Voice of Police
https://bit.ly/3y1BVgi 🚔Join Now🙏 Daily Updated information about all Police Organaizations 👉 Crime News 👉 Genuine Information 👉 Latest Reforms 👉 New Amendments 👉 Regular Activities 👉for more ✍️updates👍 subscribe now🙏 @voiceofpolice🙏
إظهار المزيد2 118المشتركون
-124 hour
-47 يوم
+730 يوم
- المشتركون
- التغطية البريدية
- ER - نسبة المشاركة
جاري تحميل البيانات...
معدل نمو المشترك
جاري تحميل البيانات...
*ఉద్యోగులకు పనిచేసే జిల్లా లోనే పోస్టల్ బ్యాలెట్ సదుపాయం*
*అదనపు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఏం.ఎన్.హరింద్ర ప్రసాద్*
వెలగపూడి, ప్రధాన ప్రతినిధి : పోస్టల్ బ్యాలెట్ సెంట్రల్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో భాగంగా తొలి విడతలో 80,111 ఫారం -12 లు, 10,123 ఫారం-12డి లు మార్పిడి చేసుకోవడం జరిగింది. ఎన్నికల విధుల్లో ఉన్న రెగ్యులర్ (ఫారం -12), అత్యవసర సేవల (ఫారం -12డి) ఉద్యోగులకు పనిచేసే జిల్లా లోనే పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో పోస్టల్ బ్యాలెట్ల తొలి ఎక్స్చేంజి కార్యక్రమం ఆదివారం జరిగింది. అదనపు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఏం.ఎన్.హరింద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సెంట్రల్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో 26 జిల్లాలకు చెందిన పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో 26 జిల్లాలకు చెందిన పోస్టల్ బ్యాలెట్ నోడల్ ఆఫీసర్లు వారి జిల్లాలో సేకరించబడిన
ఫారం -12 లు మరియు ఫారం-12డి లతో హాజరయ్యారు. ఏ ఏ జిల్లాలకు చెందిన పోస్టల్ బ్యాలెట్ లను ఆయా జిల్లాల పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులకు అందజేసుకున్నారు.
ఈ ఎక్సేంజ్ కార్యక్రమంలో అందిన దరఖాస్తులకు అనుగుణంగా ఆయా జిల్లాల పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులు ఖాళీ పోస్టల్ బ్యాలెట్ లతో మే 3 వ తారీఖున తిరిగి ఈ సెంట్రల్ ఎక్స్చేంజ్ కార్యక్రమానికి హాజరై ఏ జిల్లాలకు చెందిన పోస్టల్ బ్యాలెట్ లను ఆ జిల్లాల పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులకు అందజేస్తారు. ఈ విధంగా అందిన ఖాళీ పోస్టల్ బ్యాలెట్ లను సంబధిత ఉద్యోగులకు అందజేసి, ఆయా ఉద్యోగులు ఓటు వేసిన తదుపరి మళ్లీ ఆ పోస్టల్ బ్యాలెట్ లను మే 10 వ తేదీన తిరిగి ఈ సెంట్రల్ ఎక్సైజ్ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాలకు పంపించడం జరుగుతుంది.
తొలిసారిగా జరిగిన ఈ సెంట్రల్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో ఫారం - 12 లకు సంబంధించి అత్యధిక మొత్తంలో విశాఖపట్నం జిల్లా నుండి 5,625 దరఖాస్తులు రాగా, అత్యల్పంగా 969 దరఖాస్తులు అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి వచ్చాయి. ఫారం -12 డి లకు సంబంధించి అత్యధిక మొత్తంలో 999 దరఖాస్తులు పల్నాడు జిల్లా నుండి రాగా, అత్యల్పంగా 25 దరఖాస్తులు శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాయి.
జాయింట్ సీఈఓ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈవో మల్లిబాబు తదితరులతోపాటు అన్ని జిల్లాలకు చెందిన పోస్టల్ బ్యాలేట్ నోడల్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
SBI - PSP
PC 166 B Ganesh of 14 Bn APSP on Depn with Redsanders Taskforce died in the hands of Redsander Smuglers on 6.2.2024 st TPT.
Smt B Anusha, Wife (Legal Heir) has been paid Rs.30 lakh as Spl Exgratia from CM Relief Fund on 16.2.2024
Today, 26.4.24, under SBI PSP, Rs.75 lakh towards PAI Insurance amt was also credited to her bank Acct.
For information.
Regards
Rajan, CAO
*గన్ మిస్ ఫైర్.. డీఎస్పీ మృతి*
భద్రాద్రి జిల్లా
భద్రాద్రి జిల్లాలోఈరోజు ఉదయం విషాదం చోటు చేసుకుంది.
గన్ మిస్ ఫైర్ కావడంతో సీఆర్పీఎఫ్ డీఎస్పీ శేషగిరి రావు ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్ళింది. తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మర్గమధ్య లో మరణించారు.
కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప 81వ బెటాలియన్ లో బుధవారం ఈ ఘటన జరిగింది.