప్పున కార్డుకు 2 కిలోల చొప్పున పంపిణీ చేశారు.
– మొత్తంగా చూస్తేౖ 2014–19 మధ్య ఐదేళ్ల కాలంలో రేషన్ కార్డుదారులకు అప్పుడప్పుడూ మాత్రమే కందిపప్పు పంపిణీ చేశారు.
వైయస్ జగన్ గారి ప్రభుత్వంలో...:
– ప్రస్తుత ప్రభుత్వం అంటే, 2019 నుండి 2023 వరకు అన్ని జిల్లాల్లో సార్టెక్స్ ఫోర్టిఫైడ్ రైస్, గోధుమ పిండి, చక్కర, రాగులు – జొన్నలను (రాయలసీమ జిల్లాలలో) ప్రతి నెలా పీడీఎస్ కింద పంపిణీ చేస్తున్నారు.
–ౖ పైన పేర్కొన్న వాటితో పాటు కార్డుదారులు అందరికీ 1 కిలో కందిపప్పును రూ.67 చొప్పున పంపిణీ చేస్తున్నారు.
– ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 2019–20 నుండి 2022–23 వరకు, వివిధ సమయాల్లో బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో ధర రూ.87 నుండి రూ.93 వరకు ఉండగా రూ.26 నుండి రూ.89 వరకు సబ్సిడీ రూపంలో పంపిణీ చేశారు.
– ప్రస్తుతం 2023–24 సంవత్సరంలో బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర రూ.139 ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.72 మొత్తాన్ని సబ్సిడీగా వెచ్చిస్తూ కిలోకు రూ.67 చొప్పున కార్డుదారులకు పంపిణీ చేస్తోంది. ఇందుకోసం ప్రతి నెలా రూ.56 కోట్లు ఖర్చు చేస్తోంది.
1 952
– ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మధ్యలో రామాయపట్నం పోర్టుకు అత్యంత సమీపంలో తెట్టు వద్ద ఎయిర్పోర్టును నిర్మించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది.
– పోర్టు పక్కనే భారీ పరిశ్రమలు రానుండటంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులతో పాటు సరకు రవాణాకు అనువుగా ఉండే విధంగా ఈ ఎయిర్పోర్టును నిర్మిస్తున్నారు.
– ఎయిర్ కార్గో హబ్గా ఈ ఎయిర్పోర్టును నిర్మించడానికి సంబంధించి ఇప్పటికే భూ సేకరణ ప్రక్రియను ఈ ప్రభుత్వం చేపట్టింది. త్వరలోనే అనుమతులు అన్నీ రాగానే పనులు మొదలుపెట్టే విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతోంది.
ఈ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది:
– రాష్ట్రంలో మొత్తం ఏడు విమానాశ్రయాలు ఉండగా అందులో అయిదు ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుండగా, కర్నూలు ఎయిర్పోర్టును రాష్ట్ర ప్రభుత్వం, పుటపర్తి ఎయిర్పోర్టును శ్రీసత్యసాయి ట్రస్ట్ నిర్వహిస్తోంది.
– రాజమండ్రి, విజయవాడ, కడప, తిరుపతి విమానాశ్రయాల్లో భారీ విమానాలు దిగే విధంగా రన్వేలను విస్తరించడంతో పాటు కొత్త టెర్మినల్ బిల్డింగ్లను నిర్మిస్తోంది.
– రాజమండ్రి విమానాశ్రయ విస్తరణ పనులకు రూ.350 కోట్లతో ఈ మధ్యనే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేశారు.
– అలాగే కడప విమానాశ్రయం విస్తరణ కోసం 40 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించడంతోపాటు రూ.450 కోట్లతో కడప ఎయిర్పోర్టు అభివృద్ధికి ఇప్పటికే టెండర్లను పిలవడం జరిగింది.
– విజయవాడ టెర్మినల్, రన్వే విస్తరణ పనులు దాదాపు పూర్తి అయ్యి కొత్త సంవత్సరంలో అందుబాటులోకి రానుంది.
– తిరుపతి విమానాశ్రయాన్ని ఆధునీకరించడంలో పాటు అక్కడ విమానాలను రిపేర్ చేసే విధంగా ఎంఆర్వో యూనిట్ను ఏర్పాటు చేయనున్నారు.
– కర్నూలు ఎయిర్పోర్టులో పైలెట్ శిక్షణా కేంద్రంతో పాటు ఏరో స్పోర్ట్స్ హబ్గా ప్రభుత్వం తీర్చిదిద్దనుంది.
కోవిడ్ దెబ్బనూ ఈ ప్రభుత్వంపైకి నెడుతున్న ఈనాడు:
– గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో అనేక కొత్త నగరాలకు ఎయిర్ కనెక్టివిటీ పెరిగింది. కానీ ఈనాడు దినపత్రిక మాత్రం సర్వీసులు తగ్గిపోయాయి.. రెక్కలు విరిచేశారు అంటూ తప్పుడు వార్తలు రాస్తోంది.
– కోవిడ్ దెబ్బతో ట్రూజెట్, జెట్ ఎయిర్వేస్ దివాళా తీయగా, స్పైస్ జెట్ వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సర్వీసులను తగ్గించుకున్నాయి. చివరకు ఎయిర్ ఇండియా కూడా నష్టాలను భరించలేక టాటాల చేతిలోకి వెళ్లిపోయింది. ఇలా కోవిడ్ దెబ్బతో విమాన సర్వీసులు తగ్గితే దాన్ని కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి మెడకు కట్టాలని చూడటం ఈనాడు సంకుచితత్వానికి నిదర్శనం.
గతంలో లేని విధంగా కొత్త సర్వీసులు:
– గతంలో లేని విధంగా ఇప్పుడు విశాఖపట్నం నుంచి జైపూర్, గోవా, కడప, కోల్కతా, తిరుపతిలకు కొత్తగా సర్వీసులు ప్రారంభమైన మాట వాస్తవం.
– అలాగే విజయవాడ నుంచి షిర్డీ, విశాఖ, షార్జాలకు; తిరుపతి నుంచి బెల్గాం, గుల్బర్గా, షిమోగా, షిర్డీలకు కొత్తగా సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
– అదే విధంగా దుబాయ్, బహ్రెయిన్, కువైట్, శ్రీలంక, సింగపూర్, బ్యాంకాక్లకు నేరుగా సర్వీసులు నడిపే విధంగా విమానయాన సంస్థలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. అలాగే ఇప్పటివరకు పేరుకే పరిమితమైన తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు, ఆస్ట్రేలియా, యూరప్లకు విమాన సర్వీసులు నడపడానికి కూడా సంప్రదింపులు జరుపుతోంది.
పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు కూడా..:
– కేవలం ఎయిర్పోర్టులే కాకుండా ప్రతీ 50 కి.మీ.కు పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఉండే విధంగా పెద్ద ఎత్తున తీరప్రాంత అభివృద్ధిపై వైయస్ జగన్ గారి ప్రభుత్వం దృష్టి సారించింది.
– దేశంలో ఎక్కడా లేని విధంగా మూలపేట, కాకినాడ, మచిలీపట్నం రామాయపట్నం.. ఇలా నాలుగు గ్రీన్ ఫీల్డ్ పోర్టులు నిర్మాణం అవుతున్నాయి.
– ఇంకా 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం సుమారు రూ.20,000 కోట్లు వ్యయం చేస్తోంది.
వాస్తవాలు ఇలా ఉంటే.. మసిపూసి మారేడుకాయ చేసే పద్ధతిలో ఈనాడు దినపత్రిక అవాస్తవాలతో కథనాలు రాస్తోంది.
1 952
‘మాటలు మరిచారు.. రెక్కలు విరిచారు’ అంటూ 31–12–2023న ఈనాడు దినపత్రిక రాష్ట్రంలో పౌరవిమానయానంపై అవాస్తవాలతో, వక్రీకరణలతో కథనాన్ని ప్రచురించింది.
వాస్తవాలను ఫ్యాక్ట్ చెక్ రూపంలో కింద పొందుపరుస్తున్నాం.
ముందుగా భోగాపురం, కర్నూలు విమానాశ్రయాలకు సంబంధించి, ప్రయాణికుల గురించి ప్రధాన వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నాం.
– నిజానికి గత ప్రభుత్వం భూ సేకరణ చేయకుండా, కీలక అనుమతులు కూడా లేకుండా భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది.
వైయస్ జగన్ గారి ప్రభుత్వం ఇప్పుడు అన్ని అనుమతులతో వేగంగా నిర్మాణ పనులు చేస్తోంటే ఈనాడు దినపత్రిక తప్పుడు కథనాలు రాస్తోంది.
– అలాగే కర్నూలు విమానాశ్రయంలో కూడా చాలా పనులు మిగిలి ఉండగానే హడావిడిగా గత ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రారంభించేసింది. కానీ వైయస్ జగన్ గారి ప్రభుత్వం రూ.240 కోట్లు ఖర్చు చేసి కీలక ఏటీసీ టవర్, డీజీసీఏ అనుమతులు తీసుకువచ్చి ప్రారంభిస్తే ఈనాడు దినపత్రిక ఎగతాళి చేస్తూ అసత్యాలతో కథనం రాసింది.
– గతంలో కన్నా ఈ ప్రభుత్వంలో ప్రయాణికుల వృద్ధి కూడా 54 శాతం ఉంది. అందుకు టేబుల్లోని గణాంకాలే నిదర్శనం.
భోగాపురం... అన్ని అనుమతులు తెచ్చింది ఈ ప్రభుత్వమే:
– భూ సేకరణ చేయకుండా, పునరావాసం చేపట్టకుండా, పౌరవిమానయాన శాఖ, రక్షణ రంగం, పర్యావరణం వంటి ఎలాంటి కీలక అనుమతులు లేకుండానే గత ప్రభుత్వంలో భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు.
– కానీ వైయస్ జగన్ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అనుమతులు తీసుకొని 2,203.26 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించే విధంగా జీఎంఆర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
– ఒప్పందం కుదుర్చుకునే సమయానికి సేకరించిన భూమి కేవలం 377 ఎకరాలు మాత్రమే. మిగిలిన భూమిని ఈ ప్రభుత్వం సేకరించి, 376 కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి పునరావాసం కల్పించింది.
– రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గేటెడ్ కమ్యూనిటీ తరహాలో విశాలమైన రోడ్లు, డ్రైనేజ్, తాగునీరు, విద్యుత్, పాఠశాలలు, ప్రార్థన మందిరాలు, కమ్యూనిటీ హాళ్లు వంటివి నిర్మించి మరీ నిర్వాసితులకు అప్పగించింది.
– పునరావాసం కోర్టు కేసులు, పర్యావరణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ల్లో వేసిన కేసుల్లోనూ పోరాడి మరీ విజయం సాధించింది ఈ ప్రభుత్వమే.
– గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో.. కేంద్రంలో గత ప్రభుత్వంలో అధికార పార్టీకి చెందిన అశోక్ గజపతి రాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి ఒక్క అనుమతి కూడా తీసుకురాలేకపోయారు. అలాగే ఒక ముద్ర ఉండే విధంగా విమానయాన రంగానికి చెందిన కీలక ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకురావడంలోనూ విఫలమయ్యారు.
– కానీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సేఫ్టీ, కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన శాఖ, పర్యావరణ శాఖల నుంచి కీలక అనుమతులు సాధించి పనులు మొదలు పెట్టింది.
– గత ప్రభుత్వంలా అనుమతులు లేకుండా, గొప్పల కోసం టెంకాయ కొట్టడం కాకుండా అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే 2023 మేలో సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేసిన మరుక్షణం నుంచి పనులు వేగంగా జరుగుతున్నాయి. 2025 నాటికి ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుంది.
కర్నూలు విమానాశ్రయ పనులు కూడా..:
– కర్నూలు ఎయిర్పోర్టుకు 2017లో శంకుస్థాపన చేసిన గత ప్రభుత్వంలో పనులు పూర్తవ్వకుండానే, ఎన్నికలు వస్తున్నాయంటూ 2019 జనవరిలో హడావిడిగా విమానాశ్రయాన్ని ప్రారంభించేశారు.
– కానీ వాస్తవంగా అప్పటికి రన్వే, టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ టవర్ వంటి కీలక నిర్మాణ పనులు 30 శాతం కూడా పూర్తికాలేదు.
– ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ టవర్, బే పార్క్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, నావిగేషన్ ఎక్విప్మెంట్ నిర్మించడం జరిగింది. ఇందుకోసం ఈ ప్రభుత్వం రూ.240 కోట్లు ఖర్చు చేసింది.
– అంతే కాకుండా కీలకమైన ఏరో డ్రోమ్ లైసైన్స్, సెక్యూరిటీ క్లియరెన్స్ అనుమతులతో పాటు ఎస్పీఎఫ్ ఫోర్స్లను కూడా ఈ ప్రభుత్వమే తీసుకొచ్చింది.
– పౌరవిమానయాన శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలోని అధికార పార్టీ వ్యక్తే ఉన్నప్పటికీ ఈ విమానాశ్రయానికి సంబంధించి కీలక అనుమతులను తీసుకురావడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది.
– 70 శాతంపైగా పనులను వైయస్ జగన్ గారి ప్రభుత్వమే పూర్తి చేయడంతో ఈ ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టి 2021 మార్చిలో ప్రారంభించడం జరిగింది.
దగదర్తి ఎయిర్పోర్ట్:
– గత ప్రభుత్వం నెల్లూరుకు సమీపంలో దగదర్తి వద్ద ఎయిర్పోర్టు నిర్మించాలని ప్రతిపాదించింది. కానీ ఆ ప్రతిపాదన చుట్టూ అనేక సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు.
1 952
అన్ని ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి:
– రాష్ట్ర ప్రభుత్వం వాస్తవ సాగుదారుల పంట వివరాలను ఈ క్రాప్ లో నమోదు చేసి, దాని ఆధారంగా, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ క్రాప్ నమోదు ఆధారంగా కౌలు రైతులకు వారి గ్రామాల్లోనే రాయితీపై విత్తనాలు, ఎరువులు కూడా ప్రభుత్వం అందిస్తోంది.
– అంతేకాకుండా కౌలు రైతులకు సున్నా వడ్డీ పంట రుణాలు, పంటల బీమా, పంట నష్టపరిహారం (ఇన్ పుట్ సబ్సిడీ), పంట రుణాలు వైయస్సార్ రైతు భరోసా లాంటి అన్ని పథకాల లబ్ధి అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోంది.
– 2019 నుండి ఇప్పటి వరకు పంటల బీమా ద్వారా 3.55 లక్షల మంది కౌలు రైతులకు రూ.731.08 కోట్లు, పంట నష్ట పరిహార పెట్టుబడి రాయితీ ద్వారా 2.41 లక్షల మంది కౌలు రైతులకు రూ.253.56 కోట్లు, 14.39 లక్షల కౌలు రైతులకు రూ.8246 కోట్లు పంట రుణాలను, వైయస్సార్ రైతు భరోసా కింద 5.52 లక్షల మంది కౌలు రైతులకు రూ.712.67 కోట్లు మంజూరు చెయ్యడం జరిగింది.
– దురదృష్టకర పరిస్థితులలో వ్యవసాయ కారణాలతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు, భూయజమానులతో సమానంగా రూ.7 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం అందిస్తోంది.
– 01.06.2019 నుండి 2023లో ఇప్పటివరకు 1296 కేసులకు సంబంధించి చెల్లించిన మొత్తం ఎక్స్గ్రేషియా రూ.90.72 కోట్లు. ఇందులో 495 మంది కౌలు రైతులకు రూ.34.65 కోట్లు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో 2014 నుండి 31.05.2019 వరకు జరిగిన రైతు ఆత్మహత్యలను పునర్విచారణ జరిపి 474 మంది కేసులకు రూ.23.70 కోట్లు ఎక్స్గ్రేషియా అందించగా, వీరిలో 212 మంది కౌలు రైతులకు రూ.10.60 కోట్లు ఎక్స్గ్రేషియా అందించడం జరిగింది.
రైతు సంక్షేమమే రాష్ట్ర సంక్షేమమని నమ్మే వైయస్ జగన్ గారి ప్రభుత్వం కౌలు రైతులకు అన్ని విధాలా తోడ్పాటు అందించేందుకు వివిధ రైతు సంక్షేమ పథకాల కింద సహాయ సహకారాలు అందిస్తోంది. వాస్తవాలు ఇలా ఉంటే... ఈనాడు దినపత్రిక ప్రభుత్వంపై బురద జల్లేందుకు తప్పుడు కథనాలు రాస్తోంది.
1 952
తొలిసారిగా జీఎల్టీ ఖర్చులు చెల్లిస్తూ...:
– గత ప్రభుత్వాలు రైతులకు జీఎల్టీ (గన్నీబ్యాగులు, లేబర్, రవాణా) ఖర్చులు అందించేవి కావు. కానీ ఈ ప్రభుత్వం తొలిసారిగా జీఎల్టీ ఖర్చులను రైతులకు అందిస్తూ వారికి తోడుగా నిలుస్తోంది.
– తద్వారా గోనె సంచులు, హమాలి, రవాణా చార్జీలను మద్దతు ధరతో పాటు కలిపి చెల్లించటం వల్ల క్వింటాలుకు కనీస మద్దతు ధర కాకుండా అదనంగా రూ.252 వరకూ రైతులకు లభిస్తోంది.
– మొత్తం అన్ని చార్జీలు కలుపుకొని టన్నుకు రూ.2,523 జీఎల్టీ రూపేణా ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. బాధిత రైతుకు ఊరటనిచ్చే విధంగా వారికి జరిగిన నష్టాన్ని భర్తీచేసి రైతును ఒడ్డుకు చేర్చేలా ఈ ప్రభుత్వం అందిస్తున్న భరోసా ఇది.
కేంద్రం ప్రశంసలు:
– విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని స్వయంగా ఆయా ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలే ప్రశంసించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి.
– పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణగా సీఎం వైయస్ జగన్ గారు తీసుకొచ్చిన గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ వల్ల క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి ఒక సమర్థవంతమైన యంత్రాంగం ఏర్పాటైంది. అత్యవసర పరిస్థితులలో, విపత్తుల్లో ఈ వ్యవస్థ స్పందిస్తున్న తీరు, అందిస్తున్న సేవలు ఇతర రాష్ట్రాలకూ దిక్సూచిలా నిలుస్తాయని కేంద్ర ప్రభుత్వానికి చెందిన కార్యదర్శి స్థాయి అధికారులు కూడా ప్రశంసలు కురిపించారు.
కౌలు రైతుల సంక్షేమమే లక్ష్యం:
– కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఎలాంటి సాయం చేయకున్నా, రైతు భరోసా కింద ఏడాదికి రూ.13,500 అర్హులైన ప్రతీ కౌలు రైతుకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తోంది.
– అంతేకాకుండా షెడ్యూల్ తెగలు,షెడ్యూల్ కులాలు, వెనుకబడిన కులాలు, మైనారిటీ వర్గాలకు చెందిన కౌలు రైతుల కుటుంబాలకు; దేవాదాయ భూములు, అటవీ భూమి సాగుదారులకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుండి 3 విడతలలో రూ.13,500 అందిస్తోంది వైయస్ జగన్ గారి ప్రభుత్వం.
– ఇప్పటివరకూ ఈ ప్రభుత్వ హయాంలో రైతుల భరోసా అందుకున్న కౌలు రైతులు, అటవీ భూమి సాగుదారుల వివరాలను పట్టికలో చూడొచ్చు.
కౌలు రైతులను గుర్తించే చట్టబద్ధమైన ప్రక్రియ:
– దేశంలో తొలిసారిగా కౌలు రైతులను గుర్తించేందుకు చట్టబద్ధమైన ప్రక్రియను కూడా జగన్ ప్రభుత్వమే ప్రారంభించింది.
– వాస్తవ సాగు రైతులకు చేయూత ఇవ్వాలనే దృఢ సంకల్పంతో, అదేవిధంగా భూయజమాని హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, వారి హక్కుల రక్షణకు ఏర్పాట్లు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘‘పంట సాగుదారు హక్కుల చట్టం –2019’’ని 17–08–2019న అమలులోనికి తీసుకు వచ్చింది.
– ఈ చట్టం ద్వారా కౌలు రైతులకు అతి సులభతరమైన విధానంలో పంట సాగుదారు హక్కు పత్రాలు జారీ చేసే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
– అర్హులైన కౌలు రైతులందరికీ భూ యజమాని అంగీకారంతో, వారు దూర ప్రాంతాల్లో ఉన్నా, వారి అనుమతిని మొబైల్ ఫోన్, వీడియో కాల్, ఈ–మెయిల్ వంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా తీసుకుని, కౌలు రైతుల గుర్తింపు కార్డులు (పంట సాగుదారు హక్కు పత్రాలు) ప్రభుత్వం జారీ చేస్తోంది.
– దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇటువంటి విధానం అమలులో లేదు. ఈ సంవత్సరం ‘‘జగనన్న సురక్ష’’ కార్యక్రమంలో దీనిని కూడా భాగం చేసి ప్రత్యేక డ్రైవ్ తో అత్యధికంగా 8.25 లక్షల సీసీఆర్సీలను కౌలు రైతులకు ఇచ్చింది ఈ ప్రభుత్వం.
– ప్రతి ఏటా పెరుగుతున్న సీసీఆర్సీ కార్డుల సంఖ్య కౌలు రైతులకు సాయం చెయ్యాలన్న ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. 2019–20 నుండి 2023–24 వరకు ఇచ్చిన కౌలు గుర్తింపు కార్డుల వివరాలు పట్టికలో చూడొచ్చు.
కౌలు రైతులకు సులభంగా రుణాలు:
– కౌలు రైతులకు రుణం అందించేందుకు బ్యాంకులు సత్వరంగా ముందుకు రావు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది.
– రబీ పంటకాలం (2023–24) నుంచి మరింత ఎక్కువమంది కౌలు రైతులకు రుణం అందించేందుకు వీలుగా కౌలు రైతుల వివరాలను సీసీఎల్ఏ వారి వెబ్ ల్యాండ్ పోర్టల్ లో లోన్ చార్జ్ మాడ్యూలుకు అనుసంధానం చెయ్యడం జరిగింది.
– దీనివల్ల బ్యాంకులు, భూ యజమానుల వివరాలతో పాటు, కౌలు రైతుల వివరాలను ఖరారు చేసుకుని వారికి రుణాలు అందించగలుగుతాయి.
– బ్యాంకర్లు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం కౌలు రైతులకు పంట రుణాలను అందజేస్తారు. అలాగే సాగు అవసరాలకు బంగారం తాకట్టుపై అందించే రుణాలు కాడా ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి అందజేయడం జరుగుతుంది.
– 2023–24 సంవత్సరంలో ఇప్పటి వరకు 8.25 లక్షల మంది కౌలు రైతులకు సీసీఆర్సీ పత్రాలు ఇవ్వగా, వారిలో 5.27 లక్షల కౌలు రైతులకు రూ.1,577 కోట్ల పంట రుణాలు ఇచ్చారు. ఈ స్థాయిలో కౌలు రైతులకు రుణ సాయం దక్కేలా చేయడంలో ఈ ప్రభుత్వం చూపిస్తున్న చిత్తశుద్ధే ప్రధాన కారణం.
1 952
‘ఉదారమంటూ ఉత్తమాటలు!’ అంటూ 19–12–2023న ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన కథనం పూర్తిగా అవాస్తవం. కౌలు రైతుల కష్టాలపై తప్పుడు రాతలతో ప్రభుత్వంపై విషం కక్కింది ఈనాడు దినపత్రిక.
గత ప్రభుత్వం, విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకునే చర్యలను పూర్తిగా పక్కనపెట్టి, కేవలం ఫొటో షూట్లకే పరిమితమైనా, నాటి ప్రభుత్వ పనితీరు భేష్ అంటూ ఆకాశానికి ఎత్తిన ఈనాడు పత్రిక అసత్య కథనాలను ప్రజలను నమ్మలేదు. కాబట్టే రైతు వ్యతిరేక విధానాలతో గత ప్రభుత్వం అధికారం కోల్పోయింది.
మొట్టమొదటిసారిగా తక్షణ నగదు సాయం:
– గతంలో తుఫాను, వరదలు లాంటి విపత్తులు సంభవించినప్పుడు రాష్ట్రంలో తక్షణ సహాయంగా ఏ ప్రభుత్వమూ నగదు ఇవ్వలేదు.
– కానీ వైయస్ జగన్ గారి ప్రభుత్వం మాత్రం తక్షణ సహాయంగా శిబిరాలకు తరలించిన వారికి రూ.2వేల నగదు అందిస్తోంది.
– మిచాంగ్ తుపాను సమయంలో నగదు సాయాన్ని మరింత పెంచి రూ.2,500 చొప్పున, 1.02 లక్షలకు పైగా కుటుంబాలకు తక్షణ సహాయంగా అందించింది.
– శిబిరాలకు తరలించిన వారికే కాక ఇళ్లలోకి నీళ్లు వచ్చిన వారికికూడా తొలిసారిగా తక్షణ సహాయం కింద నగదును పంపిణీ చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానిది.
– తుపాను ప్రభావం తగ్గిన రెండు రోజుల్లో ఈ పంపిణీని శరవేగంగా పూర్తిచేసింది. నగదుతో పాటు నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, వంటనూనె, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, కందిపప్పులతో రేషన్ కూడా శరవేగంగా బాధితులకు అందించింది.
ముందస్తు చర్యలు:
– మిచాంగ్ తుపాను తీవ్రత గురించి ముందుగానే గ్రహించిన జగన్ ప్రభుత్వం తుపాను రాకముందే రైతులు, కౌలు రైతుల పంటను కాపాడేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది.
– సహాయక శిబిరాలు ఏర్పాటు చేస్తూనే కేవలం 48 గంటల వ్యవధిలోనే దాదాపు లక్ష టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది.
– అంతేకాక మిల్లులకు, రక్షిత ప్రాంతాలకు మరో 13.6 లక్షల టన్నుల ధాన్యాన్ని తరలించింది. ఈ ధాన్యాన్ని శరవేగంగా చేర్చడానికి కేవలం రవాణా ఖర్చుల కిందే వివిధ జిల్లాల కలెక్టర్లకు రూ.1.9 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
12 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు:
– మిచాంగ్ తుపాను ఏదో ఒకచోట తీరం దాటకుండా తీరం వెంబడి కదులుతూ ఉండడం వల్ల దాదాపు ఆరు రోజులపాటు రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీనివల్ల ఆరు రోజులపాటు నిరంతరాయంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తీరంలోనే ఎక్కువ కాలం తుపాను ఉన్నందువల్ల సముద్రంలో పోటు పెరిగి డ్రెయిన్లలో వరదనీరు సముద్రంలోకి కలవకపోవడంతో పొలాల్లోనే నీళ్లు నిలిచిపోయి, కోయకుండా పొలాల్లో ఉన్న పంట నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు, కౌలు రైతులను ఆదుకునేందుకు రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం వైయస్ జగన్ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ విస్తృతంగా ధాన్యాన్ని సేకరిస్తోంది. రైతులు, కౌలు రైతులనుంచి దాదాపుగా 12 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం ఇప్పటివరకూ సేకరించింది.
ధాన్యం వెరైటీల ప్రకారం గ్రేడెడ్ ఎంఎస్పీ ఇస్తూ..:
– గతంలో కేవలం ఏ– గ్రేడ్, సాధారణ రకం అనే రెండు రకాలుగానే ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు. ఈ విధానం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. కానీ వైయస్ జగన్ ప్రభుత్వం రైతులకు లాభం చేకూర్చే విధంగా ధాన్యం వెరైటీల ప్రకారం గ్రేడెడ్ ఎంఎస్పీ ఇచ్చి కొనుగోలు చేస్తోంది.
– ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీని అందించే విప్లవాత్మక మార్పును ఈ ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఇందులో భాగంగా తుపాను బాధిత ప్రాంతాల్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీని జనవరి నెలలోనే అందించడానికి ప్రభుత్వం అన్నిరకాలుగా సిద్ధం అవుతోంది.
– అంతేకాక పంట ప్రారంభంలోనే దెబ్బతిన్న రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలను కూడా సరఫరా చేయడమే కాకుండా మళ్లీ సీజన్ నాటికి వైయస్సార్ ఉచిత పంటల బీమా కింద పరిహారాన్ని కూడా అందిస్తోంది.
– రైతుల పట్ల ఇంత చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పని చేస్తుంటే ఈనాడు దినపత్రిక మాత్రం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా కథనాలు ప్రచురిస్తోంది.
రైతులకు అండగా ప్రభుత్వం:
– ప్రభుత్వ ఆదేశాల మేరకు మిచాంగ్ తుపాను వల్ల ఏర్పడిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే నమోదుచేసిన ఇ–క్రాప్ ఆధారంగా రైతులతోపాటు, కౌలు రైతులు సాగుచేసిన పంటనష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల చివరినాటికి తుపాను వల్ల నష్టపోయిన రైతుల జాబితాను ఖరారు చేయనున్నారు. కాగా సోషల్ ఆడిట్ ద్వారా అధికారులు తయారు చేసిన జాబితాను, రైతులు స్వయంగా పరిశీలించి తమ అభ్యంతరాలను కూడా నమోదుచేసి, తిరిగి తమ పేరును జోడించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.
– దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఇ– క్రాప్ వ్యవస్థ వల్ల నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు అత్యంత పారదర్శకంగా ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా, సబ్సిడీ విత్తనాలను ఈ ప్రభుత్వం అందించగలుగుతోంది.
1 952
– చివరి సంవత్సరం పరీక్షలు రాసిన 71,408 మందికి మేలో రూ.143.16 కోట్లు చెల్లించగా, ఆగస్టులో 1,29,240 మందికి రూ.42.69 కోట్లను ఈ ప్రభుత్వం చెల్లించింది. వీరంతా వివిధ కోర్సుల్లో ఆఖరి ఏడాది పరీక్షలు రాసినవారే.
– ఇక ఆ తర్వాత పరీక్షలు రాసిన, వివిధ కోర్సుల్లో ఆఖరి ఏడాది పరీక్షలు రాసిన 59,724 మందికి ఈ డిసెంబర్ 29న ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయనున్నారు.
పై వివరాలను గమనిస్తే విద్యా దీవెన పథకాన్ని వైయస్ జగన్ గారి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో అమలు చేస్తోందని స్పష్టమవుతుంది.
ఈనాడు వక్రీకరణలు– వాస్తవాలు
– కొన్ని కాలేజీలు ప్రభుత్వం ఫీజులు ఇచ్చేవరకూ వేచి చూడకుండా పిల్లల తల్లులు కట్టాలంటూ ఒత్తిడి తీసుకు వస్తున్నాయంటూ ఈనాడు దినపత్రిక వక్రీకరణకు దిగింది. కానీ ప్రభుత్వం డబ్బును తల్లుల ఖాతాల్లో జమచేసిన తర్వాత వారం పదిరోజుల్లోగా ఆ డబ్బును కాలేజీలకు చెల్లించాలని కోరడం జరిగింది. ఒకవేళ మూడు వారాల్లోగా చెల్లించనట్టయితే కాలేజీలు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే, తదుపరి విడతల్లో ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బు నేరుగా కాలేజీ ఖాతాలకు చెల్లిస్తుంది. ఏ విద్యార్థి తల్లిపైనా కాలేజీలు ఒత్తిడి తీసుకురావడానికి ఆస్కారం లేదనే విషయం అర్థమవుతుంది.
– కొన్ని కాలేజీలు ఫీజులు చెల్లించేంతవరకూ విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని ఈనాడు చెప్పుకొచ్చింది. కానీ ఏ కాలేజీకి కూడా విద్యార్థుల సర్టిఫికెట్లను తమ వద్ద ఉంచుకునేందుకు ఎలాంటి అధికారం లేదు. కాలేజీల నుంచి తీసుకున్న అండర్టేకింగ్ ప్రకారమే సకాలంలో వారికి ప్రభుత్వం ఫీజులు చెల్లించడం జరుగుతోంది
పూర్తి సంతృప్తస్థాయిలో విద్యా దీవెన
– జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకంలో భాగంగా.. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందినీ చదివించవచ్చు. ఈ పథకాలకు ఎలాంటి పరిమితి లేదు. గత ప్రభుత్వంలో అరకొర ఫీజు రీయింబర్స్మెంట్ లభించడం కూడా గగనంగా ఉండేది.
– కానీ సీఎం జగన్ గారు పేద విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు ఎంతో కృషిచేస్తున్నారు. గత ప్రభుత్వం ఇంజినీరింగ్కు గరిష్టంగా రూ.35 వేలు, ఫార్మాకు రూ.68 వేలు మాత్రమే ఏడాదికి చెల్లించేది.
– కానీ వైయస్ జగన్ గారి ప్రభుత్వం వివిధ కోర్సులకు రూ.3.05 లక్షల వరకు గరిష్టంగా చెల్లిస్తోంది.
ఈ పట్టికను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.
గత ప్రభుత్వం ఇంజినీరింగ్కు గరిష్టంగా రూ.35వేలు, ఫార్మాకు రూ.68వేలు మాత్రమే ఏడాదికి చెల్లించింది.
అర్హతే ప్రామాణికంగా
– గత ప్రభుత్వం కుల ప్రాతిపదికన, కోర్సు ప్రాతిపదికన కేవలం నాలుగు నుంచి పది వేలు మాత్రమే ఇచ్చేది.
– కానీ ఈ ప్రభుత్వం ఎలాంటి వివక్షా చూపకుండా, అర్హులైన అందరికీ సమానంగా వసతి దీవెన అమలు చేస్తోంది. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు; డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించేవారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని జగనన్న వసతి దీవెన కింద ఈ ప్రభుత్వం అందిస్తోంది. దీనికోసం వారికిచ్చే స్కాలర్షిప్పులను కూడా గణనీయంగా పెంచింది.
కుటుంబ వార్షిక ఆదాయం పెంపు
– గత ప్రభుత్వం హయాంలో డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టళ్లలో కాపులకు, ఈబీసీలకు డీఏహెచ్ వర్తించేదికాదు. ఈ ప్రభుత్వం ఇప్పుడు అందరితోపాటుగా సమానంగా వర్తింపచేసింది.
– గత ప్రభుత్వంలో కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి బీసీ/ఈబీసీ/కాపు/మైనారిటీలకు రూ.లక్ష కాగా, ఎస్సీ/ఎస్టీ, డీడబ్ల్యూలకు రూ.2 లక్షలు.
– కానీ వైయస్ జగన్ గారి ప్రభుత్వంలో కుటుంబ వార్షికాదాయ పరిమితిని గణనీయంగా పెంచుతూ మరింత మందికి పథకాన్ని వర్తింపు చేశారు. అన్ని వర్గాల వారికీ కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచారు.
– వసతి దీవెన డబ్బులు కూడా నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకే ఈ ప్రభుత్వం జమచేయడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రుల్లో జవాబుదారీతనాన్ని పెంచింది.
పేద పిల్లల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం ఇంత పకడ్బందీగా, పారదర్శకంగా పథకాలను అమలు చేస్తుంటే, ఈనాడు దినపత్రిక మాత్రం తప్పుడు కథనాలతో విష ప్రచారం చేస్తోంది.
1 952
‘దీవెనే శాపమైన వేళ..!’ అంటూ 19–12–2023న ఈనాడు దినపత్రికలో ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవం. తప్పుడు వార్తలతో రాష్ట్ర ప్రభుత్వం మీద రోజూ దుష్ప్రచారం చేస్తున్న ఈనాడు పత్రిక వక్రీకరణలు, అవాస్తవాలతో మరో కథనం వండివార్చింది.
ఇక్కడ ప్రధానంగా కొన్ని వాస్తవాలను చెప్పాలి.
– పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో.. దేశంలో సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం సీఎం వైయస్ జగన్ గారి ప్రభుత్వం మాత్రమే.
– ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ఫీజులు చెల్లించడమే కాదు, గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను కూడా చెల్లించి, సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తూ పేద విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలిచింది.
– 2014–19 మధ్య గత ప్రభుత్వం సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేయనేలేదు.
– గత ప్రభుత్వ నిర్వాకం వల్ల సర్టిఫికెట్లు రాక, విద్యార్థులు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. గత ప్రభుత్వం 2017 నుంచి ఇవ్వాల్సిన రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా ఈ ప్రభుత్వమే చెల్లించింది.
– ఈ ఏడాది ఆగస్టు వరకు... జగనన్న విద్యా దీవెన ద్వారా లబ్ధిపొందిన విద్యార్థులు 26.98 లక్షల మందికాగా, వారికి అందిన సాయం రూ.11,317 కోట్లు.
– జగనన్న వసతి దీవెన ద్వారా లబ్ధిపొందిన విద్యార్థులు 25.17 లక్షల మందికాగా, వారికి అందిన సాయం రూ.4,276 కోట్లు.
– గత ప్రభుత్వం ఐదేళ్ల హయాంలో చెల్లించిన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కలిపితే సగటున మొత్తం ఏడాదికి రూ.2,428 కోట్లు మాత్రమే. వైయస్ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదికి చెల్లిస్తున్న సగటు మొత్తం రూ.4,044 కోట్లు. అంటే దాదాపు రెట్టింపు.
– పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా, పూర్తి పారదర్శకంగా వైయస్ జగన్ గారి ప్రభుత్వం విద్యాదీవెన పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే ప్రభుత్వం జమచేస్తోంది.
గత ప్రభుత్వంలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లేనేలేదు
– గత ప్రభుత్వం సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేయలేదు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేయలేదు సరికదా... చెల్లించే అరకొర ఫీజులు కూడా బకాయిలు పెట్టింది. మరీ ముఖ్యంగా.. కాలేజీ ఫీజుల కన్నా తక్కువగానే ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఫీజులు చెల్లించేవారు.
– నిజానికి జగనన్న విద్యా దీవెన పథకాన్ని గత ప్రభుత్వంతో పోల్చిచూస్తే.. అమల్లోగాని, నిధుల విడుదలలోకాని, లబ్ధి పొందుతున్న విద్యార్థుల సంఖ్యలోగాని ఏరకంగా చూసినా ఈ ప్రభుత్వం హయాంలోనే సంపూర్ణంగా అమలు జరుగుతోంది. గత ప్రభుత్వం అరకొరగానే ఫీజులిచ్చింది. ఇచ్చే అరకొర ఫీజులను కూడా బకాయిలు పెట్టినంది. మిగిలిన ఫీజులు చెల్లించడానికి తల్లిదండ్రులు అప్పులు పాలైనా ఈనాడు దినపత్రిక ప్రజాపక్షాన నిలవలేదు.
ఎప్పటికప్పుడు ఫీజులు చెల్లిస్తున్న ప్రభుత్వం
– ఈ ప్రభుత్వం ఏ త్రైమాసికానికి సంబంధించిన ఫీజులను ఆ త్రైమాసికంలోనే చెల్లిస్తోంది. కేవలం మిచాంగ్ తుపాను పరిస్థితుల కారణంగా జులై – సెప్టెంబరు త్రైమాసికానికి చెల్లించాల్సిన కార్యక్రమం డిసెంబర్ 29కి వాయిదా పడింది. అక్టోబరు – డిసెంబరు 2022 కాలానికి చెల్లించాల్సిన రూ.698.68 కోట్లను మార్చి నెలలోనే ప్రభుత్వం చెల్లించేసింది.
– జనవరి– మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించి రూ.702.99 కోట్లను ఈ ఏడాది మే 24 తేదీన చెల్లించింది.
– అలాగే ఏప్రిల్ – జూన్ 2023 త్రైమాసికానికి చెందిన రూ.680.44 కోట్ల మొత్తాన్ని ఆగస్టు నెలలో చెల్లించింది.
– ఇప్పుడు జులై– సెప్టెంబరు త్రైమాసికానికి సంబంధించిన సొమ్మును కూడా ఈనెల డిసెంబర్ 29న విడుదల చేయనుంది. ఇప్పటివరకూ జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన కింద రూ.15,592.87 కోట్లను సీఎం వైయస్ జగన్ గారు నేరుగా జమ చేయడం గమనార్హం.
చిత్తశుద్ధితో అమలు చేస్తూ..:
– చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సంబంధించి వివిధ కోర్సుల్లో తుది పరీక్షలు రాసిన విద్యార్థులకు మూడు, నాలుగు త్రైమాసికాలకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ను కూడా మేలో, ఆగస్టులోనే ప్రభుత్వం చెల్లించింది.
– కాగా మే నెలకన్నా ముందుగా తుది పరీక్షలు రాసినవారికి, అలాగే ఆగస్టు– నవంబర్ నెలల్లో పరీక్షలు రాసిన వారికి కూడా ముందుగానే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించింది.
– వివిధ కోర్సుల్లో ఆఖరి సంవత్సరం పరీక్షలు రాసిన మిగిలిన కోర్సుల విద్యార్థులకు ఈ డిసెంబర్ 29న ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయనుంది.
1 952
Both in 2013-14 and in 2019-20, the issuances for tenors more than 15years is more than one third of the total issuances. And issuances for tenors more than 10 years is more than half of the issuances.
The widespread malicious campaign that the previous Government had utmost regard for capital expenditure and that the present Government is not spending enough on the creation of wealth, holds no merit. Owing to the outbreak of the Covid-19 pandemic that has adversely impacted economies across the globe for more than two financial years. The capital formation in an economy is measured by the Gross Fixed Capital Formation, which is a part of the GDP estimation. A declining trend with respect to it was witnessed with one year witnessed a contraction to the tune of 7.34%. Despite this, the capital expenditure under the present Government is not discouraging when compared with the performance of the previous Government. there is no real reduction in capital expenditure as has been alleged.
Borrowings by APSBCL
During the regime of the present Government, an NCD issuance was made by Andhra Pradesh State Beverages Corporation Limited, and the issuance was rated AA by India Ratings and Research Limited (Indian affiliate of the global ratings giant FITCH) and AA+ by ACUITE. This was the highest rating received by any AP State PSU. These ratings were reaffirmed in June 2023 and this issuance was made on the strength of the revenues of AP State Beverages Corporation alone with no dependance whatsoever on the State Budget. Further, the terms on which NCDs were issued were way more favorable when compared with the terms on which APCRDA issued bonds during the regime of the previous Government. Further, as against the APCRDA coupon rate of 10.32%, the coupon rate of AP State Beverages Corporation issuance was only 9.62%. Further, APCRDA was oversubscribed by 1.53 times and in comparison, the first tranche of AP State Beverages Corporation issuance was 4.15 times. If, the EENADU article is to be believed that the issuance was deemed unconstitutional by the Ministry of Finance, Government of India, why would SEBI which functions under DEA, MOF give an approval for the issuance and not withdraw the permission till the time it automatically lapses. The State Government withdrew the issuance in the month of August owing to slight changes in the necessity of funds for the stipulated end use. The Eenadu article misleads its readers by projecting that this issue was cancelled by the BSE. Further, if the structure was unconstitutional, how would a ratings agency rate the bond at AA?
Has RBI cautioned banks against giving loans to AP PSUs?
This is completely incorrect and the claim hold no substance. There is now an increased consciousness at the Central Government level that Government PSUs that do not have revenue sources of their own should not borrow and must be funded by Government budget. It is owing to this policy stand that RBI has given a directive to all scheduled commercial banks against lending to any PSU which does not have a revenue source to service the debt. This has nothing to do exclusively with AP. For instance, the Central Government budgeted that for NHAI, for the year 2021-22, the budgetary support would be Rs. 57,350 crores and the internal borrowings by NHAI would be to the tune of Rs. 65,000 crores. Against this, the year 2022-23, the NHAI funding was budgeted to be exclusively from the Central Government to the tune of Rs. 1,34,015 crores, and NHAI was projected to not make any borrowing. Therefore, this is policy level change and has nothing to do with AP.
It is requested that the opposition affiliated media exercise restraint and not spread rumors for sake of the political interests. Misinformation can have disastrous consequences on the future and overall development of an economy and welfare of the State.
The attached tables, give a clear image to the various comparisons drawn on the relevant state finance related malicious campaigns;
1 952
Further, a PSU can conceivably take debt either as a loan from public sector banks or from Financial institutions or by NCDs (Non convertible debentures) issued on private placement basis. There are no other means for PSUs to borrow. In response to a query made by Sri Kanamedala Ravindra Kumar as to the borrowings by AP State Government owned PSUs. The Hon’ble Minister of State for Finance, has obtained the information from various Public sector banks and Financial institutions as to the lending to AP Government owned PSUs. The aggregate of this amount is slightly lower than what is declared by AP Government. This is because of the liabilities on account of NCD issuances under SEBI guidelines.
Therefore, to say that there is some hidden borrowing somewhere which is not visible to any authorities such as RBI or CAG or Union Ministry of Finance or other Union Ministries or SEBI is highly objectionable as it undermines the credibility and robustness of the Country’s financial systems. Therefore, what can be surmised from the above is that, the debt increase during the period of the present Government is not higher than what was accumulated during the period of the TDP Government, both in terms of absolute numbers as well as in terms of CAGR numbers.
All forms of debt taken are aggregated regardless of whether they are being serviced by the State Government or not, increase of liabilities as a percentage to GSDP during the 5 year period 2014-19 is as high as 7.45% and comparatively during the period 2019-23, the figure is only 5.21% and notably, this is during a period when the Covid-19 pandemic and its aftermath necessitated even the Central Government enhance the borrowing limits to State Governments.
The fiscal deficit would only be known at the end of the financial year and not before, the monthly key indicators convey only provisional figures, of which the item public account is subject to significant changes.
Even as per the CAG provisional number for the first seven months of this financial year, the increase in public debt is Rs. 44,332.41 crores. Whereas the EENADU article wrongly conveys the increase as 71,199 crores. Public account balances, as conveyed, are subject to significant change and therefore delving deep into provisional numbers would not be of much help. What is most damaging is the PSU’s debt which is being completely misinformed.
The outstanding non-guaranteed loans of the power sector are Rs. 53,019.15 crores as on 31st March 2023. This is as per the audited financials of the power sector corporations, How can anyone imagine the same to increase to Rs. 95,000 crores in just a few months.
The guaranteed corporation loans as of March, 2023 are Rs. 1,14,975 crores (apart from civil supplies corporation debt). Not much guaranteed loans have been availed during this fiscal. Then, how can the same increase phenomenally to Rs. 1,95,000 crores?
The article also alleges that the State Government is not making any attempt to repay loans. This is very absurd, given the fact that debt is a charged expenditure and is directly debited to the Consolidated Fund in accordance with the loan schedule by the RBI, who manages the public debt To begin with, no Government faces any rollover risk. The repayment of debt is added to the borrowing ceiling as permitted by the Central Government and the State Government is allowed to borrow. Therefore, even if there is a higher debt repayment requirement in a particular year, It would not have any implication whatsoever on the fiscal deficit for that year. Because fiscal deficit is only net debt borrowed and not gross debt borrowed. Therefore, the allegation is silly. Further, finance department of any State Government would take into consideration parameters such as the yield achievable in the auction and decide on the tenor.
1 952
In the light of the continuous misinformation propaganda by the opposition parties and the related media, now slipping to a new low today with the Eenadu article wherein the newspaper shamelessly conveyed incorrect and baseless figures in the most objectionable distasteful manner, on state finances.
Despite continuous rebuttals by the State Government with utmost sincerity by providing verifiable and independent sources, the Opposition affiliated media continuously spreads misinformation with disregard to journalistic ethics and morals. Not one source is ever indicated to support their allegations.
The RBI releases a report on State finances every year titled, ‘State Finances - A study of Budgets’. This report contains the State wise details of outstanding liabilities for the past 15 years. In fact, the RBI has taken into consideration the audited numbers released by the CAG and after making some minor adjustments to better reflect the actual position and arrives at the figures for State wise outstanding liabilities. As per this report the total outstanding liabilities of government of Andhra Pradesh at the end of March 2023 are estimated at Rs 4,28,715.70 Crs.
1)The outstanding liabilities of the combined State of Andhra Pradesh on 31st March 2014 was Rs. 1,96,202.40 crores.
2) To this, Rs. 7,333 crores was added as this is the fiscal deficit for the first two months of 2014-15 financial year.
3) As per the State Reorganization Act, 58% is devolved to the successor State of Andhra Pradesh.
Thus, the liability of the State of AP at the time of formation of the TDP Government in June 2014 was Rs. 1,18,050 crores and the same has increased to Rs. 2,64,451 crores as of 31st March 2019. TDP Government was in existence till almost the end of May 2019 and during the first two months of the financial year 2019-20, the government had borrowed another Rs. 7,346.56 crores. Therefore, by the time of dissolution of the TDP Government, the liabilities have swollen to Rs. 2,71,797.56 crores.
The outstanding liabilities have increased by 169% during the 5 year TDP period. This translates to a compounded annual growth rate of the liabilities of 21.87% during 2014-19. As against that, the outstanding liabilities have increased by only 55% during the five year YSRCP rule from 2019-23, translating to a compounded annual growth rate of only 12.07% during the period 2019-23.
With respect to off budget borrowings, all kinds of rumors are being circulated.
In accordance with Article 293(1), the State Government has provided guarantees within the limits stipulated by the State Legislature. The Andhra Pradesh Fiscal Responsibility and Budget Management Act, 2005 stipulates the limits within which the State Government can provide guarantees. Further, in accordance with the power conferred under Section 15 of the Act, the Andhra Pradesh Fiscal Responsibility and Budget Management Rules, 2006 have been issued. As per rule 6 of said rules, the State Government is required to disclose the details of guarantees it provided in FORM D-4, at the time of presenting the budget. In absolute adherence to this rule, every year, the State Government has been providing the details of the guarantees given and utilized, as part of the budget documents.
Apart from this, as part of a regular practice, the entity wise debt availed on the strength of the Government guarantee, the nature of debt availed etc. are also being provided in a very comprehensive fashion in Volume-V of the Budget document, which includes Statement of Government guarantees, Debt position and Securities lent to companies and other undertakings. When the State Government is presenting all these details in the same manner as what was being done before under earlier dispensations, to say that the State is concealing information is grossly wrong.
1 952
– గత ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ సబ్సిడీ కోసం చెల్లించాల్సిన రూ.12వేల కోట్లు ఇవ్వకపోవడంతో డిస్కంలపై తీవ్ర భారం పడింది. జనరేషన్ ప్లాంట్లకు ఇచ్చిన కరెంటుకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేక మొత్తం రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని సంక్షోభంలోకి నెట్టారు.
– కానీ వైయస్ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలను చెల్లించడంతోపాటు, ఉచిత విద్యుత్ సబ్సిడీ కోసం రూ.46 వేల కోట్లు ఖర్చు చేసింది. దీంతో డిస్కంలు జెన్కోలకు సకాలంలో బకాయిలు చెల్లించి, విద్యుత్ కొనుగోళ్లు చేసి రైతులకు అందించగలుగుతున్నాయి.
సీఎం వైయస్ జగన్ దూరదృష్టి – సెకీతో ఒప్పందం
– అంతేకాదు, ఉచిత విద్యుత్ హామీకి అనుగుణంగా దీర్ఘకాలికంగా పగటి పూట వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు విద్యుత్ పంపిణీ సంస్థలు ఒప్పందం కూడా చేసుకున్నాయి. కేవలం రూ.2.49లకే యూనిట్ కరెంటు లభించేలా ఒప్పందం చేసుకున్నాయి. వచ్చే ఏడాది సెప్టెంబరు నుంచి 3వేల మెగావాట్లు, 2025 సెప్టెంబరు నాటికి మరో రూ.3వేల మెగావాట్లు, ఆ మరుసటి ఏడాది వేయి మెగావాట్లు అందుబాటులోకి వస్తాయి. ఇది సీఎం వైయస్ జగన్ గారి దూరదృష్టికి నిదర్శనం.
– గత ప్రభుత్వం పీపీఏల రూపంలో ఆర్థిక వ్యవస్థ నడ్డివిరిచేలా నిర్ణయాలు తీసుకుంటే.. ఈ ప్రభుత్వం రైతులకు మేలు చేసేలా దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంది. సెకీతో జరిగిన ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక భాగస్వామి. దాని ప్రకారం ఈ ఒప్పందం నిమిత్తం అయ్యే విద్యుత్ కొనుగోలు వ్యయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. రానున్న మూడు దశాబ్దాలపాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఈ ఒప్పందం ఉపకరిస్తుంది.
కొత్తగా 3.83 లక్షల వ్యవసాయ పంపుసెట్లు
గత ఆర్థిక సంవత్సరం (2022–23)లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1.25 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ఈ ప్రభుత్వం మంజూరు చేసింది. 2019–2023 మధ్య ఈ ప్రభుత్వం సుమారు 3.83 లక్షల వ్యవసాయ పంపుసెట్లు మంజూరు చేసింది.
– ‘‘రాష్ట్రంలో ఇచ్చేదే ఏడు గంటల విద్యుత్.. అందులోనూ సగటున రెండు గంటలు కోతలే.. లోడ్ రిలీఫ్ ఇతరత్రా పేరిట ఇష్టారాజ్యంగా నిలిపేస్తున్నారు’’ రంటూ ఈనాడు రాసింది పూర్తిగా అవాస్తవం. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి అన్ని రంగాలకు మరీ ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంతృప్తికరంగా ఉంది. వచ్చే వేసవి పూర్తి అయ్యేవరకు ఏ ఇబ్బందీ లేకుండా అందుబాటులో ఉన్న విద్యుత్ కేంద్రాలతో పాటు కావలసిన మేర స్వల్పకాలిక మార్కెట్ నుండి ప్రభుత్వం కొనుగోళ్లు ఖరారు చేసింది.
వ్యవసాయానికి కచ్చితంగా 9 గంటల విద్యుత్
– గ్రిడ్ నిర్వహణ నిమిత్తం ఎప్పుడైనా డిమాండ్ కు సరిపడా విద్యుత్ అందుబాటులో లేనప్పుడు, గ్రిడ్ ఫ్రీక్వెన్సీ పరిమితికి మించి అదుపులో లేనప్పుడు, పగటి పూట సౌర విద్యుత్ ఉత్పత్తి ఉన్న ప్రాంతాల్లో మేఘాలు కమ్మినప్పుడు మాత్రమే ఎప్పుడైనా కాసేపు విద్యుత్ సరఫరా నియంత్రణ చేయడం జరుగుతుంది.
– అలాగే దక్షిణాది విద్యుత్ గ్రిడ్లో సరఫరాకు తీవ్ర కొరత ఏర్పడినప్పుడు, గ్రిడ్ ఫ్రీక్వెన్సీ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నప్పుడు, దక్షిణ రీజియన్ లోడ్ డిస్పాచ్ – బెంగళూరు వారు కేంద్ర విద్యుత్ గ్రిడ్ నుండి వచ్చే విద్యుత్ను రాష్ట్రాల వాటా ప్రకారం నియంత్రణ చేసే క్రమంలో ఒక్కోసారి కేంద్ర గ్రిడ్ కు అనుసంధానమై ఉన్న అధిక కెపాసిటీ గ్రిడ్ ట్రాన్స్ఫార్మర్లను ట్రిప్ చెయ్యడం ద్వారా పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంటారు.
– అలాంటి సమయాల్లో కూడా కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు కొంతసేపు అంతరాయం ఏర్పడే అవకాశం వుంది. ఇది రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ చేతుల్లో ఉండదు. అయితే ఇలా ఎప్పుడైనా వ్యవసాయ రంగానికి విద్యుత్ అంతరాయం అప్పుడప్పుడూ ఏర్పడితే ఆ కోల్పోయిన సమయాన్ని మళ్ళీ అదే రోజు వేరొక సమయంలో ఇచ్చి తొమ్మిది గంటల సరఫరా భర్తీ చేయడం జరుగుతోంది. ఇలా ఎప్పుడోగానీ జరగదు.
వాస్తవాలు ఇలా ఉంటే.. కేవలం అవాస్తవాలు, అభూత కల్పనలతో రైతులను, ఇతర వర్గాల ప్రజలనూ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది ఈనాడు దినపత్రిక.
1 952
‘నయవంచక సర్కారును ఏ తీగలపై ఉతికారేయాలి?’ అంటూ 18–12–2023న ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన కథనం పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. రైతులకు ఉచిత విద్యత్ పథకాన్ని సత్సంకల్పంతో, దృఢ నిశ్చయంతో సీఎం వైయస్ జగన్ గారి ప్రభుత్వం అమలు చేస్తున్నా.. కేవలం ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలన్న దురుద్దేశంతో ఈనాడు మాత్రం తప్పుడు రాతలు రాస్తోంది. ఈనాడు దినపత్రిక ఒక ఉన్మాదిలా మారి పూర్తిగా అసత్యాలు, అభూత కల్పనలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది.
– రానున్న మూడు దశాబ్దాలపాటు.. ఎలాంటి అవాంతరాలు లేకుండా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి సీఎం వైయస్ జగన్ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది సీఎం వైయస్ జగన్ గారి దూరదృష్టికి నిదర్శనం.
– రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ సరఫరా పరిస్థితి అన్ని రంగాలకు మరీ ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంతృప్తికరంగా ఉంది. వచ్చే వేసవి పూర్తి అయ్యేవరకు ఏ ఇబ్బందీ లేకుండా అందుబాటులో ఉన్న విద్యుత్ కేంద్రాలతో పాటు, ప్రభుత్వం కావలసిన మేర స్వల్పకాలిక మార్కెట్ నుండి కొనుగోళ్లు ఖరారు చేసింది.
– రాష్ట్ర విభజన నాటికి మొత్తం విద్యుత్ సంస్థల అప్పులు దాదాపు రూ.29,700 కోట్లు ఉంటే మార్చి 2019 నాటికి భారీగా రూ.68,600 కోట్లకు (131% పెరుగుదల) పెరిగాయి. ఇది గత ప్రభుత్వ నిర్వాకం. 2019లో వైయస్ జగన్ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ మార్చి 2023 నాటికి రూ.97,500 కోట్లకు (42% పెరుగుదల) చేరాయి. విద్యుత్ సంస్థల అప్పుల భారం 2014–19 మధ్య కాలంలోనే ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది.
– విద్యుత్ పంపిణీ సంస్థలు, డిస్కంల నికర విలువ 2014లో సుమారు మైనస్ రూ.4,315 కోట్లు ఉంటే, ఆ ప్రభుత్వం దిగిపోయేనాటికి, ఆ డిస్కంల నికర విలువ మరింత దారుణంగా క్షీణించి మైనస్ రూ.20వేల కోట్లకు చేరింది.
మొత్తానికి రైతు అన్నవాడు పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుపోయాడు.
గత ప్రభుత్వం పాలన మరో చీకటి అధ్యాయమని రైతులే చెబుతారు.
– ప్రజలకు జ్ఞాపకశక్తి ఉండదని, ఈతరం వారికి గతంలో జరిగినవి తెలియదని నిరంతరం భావించే ఈనాడు దినపత్రిక రైతులకు విద్యుత్ అందించడంలో గతమెంతో ఘనకీర్తి అన్నట్టుగా మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తోంది.
– ఈనాడు దిన పత్రిక చరిత్రను ఒక్కసారి రెండు దశాబ్దాల కిందకు వెళ్లిచూస్తే రైతులకు ఉచిత విద్యుత్ వద్దని, దీనివల్ల విద్యుత్ సంస్థలు సంక్షోభంలోకి వెళ్లిపోతాయంటూ పరోక్షంగా కథనాలు రాసి, అప్పటి ప్రభుత్వం తీసుకున్న రైతు వ్యతిరేక చర్యలకు పూర్తిగా మద్దతు పలికింది.
– ఉచిత విద్యుత్ ఇస్తామంటే.. కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనంటూ అప్పటి ప్రభుత్వ నాయకుడి మాటలను గొప్పగా కీర్తించి, రైతుల ప్రయోజనాలను పూర్తిగా మంటగలిపేందుకు తనవంతు సాయం చేసింది ఈనాడు దినపత్రిక. అప్పట్లో పగటిపూట దేవుడెరుగు.. రాత్రి పూట కూడా కనీసం నాలుగు గంటలు నిరంతరంగా కరెంటు ఇచ్చిన పాపానపోలేదు. రాత్రిపూట నీటి తడులు పెట్టడానికి పొలాలకు వెళ్లి అనేక మంది రైతులు పాము కాట్లకు గురయ్యేవారు. చీకట్లో విద్యుదాఘాతాలతో మరణించిన ఘటనలు అనేకం.
– 2014లో అదే ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టిన తర్వాత కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పులేదు. రైతులకు సరఫరాచేసే విద్యుత్తు అరకొరే. అదికూడా రాత్రిపూటే. పైగా ఉచిత విద్యుత్కోసం విద్యుత్ పంపిణీ సంస్థలు – డిస్కంలకు చెల్లించాల్సిన సబ్సిడీ రూ.12వేల కోట్లు చెల్లించకపోవడంతో రైతులకు ఉచిత విద్యుత్ పథకం పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుంది.
వైయస్ జగన్ గారి రైతు పక్షపాత ప్రభుత్వం
– సీఎం వైయస్ జగన్ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పక్షపాత ప్రభుత్వంగా అనేక చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ఉచిత్ విద్యుత్ పథకం దీర్ఘకాలంగా, స్థిరంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా అందడానికి గట్టి చర్యలు తీసుకున్నారు సీఎం జగన్ గారు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 9 గంటలపాటు నిరంతరరాయంగా విద్యుత్ సరఫరా ప్రారంభించారు.
– ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ వ్యవసాయ రంగానికి, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రోజుకి తొమ్మిది గంటల విద్యుత్ ఏ ఇబ్బందీ లేకుండా సరఫరా చేయడం జరుగుతోంది. ఈ సరఫరా సమయం కూడా పగటి పూటే
ఉండేలా ఈ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
రూ.1760 కోట్లతో ఫీడర్ల సామర్థ్యం పెంచిన సీఎం జగన్
– సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక రూ.1760 కోట్లు ఖర్చు చేసి 6,663 ఫీడర్లకు అదనపు సామర్థ్యం కల్పించడం ద్వారా పగటిపూట విద్యుత్ సరఫరాకు మార్గాన్ని సుగమం చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ పంపిణీ కోసం పంపిణీ వ్యవస్థపై ఇంత పెద్ద ఎత్తున ఖర్చుచేసింది ఈ ప్రభుత్వం.
