ఆరోగ్యమే మహాభాగ్యము
2 492
Suscriptores
+524 horas
+127 días
+1430 días
Archivo de publicaciones
కామ చూడామణి రసం...కోరికలను పెంచుతుంది
కారణాలు ఏవైనా కావచ్చు, దురలవాట్లకులోనైనాక ఆరోగ్యసమస్యలే కాక శృంగార సమస్యలు కూడా మనిషిలో ఉత్పన్నమౌతాయి. శృంగార సమస్యలను దూరం చేయడంలో "కామ చూడామణి రసం"ఎంతో ఉపయోగ పడుతుంది
ఇది కేవలం పురుషులకే కాకుండా స్త్రీలకు కూడా ఎంతో లాభదాయకమని గర్భాశయం, డిండాశయం, యోని ఇతర అవయవాలకు ఆరోగ్యాన్ని, పటుత్వాన్ని కూడా పెంచుతుంది. అంతే కాకుండా స్థనాలను బలిష్టంగా, గుండ్రంగానూ వుంచుతుంది.
ఇంతేకాకుండా స్త్రీలలో నెలసరి ఋతుక్రమాన్ని కూడా క్రమబద్ధీకరిస్తుంది. ఏ విధంగానైతే పరుషులలో తమ పురుషాంగాన్ని పటుత్వంగా ఉంచుతుందో అదేవిధంగా స్త్రీలలో కూడా వారి స్త్రీత్వాన్ని బలిష్టంగా వుంచుతుంది. ఏ వయసు వారైనా, ఏ ఋతువులోనైనా కూడా వైద్యుల సలహా మేరకు ఈ మందును తీసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు.
కావలసిన వస్తువులు...
సువర్ణ భస్మం
ముక్తా పిష్టి,
త్రివంగ భస్మం
రజత భస్మం.
సువర్ణమాక్షిక భస్మం, ,
అభ్రకభస్మం
భీమసేని కర్పూరం,
జాపత్రి,
జాజికాయ
కుంకుమ పువ్వు
లవంగాలు
ఏలకులు
ప్రతిదీ 20 గ్రాములు తీసుకుని ఏలకలు, నాగకేసరాలచూర్ణం 60 గ్రాములతో కలిపి చూర్ణంగా తయారుచేసుకోవాలి.
తయారు చేయువిధానం...వీటినన్నిటిని పొడి చేసుకుని శతావరి రసంలో ఏడురోజులు భావనచేసి ఆరించి తర్వాత చూర్ణం చేసుకోవాలి
వాడేవిధానం.
ఒక టీ స్పూను గోరువెచ్చని నీళ్ళతో ఆహారానికి అరగంట ముందు పొద్దున రాత్రి తీసుకోవాలి
కామ చూడామణి రసంవలన ఉపయోగాలు
ఈ రసం వీర్యంను వృద్ధి చేసేది, పుష్టికరమైనది, కామోద్దీపనం కలిగించేది. శరీరంలోని పిత్తం, మద్యం, మాంసాహారం, అమితంగా మసాలా పదార్థాలను తీసుకోవడంవలన వచ్చే దుష్పరిణామాలను ఇది అరికడుతుంది. ఇది అన్ని ఋతువులలోనూ ఉపయోగించవచ్చని వైద్యులు తెలిపారు
####################
Cell.9949363498
Weight Loss best Remedy :-
బరువు తగ్గడానికి
1, శొంటి 100 గ్రా
2, శుద్ది చేసిన పిప్పళ్ళు 100 గ్రా
3, మిరియాలు 100 గ్రా
4, చిత్రమూలo 100 గ్రా
5, వాయు విడంగాలు 100 గ్రా
6, కరక్కాయ 100 గ్రా
7, ఉసిరికాయ 100 గ్రా
8, తానికాయ 100 గ్రా
9, తుంగమస్తలు 100 గ్రా
10, ఉత్తరేణి వేర్ల పొట్టు 100 గ్రా
11 అక్కరకర్ర. 100 గ్రా
ఈ అన్ని వస్తువులు మంచి నాన్యమైనవి తీసుకొని, విడివిడిగా చూర్నము చేసి, అన్నీ కలిపి జల్లించి ఒక సీసాలో భద్రపరిచి , రోజూ ఉదయం ఆహారానికి అర్దగంట ముందు ఒక స్పూన్ పొడి ఒక గ్లాస్ మజ్జిగలో అలాగే రాత్రి ఒక స్పూన్ భోజనానికి అరగంట ముందు ఒక గ్లాస్ మజ్జిగలో తీసుకోవాలి,
ఇలా రోజూ ఉదయం మరియు రాత్రి రెండు ఫూటలా ఈ మందు తీసుకోవడం వల్ల అధికంగా శరీరంలో ఉండే కొవ్వు కరుగును, కండరాలల్లో వుండే కొవ్వు కరుగును ఎక్కువగా ఉన్న పొట్ట, పిరుదులు, తొడలు శరీరం, ఛాతీ అన్ని భాగాలు తగ్గుతాయి, శరీరం మెత్తం తగ్గి బరువుతగ్గుతారు తేలికగా మారుతారు.
ఈ మందు చేసుకొని వాడి అందరూ ప్రయేజనం పొందగలరు.
మాంసం, నూనె వస్తువులు, ఫ్రై, కొవ్వు పదార్థాలు, తీపి పదార్థాలు వాడకూడదు.
🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸
Call 9949363498
అన్ని లివర్ సమస్యలకు
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
నేల ఉసిరి చూర్నం 100గ్రా
నేలవేము చూర్నం 100గ్రా
తెల్లగలిజేరు చూర్నం 100గ్రా
కస్తూరి పసుపు చూర్ణం 100గ్రా
మండూర భస్మం 10గ్రా
గుంటగలగర చూర్నం 100గ్రా
ఈ అన్ని కలిపి రోజు ఉదయం ఒక స్పూన్ రాత్రి ఒక స్పూన్ రెండు గ్లాసుల నీటిలొ ఒక గ్లాస్ అయ్యెవరకు మరిగించి ఈ కసాయాన్ని వడపొసి త్రాగాలి, ఇలా రోజు రెండు సార్లు బోజనానికి ముందు తీసుకొవాలి, మీరు అనుకొని రిసెల్ట్ సమస్య తగ్గడం కొద్దిరోజులనుంచి చూడగలరు మొత్తము 3 నుంచి 6 నెలలు వాడాలి
పత్యం : అధికంగా నూనె వస్తువులు,వేపుళ్లు, మాంసవస్తువులు, అదికంగా కారం ఉప్పు తీసుకొకూడదు
పై సమస్య తగ్గె వరకు మీరు పై మందు వాడి పత్యం వుండాలి
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Repost from 🍀 వంటిల్లే వైద్యశాల 🍀
రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..
*1. బీట్ రూట్ :::: ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి.*
*2. క్యారెట్ :::: క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది .*
*3. బొప్పాయి :::: బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.*
*4. వెల్లుల్లి :::: శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.*
*5. ఆకుకూరలు :::: శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.*
*6. దానిమ్మ :::: ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.*
*7. ఆప్రికాట్ :::: ఐరన్ అధికంగా ఉన్నపండ్లో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.*
*8.ఎండు ద్రాక్ష :::: రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.*
*9.ఖర్జూరం :::: ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.*
ప్లేట్లెట్స్ అంటే ఏమిటి ?
సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి, ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి, ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది, ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి, మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది. మనం తినే ఆహరం పైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే కింద సూచించిన వాటిని ఎక్కువగా తినండి.*
*ఈ ఉపయోగకరమైన సమాచారం మీ బంధువులకి,మిత్రులకి షేర్ చేయండి.*
ఇట్లు,
మీ ఆయుర్వేద వైద్యులు,
Hanmonthrao panthulu
9949363498
మధుమేహం -
*షుగర్ /sugar*
సైడ్ ఎఫెక్ట్స్ నివారించే దివ్య ఔషదం
#########################
ఉపయోగాలు: — మీ గ్లూకోజ్ ఎప్పుడు 80—100 లోపు ఉంచుతుంది.
—ఇన్సులిన్ వాడుతున్న వారు దీనిని 3 పూటలు 90 రోజులు వాడిన తరువాత మీ ఇన్సులిన్ పాయింట్స్ తగ్గించవచ్చు.
—దీనిని నిత్యం వాడుతుంటే నీరసము, ఆయాసం తగ్గి శరీరం లో బలం కలుగుతుంది.
—శరీరంలో మంటలు, తిమ్మిరులు రానివ్వడు
–షుగర్ సైడ్ ఎఫెక్ట్స్ నుమెల్లమెల్లగా మీ శరీరం నుండి దూరం చేస్తుంది.
—వంశపారంపర్యము గా షుగర్ వచ్చే అవకాశం గలవారు నిత్యం 5 gm చూర్ణం వాడుతుంటే జీవితం లో షుగర్ వ్యాధి రాదు.
—-నేలతంగేడు మూలిక వల్ల అతిగా వచ్చే మూత్రం ను కంట్రోల్ చేస్తుంది.
—-కొందరికి పుండ్లు మానకపోవడం,గ్యాంగ్రీన్ కు దారితీయడం జరుగుతుంది.అలాంటి వారికోసం దీనిలో వాడిన పంచనింబ మేలు చేస్తుంది.
—-కంటిచూపు మసకబారడం,దృష్టి బలహీనపడం ను నివారిస్తుంది.
-మానసికఅలసట,చికాకు,లైంగికఅసమర్ధత ను తగ్గించును.
—టైప్—1 మధుమేహాన్నికూడా తగ్గిచును.
—చిన్న వయస్సులో వచ్చే షుగర్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది.
—LDL,ట్రైగ్లిసరైడ్ నుకంట్రోలో ఉంచును.
“జిమ్నెమిక్ యాసిడ్ మాలిక్యూల్స్” చక్కర నిల్వలను నియంత్రణలో ఉంచును
ఈ చూర్ణంవాడుతుంటే షుగర్ వల్ల బాధలు ఉండవు
పొడపత్రి ఆకు
నేలవేము సమూలం
తిప్పతీగ లావుది
మానుపసుపు బెర డు
నేరేడు గింజలు
మోదుగపువ్వు,
లోద్దుగ బెరడు,
వేగిస బెరడు
నేలతంగేడు,
మారేడు,
ఉసిరి
నల్లజిలకర
కలోంజీ
కటుకరోహిణి
మెంతి,
సప్తరంగి
ఒద్ది బెరడు
శిలాజితు
వంగభస్మము
Dose: 5 gm చూర్ణం ను గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం పరగడుపున. సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి.
సూచనలు: –గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు 5 gm చూర్ణం ను 3 పూటలు ఆహారానికి ముందు తీసుకోవాలి
🏀సూచన:
మీరు తయారుచేసుకోలేనప్పుడు.
మీరు ఆర్డర్ ఇస్తే మీ కోసం 310 gm చూర్ణం మేము ఫ్రెష్ మూలికలు సేకరించి తయారుచేసి speedpost ద్వారా ఇంటికి పంపిస్తాము.
1200+100 courier for one month
❤️❤️❤️❤️❤️🍀🍀❤️❤️❤️❤️❤️
ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే నాకు "9949363498 కు కాల్ చేయండి ఆయుర్వేద పరిష్కారం ఉచితంగా తెలియజేస్తాను
మగధీర అమిత బలానికి
######################
1) తుమ్మజిగురు 10గ్రా
2) బూరుగ జిగురు 10గ్రా
3)మోదుగ జిగురు 10గ్రా
4) నేలతాడి 10గ్రా
5) నేలగుమ్మడి 10గ్రా
6) అతిమదురం 10గ్రా
7) పల్లెరు 10గ్రా
8)అశ్వగంధ. 10గ్రా
9) శతావరి 10గ్రా
10, జాజికాయ 10గ్రా
11,సఫెదముస్లి 10గ్రా
12, సాలం మిశ్రీ. 10గ్రా
13, సాలం పంజా 10గ్రా
14, సాలం గట్టా. 10గ్రా
15, అక్కలకర్ర. 10గ్రా
16, కోకిలాక్ష. 10 గ్రా
17,బల విత్తులు 10 గ్రా
18, దూలగొండి విత్తులు. 10 గ్రా
ఈ అన్ని మంచి నాణ్యమైనవి పుచ్చులు లేనివి మూలికలు సమానంగా తీసుకొని, ఒక మట్టిపాత్రలొ లెదా స్టీల్ పాత్రలో వేసి, పై వస్తువులు మునిగె వరకు నాటు ఆవుపాలు పోసి ఇలా రాత్రి నానబెట్టి ఉదయం ఎండలో ఎండించాలి,
ఇలా పై విదంగా రాత్రి నానబెట్టి పగలు ఎండవేయవలెను, ఇలా 7 రోజులు వరుసగా ఖచ్చితంగా చేయాలి, ఇలా చేసి ఆ తర్వాత బాగా ఎండించి, దంచి జల్లించి గాజు సీసాలొ బద్రపరుచుకొని రోజు ఉదయం ఒక స్పూన్ రాత్రి స్పూను బోజనానికి అర్ద గంట ముందు గోరు వెచ్చని నీటితో తీసుకోవాలి.
అద్బుతమైన శక్తికి , శీఘ్రస్కలనానికి, అంగము గట్టిపడుటకు, శుక్రకణాల వృద్ధికి, కండపుష్టికి,ఎముకల పటుత్వానికి దేహదారుడ్యానికి అతిగా ఇంగ్లీష్ మందులు ( వయాగ్రా) వాడి వళ్ళు గుల్ల చేసుకొన్న వారికి
మీ సమస్య తీరుతుంది, స్త్రీలు సంతృప్తి చెందుతారు. మీ జీవతం సుఖవంతంగా సాగుతుంది,
మీ శృంగార శక్తి చాలా గొప్పగా అవుతుంది.
అనుభవమైనది ఎందరో వాడినారు,వాడుతున్నారు.లాభం పొందుతున్నారు
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
తయారుచేసింది మావద్ద ఉంది speed. post / courier ద్వారా పంపగలము
1200 నెలకు
3200 స్వర్ణభస్మం కలిసింది
100 పోస్టేజ్ extra
K.Hanmanthrao panthulu
cell.9949363498:
అసిడిటీ, గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం మరియు అజీర్తి సమస్యలకు ఆయుర్వేద చికిత్సలు..
మీరు ఎటువంటి హాస్పిటల్ మరియు ఎటువంటి వైద్య చికిత్స తీసుకోనక్కర్లేదు కేవలం 40 రోజులు కింద తెలిపిన విధంగా మీరు పాటిస్తే చాలు మీకున్న అసిడిటీ,గ్యాస్ట్రిక్,కడుపు ఉబ్బరం మరియు అజీర్తి సమస్యలు శాశ్వతంగా తొలుగుతాయి కావున పూర్తిగా చదివి మీ బంధు మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.
*"ఎసిడిటీ కి ఆయుర్వేద మందు":-*
1. 10 ml దానిమ్మ/అనార్ పండు యొక్క రసం రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. దానిమ్మ పండు పుష్కలంగా తినడం వలన కూడా మంచి ప్రయోజనం ఉంటుంది.
2. 3 నుండి 5 గ్రాముల ఉసిరి పొడిని రోజుకు రెండుసార్లు పాలతో కలిపి తీసుకోవాలి.
3. 5 నుండి 10 గ్రాముల నెయ్యిని జీలకర్ర పొడితో మరిగించి ఆహారంతో పాటు తీసుకోవాలి.
*"గ్యాస్ట్రిక్ కి ఆయుర్వేద మందు":-*
1. 2 గ్రాముల వాము పొడిని, సమాన పరిమాణంలో సోంపు పొడిని వెచ్చని నీటి లో కలిపి తీసుకోవాలి.
2. 6 ml వెల్లుల్లి రసాన్ని తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.
3. 5 గ్రాముల సోంపు, మిరియాలు మరియు రాళ్ల ఉప్పును మజ్జిగలో కలుపుకుని రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.
*"కడుపు ఉబ్బరం కు ఆయుర్వేద మందు":-*
1. 5 గ్రాములు తాజా అల్లం ను ,ఒక గ్రాము రాక్ సాల్ట్తో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే కడుపు ఉబ్బరం నుండి ఉపశమనం లభిస్తుంది.
2. వేప చెట్టు బెరడు ,శొంఠి మరియు మిరియాలను సమాన పరిమాణంలో తీసుకుని వాటిని పౌడర్ చేయండి. అర గ్రాము పొడిని రోజుకు ఒకసారి నీటిలో కలిపి తీసుకుంటే కడుపులో ఎసిడిటీని తగ్గి, పుల్లటి తేన్పులు ఆగిపోతాయి.
*"అజీర్ణం కు ఆయుర్వేద మందు":-*
1. 5 గ్రా. చూర్ణం చేసిన అల్లం ను ఉప్పు లేదా బెల్లం కలిపి రోజుకు రెండుసార్లు భోజనానికి ముందు తీసుకోవాలి.
2. 10 ml దానిమ్మ/అనార్ పండు యొక్క రసాన్ని 1 గ్రాము బ్లాక్ సాల్ట్/వేయించిన జీరా పొడి మరియు 1 గ్రాము పంచదారతో కలిపి ఆహారానికి ముందు తీసుకోవాలి.
3. 2 గ్రాముల దాల్చిన చెక్క పొడిని రోజుకు రెండుసార్లు నీటితో కలిపి తీసుకోవాలి.
4. 5 గ్రాముల ధనియాల పొడిని, చిటికెడు శొంఠి పొడిని నీటిలో కలిపి కాషాయం కాచుకుని రోజుకు మూడు సార్లు తీసుకోవాలి.
5. 3 నుండి 6 గ్రాముల జీలకర్ర పొడి మరియు రాళ్ల ఉప్పును ఒక గ్లాసు గోరువెచ్చని నీటి లి కలిపి రోజుకు
*ఇట్లు,*
*మీ ఆయుర్వేద వైద్యులు,*
9949363498
లివర్ సమస్యలకు పరిష్కారం ::మన బాడీలో లివర్ 500 కంటే ఎకకువ పనులు చేస్తుంది. లివర్ పాడైనప్పుడు దానికదే రిపేర్ చేసుకుంటుందనిన మీకు తెలుసా. లివర్కి ఏ సమస్య ఉండి 40 నుంచి 50 శాతం దానిని వేరుచేసినప్పటికీ, అవి తిరిగి పూర్తిగా 100 శాతంగా పెరుగుతాయి. అలాంటి లివర్కి ప్రాబ్లమ్ వచ్చిందంటే అది ప్రమాదమనే చెప్పొచ్చు.సాధారణంగా లివర్ డ్యామేజ్ అయితే, దానిని గుర్తించడానికి చాలా టైమ్ పడుతుంది. అందుకే దీనిని ఎప్పటికప్పుడు గమనిస్తూ మొదటిదశలోనే గుర్తించాలని చెబుతున్నారు నిపుణులు. అలాంటప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి.కాళ్ళ వాపు
కడుపులో నీరు చేరడం
రాత్రుళ్ళు నిద్రపట్టకపోవడం
పగటి పూట నిద్ర రావడం
అలసట
కామెర్లు
ఇవన్నీ కూడా మొదట్లో కనిపించే లక్షణాలు. వీటిని చాలా మంది పట్టించుకోరు. ఈ సందర్భంలో లివర్ 30 నుండి 40 శాతం వరకూ పనిచేయదని చెప్పొచ్చు.మన దేశంలో లివర్కి ప్రధానంగా 3 సమస్యలు వస్తాయి. అవి.
ఆల్కహాలిక్ లివర్ డిసీజ్
ఫ్యాటీ లివర్
వైరల్ హెపటైటిస్..వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, మలేరియా, ఎయిడ్స్ని ప్రభావితం చేసే వైరస్ ఏదైనా ఉందంటే అది హెపటైటిస్ వైరస్. ప్రపంచవ్యాప్తంగా సంవ్సతరానికి 15 లక్షల మంది మరణిస్తారు. ఈ మరణాలన్నీ లివర్ ప్రాబ్లమ్స్ వల్లే.ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. మన దేశంలోనే ీ సమస్య ఎక్కువగా ఉంటుంది. విదేశాల్లోనూ ఆల్కహాల్ తీసుకున్నా.. అది లిమిటెడ్గా ఉంటుంది. మన దగ్గర దీనిని ఎక్కువగా పట్టించుకోరు.
ఆల్కహాల్ లివర్పై ఎఫెక్ట్ చూపించినప్పుడు దీనిని పూర్తిగా నివారించాలి. అప్పుడే లివర్ కోలుకుంటుంది. దీనికోసం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఆ సమస్యని తగ్గించుకోవచ్చు.మన దేశంలో ఫ్యాటీ లివర్ డిసీజ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇవి కొవ్వు, ఆహారాలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వస్తాయి. ఈ సమస్య వచ్చిందంటే లివర్ కోలుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. కాబట్టి, ముందు నుంచి దీని విషయంలో జాగ్రత్త అవసరం.మనం తీసుకునే ఫుడ్స్లో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటన్నింటిని ప్రాసెస్ చేస్తారు. కార్బోహైడ్రేట్స్ అనేవి సాధారణ ఫుడ్స్. ఇందులో ప్రోటీన్ ఉండదు. కూరగాయల్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ, అందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, శరీరానికి చాలా మంచిది.నాన్వెజ్లో కూడా చేపలు, చికెన్, తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ బఠానీలు, పప్పులు తీసుకోవచ్చు. దీని వల్ల ప్రోటీన్ అందుతుంది.లివర్ వాపు ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహార అలవాట్లు.రోజుకి కచ్చితంగా 30 నిమిషాల పాటు ఏదైనా వర్కౌట్ చేయండి. సైక్లింగ్, స్విమ్మింగ్ చేయండి. ఇంటి పనులు చేయొచ్చు. బరువు తగ్గడం ద్వారా లివర్ ప్రాబ్లమ్స్ని దూరం చేసుకోవచ్చు. హెల్దీ ఫుడ్ బాడీ ఫ్యాట్ని తగ్గించడంలో సాయపడుతుంది. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య కూడా దూరమవుతుంది. సమస్య పరిష్కారానికి కొంతమందికి మెడిసిన్ అవసరమవుతుంది
.వైరల్
హెపటైటిస్::ఇది వైరల్ ఇన్ఫెక్షన్. దీనిని ఎ, బి, సి, డి, ఈ అనే రకాలుగా వర్గీకరిస్తారు. ఎ, బి వైరస్లకి వ్యాక్సిన్ ఉంది. ఎ, ఈ వైరస్లు రెండూ కూడా కలుషిత నీరు, ఫుడ్స్ తీసుకోవడం వల్ల వస్తుంది. అందుకే మంచి ఆహారం తీసుకోవాలి. హెల్దీ ఫుడ్స్, కూరగాయలని బాగా కడిగి తీసుకోవాలి.ప్రాణాంతక వ్యాధి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్.. ఇది రక్తం, శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. లివర్ పూర్తిగా దెబ్బతినడానికి ఇవే కారణాలు. దీని కారణంగానే క్యాన్సర్స్ వస్తాయి. వీటిని తగ్గించేందుకు ముందు నుంచి అవగాహన ఏర్పరచుకోవాలి. మీ సమస్యని డాక్టర్కి తెలపడం వల్ల మీకు పరిష్కారం దొరుకుతుంది.
Call.9949363498
ఆరోగ్య చూర్ణము
##############
అజీర్ణం గ్యాస్ కడుపునొప్పి మలబద్దకం వాతము
1. దానిమ్మ గింజల పొడి- 50 గ్రాములు
2. పుదీనా ఆకు పొడి -25 గ్రాములు
3, కొత్తిమీర ఆకు పొడి25 గ్రా
4. వాము 25 గ్రాముల
5 జీలకర్ర 25 గ్రా
6, అతిమధురం 25 గ్రాములు
7 , శతావరి. 25 గ్రా
8, కరక పెచ్చులు. 50 గ్రా
9, సునముఖి 50 గ్రా
10, శొంఠి. 25 గ్రా
11,చిత్ర మూలం 25 గ్రా
12, సైంధవ లవణము 25 గ్రా
తయారుచేయు విధానం:
పై చూర్ణాలు కలిపి నిల్వ చేసుకోవాలి.
వాడే విధానం :-
ఉదయము రాత్రి భోజనం తర్వాత చెంచా గోరువెచ్చని నీళ్ళతో తాగాలి లాభాలు: - అజీర్ణం గ్యాస్ కడుపునొప్పి,మలబద్దకం వెంటనే తగ్గిపోతుంది. వాతము చేరనీయదు
#########################
Ready to use
Call 9949363498
*===================*
* *రాగుల సూప్*
*+++++++++++++++++++*
1 రాగులపిండి -100గ్రాములు
2. అన్నం వండింది -1/4 కప్పు
3. పెరుగు -1/4 కప్పు
4. ఉల్లిపాయ ముక్కలు1/4కప్పు
5. పచ్చిమిర్చి ఒకటి
6. జీలకర్ర ఒక చెంచా
7. ఇంగువ పావు చెంచా
8. ఉప్పు తగినంత
తయారు చేయు విధానం :-
రాగుల పిండి లో తగినంత నీళ్లు కలిపి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పావు కప్ప అన్నంలో కొద్దిగా నీళ్లు వేసి గ్రైండ్ చేయాలి దాన్నిరాగులలో కలపాలి
పెరుగులో పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఇంకా వేసి గ్రైండ్ చేయాలి. దాన్ని సూపులో కలపాలి. ఉల్లిపాయ ముక్కలు కలపాలి
ఒక మట్టి పాత్రలో , ఎనిమిది పది గంటల అలాగే ఉంచుకున్న తర్వాత
త్రాగాలి.. చాలా రుచిగా ఆరోగ్యంగా ఉంటాది.
చలువ చేస్తుంది బలాన్ని ఇస్తుంది
🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸
🌼 కేశవర్ధిని 🌼
***
వెంట్రుకలు ఒత్తుగా పెరగడానికి, వెంట్రుకలు ఛిట్లిపొకుండా,రాలకుండా వుండటానికి, వెంట్రుకల యెక్క కుదుళ్ళు బలిష్ఠంగా వుండటానికి, పొడవు పెరగటానికి, చుండ్రుసమస్య పొవడానికి, వెంట్రుకలు ఆరొగ్యంగా వుండటానికి.
ఈ తైలం చేయు విధానం :
1, పచ్చి గుంటగలగరాకు రసం లీటర్
2, పచ్చి ఉసిరికాయల రసం లీటర్
3, పచ్చి గోరింటాకు రసంలీటర్
4,పచ్చి నీలి ఆకులకషాయం లీటర్
5,పచ్చి మందారపూవుల రసములీటర్
6, గురుగింజల కషాయం లీటర్
7,కరక్కాయల కషాయం లీటర్
8, మామిడికాయజీడి రసం లీటర్
9, తెల్లఉల్లిగడ్డలరసం లీటర్
10 మర్రిఊడలకషాయం లీటర్
11,లోహా భస్మం 1/4 kg
ఈ పై చెప్పిన వస్తువులు మహా శక్తివంతమైనవి, , ఈ అన్ని పచ్చివి దంచి రసం తీసుకోవాలి
కషాయం చేయడం
కషాయం చేయాల్సిన వస్తువులు తిసుకొని ఈ పదార్దానికి 8 రెట్లునీరు పొసి 2 రెట్లు వుండేటట్లుగా మెల్లగా కాచుకొని తైలంలో కలుపుకొవాలి ) ఇలా చెప్పినవన్నీ మంచి నాణ్యమైనవి తిసుకొని, ఒక పెద్ద ఇనుప పాత్రలో వేసుకొని ఇందులో నల్లనువ్వుల నూనె, 5 లీటర్లు వేసుకొని సన్నని మంట పైన చెయుచూ, పై చెప్పిన కషాయాలు రసాలు ఇగిరిపొయేవరకూ మరిగించి, కేవలం నూనె మాత్రమే మిగిలేలా చుసుకొని దించుకొని వడపొసి, ఈ నూనె ని గాజు సీసాలో భద్రపరుచుకొవాలి ఈ నూనె 2, 3 లీటర్లు మీకు మిగలవచ్చును అది కూడా జాగ్రత్తగా చేస్తే లేకుంటే ఇంకా నూనె తగ్గే అవకాశం వుంది. ఈ గొప్ప తైలాన్ని వెంట్రుకల యెక్క కుదుళ్ళకు రాసుకొని మెల్లగా 5 నిముషాలు మర్దన చేయాలి,
శీకాకాయ100 గ్రా మరియు కుంకుడుకాయ 400గ్రా మెత్తగా దంచి కలిపి తల స్నానం చేయాలి.
మీరు చేసుకొలేని పక్షంలో మా దగ్గర తిసుకొగలరు speed. post ద్వారా పంపగలము 1200 +100 కొరియర్. /500ml
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Arogya samasyalaku
call cell.9949363498
K.Hanmanthrao panthulu
:
మగధీర అమిత బలానికి
######################
1) తుమ్మజిగురు 10గ్రా
2) బూరుగ జిగురు 10గ్రా
3)మోదుగ జిగురు 10గ్రా
4) నేలతాడి 10గ్రా
5) నేలగుమ్మడి 10గ్రా
6) అతిమదురం 10గ్రా
7) పల్లెరు 10గ్రా
8)అశ్వగంధ. 10గ్రా
9) శతావరి 10గ్రా
10, జాజికాయ 10గ్రా
11,సఫెదముస్లి 10గ్రా
12, సాలం మిశ్రీ. 10గ్రా
13, సాలం పంజా 10గ్రా
14, సాలం గట్టా. 10గ్రా
15, అక్కలకర్ర. 10గ్రా
16, కోకిలాక్ష. 10 గ్రా
17,బల విత్తులు 10 గ్రా
18, దూలగొండి విత్తులు. 10 గ్రా
ఈ అన్ని మంచి నాణ్యమైనవి పుచ్చులు లేనివి మూలికలు సమానంగా తీసుకొని, ఒక మట్టిపాత్రలొ లెదా స్టీల్ పాత్రలో వేసి, పై వస్తువులు మునిగె వరకు నాటు ఆవుపాలు పోసి ఇలా రాత్రి నానబెట్టి ఉదయం ఎండలో ఎండించాలి,
ఇలా పై విదంగా రాత్రి నానబెట్టి పగలు ఎండవేయవలెను, ఇలా 7 రోజులు వరుసగా ఖచ్చితంగా చేయాలి, ఇలా చేసి ఆ తర్వాత బాగా ఎండించి, దంచి జల్లించి గాజు సీసాలొ బద్రపరుచుకొని రోజు ఉదయం ఒక స్పూన్ రాత్రి స్పూను బోజనానికి అర్ద గంట ముందు గోరు వెచ్చని నీటితో తీసుకోవాలి.
అద్బుతమైన శక్తికి , శీఘ్రస్కలనానికి, అంగము గట్టిపడుటకు, శుక్రకణాల వృద్ధికి, కండపుష్టికి,ఎముకల పటుత్వానికి దేహదారుడ్యానికి అతిగా ఇంగ్లీష్ మందులు ( వయాగ్రా) వాడి వళ్ళు గుల్ల చేసుకొన్న వారికి
మీ సమస్య తీరుతుంది, స్త్రీలు సంతృప్తి చెందుతారు. మీ జీవతం సుఖవంతంగా సాగుతుంది,
మీ శృంగార శక్తి చాలా గొప్పగా అవుతుంది.
అనుభవమైనది ఎందరో వాడినారు,వాడుతున్నారు.లాభం పొందుతున్నారు
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
తయారుచేసింది మావద్ద ఉంది speed. post / courier ద్వారా పంపగలము
1200 నెలకు
3200 స్వర్ణభస్మం కలిసింది
100 పోస్టేజ్ extra
K.Hanmanthrao panthulu
cell.9949363498:
మధుమేహం -
*షుగర్ /sugar*
సైడ్ ఎఫెక్ట్స్ నివారించే దివ్య ఔషదం
#########################
ఉపయోగాలు: — మీ గ్లూకోజ్ ఎప్పుడు 80—100 లోపు ఉంచుతుంది.
—ఇన్సులిన్ వాడుతున్న వారు దీనిని 3 పూటలు 90 రోజులు వాడిన తరువాత మీ ఇన్సులిన్ పాయింట్స్ తగ్గించవచ్చు.
—దీనిని నిత్యం వాడుతుంటే నీరసము, ఆయాసం తగ్గి శరీరం లో బలం కలుగుతుంది.
—శరీరంలో మంటలు, తిమ్మిరులు రానివ్వడు
–షుగర్ సైడ్ ఎఫెక్ట్స్ నుమెల్లమెల్లగా మీ శరీరం నుండి దూరం చేస్తుంది.
—వంశపారంపర్యము గా షుగర్ వచ్చే అవకాశం గలవారు నిత్యం 5 gm చూర్ణం వాడుతుంటే జీవితం లో షుగర్ వ్యాధి రాదు.
—-నేలతంగేడు మూలిక వల్ల అతిగా వచ్చే మూత్రం ను కంట్రోల్ చేస్తుంది.
—-కొందరికి పుండ్లు మానకపోవడం,గ్యాంగ్రీన్ కు దారితీయడం జరుగుతుంది.అలాంటి వారికోసం దీనిలో వాడిన పంచనింబ మేలు చేస్తుంది.
—-కంటిచూపు మసకబారడం,దృష్టి బలహీనపడం ను నివారిస్తుంది.
-మానసికఅలసట,చికాకు,లైంగికఅసమర్ధత ను తగ్గించును.
—టైప్—1 మధుమేహాన్నికూడా తగ్గిచును.
—చిన్న వయస్సులో వచ్చే షుగర్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది.
—LDL,ట్రైగ్లిసరైడ్ నుకంట్రోలో ఉంచును.
“జిమ్నెమిక్ యాసిడ్ మాలిక్యూల్స్” చక్కర నిల్వలను నియంత్రణలో ఉంచును
ఈ చూర్ణంవాడుతుంటే షుగర్ వల్ల బాధలు ఉండవు
పొడపత్రి ఆకు
నేలవేము సమూలం
తిప్పతీగ లావుది
మానుపసుపు బెర డు
నేరేడు గింజలు
మోదుగపువ్వు,
లోద్దుగ బెరడు,
వేగిస బెరడు
నేలతంగేడు,
మారేడు,
ఉసిరి
నల్లజిలకర
కలోంజీ
కటుకరోహిణి
మెంతి,
సప్తరంగి
ఒద్ది బెరడు
శిలాజితు
వంగభస్మము
Dose: 5 gm చూర్ణం ను గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం పరగడుపున. సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి.
సూచనలు: –గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు 5 gm చూర్ణం ను 3 పూటలు ఆహారానికి ముందు తీసుకోవాలి
🏀సూచన:
మీరు తయారుచేసుకోలేనప్పుడు.
మీరు ఆర్డర్ ఇస్తే మీ కోసం 310 gm చూర్ణం మేము ఫ్రెష్ మూలికలు సేకరించి తయారుచేసి speedpost ద్వారా ఇంటికి పంపిస్తాము.
1200+100 courier for one month
❤️❤️❤️❤️❤️🍀🍀❤️❤️❤️❤️❤️
ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే నాకు "9949363498 కు కాల్ చేయండి ఆయుర్వేద పరిష్కారం ఉచితంగా తెలియజేస్తాను
1.రోజుకు రెండు కరివేపాకు రెమ్మలు తింటే ఒబేసిటి రాదు. పచ్చి కూరగాయల సూపు తాగినా ఫలితం ఉంటుంది.
2.కలమంద గుజ్జులో పసుపు కలిపి పరిగడుపున తీసుకుంటే మార్పు కనిపిస్తుంది.
*అలసట*:
1.రోజువారీ జీవితంలో అందరూ ఎదుర్కొనే సమస్య అలసట. దీనిని అధిగమించేందుకు ద్రాక్షపండ్లు రాత్రి నీళ్ళలో నానబెట్టి పొద్దున తినాలి.
2.అలాగే, ఖర్జూర పండ్లను కూడా రాత్రి నీళ్ళలో నానబెట్టి తింటే చాలా మంచిది.
3.బాదం పాలు కూడా అలసటను దూరం చేస్తాయి.
*నెలసరి నొప్పి*:
1.స్త్రీలు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఇదొకటి. ఉత్తరేణి రసం రోజూ చెంచా చొప్పున మూడు రోజులు పరికడుపున తీసుకుంటే ముట్టు నొప్పి తగ్గిపోతుంది.
2.టీ డికాషన్లో నిమ్మరసం పిండుకుని తాగినా ఉపశమనం కలుగుతుంది.
3.రేలకాయ గుజ్జు చూర్ణం చేసి గోరు వెచ్చటి నీటిలో కలుపుకుని తాగితే నొప్పి తగ్గడమే కాదు, నెలసరి క్రమపడుతుంది.
*తలనొప్పి*:
1.పొద్దున లేవగానే రాగి చెంబులో నిల్వ ఉంచిన నీళ్ళను తాగడం వల్ల తలనొప్పి రాదు. ఉన్న నొప్పి కూడా మటుమాయం అవుతుంది.
2.ఒక చెంచాడు మెంతులు రాత్రి నీళ్ళలో నానబెట్టి పొద్దున తాగాలి. ఇలా కొన్ని రోజులు చేయడం వల్ల వాతంతో వచ్చే తలనొప్పి తగ్గుతుంది.
*నడుం నొప్పి*:
1.రాత్రి పడుకునే ముందు వేడినీటిలో ఆముదం కలిపి తీసుకోవాలి. ఉదయం సుఖవిరేచనం అయి నడుం నొప్పి తగ్గుతుంది.
2.రస కర్పూరం, నల్లమందు, కొబ్బరి నూనెలో కలిపి నడుంకు రాస్తే ఫలితముంటుంది.
*బట్టతల*:
1.సీతాఫలం ఆకులు నూరి మేక పాలలో కలిపి తలకు రాస్తుండాలి. ఇలా చేయడం వల్ల బట్టతల తగ్గే అవకాశం ఉంది.
2.గురిగింజ ఆకురసం నువ్వుల నూనెలో కలిపి వేడి చేసి తలకు రాసుకున్నా బట్టతల తగ్గే అవకాశం ఉంది.
*కీళ్ళ నొప్పులు*:
1.నొప్పి ఉన్న కీలుపై జిల్లేడు ఆకు వేడి చేసి కట్టాలి.
2.మిరియాలు, బియ్యం రెండింటిని బాగా నూరి నొప్పి ఉన్న చోట కట్టు కడితే తగ్గుతుంది.
3.ఆహారంలో ఉల్లిపాయలు ఎక్కువగా ఉండేట్లు జాగ్రత్తపడ్డా కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
*గుండె జబ్బులు*:
1.మంచి తేనె గోరు వెచ్చని నీళ్ళలో కలుపుకుని తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల గుండె జబ్బులు మీ దరిచేరవు.
2.దానిమ్మ, పచ్చి ఉసిరికాయ రసం తాగినా కూడా హదయానికి ఎంతో మేలు చేస్తుంది.
3.మన ఆహార నియమాలతోనే గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందుకే, కొవ్వు పదార్థాలు, నూనెలు తగ్గించడం చాలా మంచిది
2.అరటిపండ్లు ప్రతి రోజు ఉదయం తీసుకోవడం వల్ల ఈ వ్యాధిని అధిగమించవచ్చు.
3.ధనియాల కషాయంలో ఉప్పు కలిపి కొద్ది రోజులు తీసుకున్నా లేదా మెంతుల కషాయం తాగినా మంచి ఫలితముంటుంది.
4.వెల్లుల్లి రసాన్ని 15 రోజులపాటు తీసుకున్నా అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది.
5.కామంచి గింజల చూర్ణం కషాయం కాచి తాగినా అతిమూత్రం తగ్గుతుంది. అంతేకాదు, మధుమేహం వ్యాధి కూడా అదుపులో ఉంటుంది.
6.మర్రిచెక్క కషాయం లేదా మెంతుల కషాయం క్రమం తప్పకుండా తీసుకున్నా మంచి ఫలితముంటుంది.
*తల వెంట్రుకలు పెరుగడానికి*
1.మందార పువ్వులు,మైదాకు, కలమంద గుజ్జు, నల్ల నువ్వుల నూనెలో వేసి కాచి వడబోసి తలకు రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు నల్లగా పెరగడమే కాదు తలనొప్పి కూడా తగ్గుతుంది.
2.కరివేపాకు రసం, వెల్లుల్లి పొట్టు నల్ల నువ్వుల నూనెలో కాచి పెట్టుకున్నా వెంట్రుకలు పెరుగుతాయి.
3.గుంటగలగర ఆకురసం నువ్వుల నూనెలో వేడి చేయాలి. తర్వాత తలకు పట్టిస్తే వెంట్రుకలు నల్లగా, వొత్తుగా పెరుగుతాయి.
*ఉబ్బసం*:
1.తెల్ల జిల్లేడు పువ్వుల చూర్ణాన్ని బెల్లంతో కలిపి తింటే ఉబ్బసం తగ్గుతుంది.
2.అడ్డసరం ఆకులు ఎండబెట్టి చూర్ణం చేయాలి. అందులో శొంఠి, మిరియాల చూర్ణాలు కలిపి దానిలో తిప్పతీగ రసంతో మాత్రలు తయారు చేసి వీటిని ఇరవై రోజులు వాడితే ఎంత ఉబ్బసం, ఆయాసం ఉన్నా తగ్గుతాయి.
3.వెల్లుల్లి రసం వేడి నీళ్లలో వేసి తాగినా లేదా మిరియాల చూర్ణం తేనెలో కలిపి సేవించినా ఫలితముంటుంది.
4.నేపాల గింజలు నిప్పుల మీద వేసి ఆ పొగ పీలిస్తే ఉబ్బసం తగ్గుతుంది.
*గుండెజబ్బులు*:
1.తేనె వేడి నీళ్లలో కలిపి తాగితే గుండె జబ్బులు దరిచేరవు.
2.మద్ది చెక్క (తెల్లది) యష్టిమధుక చూర్ణాలను కలిపి నీళ్లలో కలుపుకుని తాగితే గుండె జబ్బులను నివారించవచ్చు.
3.స్వచ్ఛమైన తేనె అంటే వేప చెట్టుకు పెట్టిన తేనె తుట్టె నుంచి తీసింది.
4.మనం తీసుకునే ఆహారం వల్లే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది కనుక ఈ జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కొవ్వు పదార్థాలు, నూనెలు తగ్గించాలి.
*ఎసిడిటీ*:
1.ఎసిడిటీకి దూరంగా ఉండాలనుకుంటే వేపుడు కూరలు, మసాలాలతో చేసిన వంటకాలను మానేయాలి.
2.పచ్చబొట్టు ఆకు, నాగదమని ఆకు రెండూ కలిపి దంచిన ముద్దను తిన్న తరువాత గ్లాస్ నీళ్ళు తాగితే ఎసిడిటీ తగ్గుతుంది.
3.దానిమ్మ రసం తీసుకుంటే ఎసిడిటీ రాదు. ఒకవేళ ఉన్నా తగ్గుతుంది. రోజూ అరటి పండు తిన్నా ఫలితముంటుంది.
4.అల్లం ముక్క వేసిన పాలను బాగా మరిగించి తాగితే చక్కని ఫలితముంటుంది.
5.ఈ సమస్యతో బాధపడుతున్న వారు తరచూ మంచి నీళ్ళు తాగుతుండాలి.
*ఆకలి పుట్టడానికి*:
1.అల్లం ముక్కలు, సైందవ లవణం కలిపి భోజనానికి ముందు నమిలి ఆ రసాన్ని మింగితే ఆకలి పుడుతుంది.
2.మిరియాల చారుతో అన్నం తింటే ఆకలి లేదు అన్న సమస్యే రాదు.
3.నేపాళ గింజల చూర్ణం, జీలకర్రను చక్కెరతో కలిపి తీసుకుంటే జీర్ణశక్తి పెరిగి ఆకలి పుడుతుంది.
4.ఉత్తరేణి బియ్యం, మేకపాలలో కలిపి నూరి మాత్రలుగా చేసి పాలతో తీసుకుంటే ఆకలి ఆధిక్యాన్ని తగ్గించవచ్చు.
*అధిక రుతుస్రావం*:
1.ఉసిరికాయ, కరక్కాయ, రసాంజనం మూడింటినీ కలిపి చూర్ణం చేసి తాగితే నెలసరిలో అధికస్రావాలు తగ్గుతాయి.
2.ఇంటి ముందు అందం కోసం పెంచుకునే ఎర్రమందారం పువ్వులు కూడా ఆరోగ్య ప్రదాయనిగా పనిచేస్తాయి. ఈ పవ్వుల కషాయం తాగినట్లయితే అధిక రక్తస్రావం తగ్గిపోతుంది.
*కడుపు ఉబ్బరం*:
1.ఒక గ్రాము సైందవ లవణం, 5 గ్రాముల అల్లం కలిపి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
2.అన్నం తిన్న తర్వాత వాము, ఉప్పు కలిపి తీసుకున్నా ఈ సమస్యను అధిగమించ వచ్చు.
*తలవెంట్రుకలు ఊడిపోకుండా*
1.ఉసిరి రసం, గుంట గలగర రసం కొబ్బరినూనెలో కలిపి వేడి చేసి తలకు రాయడం వల్ల వెంట్రుకలు రాలవు.
2.తల వెంట్రుకలకు కొబ్బరి నూనెలో కలమంద గుజ్జు కలిపి వేడి చేసి రాయాలి. ఇది వెంట్రుకలు రాలడాన్ని అరికడుతుంది.
3.బాధం, కరక్కాయ నూనె రాసినా కూడా మంచి ఫలితముంటుంది.
*దంత సమస్యలు*:
1.నల్ల నువ్వులు తిని వెంటనే నీళ్ళు తాగితే కదులుతున్న దంతాలు గట్టి పడుతాయి.
2.వేపపుల్లతో పండ్లు తోమినా దంతాలు పటిష్టంగా ఉంటాయి.
3.జిల్లేడు పాలను నొప్పి ఉన్న పన్నుపై వేస్తే పంటి నొప్పి తగ్గుతుంది.
*కాళ్ళ పగుళ్ళు*:
1.పసుపు, నువ్వుల నూనె కలిపి రాస్తే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి.
2.మెంతులు, మైదాకు కలిపి రుబ్బి పెట్టుకుంటే త్వరగా నయమవుతుంది.
3.మర్రిచెట్టు పాలు పట్టి వేసినా చక్కని ఫలితం ఉంటుంది.
4.త్రిఫలచూర్ణం వాడితే పగుళ్ళు రావు.
*అజీర్ణం*:
1.రోజూ రెండు కప్పుల పెరుగు తింటే అజీర్ణం రాదు.
2.ఉల్లిగడ్డను కాల్చి కొంచెం ఉప్పు కలిపి మెత్తగా నూరి తింటే జీర్ణ శక్తి పెరుగుతుంది. ఇలా రోజుకు ఒక్కసారి వారం రోజులు చేస్తే మరీ మంచిది.
3.జీలకర్ర కషాయం తాగితే అజీర్ణపు కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
4.నేల తంగెడు చూర్ణం 1 లేదా 2 చెంచాలు అల్లం రసంతో కలిపి తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
*అతి బరువు* (ఊబకాయం):
*గృహ వైద్యం*:-
నోట్:- పనిలేక కాలక్షేపం కోసం మరియు పబ్లిసిటీ కోసం చేసిన పోస్ట్ కాదు. మీ ఆరోగ్యం కోసం ఎంతో విలువైన సమయం కేటాయించి చేయడం జరిగింది. కొంచెం ఓపిక పెట్టి మొత్తం చదివి వినియోగించుకోండి. మీ బంధు మిత్రులకి షేర్ చేయండి.
వైద్య రంగంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నప్పటికీ ఆయుర్వేదానికి ఉన్న ప్రాధాన్యం తగ్గడంలేదు. వ్యాధి తగ్గడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నా ఆయుర్వేదంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.
*శ్వాసకోశ వ్యాధులు*:-
1.జిల్లేడు మొగ్గను కషాయం బెట్టి అందులో తాటి బెల్లం కలిపి వరుసగా ఏడు రోజులు వాడితే దగ్గు-దమ్ము తగ్గుతాయి.
2.మిరియాల కషాయం లేదా అల్లం రసం తేనెతో కలిపి సేవించినా శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి.
3.అడ్డసరం ఆకు కషాయం రోజు చెంచాడు తీసుకున్నా లేదా మద్దిచెక్క చూర్ణం పాలలో కలుపుకుని తీసుకున్నా ఫలితముంటుంది.
4.సర్పాక్షి వేరును చూర్ణం చేసి అల్లం రసంలో కలిపి తీసుకుంటే క్రమంగా దగ్గు-దమ్ము తగ్గుతాయి.
*రక్తహీనత*:
1.నీడలో ఎండబెట్టిన సరస్వతి ఆకు చూర్ణం, చిటికెడు మిరియాల చూర్ణం, ఆవుపాలతో కలిపి సేవించాలి. క్రమంగా రక్తవృద్ధి జరుగుతుంది.
2.నీడలో ఎండబెట్టిన ఉసిరి చూర్ణాన్ని ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు రెండు చెంచాలు తినాలి.
4.విటమిన్ బి లోపం వల్ల రక్తహీనత కలిగిన వాళ్ళు గలిజేరు ఆకును కూర లేదా పచ్చడిగా తీసుకుంటే మంచి ఫలితముంటుంది.
5.విష్ణుకాంత సమూలం నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి. దానిని పాలతో కలిపి తీసుకుంటే రక్త క్షీణత తగ్గుతుంది.
*మూర్ఛ*:
1.తులసి ఆకురసం సైందవ లవణంతో కలిపి 1 లేదా 2 చుక్కలు వేస్తే స్పృహ వస్తుంది.
2.పసుపు పొడి పొగ వేసినా మూర్చ నుండి మెలకువ వస్తుంది.
3.తరచుగా పిల్లల్లో వచ్చే మూర్ఛవ్యాధులకు వస కషాయంతో స్నానం చేయించాలి.
4.కమ్మగగ్గెర ఆకును ఎండించి చూర్ణం చేసి నస్యంగా వాడాలి.
5.మూర్ఛవ్యాధి ఉన్న వ్యక్తికి 5 లేక 6 చుక్కల వావిలాకు రసం ముక్కులో వేస్తే ఫలితముంటుంది.
6.సీతాఫలం ఆకులు నలిపి వాసన చూపితే మూర్ఛ వ్యక్తికి మెలుకువ వస్తుంది. లేదా ఉల్లి రసం ముక్కులో వేసినా మంచి ఫలితం ఉంటుంది.
*తెల్లమచ్చలు*:
1.వేపకాయలు, ఆకులు, పువ్వులు సమానంగా కలిపి మెత్తగా నూరుకోవాలి. దీనిని రోజుకు రెండుసార్లు అరతులం చొప్పున తింటే నలభై రోజుల్లో తెల్లమచ్చలు తగ్గుతాయి.
2.పిచ్చి కుసుమ ఆకుల రసాన్ని తులసి ఆకుల రసంతో కలిపి మచ్చలు ఉన్నచోట రాయడం వల్ల క్రమంగా అవి తగ్గుముఖం పడుతాయి.
3.తంగేడు చెట్టు పట్టను ఆవుపాలలో దంచి తెల్లమచ్చల మీద రాస్తే తగ్గుతాయి.
*నిద్రలేమి*:
1.శతావరి చూర్ణం, బెల్లంతో కలిపి తింటే చక్కని నిద్ర వస్తుంది.
2.కలమంద నూనె తలకు మర్దన చేయాలి లేదా మోది చూర్ణం, బెల్లంతో కలిపి తిన్నా సుఖనిద్ర వస్తుంది.
3.మరాటి మొగ్గ పొడి చేసి పాలలో కలిపి పడుకునే ముందు తాగాలి. అలాగే, వేడి పాలు తాగినా సుఖనిద్ర వస్తుంది.
*నోటి సమస్యలు*:
1.లవంగాలు, యాలకులు నోటిలో చప్పరిస్తూ నమిలి మింగితే నోటి దుర్వాసన పోతుంది.
2.వెలగ ఆకు రసంలో నిమ్మ ఉప్పు కలిపి పుక్కిలించాలి.
3.పల్లేరు ఆకు రసం, తేనె కలిపి పుక్కిలించినా ఫలితం ఉంటుంది.
4.నోటి పూతను సులువుగా తగ్గించుకోవచ్చు. జామ ఆకులను నమిలి ఉమ్మివేయాలి. ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజులు చేస్తే తగ్గిపోతుంది.
5.లేత నేరేడు ఆకు కషాయం పుక్కిలించినా నోటి పూత తగ్గిపోతుంది.
6.గొబ్బి ఆకు (ముళ్ళ గోరింట) ఆకు నమిలి ఉమ్మేయాలి. అలాగే, పల్లేరు రసంలో తేనె కలిపి పూసినా నోటిపూట ఇట్టే తగ్గిపోతుంది.
*తల తిప్పటం*:
1.అల్లం, ఉప్పు కలిపి పొద్దున తింటే తగ్గుతుంది.
2.10 గ్రాముల అల్లం, 10 గ్రాముల బెల్లం దంచి ముద్ద చేసి నోట్లో పెట్టుకోవాలి. దాని నుండి వచ్చే ఊటను మింగాలి. ఇలా వారం రోజులు చేస్తే తల తిప్పుట తగ్గిపోతుంది.
3.మునగ ఆకులు మిరియాలు కలిపి మెత్తగా నూరి తలకు పట్టువేస్తే తలదిమ్ము తగ్గుతుంది.
*రక్తపోటు* (బి.పి.):
1.సుగంధపాల, మారేడు కలిపి వాడితే బి.పి. అదుపులో ఉంటుంది.
2.మారేడు ఆకుల కషాయం రోజూ తాగాలి. లేదా రోజూ చెంచెడు కల్యమాకు రసం తాగినా రక్తపోటు నిలకడగా ఉంటుంది.
3.ఈశ్వరి వేరు చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే రక్తపోటు తగ్గుతుంది.
4.కాచి చల్చార్చిన నీటిలో అల్లం రసాన్ని కలిపి పొద్దున్నే తాగితే బి.పి. అదుపులో ఉంటుంద.
*మలబద్దకం*:
1.అరటి పండు రోజూ ఉదయం పరిగడుపున తింటే మలబద్దకం పోతుంది.
2.రాత్రి పడుకునే ముందు వేడి నీటితో త్రిఫల చూర్ణం తీసుకుంటే ఫలితముంటుంది.
3.రోజూ రెండుపూటల కలబంద గుజ్జు తింటే వారం రోజుల్లో ఈ సమస్యను అధిగమించవచ్చు.
*అతిమూత్రం నివారణకు*:
1.నేరెడు గింజల చూర్ణం 40 రోజులు పొద్దున చెంచాడు పొడిని నీళ్లలో కలిపి తీసుకుంటే అతి మూత్రవ్యాధి అదుపులో కొస్తుంది.
,గుండె ,కిడ్నీ ,లివర్ టాక్సిన్స్
********
1,తెల్లగలిజెరువేర్లు100గ్రా
2,తిప్పతీగ100గ్రా
3,పాషాణ భేదివేర్లు100గ్రా
4,ఉలిమిరిచెక్క(వరుణ)100గ్రా
5,ఉత్తరేణి గింజలు 100 గ్రా
6,గోక్షుర 100గ్రా
7,అశ్వగంధ100గ్రా
8,నేలఉసిరి 50గ్రా
9,అర్జున. 50గ్రా
10, సుగందిపాల50గ్రా
11,ఉసిరి50గ్రా
12,కరక్కాయ50 గ్రా
13,తానికాయ50గ్రా
అన్నింటిని సమముగా చూర్ణించి
Teaspoon ఆహారానికి అరగంట ముందు 2 పూటలు త్రాగుతున్న
రక్తము గుండె లివర్ కిడ్నీ లు శుభ్రపడతాయి
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
Ready recipe
K.HanmanthraoPanthulu
.cell.9949363498
14.- పొగతాగడం వల్ల వచ్చే దగ్గును తొలగించడంలో అతిమధురం సమర్థంగా పనిచేస్తుంది.
15.- కత్తులతో తగిలిన గాయాలను మాన్పడంలో అతిమధురం బాగా పనిచేస్తుంది.
16.- అతి మధురం చూర్ణాన్ని తేనెతో గానీ, పాలతో గానీ సేవిస్తే, వైరల్ జ్వరాలు తగ్గుతాయి. ఎసిడిటి, అల్సర్, IBS మలబద్దకం, రక్తనాళాల సమస్యలు, జుత్తురాలడం, చర్మరోగాల వంటివి ఉంటే, ఒక్కో వ్యాధికి ఒక్కో ఔషధం వాడే అవసరం లేకుండా, అతిమధురం వాడటం ఉత్తమం.
ఒకటి రెండుకన్నా మించి వ్యాదులు ఉన్న వారికి అతిమధురం నిజంగా ఒక వరప్రసాదo
స్పూన్ అతిమధురం చూర్ణానికి రెండు టీ స్పూన్ల తేనె, ఒక టీ స్పూను ఆవునేయి కలిపి ప్రతిరోజూ సేవిస్తుంటే లైంగిక శక్తి పెరుగుతుంది.
అతి మధురం చూర్ణాన్ని తేనెతో వాడితే దగ్గు ఆస్తమా గొంతులో గరగర తొలగిపోతుంది.
మోకాళ్ల నొప్పులను ఇది నయం చేస్తుంది. వేడి నీటిలో అతిమధురాన్ని చేర్చి పురుషులు ఉదయం, సాయంత్రం పూట తీసుకుంటే.. , జుట్టు నెరవడం, వీర్యలోపం వంటి సమస్యలుండవు. అతిమధురంతో వాత రోగాలు నయం అవుతాయి. ఛాతిలో నొప్పి, తలనొప్పికి అతిమధురం దివ్యౌషధంగా పనిచేస్తుంది. పచ్చకామెర్లను అతిమధురం పూర్తిగా నియంత్రిస్తుంది ,కిడ్నీ సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
సలహాలకు call 9949363498
*ఆయుర్వేదంలో_అతిమధురం_చూర్ణం_ఉపయోగం.
ఆయుర్వేద వైద్య విధానంలో అత్యంత తీయని రుచి కలిగి అత్యంత శక్తివంతమైన ఔషధాల్లో అతి మధురం అగ్రస్థానాన్ని పొందిందంటే అతిశయోక్తి కాదు. అతి మధురం, గుమ్మడి, రోజు పూలు, సోపు గింజలు మొదలైన వాటితో ఒక ఔషధాన్ని రూపొం దించి, ఎలుకలపై ప్రయోగించి పరి శోధించారు. జీర్ణా శయంలోని వ్రణాన్ని మార్చడమే కాక, ఇతర ఆధునిక ఔషధాలతోపాటు దీనిని కూడా వాడటం వల్ల ఆ వ్రణం మానే ప్రక్రియ శీఘ్రతరమైనట్లు గుర్తించారు. అలాగే ఆధునిక ఔషధాల దుష్పరిణామాలు తగ్గడాన్ని కూడా గుర్తించారు. పచారి కొట్లలోను, ఆయుర్వేద ఔషధ విక్రయశాలల్లోనూ లభించే ఈ మొక్క వేళ్లు, వేళ్ల చూర్ణాన్ని ఔషధంగా ఉపయోగిస్తారు.
*ఔషధోపయోగాలు(#maedical_uses):*
ఒక స్పూన్ అతిమధురం చూర్ణానికి రెండు టీ స్పూన్ల తేనె, ఒక టీ స్పూను ఆవునేయి కలిపి ప్రతిరోజూ సేవిస్తుంటే లైంగిక శక్తి పెరుగుతుంది.
అతి మధురం చూర్ణాన్ని తేనెతో వాడితే దగ్గు ఆస్తమా గొంతులో గరగర తొలగిపోతుంది.
మోకాళ్ల నొప్పులను ఇది నయం చేస్తుంది. వేడి నీటిలో అతిమధురాన్ని చేర్చి పురుషులు ఉదయం, సాయంత్రం పూట తీసుకుంటే.. , జుట్టు నెరవడం, వీర్యలోపం వంటి సమస్యలుండవు. అతిమధురంతో వాత రోగాలు నయం అవుతాయి. ఛాతిలో నొప్పి, తలనొప్పికి అతిమధురం దివ్యౌషధంగా పనిచేస్తుంది. పచ్చకామెర్లను అతిమధురం పూర్తిగా నియంత్రిస్తుంది ,కిడ్నీ సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
1.-అతి మధుర చూర్ణంలో సగభాగం వచ చూర్ణం కలిపి పూటకు పావు స్పూను వంతున మూడు పూటుల తగినంత తేనెతో కలిపి తీసుకుంటే వివిధ రకాలైన దగ్గులు తగ్గుతాయి.
2.- అతిమధురం, అశ్వగంధ, శుంఠి చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని, అరస్పూను నుంచి ఒక స్పూను వరకూ అరకప్పు పాలతో కలిపి సేవిస్తుంటే కీళ్లు, కండరాల నొప్పులు, ఒంట్లో నీరసం తగ్గి హుషారుగా ఉంటారు.
3.- సోపు గింజల చూర్ణానికి రెట్టింపు అతి మధురం, పటికబెల్లం కలిపి ఉంచుకుని ఉదయం, సాయంత్రం ఒక స్పూను వంతున అరకప్పు నీటిలో కలిపి సేవిస్తే కడుపు ఉబ్బరం, దగ్గు, ఆయాసం, త్రేన్పులు తగ్గుతాయి.
4.- అతి మధుర చూర్ణాన్ని మూడు పూటలా పూటకు ఒక స్పూను వంతున అరకప్పు నీటిలో కలిపి సేవిస్తుంటే అధిక దాహం, ఎక్కిళ్లు, నోటిపూత, కడుపులో మంట, అధిక వేడి, చర్మంపై వచ్చే దద్దుర్లు తగ్గుతాయి.
5.- అరకప్పు పాలలో కలిపి సేవిస్తుంటే బాలింతల్లో స్తన్యవృద్ధి జరుగుతుంది.
బియ్యం కడుగు నీళ్లతో సేవిస్తే నోరు, ముక్కు మొదలైన భాగాలనుంచి కారే రక్తస్రావం, స్త్రీలలో అధిక బహిష్టు రక్తస్రావం తగ్గుతాయి.
జీర్ణాశయ, గర్భాశయ, శ్వాసకోశ వ్యాధులకు వాడే ఔషధాల్లో అతి మధురాన్ని ఒక అనుఘటకంగా ఉపయోగిస్తారు.
6.- అతి మధుర చూర్ణంతో పళ్లు తోముకుంటే పిప్పిపళ్లు, చిగుళ్లనుంచి రక్తస్రావం, నోటి పుళ్లు, నోటి దుర్వాసన తగ్గుతాయి.
7.- అతి మధుర చూర్ణం, ఎండు ద్రాక్ష సమానంగా కలిపి దంచి ముద్ద చేసి ఉంచుకుని, రోజూ రెండుసార్లు పూటకు పది గ్రాముల చొప్పున చప్పరించి కప్పు పాలు సేవిస్తుంటే స్త్రీలలో రక్తహీనత వల్ల కలిగే నీరసం, ఆయాసం, అలసట, గుండె దడ, మలబద్ధకం తగ్గు తాయి.
8.- రుతురక్తం సక్రమంగా పద్ధతిలో, సరైన ప్రమాణంలో వెలువడుతుంది. అధిక రుతుస్రావం తగ్గు తుంది. సుఖ ప్రదమైన నిద్ర కలుగుతుంది.
అతి మధురం, ఆకుపత్రి చూర్ణాలను సమానంగా కలిపి ఒక స్పూను వంతుగా రోజూ రెండుపూటలా అరకప్పు పాలతో కలిపి సేవిస్తుంటే మనో వ్యాకులత తగ్గి మనో నిబ్బరం, మానసిక ప్రశాంతత, మానసిక ఉత్తేజం కలుగుతాయి.
9.- అతి మధుర చూర్ణాన్ని గాయాలు, వ్రణాలు, పుళ్లపై చల్లుతుంటే రక్తస్రావం తగ్గి శీఘ్రంగా మానుతాయి.
10.- అతి మధురం, కరక, తాని, ఉసిరిక చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని, ఉదయం, సాయంత్రం రెండుపూటలా సేవిస్తుంటే నేత్ర దోషాలు తగ్గి కంటి చూపు మెరుగవుతుంది.
11.- అతి మధురం, సరస్వతి ఆకు, అశ్వగంధ, పటిక బెల్లం చూర్ణాలను సమానంగా కలిపి రెండుపూటలా పావుస్పూను నుంచి స్పూను వరకూ మోతాదుగా అరకప్పు పాలతో సేవిస్తుంటే మెదడుపై ప్రభావం చూపి మతి మరుపు తగ్గి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.
12.- అతి మధురం, అశ్వగంధ చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని, గ్లాసు పాలలో ఒక స్పూను చూర్ణం, ఒక స్పూను వంటున పటికబెల్లం పొడి, నెయ్యి, తేనె కలిపి రోజూ ఒకటి రెండుసార్లు తాగుతుంటే పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగడమే కాక, లైంగిక కార్యం తరువాత కలిగే నీరసం, నిస్సత్తువ, కండరాలు బిగదీసుకున్నట్లు ఉండే ఇబ్బందులు తొలగుతాయి.
12.- మధుమేహ వ్యాధిగ్రస్తులు అతి మధురం వాడే విషయంలో వైద్యుల సలహాలను అనుసరించాల్సి ఉంటుంది.
13.-.- అతిమధురం చూర్ణానికి అవసరమైనంత చక్కెర కలిపి, రోజుకు రెండు సార్లు, రెండు స్పూన్ల చొప్పున సేవిస్తుంటే ఎలర్జీ, దద్దుర్లు తగ్గుతాయి.
రెండు వారాల తరువాత నుంచి వారు మామూలుగా వాడే ఓరల్ హైపోగ్లైసీమిక్ మందులను నిలిపేయటం జరిగింది.
.
*Note: fresh మూలికలు అన్ని సేకరించి తయారుచేసుకోలేని వారికి మూలికలతో మాచే స్వయంగా తయారు చేయబడిన చూర్ణంసిద్ధంగా ఉంది.
.
✍️ *సమస్య ఏదైనా ఒకసారి మాతో చర్చించండి. మా వంతు సహాయంగా మీకు విలువైన ఆరోగ్య సలహాలు ఇవ్వబడును
Cell.9949363488
🙂 *అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలి* 🙂
✍️ *మధుమేహం (షుగర్) సమస్య - అద్భుతమైన ఆయుర్వేద మరియూ గృహ చికిత్స నివరణా మార్గాలు:*
*విన్నపం:*
*మిత్రులు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని వికువైన ఆరోగ్య సమాచారాన్ని మీకోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొంచెం ఓపిక పెట్టి మొత్తం చదివి అర్థం చేసుకుని పాటించగలరని మనవి.*
👉చరిత్రలో మొట్టమొదటగా మధుమేహాన్ని గూర్చిన సమగ్రమైన వివరణ ఇచ్చింది ఆయుర్వేద గ్రంథాలే.
👉చరక సుశృత సంహితలు గ్రంథస్తమైన కొన్ని వేల సంవత్సరాల తరువాత కూడా... నాటికీ, నేటికీ... వ్యాధి మౌలిక దృక్పథంలో ఏ మాత్రం మార్పు లేక పోవటం వైద్య శాస్త్రవేత్తలను విస్మయ పరుస్తోంది.
👉 "వాత వ్యాధీ ప్రమేహశ్చ....” అంటూ సుశృతుడు ఎనిమిది మహారోగాలలో మధుమేహాన్ని చేర్చి చికిత్సాపరంగా దీనికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చాడు.
👉ఎక్కువ మోతాదులో మూత్రం (మేహం) వెళుతుంది కాబట్టి దీనికి ప్రమేహమని పేరు. అలాగే మూత్రం చక్కెరతో (మధు) కలిసి విసర్జితమవుతుంది. కనుక దీనికి మధుమేహమని పేరు వచ్చింది.
👉దీనిలో 'ప్రభూత-మూత్రత (మూత్రం ఎక్కువ మోతాదులో రావటం), అవిల మూత్రత (మూత్రం చిక్కగా రావటం) అనే రెండు ప్రధానమైన లక్షణాలుంటాయని శాస్త్రకారుడు చెప్పాడు.
👉 మధుమేహానికి సరిపోలిన ఇంగ్లీషు పదం డయాబెటిస్ మెల్లిటస్ కూడా ఇదే అర్థాన్ని ధ్వనించడం గమనార్హం! డయాబెటిస్ అనేది గ్రీకు పదం. ప్రవహించడమని దీని అర్థం. అలాగే మెల్లిటస్ అనేది లాటిన్ పదం. తేనె అని అర్థం. డయాబెటిస్ మెల్లిటస్ అంటే, తేనె వంటి ద్రవం శరీరం నుంచి ప్రవహించడమని అర్థం.
👉మధుమేహంలో వాత, పిత్త, కఫాల జోక్యం ఉన్నప్పటికి ప్రధానంగా కఫ వాతాలు దూషితమవుతాయి.
👉శ్లేష్మం పెరిగే ఆహార విహారాల వలన కఫం ఆమాశయంలో జమ చేరి పాంక్రియాస్ బలహీనమవుతుంది.
👉ఈ పాంక్రియాస్ ఇన్సులిన్ ను పూర్తి స్థాయిలో విడుదల చేయలేకపోవడంతో రక్తంలో ఉన్న చక్కెర నిల్వలు కణజాలాలలోకి వెళ్లలేవు.
👉దీనితో శరీరానికి రావలసిన శక్తి అందకపోగా, గుండె, మూత్రపిండాల వంటి ప్రధాన అంతర్గత అవయవాల మీద అదనపు వత్తిడి పడుతుంది.
👉ఈ విధంగా మధుమేహమూ, దానిని అనుసరించి ఇతర ఇక్కట్లు వస్తాయి.
👉శారీరక క్రియలు సక్రమంగా జరగకపోవడానికి కారణం వాతదోషం కనుక, మధుమేహం వాత ప్రధాన వ్యాధిగా నమోదయింది.
👉మధుమేహం ఎందుకు ప్రాప్తిస్తుందనే దానికి సుశృతుడు ఇచ్చిన వివరణ అత్యంత ప్రామాణికతను సంతరించుకుంది.
👉'సహజో ఆపథ్యనిమిత్తా...' అంటూ మధుమేహం ప్రధానంగా రెండు రకాలని, వంశపారంపర్యత, బీజ దోష వికృతి వంటి సహజమైన కారణాలచేత వచ్చేది మొదటి రకమని, అపథ్యాలైన ఆహార విహారాలను పాటించడం వలన సంక్రమించేది రెండవ రకమనీ సుశృతుడు పేర్కొన్నాడు.
👉మొదటి రకాన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ లేదా జువనైల్ డయాబెటిస్ తోను, రెండవ రకాన్ని నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ లేదా మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటిస్ తోనూ పోల్చవచ్చు.
👉మధుమేహం వ్యక్తమవ్వటానికి ముందుగా శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. ఆయుర్వేదం ఈ లక్షణాలను 'పూర్వరూపాలు' అంటుంది.
👉ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు కనుక అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి పురోగమనాన్ని అరికట్టవచ్చు.
👉 శరీరమంతా జిగటగా తిమ్మిరి పట్టినట్లు ఉండటం (చిక్కనతా దేహే),
👉దంతాలు, కళ్లు మొదలైన భాగాల్లో మలినాలు ఎక్కువగా చేరడం (దంతాధీనాం మలాద్యత్వం),
👉 నోరు తడారి పోవటం (గళ తాలు శోష),
👉కాళ్లు, చేతుల్లో మంటగా అనిపించటం (హస్త పాద తల),
👉వెంట్రుకలు, గోళ్లు ఎక్కువగా పెరగటం (కేశ నఖాతివృద్ధి),
👉మూత్రం నుంచి తియ్యని వాసన రావటం (మధుర మూత్రత),
👉ఎక్కువగా దాహం వేయటం (పిపాసా),
👉 అనుత్సాహంగా అనిపించటం (అవసాదం),
👉 చల్లని పదార్థాలంటే ఇష్టంగా అనిపించటం (శీత ప్రియత్వం),
👉నిస్త్రాణగా అనిపించటం (శిథిలాంగత),
👉కొద్దిపాటి పనికే ఆయాసం రావటం (శ్వాస),
👉 నోటిలో తియ్యగా అనిపించటం (స్వాదు ఆస్యత),
👉ఎప్పుడూ విశ్రమించాలని అనిపిస్తుండటం (స్వప్న సుఖే రతి),
👉కునికిపాట్లు పడుతుండటం (తంద్ర),
👉చెమటలు ధారలుగా కారుతుండటం (స్వేదో గంధా)...
👉ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వాటిని మధుమేహ పూర్వరూపాలుగా భావించాల్సి ఉంటుంది.
👉చికిత్స విషయానికి వస్తే, సంహితాకారులు రక్తంలోని చక్కెరను తగ్గించటం కంటే, 'సంప్రాప్తి విఘటన'కు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు.
👉సంప్రాప్తి అంటే, వ్యాధి ప్రాదుర్భావం నుంచీ ఉపద్రవాల వరకూ కొనసాగే వివిధ దశలు, దోషాలు కొద్దిగా పెరిగినప్పుడు ఆహారనియమాలతో పాటు శారీరక వ్యాయామాలు అవసరమవుతాయి.
👉 దోషాలు ఒక మోస్తరుగా వృద్ధి చెందితే ఆహార వ్యాయామాలతో పాటు ఔషధాలు కూడా అవసరమవుతాయి. ఒకవేళ దోషాలు మరీ ఎక్కువగా వృద్ధి చెందితే, ఔషధ, ఆహార, వ్యాయామ సూచనలతో పాటు దోషాలను సమూలంగా బైటకు పంపడానికి శోధన చికిత్సలను చేయాల్సి ఉంటుంది. వీటిని పంచకర్మ చికిత్సలు అంటారు.
👉సంక్షిప్తంగా చెప్పాలంటే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, మధుమేహ చికిత్స రెండు ప్రధానమైన విభాగాలుగా జరుగుతుంది:
*1) ఆహార చికిత్స 2) ఔషధ చికిత్స.*
*1. ఆహార చికిత్స:*
👉మీరు ఇంతకు మునుపు ఏ ఆహారం తీసుకుంటున్నారో అదే కొనసాగించవచ్చు. వరి అన్నం మానేసి హడావుడిగా గోధుమ రొట్టెలు మొదలెట్టాల్సిన పనిలేదు. కాకపోతే తీపి పదార్థాలను, అధికంగా క్యాలరీలను విడుదల చేసే పదార్థాలను త్యజించాల్సి ఉంటుంది.
👉అంటే చక్కెర, స్వీట్లు, బెల్లం, గ్లూకోజ్, జీడిపప్పు, వేరుశనగ, కొబ్బరి, కూల్డ్రింక్స్, మద్యం, అరటి, మామిడి, పనస, సపోట మొదలైన వాటిని మీ ఆహారం నుంచి తొలగించాలి.
👉మధుమేహంలో ఆకలి ఎక్కువగా వేస్తుంటుంది. అలా అని ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటే శరీరంలో అల్పస్థాయిలో తయారయ్యే ఇన్సులిన్ మోతాదు ఆహారం నుంచి తయారయ్యే గ్లూకోజ్ను పూర్తిగా దహనం చెందించలేదు. దీనితో రక్తంలో చక్కెర శాతం పెరిగిపోతుంది. అందుచేత ఆహారాన్ని చిన్న చిన్న మోతాదులలో తరచుగా తీసుకోవడం మంచిది.
👉ఆహారంలో దుంప కూరలను మానేయాలి. వీటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వలన గ్లూకోజ్ ఎక్కువగా తయారు కావడమే కాకుండా వాతం కూడా పెరుగుతుంది. మధుమేహం వాత ప్రధాన వ్యాధి అనే సంగతి ఇంతకు ముందే పేర్కొనడం జరిగింది.
👉కొవ్వు పదార్థాలను పూర్తిగా మానేయాలి. అలాగే నెయ్యి, వెన్న, కొబ్బరి నూనె, వేరుశనగ నూనె మొదలైనవి రోజు మొత్తానికి మూడు, నాలుగు చెంచాలకు పరిమితం చేసుకోవడం మంచిది. మధుమేహం విషయంలో కోడిగుడ్డులోని పచ్చసొన, డాల్డా తదితరాలు కూడా మంచివి కాదు.
✍️ *ఆహారం తీసుకోవాల్సిన పద్ధతి, ప్రణాళిక:*
✍️ *ప్రాతః కాలం:*
👉రెండు చెంచాల మెంతులు రాత్రంతా నీళ్లలో నానేసి ఉదయం నిద్ర లేచిన తరువాత నమిలి వేడి నీళ్లు తాగాలి. (లేదా)
👉అరకప్పు ఉసిరిపండ్ల రసంలో చిటికెడంత పసుపు కలుపుకొని తాగాలి. (లేదా)
👉 కాకరకాయ రసాన్ని వేడి నీళ్లతో కలిపి తాగాలి.
✍️ *ఉదయం తీసుకోవాల్సిన అల్పాహారం:*
👉ఉప్మాను జారుడుగా చేసుకొని చిన్న గరిటెడు తినాలి (కొద్దిగంత నెయ్యి తాళింపుతో) (లేదా)
👉అటుకులతో చేసిన ఉప్మాను బఠాణీలు, ఉల్లిపాయలతో సహా తినాలి. (లేదా)
👉 మొక్కజొన్నలతో చేసిన ప్లేక్స్ను పాలలో నానేసి తినాలి. (లేదా)
👉ఉడికించిన కోడిగుడ్డును పచ్చసొన
తొలగించి తినాలి. తరువాత...
👉కూరగాయలతో చేసిన సూప్ను గానీ, టమాటా సూప్ను గానీ తాగాలి. (లేదా)
👉వెన్న తీసిన పాలు తాగాలి. (లేదా)
👉 పుచ్చకాయ, బత్తాయి, క్యారెట్, ఆపిల్... మొదలైన పండ్లనుంచి తీసిన రసాన్ని తాగాలి.(చక్కెర లేకుండా)
✍️ *మధ్యాహ్నం భోజనం:*
👉భోజనానికి ముందు దోసకాయ, టమాట, ఉల్లి, క్యారెట్ మొదలైన వాటితో సలాడ్ చేసుకొని తినాలి.
👉గోధుమలతో చేసిన చపాతీలను గానీ, పరిమిత మోతాదులో వరి అన్నాన్ని గానీ మెంతులతో కలిపి తయారు చేసుకొని తినాలి.
👉ఆకు కూరలను, కాయగూరలను వేపుడుగా కాకుండా పులుసు కూరలాగా చేసుకొని తగినంతగా తినాలి.
👉బీన్స్, లేత వంకాయ, బూడిద గుమ్మడికాయ, కాకరకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టమాటా, సొరకాయ, మునగ కాయ, పొట్లకాయ, బెండకాయ, దోసకాయ, బీరకాయ, దొండకాయ...వీటిలో దేనినైనా ఉడికించి తగినంత అల్లం, వెల్లుల్లి, మెంతులు, జీలకర్రలను కలిపి తీసుకోవచ్చు.
👉పెసర పప్పును గానీ, కందిపప్పును గానీ పలుచగా ఉడికించి తీసుకోవాలి. ఉడికిన తరువాత, అరుగుదల కోసం ఇంగువ, మిరియాలు, లవంగాలు, జీలకర్ర మొదలైన వాటితో వేయించి తీసుకోవచ్చు.
👉చివరగా పెరుగుకు బదులు మజ్జిగ పోసుకొని భోజనాన్ని ముగించాలి.
👉మాంసాహారులు చేపలను గానీ, స్కిన్ లెస్ చికెన్ ను గానీ పరిమితంగా తీసుకోవచ్చు.
✍️ *సాయంత్రం అల్పాహారం:*
👉అటుకులతోను, మరమరాలతోనూ మిక్చర్లా చేసుకొని ఉల్లిపాయ ముక్కలతో సహా తినాలి. (లేదా)
👉 బొప్పాయి(పండినది కాదు), దానిమ్మ, బత్తాయి మొదలైన
పండ్లను ముక్కలుగా చేసుకొని తినాలి. (లేదా)
👉మేరీ బిస్కెట్లను తినాలి, తరువాత....
👉వెన్న తీసిన పాలలో అశ్వగంధ చూర్ణం, శతావరి చూర్ణం మొదలైన చూర్ణాలను కలుపుకొని తాగాలి. (లేదా)
👉 కూరగాయలనుంచి తీసిన సూప్ను గానీ, టమాటా సూప్ను గానీ తాగాలి. (లేదా)
👉టీలో అల్లం కలుపుకొని తాగాలి. (పంచదార కలపకుండా) (లేదా)
👉నీటిలో నానేసిన ఖర్జూరాల నుంచి రసం పిండి, ఉసిరి రసంలో కలుపుకొని త్రాగాలి.
✍️ *రాత్రిభోజనం:*
👉ఇది మధ్యాహ్న భోజనం కంటే కాస్త తేలికగా ఉంటే మంచిది.
👉రాత్రి పడుకునే ముందు పల్చటి మజ్జిగ తాగాలి.
👉 ఓరల్ హైపోగ్లైసీమిక్ డ్రగ్స్ కి అంతగా ప్రతిస్పందించని వారిలో కూడా ఈ మిశ్రమం ఆశాజనకమైన ఫలితాలను ప్రదర్శించినట్లు అధ్యయనకారులు గమనించారు.
👉అలాగే ఆహారం విషయంలోనూ, వ్యాయామం విషయంలోనూ ఎంత నిక్కచ్చిగా ఉన్నప్పటికీ ప్రయోజనం కనిపించని వారిలో కూడా ఇది చక్కని ఫలితాలను చూపించింది, అయితే, ఇన్సులిన్ మీద ఆధారపడిన వారిలో మాత్రం అంతగా ప్రభావాన్ని చూపించలేకపోయింది.
👉మామిడి జీడి, నేరేడు గింజలు, కాకరకాయలు, పొడపత్రిఆకులు మొదలగు వీటి చూర్ణాన్ని 5 గ్రాముల మోతాదులో రోజుకు మూడుసార్లు చొప్పున ఇస్తూ, ఆహారపు శక్తిని రోజుకు 1200 క్యాలరీలకు నియంత్రించినప్పుడు 60 శాతం కేసుల్లో చక్కని మార్పు కనిపించింది. అధ్యయనాన్ని ఆరునెలపాటు, 100 మంది వ్యక్తులమీద జరిపారు.
👉ఈ బైల్ పదార్థం సహజంగా నీటిలో కరిగే గుణం కల్గి ఉంటుంది. ఒక్కోసారి 'లివర్లో తయారయ్యే ఈ బైల్ కి నీటిలో కరిగే లక్షణం పోతుంది. కామెర్లు వచ్చినప్పుడు రక్తంలో కలిసిన బైల్ మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ అయి మూత్రం ద్వారా బైటకు పోతుంది. కాబట్టి, కామెర్లలో మూత్రం ఆవులు, గేదెల మూత్రంలాగా పచ్చగా వెళ్తుంది.
👉 హైపటైస్ వైరస్ వలన కామెర్లు వస్తే ఆ కామెర్లు ప్రాణాపాయ స్థితిని తెస్తాయి.
👉ఫిట్స్ జబ్బులకు వాడే మందులు, బి.పి. మందులు, మత్తునిచ్చే మందులు, పారాసిటమాల్ వంటి జ్వరం బిళ్ళలు తక్షణం లివరిని దెబ్బతీసి కామెర్లకు కారణం కావచ్చు కూడా!
👉 *గాల్ స్టోన్స్ :* గాల్ బ్లాడర్లో నిలవ ఉండే బైల్ రసాయనం ఒక్కోసారి గడ్డలు కట్టినట్లయి
రాళ్ళలా మారిపోతుంది. ఈ రాళ్ళనే గాలెన్స్ అంటారు.
👉బైల్ రసాయనంలో కొలెస్టరాల్, బైల్ పిగ్మెంట్స్ అనే పచ్చరంగునిచ్చే పదార్థాలు, కొన్ని ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి. వాటి పరిమాణంలో గాని, మోతాదులోగానీ తేడాలున్నప్పుడు సాధారణంగా గాలెన్స్ ఏర్పడుతుంటాయి. కొలెస్టరాల్ రాళ్ళు, బైల్పిగ్మెంట్ రాళ్ళు, రకరకాల రసాయనాలు కలిసిన రాళ్ళు ఇలా... ఈ రాళ్ళు ఏర్పడుతుంటాయి. ఈ గాల్ స్టోన వలన కోలిసిస్టయిటిస్, బిలియరీ కోలిక్ (కుడిడొక్కల్లో తరచూ విపరీతమైన నొప్పి) కామెర్లు కూడా వస్తుంటాయి.
👉ఇలా చెప్పుకుంటూ పోతే, లివర్ వ్యాధుల గురించి పెద్ద అధ్యాయమే అవుతుంది. కానీ ఎక్కువ లివర్ వ్యాధులు మాత్రం మన అజాగ్రత్త వలన, అశ్రద్ధ వలన, నిర్లక్ష్యం వలన మాత్రమే వస్తున్నాయని మరోసారి గుర్తుచేస్తున్నాము.
👉జీర్ణశక్తిని కాపాడుకోలేకపోతే ఈ లివర్ వ్యాధులు ఎప్పటికైనా తప్పకపోవచ్చు.
✍️ఈ సమస్యకు పరిస్కారం గా తయారుచేయబడిన ఆయుర్వేద దివ్యౌషదాలు సమస్యలకు అన్నింటికీ అద్భుతంగా పని చేస్థాయి
వాడుతూ ఉంటే లివర్ పదిలంగా ఉంటుంది. ఈ లివర్ వ్యాధులు సాధారణంగా రాకుండానే నిరోధించవచ్చు కూడా!!
👉లివర్ నిర్వర్తించే కార్యకలాపాలలో ముఖ్యమైన కార్యం.... శరీరంలో విషలక్షణాలు పెరగకుండా వాటిని బైటకు వెళ్ళగొట్టడం. లివర్ బలంగా ఉంటే విషంతిన్నా మనిషి మృత్యుంజయుడే అవుతాడు.
👉పొట్టలోపల ఉండే లివర్, స్పీన్, పాంక్రియాస్ ఈ మూడు అవయవాలకు సంబంధించిన జబ్బుల్లో సహాయపడే చూర్ణం ఇది. దీనిని మజ్జిగతో కలిపి తీసుకుంటే బాగా పనిచేస్తుంది.
👉లివర్, స్పీన్ పాంక్రియాస్ అవయవాలలోగాని కిడ్నీలలోగాని, పేగులలోగాని గడ్డల వంటివి వచ్చినవారు కూడా తప్పని సరిగాఈచూర్ణం వాడుకోవాలి.
👉కడుపులో వాతం, కడుపు ఉబ్బరం మెలితిప్పినట్లు బాధ, విరేచనం బంధించడం వంటి బాధలలో ఈ చూర్ణం రెండుపూటలా తీసుకొంటే వెంటనే ఫలితం కన్పిస్తుంది.
👉పైల్స్, ఫిస్ట్యులా వంటి మూల వ్యాధులతో బాధపడేవారు, వాటికి వాడుతున్న మందులతో (ఏ వైద్య విధానానికి సంబంధించినవి అయినా సరే) పాటు అదనంగా ఈ చూర్ణం కూడా వాడండి.
👉జీర్ణశక్తి ఏమాత్రం సరిగాలేదని గమనించగానే, వెంటనే ఈచూర్ణం వాడుకోండి. అజీర్తి పెద్దదై అనేక వ్యాధులకు దారి తీయకుండానే నివారించ బడ్తుంది.
👉 రక్తక్షీణత వలన మనిషి తెల్లగా పాలిపోయి, శుష్కించి పోతాడు. గుండె దడదడలాడుతుంటాయి. ఆయాసపడి పోతుంటాడు. పట్టుమని పదినిమిషాలు ఏ పనీ చేయలేకపోతాడు. ఉత్సాహం కోల్పోతుంటాడు. పని సామర్ధ్యం పడిపోతుంటుంది. ఇలాంటి వారు ఈ లక్షణాలు కన్పించగానే వైద్యుని సంప్రదించి హిమోగ్లోబిన్ ఎంత శాతం ఉందో పరీక్ష చేయించు కోవడం తగిన మందులు వాడుకోవడం చెయ్యాలి. దానితో పాటు ఈ చూర్ణం వాడండి. తక్షణం రక్తక్షీణత తగ్గు తుంది. ఉత్సాహం కల్గుతుంది.
👉టి.బి. జబ్బు వచ్చినప్పుడు దానికి వాడే రిఫామైసిన్, ఐసోనయజిడ్, ఇథామ్బటాల్ అనే మందులకు, స్ట్రెప్టోమైసిన్ ఇంజెక్షన్ కు లివర్ ను దెబ్బతీసే గుణం ఉంది. కాబట్టి, ఈ వ్యాధి వచ్చినవారు విధిగా ఆయామందులతో పాటుగా ఈ చూర్ణం కూడా వాడండి.
👉హృదయ వ్యాధులు, బి.పి. వంటి వ్యాధులకు వాడే మందులు కూడా ఇలానే లివర్ ని దెబ్బతీస్తాయి. కాబట్టి ఈ మందులు వాడ్తున్నవారు ఈచూర్ణం కూడా వాడితే, అది లివర్నేకాదు, గుండెను రక్తనాళాలను కూడా బలసంపన్నం చేస్తుందని 'చక్రదత్త' వైద్యగ్రంథం వివరిస్తోంది.
👉 పేగుల్లో జబ్బులు, అమీబియాసిస్ ల కోసం ముఖ్యంగా మెట్రోనిడజోల్, టినిడాజోల్ వంటి మందులు ఎక్కువగా వాడ్తున్నవారు విధిగాఈచూర్ణం వాడండి. ఇది అమీబియాసిస్ ను తగ్గించి, జీర్ణశక్తిని పెంచి, పేగుల్ని సంరక్షించ గల్గుతుంది. విరేచన బద్ధకాన్ని సరిచేస్తుంది. రోజూ విరేచనం ఫ్రీగా, రెగుల్యర్గా అయ్యేలా చేస్తుంది.
👉 అన్నింటికన్నా ముఖ్యమైంది...ఆయుర్వేద చూర్ణం విషానికి విరుగుడుగా పని చేస్తుంది. ‘స్లోపాయిజన్లకు అలవాటు పడిన వారికి ఇది మంచి ఔషథం. ఆహార పదార్థాల్లో రకరకాల కల్తీలు కలిసినవి తినడం, రంగు పదార్థాలు కలిపి వాడడం ఇవన్నీ స్లోపాయిజన్సే! స్మోకింగ్, వాతావరణ కాలుష్యం, ఆల్కహాల్, మాదక ద్రవ్యాలు.. ఇలాంటివన్నీ లివర్ పనితీరును దెబ్బతీస్తాయి. కాబట్టి, శరీరంలో అత్యంత ముఖ్యమైన ‘లివర్' అవయవాన్ని సంరక్షించుకోవడం కోసం తప్పనిసరిగాఆయుర్వేద చూర్ణం వాడుకొంటూ ఉండటం మంచిది
✍️ *అన్ని రకాల కాలేయ (లివర్) సమస్యలకు ఆయుర్వేద నివారణ మార్గాలు:*
👉లివర్ చెడిపోయిందంటే జీర్ణశక్తి ఫెయిలయిందని అర్థం చాలా కాలంగా తమ జీర్ణశక్తిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారని అనుకోవాలి.
👉లివర్ వ్యాధులకు అల్లోపతి మందులు లేకపోవడం కారణంగా ప్రాణాపాయస్థితికి ఈ వ్యాధులు చాలా త్వరగా చేరుకొంటున్నాయనేది వాస్తవం.
👉హెపటైటిస్, సిర్రోసిస్, కొలిసిస్టయిటిస్ వంటి వ్యాధులు లివర్ పనితీరును దెబ్బతీసి ప్రాణాపాయస్థితిని తెచ్చిపెడతాయి.
👉 ఇలాంటి వ్యాధుల్లో రోగి మామూలు ఆరోగ్య స్థితిని కాపాడుతూ వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ... లివర్ని శక్తివంతంగా తీర్చిదిద్ది, లివర్ వ్యాధులను త్వరగా తగ్గించే మంచి ఆయుర్వేద ఔషథాలను వాడుకోవడం చాలా అవసరం.
👉 *సిర్రోసిస్:* లివర్ స్వరూప స్వభావాల్ని ఏ మాత్రం బాగుచేయడానికి వీలులేనంతగా పాడుచేసే వ్యాధిని 'సిర్రోసిస్ ఆఫ్ లివర్' అంటారు. ఈ వ్యాధికి 50 శాతం కారణం అజీర్తి మాత్రమే!
👉కల్లు, సారా, విస్కీ వంటి మత్తుపానీయాలు, అనేక ఇతర వ్యాధులలో వాడే వివిధ ఔషధాలు కూడా లివర్ సిర్రోసిస్ కి కారణం అవుతాయి.
👉 అతిగా ఇనుము లివర్ ద్వారా ఎక్కువగా అవటం వలన కూడా సిర్రోసిస్ వస్తుంటుంది కొందరిలో.
👉తరచూ కామెర్లు, గోళ్ళు తెల్లబడటం, మనిషి తెల్లగా పాలిపోయి శుష్కించి పోవడం, గోళ్ళు చెంచా ఆకారంలో వంగిపోవటం, వృషణాలు (ముష్కాలు) క్షీణించడం, పేగుల్లో రక్తస్రావం, ఆఖరుగా లివర్ ఫెయిల్యూర్... ఇలా ఈ వ్యాధి ప్రాణాంతకంగా పరిణమిస్తుంటుంది.
👉 జలోదరం వ్యాధిలో పొట్టచుట్టూ నీరుపట్టి, పైకి ఎదగదన్నినట్లయి ఊపిరాడనట్లవుతుంది. లివర్ తో పాటు మూత్రపిండాలు కూడా దెబ్బతినడం వలన ఈ వ్యాధి వస్తుంది.
👉హెపటైటిస్ వైరస్లలో అనేక రకాలున్నాయి. వాటిలో కొన్ని లివర్ ని చేరి, అది వాచిపోయేలా చేస్తాయి. అందువలన కామెర్లు ప్రముఖంగా బైట పడతాయి. కొందరిలో ఈ లివర్ వాపు జబ్బు (హెపటైటిస్) నెలల తరబడి ఉండిపోతుంది కూడా!
👉 "క్రానిక్ యాక్టివ్ హెపటైటిస్" (CAH) అనే పరిస్థితికి ఇది దారితీస్తుంది. క్రమేణా సిర్రోసిస్ కు కూడా కారణమై మరణం వైపు నడిపిస్తుంది.
👉 *లివర్ నెక్రోసిస్ సమస్య:* పారాసిటమాల్ వంటి జ్వరం బిళ్ళలు ఎక్కువగా మింగిన వ్యక్తులకు త్వరగా లివర్ దెబ్బతింటుంది. జ్వరం, కీళ్ళనొప్పులు, నడుంనొప్పి, తలనొప్పి వంటి బాధలతో ఎప్పుడూ సతమతమయ్యేవారు ఈ ఔషధాన్ని తప్పనిసరిగా అతిగా వాడుతుంటారు. అందువలన తాత్కాలికంగా నొప్పి తగ్గినట్లనిపించినా, చివరికి లివర్ ని బలిపెట్టవలసి వస్తుంటుంది.
👉ఇలాగే, టి.బి. మందులు, మత్తుని కల్గించే మందులు, బి.పి. తగ్గడానికి వాడే మందులు కూడా లివర్లో నెక్రోసిస్ అనే ప్రమాదకర పరిస్థితిని తీసుకువస్తాయి. ఎప్పుడూ కామెర్లు తిరగబెడ్తున్నాయంటే త్వరలో లివర్ సిర్రోసిస్ కి గాని, నెక్రోసిస్ గానీ, కేన్సర్ కి గాని దారితీస్తుంది.
👉లివర్ లో నెక్రోసిస్ వస్తే కామెర్లు, మెదడుకు నీరుపట్టి వాచిపోవటం (ఎనోకెఫలోపతి), రక్తస్రావం, రోగి అకస్మాత్తుగా కోమాలోకి వెళ్ళిపోవటం, జలోదరం (ASCITIS) వంటి లక్షణాలు కూడా కన్పిస్తాయి. అప్పుడప్పుడు కొన్ని మానసిక లక్షణాలు కూడా వస్తుంటాయి. .
👉అయితే లివర్ ని బాగుచేసి, బలసంపన్నం చేసి, సాధారణ స్థితికి తీసుకు రాగలిగితే రోగులు పునర్జీవితం పొందే అవకాశం ఉంది... ఈ లివర్ నెక్రోసిస్ వ్యాధిలో!!
👉లివర్ దెబ్బతింటోందని ముందుగానే గ్రహించి లివర్ ని శక్తివంతం చేసే ఆయుర్వేద ఔషథాలు వాడుతూ ఉంటే ఈ నెక్రోసిస్ ప్రమాదాన్ని నివా రించవచ్చు.
👉 *కామెర్లు:* లివర్ వ్యాధి అనగానే కామన్ గా కన్పించే కామెర్లు రక్తానికి ఎర్రరంగునిచ్చే ఇనుముకు సంబంధించిన రసాయన పదార్థాన్ని హిమోగ్లోబిన్ అంటారు. లివర్ ఈ హిమోగ్లోబిన్ కు పుట్టిల్లు. ఈ హిమోగ్లోబిన్ లోంచి బిలురుబిన్ అనే రసాయన పదార్థం విడిపోయి, లివర్లో ఉన్న బైల్దక్ట్ ద్వారా పేగుల్లోకి వెళ్తుంది. ఈ బిలిరుబిన్నే 'బైల్' అని కూడా పిలుస్తారు. ఇది జీర్ణ ప్రక్రియకు తోడ్పడే రసాయనం.
👉కామెర్ల వ్యాధిలో ఈ బైల్ పదార్థం పేగుల్లోకి వెళ్ళకుండా నిరోధించబడ్తుంది. పేగుల్లో బైల్ లేకపోవడంచేత జీర్ణశక్తి పూర్తిగా మందగించి పోతుంది. ఇది పసుపు పచ్చటి పదార్ధం కాబట్టి జీర్ణ ప్రక్రియ చివరలో విరేచనం రూపంలో వెళ్ళే మలిన పదార్థాలు పచ్చగా గాని, గోధుమరంగులోగాని మనకు కన్పిస్తాయి. కామెర్ల వ్యాధిలో బైల్ పేగుల్లోకి వెళ్ళదు కాబట్టి విరేచనం తెల్లకాగితం అంత తెల్లగా వెళ్తుంది.
👉పేగుల్లోకి వెళ్ళకుండా లివర్లో మిగిలిపోతున్న బైల్ పదార్థం లివర్ ద్వారా రక్తంలోకి చేస్తుంది. దాంతో రక్తం అంతా పచ్చగా తయారవుతుంది. ఈ పచ్చదనాన్ని మనం కళ్ళలోనూ, నాలుక వెనుకభాగాన, అరిచేతుల్లోనూ, పలుచటి భాగాల న్నింటిలోనూ గమనిస్తుంటాం. కామెర్లలో ఒళ్ళు పచ్చబడిపోవడానికి కారణం ఇదే!!
మా వద్ద లభించే ఈ ఔషధం లో స్వచ్ఛమైన మూలికలను వాడడం తోపాటు పరిశుభ్రతను పాటిస్తూ ఎంతో జాగ్రత్తగా తయారుచేబడింది.
✍️ *విన్నపం:*
విలువైన సమాచారాన్ని ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అంత ఎక్కువ మేలు చేసిన వారు అవుతారు.
✍️సమస్య ఏదైనా ఒకసారి మాతో చర్చించండి.
Call *9949363498*
🙂 *అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలి*🙂
*Immunity/ రోగనిరోధక శక్తి*
######################
వాము
మిరియాలు
దాల్చిన చెక్క
తోక మిరియాలు
తులసి ఆకు
తిప్పతీగ
అల్లము
ఉసిరిక
పసుపు
వీటన్నింటిని సమము చూర్ణ ము చేసిపెట్టుకొని
టీ స్పూను ఆహారానికి అరగంట ముందు గోరువెచ్చని నీటితో పొద్దున రాత్రి త్రాగాలి
######################
మీరు తయారుచేసుకోలేని వారు కావాలంటే తయారు చేసి ఇవ్వగలను
(చూర్ణము/ tablets)
Call 9949363498
*🍈ఉసిరి...ఔషథ సిరి🍈*
‘సి-విటమిన్ ఎక్కువగా ఉండే పండ్లూ కూరగాయలూ తినండి...
రోగనిరోధకశక్తి పెరుగుతుంది’ కరోనా పుణ్యమా అని ఈ విషయం మాటలు సరిగ్గా రాని పసివాళ్ల నుంచి చదువురాని వృద్ధుల వరకూ అందరికీ నోటిమాటగా మారిపోయింది. అయితే ఆ విటమిన్ ఎక్కువగా ఉండే పండు ఏదీ అంటే మాత్రం నారింజ అనో, నిమ్మ అనో చెబుతారు. కానీ అందులో తొలి స్థానం మన ఉసిరి (ఇండియన్ గూస్బెర్రీ) దే... దానికి సీజన్ ఇదే..!
ప్రకృతిలో ఆరోగ్యఫలాల్ని అందించే చెట్లు ఎన్నో ఉన్నాయి. అయితే అటు ఆరోగ్యంతోపాటు ఇటు దైవ సమానంగా పూజలందుకునే చెట్లు కొన్నే ఉంటాయి. అలాంటి పవిత్ర వృక్షాల్లో ఒకటి ఉసిరి. దేవ దానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరబాటున భూమ్మీద పడటంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం. కార్తిక మాస పూజల్లోనూ వ్రతాల్లోనూ ఉసిరికి విశిష్ట స్థానం ఉంది. చెట్టుని పూజించడంతో పాటు కాయల్నీ దీపాలుగా వాడుతుంటారు. అప్పటి నుంచీ మొదలైన ఉసిరి కాయలు వేసవి వరకూ కాస్తూనే ఉంటాయి. వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కల్లో ఉసిరి ఎంతో ఉత్తమం అని చరక సంహిత పేర్కొంటోంది. ఆయుర్వేద వైద్యానికి ఉసిరే కీలకం. అందుకే ప్రతీ వ్యక్తీ తన జీవిత కాలంలో ఐదు ఉసిరి మొక్కలయినా నాటాలని పెద్దవాళ్లు చెబుతారు. ఉసిరిని సంస్కృతంలో ఆమ్లా లేదా ధాత్రీఫలం అని పిలుస్తారు.
మనకు తెలిసి ఉసిరిలో రెండు రకాలు... ఒకటి పుల్లని నేల ఉసిరి, మరొకటి తీపీ వగరూ పులుపూ కలగలిసినట్లుండే రాతి ఉసిరి. నేల ఉసిరిని నేరుగా తినడానికో పులిహోరకో వాడటంతోపాటు ఆ పొడిని దుస్తుల అద్దకాల్లోనూ వాడతారు. రాతిఉసిరిలో వేరు నుంచి చిగురు వరకూ ప్రతీ భాగమూ ఔషధమే. దీని కొమ్మలు సన్నగా ఆకులు చిన్నగా ఉంటాయి. ఓ దశలో చెట్టంతా మోడయిపోతుంది. కొన్ని రోజులకి ఆ కొమ్మలన్నీ లేత పసుపురంగులో కనిపిస్తే చిగురేయకుండానే పూసిందేమో అనుకుంటాం. కానీ అవే మెల్లగా ఆకులుగా విచ్చుకుంటాయి. పూలలా కనిపించే ఈ చిగుళ్లూ ఆరోగ్యమేనట. అవి కాస్త పెరిగాక లేతపచ్చ కలిసిన పసుపురంగులో పూత వస్తుంది. అది పిందె తొడిగి లేతాకుపచ్చ రంగు కాయగా మారుతుంది. ఈమధ్య కొందరు వ్యవసాయ నిపుణులు లేత గులాబీరంగు ఉసిరికాయల వంగడాన్నీ అభివృద్ధి చేయడం విశేషం.
*🍈పోషక సిరి*
అరటిపండు, ఆపిల్ పండు మాదిరిగా ఉసిరికాయని కొరికి తినడం కష్టమే... ఎందుకంటే పులుపు దీని ఇంటిపేరు. కానీ ఆ పులుపే ఈ పండుకున్న బలం. కమలాలతో పోలిస్తే ఉసిరిలో విటమిన్-సి 20 రెట్లు ఎక్కువ. ఆపిల్లోకన్నా మూడు రెట్లు ప్రొటీన్లు ఎక్కువ. ఇతర పండ్లలోకన్నా యాంటీఆక్సిడెంట్లూ ఎక్కువే. మొత్తంగా అనేకానేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి. అందుకే దీన్ని ‘సర్వదోషహర’ అనీ పిలుస్తారు. ఈ కాయల్ని ఎండబెట్టి నిల్వచేసుకుని ఏడాది పొడవునా వాడతారు. తాజా వాటితో పచ్చడీ పులిహోరా... వంటివి చేయడంతోపాటు మురబ్బా రూపంలో పంచదార పాకంలో నిల్వచేసుకునీ తింటారు. నిల్వపచ్చడి రూపంలో వాడుకున్నా ఉసిరి అద్భుత ఔషధమే. కానీ వీలైనంత వరకూ వాటిల్లో పంచదారా ఉప్పూ బాగా తగ్గించి తినాలి. అలాగే ఉసిరికాయలతో రైతాలానూ చేసుకోవచ్చు.
100 గ్రా. రాతి ఉసిరిలో 80 శాతం నీరూ కొద్దిపాళ్లలో ప్రొటీన్లూ పిండిపదార్థాలూ పీచూ లభిస్తాయి. 470- 680 మి.గ్రా. సి-విటమిన్ లభ్యమవుతుంది. ఎంబ్లికానిన్-ఎ, ఎంబ్లికానిన్-బి, ప్యునిగ్లుకానన్ వంటి పాలీఫినాల్సూ, ఎలాజిక్, గాలిక్ ఆమ్లం... వంటి ఫ్లేవనాయిడ్లూ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం... వంటి ఖనిజాలూ ఉసిరిలో దొరుకుతాయి. ఇతర పండ్లలో మాదిరిగానే ఇందులో పీచూ ఎక్కువే.
*🍈ఆరోగ్య సిరి*
ఉసిరి త్రిదోషహరిణి అంటోంది ఆయుర్వేదం. అన్ని అవయవాలూ సమన్వయంతో పనిచేసేలా చేస్తుందట. అందుకే అద్భుత ఔషధంగా చెప్పే చ్యవన్ప్రాశ్ తయారీకి ఆమ్లానే ప్రధానం. పరగడుపున కాస్త ఉసిరి పొడిని నీళ్లలో కలుపుకుని తాగితే దీర్ఘకాలిక దగ్గు, అలర్జీ, ఆస్తమా, టీబీ... వంటివన్నీ తగ్గుతాయని చెబుతారు సంప్రదాయ వైద్యులు. ముఖ్యంగా జలుబుతో బాధపడేవాళ్లు రెండు టీ స్పూన్ల ఉసిరి పొడీ తేనే కలిపి పేస్టులా చేసుకుని రోజుకి రెండుమూడుసార్లుగా తింటే చాలావరకూ తగ్గుతుందట. ఇతరత్రా ఇన్ఫెక్షన్లనీ ఇది తగ్గిస్తుంది. అందుకే ఫ్లూ తరహా జ్వరాల నివారణకి ఉసిరి ఉత్తమోత్తమ ఔషధం.
తిన్నది ఒంటికి పట్టేలా చేయడం లోనూ దీన్ని మించింది లేదు. ఎండు ఉసిరి జీర్ణసంబంధమైన అన్ని సమస్యల్నీ నివారిస్తుందనీ భోజనం తరవాత తింటే మరీ మంచిదనీ అంటారు. ఇది జీవక్రియని పెంచడంతోపాటు ఇందులోని పీచు ఆకలినీ తగ్గిస్తుంది. దాంతో ఊబకాయాన్నీ అడ్డుకోవచ్చు. మలబద్ధకం కూడా ఉండదు.
కాలేయ వ్యాధులకీ ఉసిరి దివ్యౌషధం. శరీరంలోని విషతుల్యాలనీ తొలగిస్తుంది. డయేరియా డీసెంట్రీలనీ ఉసిరి తగ్గిస్తుంది. మెదడు పని తీరుని మెరుగుపరుస్తుందనీ, తద్వారా జ్ఞాపకశక్తీ, తెలివితేటలూ పెరుగుతాయనీ చెబుతారు. నెలసరి సమస్యల్ని తగ్గించి, సంతానో త్పత్తి సామర్థ్యాన్నీ పెంచుతుందనీ, వీర్యసమృద్ధికీ తోడ్పడుతుందనీ చెబుతారు.
ఊపిరితిత్తుల వ్యాధులకు ఉసిరిని మించిన మందు మరొకటి లేదట. రోజూ ఓ ఉసిరికాయని తింటే కఫ సమస్యలన్నీ తొలగిపోతాయి. కంటి సమస్యలకి ఉసిరి మంచిదన్న కారణంతో దీన్ని చక్షు క్షయ అనీ పిలుస్తారు. ఉసిరికాయల్ని ముద్దగా చేసి తలకి పట్టిస్తే కళ్ల మంటలు తగ్గుతాయట. ముఖ్యంగా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీరాడికల్స్ కారణంగా కణాలు దెబ్బతినకుండా చేయడంతో చర్మం త్వరగా ముడతలు పడకుండా ఉంటుంది.
ఆయుర్వేదమే కాదు, అల్లోపతీ సైతం ఉసిరిని ఔషధ సిరి అని పొగుడుతోంది. ఇందులో యాంటీ మైక్రోబియల్, యాంటీవైరల్ గుణాలు అధికంగా ఉన్నాయనీ, ఇది రక్త ప్రసారాన్ని మెరుగు పరుస్తుందనీ గ్యాస్ట్రిక్ సమస్యల్నీ కొలెస్ట్రాల్నీ తగ్గిస్తుందనీ చెబుతోంది. ఇందులో ఉండే క్రోమియం ఇన్సులిన్ స్రావాన్నీ పెంచడం ద్వారా చక్కెర నిల్వల్ని తగ్గించి హృద్రోగాలూ మధుమేహం... వంటివి రాకుండా అడ్డుకుంటుందనీ తేలిందట. కొన్ని రకాల క్యాన్సర్లను సైతం తగ్గించగల గుణాలు ఉసిరికి ఉన్నాయట. ఎలా చూసినా ఉసిరిలో రోగనిరోధకశక్తిని పెంచే లక్షణాలు అనేకం. అందుకే మనదేశంలో పండే ఈ ఉసిరిని పొడి, క్యాండీలు, రసం, ట్యాబ్లెట్ల రూపంలో నిల్వచేసి ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్నారు.
*🍈సౌందర్య లహరి*
కేశసంరక్షణకు ఉసిరి ఎంతో మేలు. రోజూ తాజా ఉసిరిని తినడం లేదా దాని గుజ్జుని కుదుళ్లకు పట్టించడం వల్ల శిరోజాలు బాగా పెరగడంతో బాటు నల్లగా ఉంటాయి. దీంతో చేసే షాంపూలూ నూనెలూ జుట్టుకి మంచివే. ఇవి బాల నెరుపునీ చుండ్రునీ తగ్గిస్తాయి. ఆ కారణంతోనే ఈమధ్య హెయిర్ఆయిల్స్లో ఉసిరిని విరివిగా వాడుతున్నారు. అలాగే ఇందులోని సి-విటమిన్ ఎండ నుంచీ చర్మరోగాల నుంచీ కాపాడటమే కాదు, శరీరానికి మంచి మెరుపునీ ఇస్తుంది. రోజూ ఓ ఉసిరికాయని తింటే కాల్షియం శోషణ పెరుగుతుంది. దాంతో ఎముకలూ, దంతాలూ, గోళ్లూ, వెంట్రుకలూ ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే మరి, తాజాగా, ఎండు పండుగా, ట్యాబ్లెట్గా లేదా పొడి రూపంలో-ఎలా తీసుకున్నా ఉసిరి... అందాన్నీ ఆరోగ్యాన్నీ సంరక్షించే అద్భుత ఔషధ సిరి..!
*🍈ఉసిరి కాని ఉసిరి*
గూస్బెర్రీ... ఇవి ఉసిరికాయల్నే తలపిస్తాయి. కానీ ఉసిరి కాదు. వీటిని యూరోపియన్ గూస్బెర్రీ అంటారు. వీటిని అలా పిలవడంవల్లే మన ఉసిరి (ఆమ్లా)ని ‘ఇండియన్ గూస్బెర్రీ’ అని ప్రత్యేకంగా పిలుస్తారు పాశ్చాత్యులు. చూడ్డానికి ఒకేలా ఉన్నప్పటికీ ఈ ఐరోపా గూస్బెర్రీలు, పొదలకి కాస్తాయి. ఆకుపచ్చ రంగుతో పాటు ఎరుపు, ఊదా, పసుపు, తెలుపు... ఇలా వేర్వేరు రంగుల్లోనూ ఉంటాయివి. ఐరోపా, పశ్చిమాసియా దేశాలతో బాటు ఉత్తర భారతదేశం లోనూ హిమాలయ శ్రేణుల్లోనూ ఇవి ఎక్కువగా పెరుగుతాయి. చిత్రంగా వీటితోనూ నిల్వ పచ్చళ్లు పడతారు. మురబ్బా తయారు చేస్తారు. ఎండబెట్టీ తింటారు. జామ్లు చేస్తారు. జ్యూస్ రూపంలో తాగుతారు. ఇతరత్రా పోషకాలు ఉసిరిలో మాదిరిగానే ఉన్నప్పటికీ సి-విటమిన్ శాతం మాత్రం గూస్బెర్రీలో తక్కువ. కానీ నిమ్మ, నారింజలతో పోలిస్తే ఎక్కువే. ఎ-విటమిన్ కూడా పుష్కలంగా ఉండటంతో ఇవి కళ్ల సమస్యల్ని తగ్గిస్తాయి. పైగా ఇందులోని ఫైటో కెమికల్సూ ఆంథోసైనిన్లూ బీపీ, హృద్రోగాలూ మధుమేహం నియంత్రణకీ తోడ్పడతాయి. జీర్ణశక్తిని పెంచి, బరువునీ తగ్గిస్తాయి. వీటిని టీ లేదా జ్యూస్ రూపంలో తాగితే జలుబూ ఫ్లూ జ్వరాలకీ ఉపశమనం లభిస్తుంది. అందుకే ఉసిరి లానే ఇదీ అద్భుతమైన ఓషధీఫలమే!
🔆🔆
థైరాయిడ్
**
అశ్వగంధ
బ్రాహ్మి
జఠా మాంసి
శంఖపుష్పి
శుద్దగుగ్గులు
కాంచనార పట్ట
దేవదారు
తానికాయ
మిరియాలు
శొంఠి
పిప్పళ్లు
దాల్చిచెక్క
అన్నీ నాణ్య మయినవి తాజావి పుచ్చు లు లేనివి
సమానముగా తీసుకొని చూర్ణించి
ఒక టీ స్పూన్ 2 పూటలు ఆహారానికి అరగంట ముందు గోరువెచ్చని నీటితో వాడుతున్న తగ్గును
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
వివరాలకు 99493634 కు call చేయండి
శోభి నివారణ కొరకు అద్భుత యోగం - ###₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
వెలిగారం , మంచిగంధం చెక్క రోజ్ వాటర్ తో నూరి ఆ గంధాన్ని శొభి మచ్చల పైన 2 పూటలా లేపనం చేస్తూ ఉంటే శోభి హరించి ఆ మచ్చలన్నీ చర్మంలో కలిసిపోతాయి .
గమనిక -
వెలిగారం ఆయుర్వేద షాపులలో దొరకును.
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼